-
భార్యతో అత్తారింటికి అల్లు అర్జున్.. అభిమానులకు తప్పని నిరాశ
సినీ హీరో అల్లు అర్జున్ సతీసమేతంగా నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి వచ్చారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్రెడ్డి తోడల్లుడు నామిరెడ్డి వీరారెడ్డి మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం సినీ హీరో అల్లు అర్జున్ సతీసమేతంగా చింతపల్లి గ్రామానికి వచ్చి వీరారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పక్కనే ఉన్న అత్తారింటికి వెళ్లి గంటన్నర పాటు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే తమ సమీప బంధువుల పిల్లలు ఒకరిద్దరు ఇంట్లోకి వెళ్లి అల్లు అర్జున్తో ఫొటోలు దిగారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ చింతపల్లికి వచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు, పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చారు. అల్లు అర్జున్తో పాటు కుటుంబ సభ్యుల ఫొటోలను తీసుకోకుండా బౌన్సర్లు అడ్డుకున్నారు. తమ అభిమాన హీరో ఫొటో తీసుకోనీయక పోవడంతో అభిమానులు, ప్రజలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. గతంలోనూ అల్లు అర్జున్ చింతపల్లి గ్రామానికి రెండు పర్యాయాలు దసరా పండుగకు వచ్చి సందడి చేశారు. చదవండి: Shruti Hassan : శ్రుతిహాసన్ ఏంటి ఇలా తయారైంది? ఆమె ముఖానికి ఏమైంది? -
నల్లగొండ జిల్లాలో కూలిన ట్రైనింగ్ విమానం
-
కుప్పకూలిన ట్రైనీ విమానం
పెద్దవూర/విజయపురిసౌత్: నల్లగొండ జిల్లాలో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. విమానంలోని మహిళా శిక్షణ పైలట్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. టూ సీటర్ సెస్నా 152 విమానంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా రైట్ బ్యాంక్ సమీ పంలో ఫ్లైటైక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహిమా గజరాజ్ (29) శిక్షణ పొందుతున్నారు. టూ సీటర్ సెస్నా–152 ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్తో శనివారం ఉదయం 10.30 గంటలకు శిక్షణ కేంద్రం నుంచి సింగిల్గా బయలుదేరారు. టేకాఫ్ అయిన 30 నిమిషాల్లోనే కూలిపోయింది. విమానం శకలాలు వంద మీటర్ల దూరంలో పడిపో యాయి. పైలట్ అక్కడికక్కడే మృతిచెందారు. చెట్లను తాకే ఎత్తులో చక్కర్లు కొట్టి.. రామన్నగూడెం, ముత్యాలమ్మగుడి స్టేజీ మీదుగా 10 నిమిషాలకు పైగా చెట్లను తాకే ఎత్తులో నాలుగైదు సార్లు విమానం చక్కర్లు కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తర్వాత వ్యవసాయ బావి పక్కనున్న సుబాబుల్ చెట్టు పైభాగంలో ఉన్న ఆకులను తాకుతూ పైకి లేచిందని, తర్వాత 30 సెకన్లలోనే రెండు హై టెన్షన్ విద్యుత్ స్తంభాల మధ్య విద్యుత్ తీగల కిందుగా వెళ్లి కూలిపోయిందని వివరించారు. దగ్గర్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న గ్రామ వీఆర్ఏ ప్రమాదం విషయాన్ని స్థానిక తహసీల్దార్, పోలీసులకు తెలిపారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ఘటన స్థలాన్ని పరిశీలించారు. గాలిలో చక్కర్లు కొడుతూ భూమిని వేగంగా తాకి పెద్ద శబ్దంతో విమానం కూలిందని ఎస్పీ తెలిపారు. విమానం సాంకేతిక లోపంతో కూలిందా, మరేదైనా కారణమా డీజీసీఏ విచారణలో తేలుతుందన్నారు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారని తెలిపారు. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం: విమానం శిథిలాల కింద పైలట్ మృతదేహం మాంసం ముద్దగా మారింది. సాయంత్రం 4 గంటలకు ట్రాక్టర్తో శిథిలాలను పక్కకు తొలగించి మృతదేహాన్ని బయటికి తీశారు. సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం చేశారు. తర్వాత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలికి భర్త, తల్లి ఉన్నారు. వారితో కలిసి రైట్బ్యాంకులోనే ఉంటున్నారు. మహిమ మరణ వార్త తెలుసుకొని భర్త పరందామ కన్నీరుమున్నీరుగా విలపించారు. వీరికి 2017లో వివాహం అయినట్లు తెలిసింది. డీజీసీఏ బృందం పరిశీలన: ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయిన ప్రదేశాన్ని హైదరాబాద్ నుంచి వచ్చిన డీజీసీఏ ప్రత్యేక బృందం అధికారులు పరిశీలించారు. కూలిపోయిన విధానాన్ని ప్రత్యక్ష సాక్షులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి డీజీసీఏ ప్రత్యేక బృందం రానున్నట్లు తెలిసింది. మరోవైపు విజయపురి సౌత్లోని ఫ్లైటెక్ ఏవియేషన్ ఆకాడమీని గురజాల డీఎస్పీ జయరాంప్రసాద్, ఆర్డీవో పార్థసారథి తనిఖీ చేశారు. ఫ్లైటెక్లోని రికార్డులు, విమానలకు సంబంధించి అనుమతి పత్రాలను పరిశీలించి విచారణ చేపట్టారు. విమానంతో సిగ్నల్స్ తెగిపోయాయి: ఫ్లైటెక్ సీఈవో ఫ్లైటెక్ శిక్షణ కేంద్రంలో 6 నెలల క్రితం ట్రైనీ మహిళా పైలట్గా మహిమా గజరాజ్ చేరారు. ఆమె ఇప్పటివరకు 85 గంటలు విమానంను నడిపారని, ఇందులో 25 గంటలు సింగిల్గా నడిపిన అనుభవం ఉందని సంస్థ సీఈవో మమత తెలిపారు. టేకాఫ్ అయిన 15 నిమిషాల తర్వాత ఎయిర్ క్రాఫ్ట్తో సిగ్నల్స్ తెగిపోయా యన్నారు. ఫ్లైటెక్ 2009లో ప్రారంభం నాగార్జునసాగర్లోని విజయపురి సౌత్లో 2009లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం పైలట్ శిక్షణ తరగతులను నిర్వహిం చేందుకు అనుమతిచ్చింది. దీంతో ఫ్లైటైక్ ఏవి యేషన్ అకాడమీకి సంబంధించిన ప్రహరీ, రన్వే, హ్యం గర్లు నిర్మించారు. 2010లో అధికారులు క్రాస్ కంట్రీకి అనుమతులు ఇవ్వటంతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. హైదరాబా ద్లోని నాదర్గుల్ ఎయిర్ఫీల్డ్ నుంచి నాగార్జునసాగర్కు ట్రైనీ పైలట్ ఎయిర్క్రాప్ట్లో వచ్చి తిరిగి హైదరాబాద్కు చేరుకునేవారు. అలాగే ఉదయం నాగార్జునసాగర్ ఎయిర్ఫీల్డ్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరుకు క్రాస్ కంట్రీ నిమిత్తం ఎయిర్క్రాఫ్ట్లో బయలుదేరిన మహిమ.. ప్రమాదానికి గురై మృతి చెందారు. సంస్థలో పైలట్లు, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెన్స్ ఇంజనీరింగ్, బీఎస్సీ ఏవియేషన్కు సంబంధించి సుమారు 60 మందికి పైగా శిక్షణ పొందుతున్నారు. -
సర్పంచ్ పాడె మోసిన మంత్రి జగదీశ్ రెడ్డి
పెద్దవూర: అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతిచెందిన సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, పెద్దవూర సర్పంచ్ అంత్యక్రియలు ఆదివారం స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల నడుమ నిర్వహించారు. ఆయన మృతితో పెద్దవూర గ్రామ పంచాయతీలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్లో మృతి చెందగా శనివారం రాత్రి 9 గంటలకు పెద్దవూర తీసుకువచ్చిన మృతదేహాన్ని ఆదివారం 11 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమైంది. తమ అభిమాన నాయకుడి కడచూపు కోసం వందలాదిగా తరలివచ్చారు. కిలోమీటర్ పైగా సాగిన అంతిమ యాత్రలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డిలు పాల్గొని నడిచారు. పాడె మోసిన మంత్రి జగదీశ్రెడ్డి తన సహచరుడు, సీనియర్ టీఆర్ఎస్ నేత, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్రెడ్డి అంతిమ యాత్రలో మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొని పాడెను మోశారు. భాస్కర్రెడ్డితో తనకు గల అనుభవాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రముఖుల పరామర్శ అనారోగ్యంతో మృతి చెందిన పెద్దవూర సర్పంచ్ కర్నాటి విజయభాస్కర్రెడ్డి పార్థీవ దేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎక్సైజ్, యువజన శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, కర్నె ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, చాడ కిషన్రెడ్డి, సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కుమార్, ఎంసీ కోటిరెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్నాయక్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, మన్నెం రంజిత్యాదవ్, జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ చెన్ను అనురాధసుందర్రెడ్డి, కర్నాటి లింగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ కంకణాల నివేదితారెడ్డి, డీవీఎన్రెడ్డి, ఇరిగి పెద్దులు, గడ్డంపల్లి రవీందర్రెడ్డి, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
'కొడుకా నువ్వు కనపడవా.. దేవుడు అన్యాయం చేశాడు'
పెద్దవూర: తలకొరివి పెట్టాల్సిన కొడుకు చితిపై నిర్జీవంగా పడి ఉన్నాడు. బాగోగులు చూసుకునే కోడలు, నానమ్మా అంటూ పిలిచే పిల్లలు ఆ పక్కనే అచేతన స్థితిలో ఉన్నారు. ‘కొడుకా ఇక నువ్వు కనపడవా.. దేవుడు అన్యాయం చేశాడు..’ అంటూ గుండెలవిసేలా రోదిస్తూ ఆ వృద్ధ తల్లి.. నలుగురి చితికి నిప్పు పెట్టిన దృశ్యం.. గ్రామం మొత్తాన్ని కంటతడి పెట్టించింది. ఈ హృదయ విదారక దృశ్యం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తెప్పల మడుగులో శనివారం కనిపించింది. నిడమనూరులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో తెప్పలమడుగు సర్పంచ్ తరి శ్రీనుతో పాటు భార్య విజయ, పిల్లలు శ్రీవిద్య, వర్షిత్ మరణించిన విషయం తెలిసిందే. వారి అంత్యక్రియలు శనివారం స్వగ్రామంలో జరిగాయి. నలుగురి మృతదేహాలను ఒకే చితిపై పేర్చ గా.. శ్రీను తల్లి పెంటమ్మ.. ఆ చితికి నిప్పం టించింది. అంతిమ యాత్రలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తదితరులు పాల్గొన్నారు. చదవండి: మరణంలోనూ వీడని స్నేహం..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement