-
నిర్మాతగా బన్నీతో సినిమా : సుకుమార్
పిఠాపురం మున్సిపాలిటీ :నిర్మాతగా మారి అల్లు అర్జున్(బన్నీ)తో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నానని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ తెలిపారు. సోమవారం ఆయన పిఠాపురంలో సందడి చేశారు. స్థానిక నవచైతన్య జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. గతంలో కాకినాడ ఆదిత్య కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. నవచైతన్య కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెడ్డెం దుర్గాప్రసాద్ (బాబి)తో చర్చించారు. అంతకుముందు తన అసిస్టెంట్ డెరైక్టర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన సానా బుచ్చిరాయుడు మామగారైన ప్రస్తుత 23వ వార్డు కౌన్సిలర్ రెడ్డెం భాస్కరరావు స్థానిక రంగారావుగారి ఆస్పత్రిలో ఉండడంతో ఆయనను పరామర్శించారు. పముఖ దత్త ప్రచారకులు నారాయణదత్త సుకుమార్కు దత్తుని ప్రసాదాలను, కేలండర్ను అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ తానే స్వయంగా నిర్మాతగా మారి అల్లు అర్జున్తో సినీమా తీసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల విడుదలైన వన్ చిత్రం ఆశించిన విజయం సాధించలేదని, రానున్న రోజుల్లో ప్రేక్షకుల మన్ననలు పొందేలా చిత్రాలను నిర్మిస్తానని పేర్కొన్నారు. తీరిక సమయాల్లో తాను పుస్తకాలు చదవడంతో పాటు భార్య తబిత, కుమార్తె సుక్రతవేణి, కుమారుడు సుక్రాంత్తో హాయిగా జీవితాన్ని సాగిస్తున్నట్టు వెల్లడించారు. సుకుమార్ వెంట డాక్టర్ పంతం రాజేష్, వైఎస్సార్ సీపీ నేతలు ముమ్మిడి శ్రీను, కొండేపూడి శంకరరావు, రెడ్డెం జనార్ధన్ తదితరులు ఉన్నారు. -
పాతిక లక్షలు కతికేశారు..
పిఠాపురం, న్యూస్లైన్ :ఎన్నికైన పురపాలకులూ లేరు. ఆర్థిక విషయాలను చూడాల్సిన కీలక స్థానాల్లో అర్హులైన ఉద్యోగులూ లేరు. ఇంకేముంది- పిఠాపురం మున్సిపాలిటీలోని అవినీతిపరులైన అధికారులకు పంట పండింది. పురపాలక సంఘం పరిధిలో జరిగే వివిధ పనులకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్లు, వ్యాట్, ఇన్కం ట్యాక్స్ల నిమిత్తం కాంట్రాక్టర్ల నుంచి కట్టించుకున్న సొమ్మును రూ.25 లక్షల వరకూ స్వాహా చేసేశారు. కొందరు అధికారులు కలిసి పాల్పడిన స్వాహాపర్వం బయటకు పొక్కడంతో తమ పై అధికారులకు ముడుపులు ముట్టజెప్పీ, ఆయా ఖాతాల్లో నామమాత్రపు మొత్తాలు జమ చేసీ తాము బయట పడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి విశ్వసనీయంగా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. సాధారణంగా మున్సిపాలిటీ పరిధిలో ఏ విభాగానికి సంబంధించి ఏ పని చేపట్టినా.. సంబంధిత కాంట్రాక్టర్ నుంచి ఆ పని విలువలో 7.5 శాతం సెక్యూరిటీ డిపాజిట్గా, 5 శాతం ఁవ్యాట్రూ.గా, 2.5 శాతం ఇన్కం ట్యాక్స్గా వసూలు చేస్తారు. ఈ సొమ్ము డీడీలు, చెక్కులుగా ఆయా విభాగాల ఖాతాల్లో జమ చేయాలి. పిఠాపురం మున్సిపాలిటీలో పది మంది క్లాస్ వన్ కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరికి ఏ పని కేటాయించినా.. ఈ పని విలువలో 7.5 శాతం సెక్యూరిటీ డిపాజిట్గా కట్టించుకుని, ఆ పని సక్రమంగా, నాణ్యంగా పూర్తయిందని నిర్ధారణ అయ్యాక తిరిగి చెల్లిస్తారు. అలాగే వ్యాట్, ఇన్కం ట్యాక్స్లుగా వసూలు చేసిన మొత్తాన్ని మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు వెచ్చించాలి. అయితే 2005 నుంచి మున్సిపాలిటీ పరిధిలో ఇలా సేకరించిన సెక్యూరిటీ డిపాజిట్లు రూ.11 లక్షలు మేరకు, వ్యాట్ రూ.10 లక్షల మేరకు, ఇన్కం ట్యాక్స్ రూ.4 లక్షల మేరకు కొందరు అధికారులు సొంత అవసరాలకు యథేచ్ఛగా వాడుకున్నారు. ఆర్థిక వ్యవహారాాలను చూసే స్థానాల్లో అర్హులైన వారు లేకపోవడంతో వారి పని సునాయాసమైంది. పనులు పూర్తయ్యాక కాంట్రాక్టర్లకు సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాల్ని తిరిగి చెల్లించకపోయినా..వారు మున్సిపాలిటీలో తాము తిరిగి కొత్త పనులను చేపడుతూనే ఉంటాము గనుక.. ఎప్పటికో అప్పటికి వస్తాయి కదా అన్న భావనతో ఉండిపోయారు. మొత్తం మీద అన్నిరకాలుగా రూ.25 లక్షలను ఆయా ఖాతాల నుంచి నగదుగా డ్రా చేసి దారి మళ్లించిన ఆ నలుగురు అధికారులూ ఇప్పుడు విషయం బయటకు పొక్కడంతో.. తమపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు పై అధికారులకు ముడుపులు ముట్టజెపుతున్నారని సమాచారం. అంతేకాక ఆయా విభాగాల ఖాతాల్లో నామమాత్రంగా రూ.3 లక్షలు జమచేసి అంతా సక్రమంగా ఉన్నట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అనర్హులకు పగ్గాలతో.. కళ్లేలు తెంచుకున్న అవినీతి.. కాగా మున్సిపాలిటీలో రికార్డు అసిస్టెంట్గా పనిచేసిన ఓ ఉద్యోగిని అర్హత లేకున్నా 2008లో రెవెన్యూ విభాగంలో కీలకమైన పోస్టులో నియమించిన నాటి నుంచి సొమ్ములు దారి మళ్లడం జోరందుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో రికార్డు అసిస్టెంట్ను ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మరో కీలక స్థానంలోనియమించడం కూడా ఈ కుంభకోణానికి దోహదపడినట్టు చెపుతున్నారు. మున్సిపాలిటీ అక్కౌంటెంటుగా 2013 జూన్ 14నే పద్మజ్యోతి బాధ్యతలు చేపట్టినా ఆ ఉద్యోగులిద్దరూ తమ వద్ద ఉన్న రికార్డులు అప్పగించక పోవడం గమనార్హం. అయినా కమిషనర్ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా.. మున్సిపాలిటీలో నిధులు దారి మళ్లినట్టు వచ్చిన ఆరోపణల గురించి కమిషనర్ బి.రాముని ‘న్యూస్లైన్’ వివరణ కోరగా.. ఆరోపణలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఆర్ఐ, షరాబులు కొత్తగా వచ్చిన అక్కౌంటెంటుకు రికార్డులు అప్పగించక పోవడం వాస్తవమేనన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement