-
అన్నంలో పురుగు మందు కలుపుకొని తిని.. ఇద్దరు కుమార్తెలతో సహా..!
కారేపల్లి: కూలి పనులు చేస్తే వచ్చే డబ్బు అంతంతే కావడం.. దానికితోడు భర్త మద్యానికి బానిసయ్యాడని మనస్తాపం చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలకు అన్నంలో పురుగు మందు కలిపి పెట్టి, తాను తిని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చిన్నకట్టుగూడెంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చిన్నకట్టుగూడెం గ్రామానికి చెందిన బానోతు శివ, ఉమ భార్యాభర్తలు. వీరికి ఐదో తరగతి చదివే భానుశ్రీ, నాలుగో తరగతి చదివే శ్రీవిద్య అనే కూతుళ్లు ఉన్నారు. కూలి చేసుకుని జీవించే వీరి కుటుంబంలో మద్యం చిచ్చుపెట్టింది. ఇటీవల శివ మద్యానికి బానిస కావడంతో ఉమ అతనిని వారిస్తోంది. అయితే, శివ శనివారం రాత్రి కూడా మద్యం తాగి రావడంతో ఉమ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం శివ పనికి వెళ్లాక అన్నంలో పురుగు మందు కలిపి కూతుళ్లకు పెట్టాక ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం గోవింద్తండా గ్రామంలోని తన తండ్రికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు వారిని కారేపల్లి పీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఉమ, ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. ఇదీ చూడండి: మాకు న్యాయం చేయాలి -
ఖరీఫ్ సాగు లక్ష్యం ..93.91 లక్షల ఎకరాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్–2022 కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు కోసం సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను వైఎస్సార్ ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. పంటలు ప్రకృతి వైపరీత్యాల బారినపడకుండా ముందస్తు ఖరీఫ్కు వెళ్లేలా రైతులను సమాయత్తం చేయాలని అధికారులు నిర్ణయించారు. నిర్దేశించిన గడువులోగా సాగు నీటిని విడుదల చేయడం ద్వారా జూన్ మొదటి వారంలోనే నాట్లు పడేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖరీఫ్–2022లో 93.91 లక్షల ఎకరాల్లో పంటల్ని సాగు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ప్రధానంగా 40.34 లక్షల ఎకరాల్లో వరి, 18.40 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.82 లక్షల ఎకరాల్లో పత్తి, 6.62 లక్షల ఎకరాల్లో కందులు, 3.71 లక్షల ఎకరాల్లో చెరకు, 2.72 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతాయని అంచనా. ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ రానున్న సీజన్లో రూ.196.70 కోట్ల విలువైన 6.84 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించాలని అధికారులు నిర్ణయించారు. తొలిసారి వాణిజ్య పంటలైన పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల (నాన్ సబ్సిడీ)ను కూడా ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేయబోతున్నారు. వేరుశనగ విత్తన పంపిణీ మే మూడో వారం నుంచి, వరి విత్తనాలను జూన్ మొదటి వారం నుంచి పంపిణీ చేయనున్నారు. గిరిజన మండలాల్లో మాత్రం వేరుశనగ, వరి విత్తనాలను మే 3వ వారం నుంచే పంపిణీ చేస్తారు. మరోవైపు 19.02 లక్షల టన్నుల ఎరువులు కేటాయించారు. వీటిని ల్యాబ్లలో సర్టిఫై చేసిన తర్వాతే పంపిణీ చేయబోతున్నారు. కనీసం 1.50 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల వద్ద ముందస్తుగా నిల్వ చేస్తున్నారు. ఈసారి మొత్తం వినియోగంలో కనీసం 30 శాతం ఎరువులు, 10 శాతం పురుగుల మందులను ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సీజన్లో రూ.92,687 కోట్ల మేర వ్యవసాయ రుణాలివ్వాలని నిర్దేశించారు. రైతు ముంగిటకే అన్నిసేవలు ఖరీఫ్లో ప్రతి రైతుకు వారి గ్రామాల్లోనే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటి వాటిని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. సేంద్రియ సాగును ప్రోత్సహించేలా ఆర్బీకేల ద్వారా రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పకడ్బందీ ఏర్పాట్లు పంటలు వైపరీత్యాల బారిన పడకుండా సాధ్యమైనంత త్వరగా సీజన్ ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నాం. సీజన్కు ముందుగానే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వాటిని అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నాం. 8,508 పొలం బడులు నిర్వహించడం ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు జీఏపీ సర్టిఫికేషన్ జారీకి శ్రీకారం చుడుతున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ (చదవండి: రూ.390 సిమెంట్ బస్తా రూ.235కే!) -
ఉన్నావ్ దారుణం: సంచలన విషయాలు వెల్లడి
లక్నో: ఉత్తరప్రదేశ్లో మహిళలపై దురాగతాలకు అంతు లేకుండా పోతుంది. తాజాగా కొద్ది రోజుల క్రితం ఉన్నావ్లో ముగ్గురు మైనర్, దళిత బాలికలపై విషప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఈ బాలిక కాన్పూర్ ఆస్ప్రతిలో చికిత్స పొందుతుది. ఈ దారుణానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రధాన నిందితుడు వినయ్ అలియాస్ లంబుని అదుపులోకి తీసుకున్నారు. తానే ముగ్గురు మైనర్ బాలికలకు విషం ఇచ్చినట్లు అంగీకరించాడు. ఈ సందర్భంగా పోలీసు అధికారి లక్ష్మి సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఈ దారుణం వెనక ప్రధాన కారణం ప్రేమను అంగీకరించకపోవడం. నిందితుడు వినయ్, ఈ ముగ్గురు బాలికలకు లాక్డౌన్ కాలంలో పరిచయం ఏర్పడింది. వీరంతా పశువుల మేపడం కోసం పొలానికి వచ్చేవారు. అందరూ కలిసి భోజనం చేసేవారు.. కబుర్లు చెప్పుకునే వారు. ఈ క్రమంలో వినయ్ ముగ్గురు బాలికల్లో ఒకరిని ప్రేమించాడు. అనేకసార్లు ఆమెకు ప్రపోజ్ చేశాడు. కానీ సదరు బాలిక అంగీకరంచలేదు. కోపం పెంచుకున్న వినయ్ ఎలాగైనా బాలికను అంతం చేయాలనుకున్నాడు’’ అని తెలిపారు. పథకం ప్రకారమే హత్య ‘‘ఈ క్రమంలో వినయ్ తన స్నేహితులతో కలిసి సదరు బాలికను చంపేందుకు ప్రణాళిక రచించాడు. దానిలో భాగంగా తన ఇంటిలో ఉన్న పురుగుల మందును తీసుకెళ్లి నీళ్ల బాటిల్ కలిపాడు. ఆ తర్వాత తినుబండారాలు, పురుగుల మందు కలిపిన వాటర్ బాటిల్ తీసుకుని బాధిత మైనర్ బాలికల దగ్గరకు వెళ్లాడు’’ అని తెలిపారు. ‘‘రోజులానే నిందితుడు వినయ్, మిగతా బాలికలు అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత వినయ్ తన దగ్గర ఉన్న పురుగుల మందు కలిపిన వాటర్ బాటిల్లోని నీటిని తను ప్రేమించిన అమ్మాయి చేత తాగించాలని భావించాడు. కానీ దురదృష్టం కొద్ది ముగ్గురు అమ్మాయిలు ఆ నీటిని తాగారు. కాసేపటికే బాధితులంతా స్పృహ తప్పి పడిపోయారు. ఊహించని ఈ ఘటనకు భయపడిని వినయ్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు అని తెలిపారు. పట్టించిన కాల్ డీటెయిల్ రికార్డు దారుణం గురించి తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. అక్కడ వారికి సిగరేట్ పీక, వాటర్ బాటిల్ కనిపించింది. ఆ తర్వాత మిగతా వారిని ప్రశ్నించగా.. వినయ్ పాత్ర బయటకు వచ్చింది. దాంతో పోలీసులు కాల్ డీటెయిల్ రికార్డ్(సీడీఆర్) టెక్నిక్ ద్వారా వినయ్ ఈ దారుణం జరిగినప్పుడు అక్కడే ఉన్నాడని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను చేసిన దారుణం గురించి వెల్లడించాడు. ఇక తమ పిల్లలను పొట్టన పెట్టుకున్న నిందితుడిని ఉరి తీయాల్సిందిగా బాధిత బాలికల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జరిగిన దారుణం పట్ల విపక్షాలు మండిపడుతున్నాయి. మహిళల భద్రత విషయంలో యూపీ ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యింది అంటూ మండి పడుతున్నాయి. చదవండి: దారుణం: ఉలిక్కి పడిన ‘ఉన్నావ్’ వాళ్లను పెళ్లికి పిలవొద్దు.. పిలిచారనుకో.. -
‘సరిహద్దు’లో దగా..!: నిషేధిత పురుగు మందులు
సాక్షి, చిలుకూరు (కోదాడ): అమాయక రైతులను అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు దళారులు నిషేధిత పురుగు మందులను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆ మందుల వాడకంతో స్వల్పకాలంలో ప్రయోజనాలు కనిపిస్తుండగా దీర్ఘకాలంలో వాటితో ఎన్నో దుష్పరిణామాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పురుగుల మందులను గుంటూరు జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్న దళారులు రాష్ట్ర సరిహద్దు (సూర్యాపేట , నల్లగొండ జిల్లాలు) మండలాల్లోని రైతులకు తక్కువ ధరకేనంటూ విక్రయిస్తూ దగా చేస్తున్నారు. అనుమతులు లేని విషతుల్యమైన రసాయన మందుల విక్రయాలు యథేచ్ఛగా జరుగతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. నీటి విడుదలతో.. నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటు ఎగువనుంచి వరద వస్తుండడంతో ఎడమకాల్వకు సకాలంలో నీటిని విడుదల చేశారు. దీంతో ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని దామరచర్ల, గరిడేపల్లి, నేరేడుచర్ల, హుజూర్నగర్, మఠంపల్లి, చిలుకూరు, కోదాడ తదితర మండలాల్లో ప్రస్తుత వానాకాలం సీజన్లో వరి పంటను ఎక్కువగా సాగు చేశారు. నెల రోజులు దాటిన వరిపొలాలకు ప్రస్తుతం దోమపోటు, తెగుళ్లు ఆశించాయి. అయితే ధర తక్కువగా ఉండడంతో రైతులు తమ పొలాలను కాపాడుకునేందుకు గుంటూరు జిల్లా మందుల వాడకంపై మొగ్గు చూపుతున్నారు. ధర తక్కువంటూ.. ఈ ప్రాంతంలో లభించే రసాయనిక మందులు దాదాపుగా మల్టీనేషన్ కంపెనీలకు చెంది ప్రభుత్వ ఆమోద ముద్రతో విక్రయిస్తున్నారు. మార్కెట్లో వీటి ధర కూడా ఎక్కువే. ఇదే అదునుగా చేసుకున్న దళారులు ఆంధ్రా ప్రాంతంలో నిషేధించిన గుంటూరు మందులు తక్కువ ధరేనంటూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మందులు గుంటూరు జిల్లా కేంద్రం సత్తెనపల్లి రోడ్డులోని ఓ మిర్చి యార్డు దగ్గరలోని గోదాము నుంచి సరఫరా అవుతున్నాయని తెలిసింది. కాగా, ఈ మందులు ( లాకర్, బీపీహెచ్ పురుగు, దోమలకు , మూవ్ తెగుళ్లకు సంబంధించినవి) పిచికారీ చేసిన వెంటనే పురుగులు చనిపోతుండడం, ధర తక్కువ (ఎకరానికి 100 గ్రాముల ప్యాకెట్ రూ.1000)కు లభిస్తుండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇదే ప్రాంతంలో లభించే మందులకు రెట్టింపు ధర ఉండడంతో రైతులు వాటిని కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా ఇటు రాష్ట్ర ఆదాయానికి కూడా గండిపడుతోంది. గ్రామానికి ఇద్దరు చొప్పున ఏజెంట్లు రాష్ట్ర సరిహద్దు మండలాల్లోని ప్రతి గ్రామంలో ఇద్దరు చొప్పున ఏజెంట్లు ఆయా కంపెనీల నిర్వాహకులు నియమించుకుని మందుల విక్రయాలు జరుపుతున్నారని తెలిసింది. అయితే ఈ ఏజెంట్లు రైతుల వద్ద ముందస్తుగానే డబ్బులు తీసుకుని రాత్రి వేళల్లో ఆర్డర్ మీద సరఫరా చేస్తున్నారని సమాచారం. ఏజెంట్లకు కమీషన్ ఎక్కువగా వస్తుండడంతో స్థానిక రైతులకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారని ప్రచారం జరుగుతోంది. నష్టాలు ఎక్కువే... గుంటూరు మందులు పిచికారీ చేసిన వెంటనే పురుగులు చనిపోతున్నాయి. కానీ దీర్షకాలికంగా ఎన్నో నష్టాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నిషేధిత మందులలో సైనైడ్ కలుపుతారని, వీటిని పిచికారీ చేస్తే కొద్ది రోజులకు చేలు ఎర్రబారతాయని, తదనంతరం సారవంతమైన భూములు చౌడు భూములుగా మారుతాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఈ మందులతో నీరు విషతుల్యంగా మారడంతో మానవాళికి కూడా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. మా దృష్టికి కూడా వచ్చింది గుంటూరు జిల్లా మందుల వ్యవహారం మా దృష్టికి కూడా వచ్చింది. అ మందులు పిచికారీ చేయకూడదని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కొంత మంది రైతులు దళారుల ద్వారా రహస్యంగా తెచ్చుకుంటున్నారు. ఈ మందులపై నిఘా ఏర్పాటు చేశాం. ఈ మందుల తయారీలో సైనైడ్ కలుపుతారు. ఎంతో ప్రమాదకరం. ఎవరైనా ఆ మందులు విక్రయిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. –జ్యోతిర్మయి, జిల్లా వ్యవసాయాధికారిణి -
‘ప్రాణాంతక మందుల’ పై ఉదాసీనత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతుల ప్రాణాలను హరిస్తున్న 18 రకాల క్రిమిసంహారక మందులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెల్సిందే. అయితే అందులో గతేడాది మధ్య భారత్లో పదుల సంఖ్యలో పత్తి రైతులను బలితీసుకున్న మోనోక్రోటోపాస్, మాంకోజెబ్ క్రిమి సంహారక మందులు లేకపోవడం ఆశ్చర్యకరం. దోమల సంహారానికి మున్సిపల్ సిబ్బంది, తెగుళ్ల నివారణకు రైతులు కొట్టే డీడీటీని కూడా నిషేధించక పోవడం గమనార్హం. మానవులు, జంతువుల ప్రాణాలకు హానికరమైన ఈ మూడు మందులను కూడా నిషేధించాలని వ్యవసాయ శాస్త్రవేత్త అనుపమ వర్మ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మొత్తం 18 క్రిమిసంహారక మందుల్లో 11 మందుల రిజిస్ట్రేషన్, ఉత్పత్తి, అమ్మకం, దిగుమతి, ఉపయోగాన్ని తక్షణమే నిషేధించగా, ఆరు క్రిమిసంహారక మందులను 2020, డిసెంబర్ నాటికి విడతల వారిగా నిషేధించాలని నిర్ణయించింది. హెర్బిసైడ్ ట్రిఫులారిన్ను కూడా కేంద్రం తక్షణమే నిషేధించినప్పటికీ ఒక్క గోధుమ పంటకు మాత్రం అనుమతించాలని నిర్ణయించింది. వాస్తవానికి దీన్ని కూడా సంపూర్ణంగా నిషేధించాలని వర్మ కమిటీ సిఫార్సు చేసింది. వాస్తవానికి ఈ క్రిమిసంహారక మందులను కేంద్రం ఎప్పుడో నిషేధించి ఉండాల్సిందీ, తాత్సారం చేస్తూ వచ్చింది. దేశంలో రైతులు ప్రాణాంతకమైన క్రిమిసంహారక మందులను ఉపయోగిస్తున్నారంటూ సామాజిక కార్యకర్తలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రాణాంతకమైన 66 మందుల ప్రభావాన్ని సమీక్షించి తగిన సిఫార్సులను చేయాల్సిందిగా కోరుతూ 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం వర్మ కమిటీని నియమించింది. ఆ కమిటీ 66 మందుల్లో 19 మందులను సంపూర్ణంగా నిషేధించాలని సిఫార్సు చేస్తూ 2015, డిసెంబర్ నెలలోనే నివేదికను మోదీ ప్రభుత్వానికి అందజేసింది. దాదాపు 20 నెలల అనంతరం ఆగస్టు 8వ తేదీన చర్యలు తీసుకుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో నిషేధించిన క్రిమిసంహారక మందుల్లో 104 మందులను మన దేశంలో వాడుతున్నారని ఆరోగ్య కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వాటిల్లో 66 రకాల మందులను మాత్రమే వర్మ కమిటీ సమీక్షించిందని వారు చెప్పారు. అలాగే ప్రపంచంలో పలు దేశాలు నిషేధించిన ‘గ్లైఫోసేట్’ను వర్మ కమిటీ సమీక్షించినా దాన్ని నిషేధించాల్సిందిగా ఎలాంటి సిఫార్సు చేశారు. ప్రాణాంతక మందులను నిషేధించే అధికారం ఒక్క కేంద్రానికి మాత్రమే ఉంది. రాష్ట్రానికి వాటిపై 90 రోజులపాటు తాత్కాలికంగా నిషేధం విధించే అధికారం మాత్రం ఉంది. కాకపోతే వాటి ఉత్పత్తి యూనిట్లకు లైసెన్స్లు నిరాకరించే అధికారం ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement