-
అమెరికాలో మినీ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..!
-
జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. సీనియర్ బౌలర్ రీ ఎంట్రీ
భారత్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును గురువారం ప్రకటించింది. సీనియర్ బౌలర్ కెమర్ రోచ్తో పాటు న్క్రుమా బోన్నర్ తిరిగి జట్టులోకి వచ్చారు. అదే విధంగా బ్రాండన్ కింగ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ జట్టుకు కీరన్ పొలార్డ్ సారథ్యం వహించనున్నాడు. కాగా వెస్టిండీస్ జట్టు భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఫిబ్రవరి 6న భారత్- వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. మూడు వన్డేలు కూడా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నాయి. వెస్టిండీస్ జట్టు: కీరన్ పొలార్డ్ (సి), ఫాబియన్ అలెన్, న్క్రుమా బోన్నర్, డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, కెమర్ రోచ్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, హేడెన్ వాల్ష్ జూనియర్. చదవండి: IND Vs WI: అయ్యర్పై వేటు.. రవి బిష్ణోయ్కు బంపరాఫర్; తొలి వన్డేకు రాహుల్ దూరం -
టీమిండియా కెప్టెన్కు అరుదైన గౌరవం
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విస్డెన్ అత్యుత్తమ వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేడ్(2010) అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో ఐసీసీ ప్రకటించిన మేల్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేడ్గా ఎంపికైన కోహ్లికి మరో అత్యుత్తమ గౌరవం లభించింది. 2011 వన్డే ప్రపంచకప్తో దశాబ్దాన్ని ప్రారంభించిన కోహ్లి.. దశాబ్ద కాల వ్యవధిలో 60కిపైగా సగటుతో 11000కుపైగా పరుగులు సాధించాడు. ఇందులో 42 శతకాలు ఉన్నాయి. 2011 ప్రపంచకప్లో 9 మ్యాచ్ల్లో ఓ శతకం మరో అర్ధశతకం సాయంతో 282 పరుగులు సాధించిన కోహ్లి.. భారత్ను రెండోసారి జగజ్జేతగా నిలపడంలో తనవంతు పాత్రను పోషించాడు. రెండేళ్ల అనంతరం 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా విరాట్ అద్భుతంగా రాణించి భారత్ను ఛాంపియన్గా నిలిపాడు. ఈ టోర్నీ ఫైనల్లో టాప్ స్కోరర్గా నిలిచిన అతను భారత కీర్తిపతాకను మరోసారి రెపరెపలాడించాడు. 2010 దశాబ్దంలో జరిగిన 5 ఐసీసీ టోర్నీల్లో కోహ్లి అద్భుతంగా రాణించడంతో టీమిండియా ప్రతి టోర్నీలో కనీసం సెమీస్ వరకు చేరుకోగలిగింది. కాగా, కోహ్లి తన ఓవరాల్ వన్డే కెరీర్లో 254 మ్యాచ్ల్లో 59.7 సగటుతో 12169 పరుగులు సాధించాడు. ఇందులో 43 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక మహిళల విభాగంలో ఆసీస్ క్రికెటర్ బెత్ మూనీ విస్డెన్ ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డు గెలుచుకుంది. కాగా, విస్డెన్ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టును కూడా ప్రకటించింది. ఆ జట్టుకు కోహ్లినే నాయకుడిగా ఎంపిక చేసింది. విస్డెన్ దశాబ్దపు ఉత్తమ టెస్ట్ జట్టు: అలిస్టర్ కుక్(ఇంగ్లండ్), వార్నర్(ఆస్ట్రేలియా), కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్), కోహ్లి(కెప్టెన్), స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా), సంగక్కర(శ్రీలంక), బెన్ స్టోక్స్(ఇంగ్లండ్), అశ్విన్(భారత్), స్టెయిన్(దక్షిణాఫ్రికా), బ్రాడ్(ఇంగ్లండ్), ఆండర్సన్(ఇంగ్లండ్) చదవండి: విలియమ్సన్ను ఆడించకపోవడంపై ఎస్ఆర్హెచ్ క్లారిటీ -
మనదే పైచేయి
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్నే శాసించిన వెస్టిండీస్...80వ దశకంలో భారత్పై కూడా గర్జించింది. కానీ ఆ తర్వాత సీన్ మారింది. భారత్ గేర్ మార్చుకుంది. వన్డేల్లో సొంత గడ్డపై కరీబియన్ను మట్టికరిపిస్తూనే ఉంది. గడిచిన పుష్కర కాలంగా 4 వన్డేల సిరీస్ జరిగినా... 5 వన్డేల్లో తలపడినా... 3 వన్డేలు... ఇలా సిరీస్ ఏదైనా విజేత మాత్రం భారతే. అంతగా రాటుదేలింది టీమిండియా. సాక్షి క్రీడా విభాగం: వెస్టిండీస్ ఇటు వన్డేల్లో, అటు టి20ల్లో రెండేసి సార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచింది. ఒకప్పుడు నిప్పులు చెరిగే బౌలింగ్తో, ఎదురుదాడి బ్యాటింగ్తో ప్రపంచ ప్రత్యర్థుల్నే వణికించిన ఈ జట్టు క్రమంగా ప్రాభవం కోల్పోయింది. తమ దీవుల్లో జరిగే కరీబియన్ లీగ్ పుణ్యమాని ఇప్పుడు టి20ల్లో సత్తా చాటుతున్నప్పటికీ... వన్డేల్లో మాత్రం నిలకడలేని ఆటతీరుతో చతికిలబడుతోంది. అలనాడు భారత్లోనూ విండీస్ది అద్భుతమైన రికార్డు. 1983 సీజన్లో ఇక్కడ ఐదు వన్డేల సిరీస్ను 5–0తో, 1987 సీజన్లో ఏడు వన్డేల సిరీస్ను 6–1తో గెలిచిన అసాధారణ జట్టు వెస్టిండీస్. కానీ ఆ తర్వాత... మళ్లీ ఆడేందుకు ఇక్కడికి వస్తే మాత్రం కరీబియన్ సిరీస్లు కాదు కదా... మ్యాచ్లు గెలిచేందుకే ఆపసోపాలు పడుతోంది. 90 దశకంలో భారత్ ఆధిపత్యం... ప్రపంచ వ్యాప్తంగా వెస్టిండీస్ 80వ దశకంలో ఎక్కడ ఆడినా గెలిచేది. కానీ 90 నుంచి తిరోగమనం మొదలైంది. భారత్ పైచేయి సాధించడం కూడా ప్రారంభమైంది. కరీబియన్తో ముఖాముఖి సిరీస్లతో పాటు, విండీస్ ఆడేందుకు వచి్చన హీరో కప్ (1993), విల్స్ వరల్డ్ సిరీస్ (1994)లలో భారతే విజేతగా నిలిచింది. సొంతగడ్డపై భారత్ గర్జిస్తుంటే బ్యాటింగ్ దిగ్గజం లారా, బౌలింగ్ లెజెండ్స్ వాల్‡్ష, అంబ్రోస్లు ఉన్న విండీస్ జట్టు ఏమీ చేయలేకపోయింది. రిక్తహస్తాలతోనే తిరుగుముఖం పట్టేది. దీంతో ప్రపంచ క్రికెట్లో వెస్టిండీస్ స్వర్ణయుగం కరిగిపోయింది. తర్వాత ఓ మామూలు జట్టుగా మిగిలిపోయింది. ఆటగాళ్ల వైఫల్యం, బోర్డు రాజకీయాలు, కాంట్రాక్టు వివాదాలు, సంక్షోభం ఇలా అన్నింటితో సతమతమై ఇప్పుడు కొన్ని మెగా టోర్నీల్లో క్వాలిఫయింగ్ ఆడే పరిస్థితికి దిగజారింది. 12 ఏళ్లుగా టీమిండియాదే విక్టరీ... గుడ్డిలో మెల్లగా వెస్టిండీస్ను దశాబ్దాల తర్వాత 2002 సీజన్ ఆదుకుంది. ఆ ఏడాది భారత్కు వచ్చిన విండీస్ మొదట టెస్టు సిరీస్ ఓడిపోయినా... సుదీర్ఘంగా సాగిన ఏడు వన్డేల సిరీస్లో టీమిండియాను భారత గడ్డపై 4–3తో కంగుతినిపించింది. క్రిస్ గేల్ రెండు శతకాలతో చెలరేగాడు. ఇక ఆ తర్వాత భారత్లో ముఖాముఖి వన్డే సిరీస్కు రావడం, ఓడిపోవడం రివాజుగా జరిగేవి. 2007 నుంచి ఇప్పటివరకు ఐదు సార్లు భారతగడ్డపై అడుగుపెట్టిన కరీబియన్ జట్టు పరాజయంతోనే తిరుగు పయనమైంది. 2007తో పాటు 2011, 2013, 2014, 2018దాకా ఇరు జట్ల మధ్య 20 వన్డేలు జరిగాయి. ఇందులో 14 మ్యాచ్ల్లో భారత్ జయకేతనం ఎగురవేసింది. ఈ ఐదు సిరీస్లలోనూ ప్రత్యర్థి జట్టు ఒక మ్యాచ్కు మించి గెలవలేకపోవడం భారత ఆధిపత్యానికి నిదర్శనం. ఒకటేమో ‘టై’ అయింది. ఈసారి వన్డే సిరీస్లోనూ కోహ్లి సేనే ఫేవరెట్ కొన్నాళ్లుగా భారత్ అద్భుతమైన ఫామ్లో ఉంది. ఇటీవలే ముగిసిన టి20 సిరీస్లోనూ భారత్ ఆల్రౌండ్ ప్రతాపం తెలిసిందే. బ్యాటింగ్లో టాపార్డర్ దుర్భేద్యంగా తయారైంది. రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లి ఈ ముగ్గురు నిలబడితే ఎంతటి బౌలింగ్ అయినా చెల్లాచెదురు కావాల్సిందే. గత ఆఖరి టి20లో విండీస్ బౌలర్లకు ఇది బాగా గుర్తయింది. ఇక బౌలింగ్లోనూ షమీ, దీపక్ చాహర్ పేస్కు కుల్దీప్, చహల్, జడేజాల స్పిన్ అండ ఉండనే ఉంది. ఎటొచ్చి జట్టు మేనేజ్మెంట్ బెంగంతా మిడిలార్డర్, ఫీల్డింగ్లపైనే ఉంది. పొట్టి క్రికెట్లో భారత ఫీల్డర్లు పదేపదే క్యాచ్ల్ని నేలపాలు చేశారు. అదే విధంగా నిలకడలేని మిడిలార్డర్ వైఫల్యంతోనే రెండో టి20ని కోల్పోయింది. ఈ రెండు విభాగాలపై జట్టు సహాయ సిబ్బంది కన్నేస్తే భారత జోరుకు తిరుగుండదు. మీకు తెలుసా... ఈ ఏడాది భారత్ బాగానే ఆడినట్లు కనిపించింది. వరుసబెట్టి సిరీస్ల్లో పాల్గొంటుంది... గెలుస్తుంది. కానీ స్వదేశంలో మాత్రం ఒకే ఒక్క వన్డే సిరీస్ ఆడింది. అది మార్చిలో ఆ్రస్టేలియాతో ఐదు వన్డేల సిరీస్ ఆడిన టీమిండియా అందులో 2–3తో ఓడింది. ఆ తర్వాత ఐపీఎల్, ఇంగ్లండ్లో వన్డే ప్రపంచకప్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లతో సిరీస్లు ఆడింది. ఇక ఈ ఏడాది భారత్ ఆడే ఆఖరి వన్డే సిరీస్ ఇదే. దీన్ని విజయంతో ముగించాలని కోహ్లిసేన గట్టి పట్టుదలతో ఉంది. గాయంతో భువనేశ్వర్ ఔట్ చెన్నై: భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ మళ్లీ గాయపడ్డాడు. దీంతో వెస్టిండీస్తో జరిగే మూడు వన్డేల సిరీస్కు దూరమయ్యాడు. ఈ సీనియర్ సీమర్ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో అతని స్థానంలో యువ పేసర్ శార్దుల్ ఠాకూర్ను తీసుకునే అవకాశముంది. ఈ ఏడాది భువీని గాయాలు చికాకు పెడుతున్నాయి. ఇంగ్లండ్లో జరిగిన వన్డే ప్రపంచకప్ సమయంలో అతను తొడ కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. పాక్తో మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడాల్సి వచి్చంది. మళ్లీ సెమీఫైనల్లో ఆడినప్పటికీ... తదనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లతో జరిగిన సిరీస్లకు అతను దూరమయ్యాడు. ఎట్టకేలకు విండీస్తో జరిగిన మూడు టి20ల సిరీస్తో పునరాగమనం చేసిన అతను మళ్లీ వన్డేలకు దూరం కావడం జట్టు వర్గాలను ఆందోళన పరుస్తోంది. భువీ గాయంపై ఇంకా బోర్డు గానీ, జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్గానీ అధికారికంగా వెల్లడించలేదు. ►55 వెస్టిండీస్తో స్వదేశంలో భారత జట్టు ఇప్పటివరకు 55 వన్డేలు ఆడింది. టీమిండియా 27 మ్యాచ్ల్లో... విండీస్ కూడా 27 మ్యాచ్ల్లో గెలుపొందాయి. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ►130 ఓవరాల్గా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన వన్డేల సంఖ్య. భారత్ 62 మ్యాచ్ల్లో... విండీస్ కూడా 62 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. రెండు మ్యాచ్లు ‘టై’గా ముగియగా... నాలుగు మ్యాచ్లు రద్దయ్యాయి. -
మెరిసేదెవరో... మెప్పించేదెవరో?
భాగ్యనగరం ఎన్నో ఐపీఎల్ టి20 మ్యాచ్లకు వేదికగా నిలిచింది. కానీ అంతర్జాతీయ మెరుపులే లేవు. వన్డే, టెస్టులకు ఆతిథ్య మిచ్చిన ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఇప్పుడు ఆ ‘పొట్టి’ లోటునూ తీర్చు కునేందుకు సిద్ధమైంది. ఫామ్లో ఉన్న కోహ్లి సేన జోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు భాగ్యనగర క్రికెట్ ప్రియులు పోటెత్తనున్నారు. ‘ఢీ’కొట్టేందుకు వెస్టిండీస్ ‘సై’ అంటోంది. సాక్షి, హైదరాబాద్: భారత కుర్రాళ్లను ఇప్పుడు ఐపీఎల్ వేలమే కాదు... వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్ కూడా ఊరిస్తోంది. తమ నిలకడైన ప్రదర్శనతో అటు ఫ్రాంచైజీలు, ఇటు సెలక్టర్ల కంట పడేందుకు యువ ఆటగాళ్లకు విండీస్తో సిరీస్ చక్కని అవకాశం కలిపిస్తోంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్లో హిట్టయినా... టీమిండియా తరఫున ఫ్లాపవుతున్న ఆటగాళ్లు మనసుపెడితే చోటు ఖాయం చేసుకునే తరుణం కూడా ఇదే! ఐపీఎల్ వేలానికి ముందు జరుగుతున్న సిరీస్ కాబట్టి ఎవరు మెరిపిస్తే వాళ్లపైనే కాసులు కురుస్తాయన్న సంగతి ఆటగాళ్లకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో భారత తుది జట్టుకు ఆడే కుర్రాళ్లు అందివచి్చన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో పడ్డారు. నడిపించే నాయకుడొచ్చాడు... బంగ్లాదేశ్తో జరిగిన టి20 సిరీస్కు విశ్రాంతి తీసుకున్న కోహ్లి మళ్లీ జట్టును నడిపించేందుకు రావడమే భారత్కు సగం బలం. భారత విజయవంతమైన సారథి ఫామ్కు ఏ ఢోకా లేదు. ఆడేది ముందయినా... తర్వాత ఛేదన అయినా తన వంతు మెరుపులు మెరిపిస్తాడు. చాన్నాళ్ల తర్వాత టి20 జట్టులోకి కీలక బౌలర్లు పునరాగమనం చేశారు. పేసర్లు భువనేశ్వర్, షమీ, కుల్దీప్లు పొట్టి మ్యాచ్కు సిద్ధమయ్యారు. జట్టు కూర్పులో భాగంగా ఇద్దరేసి సీమర్లు, స్పిన్నర్లను తీసుకుంటే కుల్దీప్, షమీకి తుది జట్టులో చాన్స్ లేకపోవచ్చు. ఇటీవల యువ పేసర్ దీపక్ చాహర్ చెలరేగుతుండటంతో కోహ్లి ఈ కుర్రాడివైపే మొగ్గుచూపొచ్చు. అలాగే రవీంద్ర జడేజా బ్యాటింగ్లో అక్కరకొస్తాడు. కాబట్టి యజువేంద్ర చహల్కు జతగా జడేజానే కోహ్లి ఎంపికవుతుంది. దీంతో కుల్దీప్ బెంచ్కే పరిమితం కావాలి. మిడిలార్డర్లో అయ్యర్, మనీశ్ పాండే, శివమ్ దూబేల స్థానాలకు ఢోకా లేదు. రాహుల్కు భలే చాన్సులే! రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో ఈ సిరీస్కు దూరం కావడం లోకేశ్ రాహుల్కు వరమైంది. దీంతో ప్రతీ మ్యాచ్లోనూ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం దక్కుతుంది. ఇక్కడ మెరుపులు మెరిపిస్తే రోహిత్కు రెగ్యులర్ భాగస్వామి కూడా కావొచ్చు. పైగా టి20ల్లో రాహుల్కు మంచి రికార్డే ఉంది. 31 పొట్టి మ్యాచ్ల్లో 42.74 సగటుతో 974 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్లోనూ వీరబాదుడు బాదిన సంగతి తెలిసిందే. మరో యువ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ ఈ సిరీస్లో తానేంటో నిరూపించుకోవాలి. కెప్టెన్, జట్టు మేనేజ్మెంట్ నుంచి కావాల్సినంత సహకారం లభిస్తున్నా... ఇంకా జట్టులో ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ధోని వారసుడిగా వచి్చన పంత్ నిలకడలేని ఆటతీరుతో నిరాశపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను విండీస్పైనా పట్టుదలతో రాణించాల్సిన అవసరముంది. అనుభవలేమి అసలు సమస్య... అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం ప్రస్తుత వెస్టిండీస్కు పెద్ద సమస్య. ఈ ఐపీఎల్లో ఆల్రౌండ్ మెరుపులు మెరిపించిన రసెల్ సహా, బ్రాత్వైట్, బ్రేవోలను కాదని వెస్టిండీస్ పూర్తిగా యువ ఆటగాళ్లతో భారత్కు వచ్చింది. బాల్ ట్యాంపరింగ్కు పాల్పడటంతో హిట్టర్ నికోలస్ పూరన్ కూడా మ్యాచ్కు దూరమయ్యాడు. దీంతో పర్యాటక జట్టు బ్యాటింగ్ లైనప్ ప్రధానంగా ఓపెనర్లు ఎవిన్ లూయిస్, లెండిల్ సిమన్స్, హెట్మైర్, కెప్టెన్ పొలార్డ్లపైనే ఆధారపడి ఉంది. ఇక బౌలర్ల విషయానికొస్తే హోల్డర్, కీమో పాల్, కాట్రెల్లపై జట్టు నమ్మకం పెట్టుకుంది. భారత్లో ఆడిన అనుభవం తమకు వుందని, యువసత్తాతోనే కోహ్లిసేను ఓడిస్తామని పొలార్డ్ చెప్పాడు. పిచ్, వాతావరణం ఇప్పటిదాకా పొట్టిఫార్మాట్లో ఈ పిచ్ బౌలర్లకు బాగా కలిసొచ్చింది. ఐపీఎల్లో హోమ్ టీమ్ సన్రైజర్స్ బౌలర్లు తమ బ్యాట్స్మెన్ తక్కువ స్కోరు చేసినా నిలబెట్టిన సందర్భాలున్నాయి. చల్లటి సాయంత్రం వర్షం ముప్పేమీ లేదు. మంచు ప్రభావం దృష్ట్యా పిచ్ను పూర్తిగా కప్పి ఉంచారు. మూడో కంటికి నోబాల్... ఇప్పటిదాకా నోబాల్ను ఫీల్డు అంపైర్లే చూసేవారు. వారు చూసినపుడు నోబాల్... లేదంటే లేదు. కొన్ని సందర్భాల్లో గీత దాటిన నోబాల్కు నాటౌట్ అయినా... అంపైర్లు దాన్ని గమనించకపోవడంతో పెవిలియన్ చేరిన సందర్భాలున్నాయి. అయితే నోబాల్ను ఇకపై థర్డ్ అంపైర్ పర్యవేక్షిస్తారు. భారత్, వెస్టిండీస్ల సిరీస్తో నోబాల్ నిర్ణయాధికారం థర్డ్ అంపైర్ పరిధిలోకి వెళ్తుందని ఐసీసీ తెలిపింది. ►8 భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటివరకు 14 టి20 మ్యాచ్లు జరిగాయి. భారత్ 8 మ్యాచ్ల్లో నెగ్గగా... విండీస్ 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. విండీస్తో జరిగిన చివరి 5 టి20ల్లో భారత్నే విజయం వరించింది. ►1 మరో సిక్స్ కొడితే అంతర్జాతీయ క్రికెట్లో (టెస్టు, వన్డే, టి20) 400 సిక్స్లు పూర్తి చేసుకోనున్న తొలి భారతీయ క్రికెటర్గా, ఓవరాల్గా మూడో క్రికెటర్గా రోహిత్ శర్మ గుర్తింపు పొందుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 399 సిక్స్లు ఉన్నాయి. ఈ జాబితాలో క్రిస్ గేల్ (534 సిక్స్లు), షాహిద్ అఫ్రిది (476 సిక్స్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ►టి20 క్రికెట్లో ఆరుగురి బౌలింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉండాల్సిందే. ఎందుకంటే మనం ఎంచుకున్న ఐదుగురు బౌలర్లు అన్ని ఓవర్ల (నాలుగు ఓవర్ల కోటా)ను అద్భుతంగా వేస్తారని ఆశించలేం. అందుకే ఆరో బౌలింగ్ ఆప్షన్ ఉండాలి. ప్రపంచకప్ కోసం జట్టులో పేసర్ల మధ్యే పోటీ నెలకొంది. బుమ్రా, భువనేశ్వర్, షమీలతో పాటు యువ బౌలర్ దీపక్ చాహర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. టాప్–4లో రోహిత్, రాహుల్, నేను, అయ్యర్ పదిలంగా ఉన్నాం. రిషభ్కు మిడిలార్డర్లోనే అవకాశమిస్తాం. అతను ధోనిలా అనుకరించి విఫలమైనంత మాత్రానా ధోని పేరుతో వెక్కిరించడం ధోని స్థాయిని కించపరచడమే అవుతుంది. పంత్లో సహజసిద్ధమైన ప్రతిభవుంది. అవకాశాలు ఇస్తే నిలకడైన బ్యాట్స్మన్గా నిరూపించుకునే సత్తా అతనిలో ఉంది. –భారత కెప్టెన్ కోహ్లి ►నాకు భారత్లో ఆడిన అనుభవముంది. ప్రస్తుతం ఇదే మాకు అక్కరకొస్తుంది. ఆతిథ్య దేశానికి సవాల్ విసిరేందుకు మా కుర్రాళ్లంతా సిద్ధంగా ఉన్నారు. సిరీస్ కోసం బాగా సన్నద్ధమయ్యాం. తప్పకుండా మా వాళ్లు రాణిస్తారు. ప్రపంచ క్రికెట్లో భారత్ మేటి ప్రత్యర్థి. టెస్టుల్లో నంబర్వన్ అయిన జట్టును మేం ధీటుగా ఎదుర్కొంటాం. మెరుగైన ప్రదర్శన కనబరుస్తాం. అందుబాటులో ఉన్న అవకాశాల్ని వినియోగించుకుంటాం. ఒకరిద్దరి ఆటగాళ్ల చుట్టూనే తిరగం. వారిపై ఆధారపడం. జట్టుగా ఏం చేయాలో... ఎలా పోరాడాలో మాకు తెలుసు. –వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement