-
మిమిక్రీ శాయవలే... ముంబైలో ఫ్లాట్ కొనవలే!
ఆలియా భట్ గొంతును అనుకరిస్తూ బోలెడు పాపులారిటీ సంపాదించింది 24 సంవత్సరాల కంటెంట్ క్రియేటర్ చాందిని భాబ్డా. ఈ పాపులారిటీనే ఆమెను ముంబైలో ఒక ఫ్లాట్కు ఓనర్ను చేసింది. సంప్రదాయ రీతిలో గృహప్రవేశంతో తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది చాందిని. ఇన్స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 2022లో ఆన్–పాయింట్ మిమిక్రీ క్లిప్స్తో సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది చాందిని. సొంత ఇంటి కలతో మిమిక్రీ కళను నమ్ముకొని డబ్బులను పొదుపు చేసేది. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది. ఈ ఫ్లాట్ కొనడానికి ఎన్నో ఇష్టాలను వదులుకొని, ఎలా డబ్బు పొదుపు చేసిందీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వివరించింది చాందిని. ‘ఫ్రెండ్స్ విదేశాలకు వెళుతున్నప్పుడు నాకు కూడా వెళ్లాలనిపించేది. బర్త్డే ఫంక్షన్ను ఘనంగా జరుపుకోవాలనుకునేదాన్ని... ఇలాంటి ఎన్నో సందర్భాలలో ఇంటికల గుర్తుచ్చేది. పొదుపు చేయడం ఎప్పుడూ మానలేదు’ అని రాసింది చాందిని. -
సొంత ఇల్లు కొందామనుకుంటున్నారా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
అద్దె ఇంట్లో ఉంటూ సొంత ఇల్లు కొనాలని కలలు కంటున్నారా? ఇల్లు కొనడం మంచిదా లేక అద్దె ఇంట్లోనే కాలం గడపడం మంచిదా? ఈ రోజు ఈ ప్రశ్నలకు జవాబుగా మీ జాతకపరంగా పరిష్కారం చెప్పటం లేదు. ఇది ఏదో ఒక రుణ సంస్థ తరఫున ప్రకటన కాదు. ఫలానా దగ్గరే కొనమని విసిగించడమూ కాదు. ఇప్పుడు చెప్పబోతున్నది ఇల్లు, ఫ్లాటు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే. కేవలం ఆర్థికపరంగా, ఇన్కం ట్యాక్స్ చట్టపరంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులు, మీరు తీసుకోవాల్సిన శ్రద్ధ, జాగ్రత్తలు తెలుసుకోండి. ఈ విషయంలో సెంటిమెంటు జోలికి వెళ్లకండి. ఎక్కడ కొందామనుకుంటున్నారు? మీకు కానీ మీ కుటుంబసభ్యులకు అనువైన లొకేషన్లో కొనండి. అన్నింటికీ దగ్గరగా ఉండాలి. రవాణా సౌకర్యం ఉండాలి. వాన, వరద వస్తే ముంపునకు గురి కాకూడదు. మీరే ఉంటారా లేక కేవలం అద్దె.. అంటే ఆదాయం కొసం తీసుకుందామనుకుంటున్నారా అనేది చూసుకోవాలి. కొంత మంది పెన్షన్ లేని వాళ్లు నెలసరి ఆదాయం కోసం ఇళ్లు కొన్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. మీ వనరుల సంగతేమిటి? మీరు ఇంటికోసం ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు అనేది ముఖ్యం. ఇటువంటి విషయాల్లో ఎంత పక్కాగా లెక్కలు వేసినప్పటికీ అదనపు భారం అనివార్యం. టైం కూడా మీ చేతిలో ఉండదు. వ్యవహారం సాఫీగా జరగకపోవచ్చు. మొత్తం ఇన్వెస్టుమెంటు రెడీగా ఉందా? అప్పు అవసరమా? అనవసరమా? అప్పు ఎక్కడ నుంచి తీసుకోవాలి? ఏ సంస్థా పూర్తి మొత్తాన్ని అప్పుగా ఇవ్వదు. మనం కొంత మార్జిన్ మనీ చెల్లించాలి. కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. మీరు చేసిన ఇన్వెస్టుమెంటుకి, చెల్లించిన మార్జిన్ మనీకి ‘సోర్స్’ ఉండాలి. ‘సోర్స్’ అంటే అప్పు కావచ్చు, మీ సేవింగ్స్ కావచ్చు, పన్ను చెల్లించగా మిగిలిన మొత్తం కావచ్చు, మీ అబ్బాయి అమెరికా నుండి పంపి ఉండవచ్చు, మీకు వీలునామా ద్వారా సంక్రమించిన బ్యాంకు బ్యాలెన్సు కావచ్చు లేదా లాటరీ తలుపు తట్టి ఉండవచ్చు. ‘సోర్స్’కి రాత లు, కోతలు ఉండాలి. అలా ఉండకపోతే ఆ మొ త్తాన్ని మీ ఆదాయంగా భావిస్తారు. క్యాపిటల్ బడ్జె ట్ వేసుకున్నాకా, రెవెన్యూ బడ్జెట్ వేసుకోవాలి. రెవెన్యూ బడ్జెట్ గురించి ఆలోచించారా? అన్నీ సక్రమంగా ఉండి, సకాలంలో ఇల్లు పూర్తి అయ్యిందనుకోండి. మీరే ఆ ఇంట్లో ఉంటే ఇంటి రుణం చెల్లింపుల మీద, రుణం మీద వడ్డీ (పరిమితుల మేరకు) మినహాయింపు లభిస్తుంది. కానీ ప్రతి నెలా వాయిదా (ఈఎంఐ) చెల్లించగలగాలి. మీకు వచ్చే హెచ్ఆర్ఏ పన్నుకి గురి అవుతుంది. ఆర్థికపరంగా బండి సాఫీగా వెళ్లాలి. అద్దెకి ఇచ్చారనుకోండి. వచ్చిన అద్దెను తప్పకుండా ఆదాయంగా చూపించాలి. అవసరం అయితే, పన్ను చెల్లించాలి. స్వంత ఇల్లు/కొత్త ఇల్లు నిర్వహించడానికి బోలెడంత .. లేదా అనుకోని ఖర్చులు అవుతాయి. వీటన్నింటికీ సిద్ధంగా ఉండాలి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్కు పంపించగలరు. -
హైదరాబాద్లో ఆ గృహాలకు మహా గిరాకీ
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో విలాస గృహాలకు గిరాకీ పెరిగింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) 430 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే మూడు నెలల్లో విక్రయాలు 50 యూనిట్లతో పోలిస్తే ఎనిమిది రెట్లకు పైగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ ఈ వివరాలను విడుదల చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లోనూ విలాస నివాసాలు జనవరి–మార్చి కాలంలో జోరుగా సాగాయి. మొత్తం 4,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 1,600 యూనిట్లతో పోలిస్తే రెండున్నర రెట్లు అధికంగా నమోదయ్యాయి. అన్ని రకాల ఇళ్లు కలసి ఈ ఏడు పట్టణాల్లో మార్చి త్రైమాసికంలో 78,700 యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 70,500 యూనిట్లుగా ఉన్నాయి. పట్టణాల వారీగా.. ► ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 600 యూనిట్లు ఉంటే, అవి తాజాగా ముగిసిన త్రైమాసికంలో 1,900 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ముంబైలో ఖరీదైన ఇళ్ల విక్రయాలు 800 యూనిట్ల నుంచి 1,150 యూనిట్లకు పెరిగాయి. ► పుణెలో 10 రెట్లు అధికంగా 150 యూనిట్లు అమ్ముడుపోగా, బెంగళూరులో కేవలం 50 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ► కోల్కతాలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 50 యూనిట్ల నుంచి 100కు పెరిగాయి. ► చెన్నై మార్కెట్లో విలాస నివాసాల అమ్మకాలు 250 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 50 యూనిట్లుగానే ఉన్నాయి. బలంగా సొంతిల్లు ఆకాంక్ష 2022లో ఖరీదైన ఇళ్ల విభాగం బలమైన పనితీరు చూపించగా, ఆ తర్వాత కూడా అదే విధమైన విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కొనసాగినట్టు సీబీఆర్ఈ తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి తర్వాత విలాస గృహాలకు డిమాండ్ ఎగిసింది. సొంతిల్లు కావాలని, విశాలమైన ఇళ్లు కావాలని కోరుకునే వారు పెరిగారు’’అని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. సొంతిల్లు కావాలనే ఆకాంక్ష ఈ ఏడాది కూడా విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలకు మద్దతుగా నిలుస్తుందని సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. వినియోగ ప్రాధాన్యతలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు, ఆరోగ్యం, భద్రత, చుట్టూ పరిశుభ్రమైన పరిసరాలతో కూడిన ప్రాజెక్టులకు డిమాండ్ ఉంటుందన్నారు. లగ్జరీ ప్రాపర్టీలకు కన్సల్టెన్సీ సేవలు అందించే సోథెబీ ఎండీ అమిత్ గోయల్ స్పందిస్తూ.. సాధారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో 5–7 ఏళ్ల పాటు బేర్, బుల్ సైకిల్ ఉంటుందని చెబుతూ.. ప్రస్తుతం కచ్చితంగా బుల్ సైకిల్ అని పేర్కొన్నారు. -
సొంతింటికి ‘జంట’ దారి..!
సొంతింట్లో ఉన్నంత సంతృప్తి అద్దె ఇంట్లో లభించదు. కిరాయి ఇచ్చినంత మాత్రాన అన్ని హక్కులూ రావు. గోప్యత, ఇంటి వినియోగంలో స్వేచ్ఛ, బంధువుల రాకపోకలు ఇలా చెప్పుకుంటూ పోతే.. అద్దె ఇళ్ల విషయంలో ఎన్నో ప్రతికూల అంశాలున్నాయి. అందుకే నేటితరం పెళ్లికి ముందే లేదంటే పెళ్లయిన కొన్నాళ్లకే సొంతింటి వైపు అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు సొంతిల్లు అన్నది ఓ పెద్ద కల. కానీ, నేడు విశాలమైన (కనీస అవసరాల మేరకు) ఇల్లు అన్నది కలగా మారిందని చెప్పుకోవాల్సిందే. చదువుకునే పిల్లలు ఏకాంతం కోరుకుంటున్నారు. ఉద్యోగాలు చేసే దంపతులు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఇంట్లోనే తమకంటూ ప్రైవేటు స్థలం ఉండాలని భావిస్తున్నారు. కనుక మారుతున్న అవసరాల నేపథ్యంలో సొంతింటికి ప్లాన్ చేసుకునే వారు కనీసం టూ లేదా త్రీ బెడ్ రూమ్ ఉండాలంటున్నారు..! ఇల్లు విశాలంగా ఉండాలంటే భారీ మొత్తమే సమకూర్చుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో దంపతులు ఇద్దరూ కలసి ఉమ్మడిగా గృహ రుణం (జాయింట్ హోమ్ లోన్) తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. అయితే, దీనికి ఎలా సిద్ధం కావాలి.. నిబంధనలు ఎలా ఉంటాయి.. వంటివన్నీ వివరించే కథనం ఇది.. చిన్న కుటుంబం అనుకున్నా భార్యా భర్త, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. వీరికి తోడుగా తల్లిదండ్రులు కూడా ఉంటే ఇల్లు కాస్త విశాలంగా ఉండాల్సిందే కదా. శివ, అపూర్వ దంపతులకు సైతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివ తల్లిదండ్రులు అతడితోనే ఉంటున్నారు. శివ పెళ్లయిన కొత్తలో తనకున్న బడ్జెట్తో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఇటీవల కరోనా కాలంలో ఇంటి నుంచి పని చేసుకోవాల్సి వచ్చింది. కానీ, అందరూ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితుల్లో అతడికి ఏకాంతంతో కూడిన కాస్తంత స్థలం కరువైంది. అందుకనే అతడు త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు సమకూర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడున్న ఒక్క పడకగది ఫ్లాట్ విక్రయించగా వచ్చే మొత్తాన్ని డౌన్ పేమెంట్ కింద జమ చేసి, మిగతా మొత్తాన్ని రుణం ద్వారా సమకూర్చుకోవాలన్నది అతడి ప్రణాళిక. ఇలా కోరుకునే వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. నగరంలో త్రిబుల్ బెడ్ రూమ్ అంటే భారీ పెట్టుబడి అవసరపడుతుంది. కనుక జాయింట్ హోమ్లోన్ ఆప్షన్ను పరిశీలించొచ్చు. దీనికి ముందు జాయింట్ హోమ్లోని సాధక, బాధకాల గురించి అవగాహన కల్పించుకుంటే, సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది. నిబంధనలు – అర్హతలు చెల్లించే సామర్థ్యం ఉంటే ఒక్కరి పేరుమీదనే గృహ రుణాన్ని తీసుకోవచ్చు. కానీ, దంపతులు కలసి తీసుకోవడం వల్ల కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీలైతే జాయింట్గానే చాలా మంది గృహ రుణానికి మొగ్గు చూపుతుంటారు. చాలా బ్యాంకులు సహ రుణ గ్రహీత కింద కుటుంబ సభ్యులనే అనుమతిస్తున్నాయి. ఒక వ్యక్తి తన తండ్రితో లేదంటే భార్యతో కలసి ఉమ్మడిగా రుణం తీసుకోవచ్చు. అలాగే, తండ్రి కూడా తన కుమారుడు, పెళ్లి కాని కుమార్తెతో కలసి రుణం పొందొచ్చు. ఇక ఇద్దరు సోదరీ మణులు, ఒక సోదరి ఒక సోదరుడు, వివాహిత అయిన కుమార్తెతో కలసి తండ్రి, స్నేహతులు ఉమ్మడిగా గృహ రుణం పొందడానికి అర్హత లేదు. జాయింట్ హోమ్ లోన్లో ప్రధాన రుణ గ్రహీత, సహ రుణ గ్రహీత ఉంటారు. సహ రుణ గ్రహీతలు రెండు రకాలు. ఎంత రుణం మంజూరు చేయాలన్న అర్హత కోసం సహ రుణ గ్రహీత ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం ఇందులో ఒకటి. సహ రుణ గ్రహీత ఆదాయాన్ని సైతం రుణ అర్హతకు పరిగణనలోకి తీసుకోవడం రెండో రకం. ఉదాహరణకు రిటైర్ అయిన వారికి పెన్షన్ మినహా వేరే ఆదాయం ఉండదు. కనుక తల్లిదండ్రుల్లో ఒకరు ఆదాయం లేని సహ రుణ దరఖాస్తుదారుగా చేరొచ్చు. రుణానికి ఇద్దరు దరఖాస్తు చేసుకుంటుంటే, ఆ ప్రాపర్టీకి ఇద్దరూ సహ యజమానులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒక ప్రాపర్టీకి భార్య, భర్త సహ యజమానులుగా ఉండేట్టు అయితే అప్పుడు బ్యాంకులు ఇద్దరి పేరిట జాయింట్ హోమ్ లోన్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కనుక ఈ అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఇక జాయింట్ హోమ్ లోన్ అంటే ఇద్దరే తీసుకోవాలని లేదు. ముగ్గురు కూడా కలసి తీసుకోవచ్చు. ప్రయోజనాలు ఎన్నో.. ఉమ్మడిగా రుణం తీసుకుంటే ఎక్కువ మొత్తమే లభిస్తుంది. మంచి ఖరీదైన ఇంటికి ప్లాన్ చేసుకునే దంపతులు ఇద్దరూ వేతన జీవులు లేదా సంపాదనాపరులు అయితే ఇక బ్యాంకులు పిలిచి మరీ రుణం ఇస్తాయి. ఇద్దరి ఆదాయాన్ని అర్హత కింద లెక్కలోకి తీసుకుంటాయి. కనుక అధిక మొత్తాన్ని రుణం రూపంలో అందుకోవచ్చు. దీంతో తమ కలల ఇంటిని సొంతం చేసుకోవచ్చు. ఒక్కరి పేరు మీద రుణంతో పోలిస్తే ఇద్దరి పేరిట రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఎక్కువ మొగ్గు చూపుతాయి. ఎందుకంటే ఒకరి నుంచి కాకపోయినా, మరొకరి నుంచి అయినా రికవరీ చేసుకోవచ్చన్న ధీమాయే కారణం. పైగా ఇలా జాయింట్ హోమ్లోన్లో ఎగవేతలు చాలా తక్కువ. ఒకరికి ఇబ్బందులు వచ్చినా మరొకరు చెల్లింపుల బాధ్యతను తీసుకోగలరు. అందుకే బ్యాంకులకు, రుణ గ్రహీతలకు ఇది అనుకూల ఆప్షన్ అవుతుంది. పెద్ద మొత్తం వస్తుండడంతో చెల్లించే విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడదు. పైగా ఇంటి సౌకర్యాల విషయంలోనూ రాజీ పడాల్సిన అవసరం ఉండదు. ఇక ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్నా ఆదాయపన్ను ప్రయోజనాలకు ఢోకా ఉండదు. ఎక్కువ మందికి జాయింట్ హోమ్ లోన్ విషయంలో ఎదురయ్యే సందేహం ఇదే. కనుక ఈ సందేహం అక్కర్లేదు. విడిగా ఎవరికి వారు ఆదాయపన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవాలని అనుకుంటే.. ముందుగానే ఈఎంఐలో ఎవరి వాటా ఎంతో తేల్చుకోవాలి. నిర్ణయించుకున్న ప్రకారం ప్రతి నెలా ఈఎంఐను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. పైగా జాయింట్ హోమ్ లోన్ విషయంలో పన్ను పరంగా ఓ ప్రత్యేక వెసులుబాటు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎలా అంటే, విడిగా ఒక్కరే గృహ రుణం తీసుకుంటే, అసలు, వడ్డీ భాగాలకు ఆదాయపన్ను ప్రయోజనం పూర్తిగా పొందలేని పరిస్థితి ఉండొచ్చు. అటువంటప్పుడు ఇరువురు కలసి తీసుకోవడం వల్ల మిగులు ప్రయోజనాన్ని వేరొకరు సొంతం చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా ఈఎంఐ వాటా మార్చుకుంటే సరిపోతుంది. ఇంటి రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల వరకు సెక్షన్ 24 కింద పన్ను చెల్లించక్కర్లేదు. ఇక అసలుకు చేసే చెల్లింపులు రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద మినహాయించి చూపించుకోవచ్చు. ఈ పరిమితి ఎవరికి వారికే విడిగా అమలవుతుంది. చాలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మహిళా రుణ గ్రహీతలకు రుణ రేటులో కొంత తగ్గింపును ఇస్తున్నాయి. ఇందుకోసం ఇద్దరు దరఖాస్తుదారుల్లో ఒకరు మహిళ అయి ఉండాలి. ప్రధాన రుణ దరఖాస్తుదారుగా లేదా సహ రుణ దరఖాస్తుదారుగా ఉండొచ్చు. ప్రతికూలతలూ ఉన్నాయ్.. ► ఇద్దరు సహ రుణ గ్రహీతల్లో ఒకరికి ఆదాయం ఉన్నట్టుండి ఆగిపోతే, మరొకరు ఆ బాధ్యత తీసుకోవచ్చు. ఇది ఒక విధంగా అనుకూలం, మరో విధంగా ప్రతికూలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కరే తీసుకుని, ఆదాయం ఆగిపోతే డిఫాల్ట్ అవుతారు. ఈఎంఐ చెల్లించలేకపోతే రుణ చరిత్రపై నల్లటి మచ్చ పడుతుంది. ఉమ్మడిగా తీసుకుంటే ఈ ఇబ్బంది రాకుండా రెండో వారు చెల్లింపులతో ఆదుకుంటారు. దీనివల్ల ఒక్కరిపైనే మొత్తం ఈఎంఐ చెల్లింపుల భారం పడుతుందని మర్చిపోవద్దు. కాకపోతే ఇది మరీ పెద్ద ప్రతికూలత కాదనుకోండి. దురదృష్టవశాత్తూ ఇద్దరిలో ఒకరు శాశ్వతంగా సంపాదించలేని పరిస్థితులు ఎదురైతే తప్ప.. జాయింట్ హోమ్ లోన్లో తాత్కాలిక ఆదాయ నష్టాలను ఒక్కరే భారం మోయడం ద్వారా అధిగమించొచ్చు. కాకపోతే ఇందుకు ముందుగానే సిద్ధపడాలి. ► రుణ గ్రహీతల మధ్య విభేదాలు, స్పర్థలు తలెత్తితే సమస్య ఎదురుకావచ్చు. అప్పుడు ఇద్దరిలో ఒకరు ఈఎంఐ చెల్లించేందుకు నిరాకరించొచ్చు. దీనివల్ల క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. సిబిల్ స్కోర్ పడిపోతుంది. దీంతో భవిష్యత్తులో రుణం ఇచ్చేందుకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ముందుకు రాకపోవచ్చు. రుణ చరిత్ర దెబ్బతినకూడదని అనుకుంటే, కష్టమైనా కానీ రెండో వ్యక్తి ఈఎంఐ భారాన్ని మోయాల్సి రావచ్చు. ఇలాంటి కేసులు తక్కువే ఉంటాయి. కీడెంచి మేలెంచమన్నట్టు.. ముందే ఈ విధమైన సమస్యలకు సన్నద్ధులు కావాలి. వీలైతే జాయింట్ హోమ్ లోన్ తీసుకునే సమయంలోనే ఒక అగ్రిమెంట్ రాసుకోవడం మంచిది. ► దంపతులు కలసి గృహ రుణం తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైనా కారణంతో విడిపోవాల్సి వస్తే..? అప్పుడు మిగిలిన గృహ రుణాన్ని తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ప్రాపర్టీపై ఎవరి హక్కులు ఏ మేరకు? ఇలాంటి అంశాల్లో పక్కా స్పష్టత అవసరం. ఇందుకోసం ముందే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. వారి సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవడం ఎందుౖMðనా మంచిది. మరొకరు ఈఎంఐ భారం మోసి, చివర్లో ఇద్దరూ పంచుకోవడమా? లేక అంతటితో ముగించడమా..? ఇలా చాలా అంశాల్లో స్పష్టత తీసుకోవాల్సి ఉంటుంది. ముందే ఆయా అంశాలకు వచ్చి, న్యాయపరమైన సలహా ప్రకారం నడుచుకోవడం మంచింది. ► ఇక సహ రుణ గ్రహీతల్లో ఒకరు ఏదైనా కారణంతో మరణించినట్టయితే అప్పుడు ఏం చేయాలో ముందే ఆలోచించుకోవాలి. మిగిలిన దరఖాస్తుదారులపై రుణ ఈఎంఐ భారం పడుతుంది. ఇలా జాయింట్ హోమ్ లోన్లో ఏ కారణం వల్ల ఈఎంఐ చెల్లించకపోతే తీవ్ర సమస్యే. రుణం ఇచ్చిన సంస్థ ఇంటిని జప్తు చేసి వేలానికి పెడుతుంది. ఇక దంపతులు కలసి గృహ రుణం తీసుకున్న తర్వాత, వారిలో ఒకరు మరణించినట్టయితే.. మిగిలిన జీవిత భాగస్వామి మొత్తం ప్రాపర్టీలో ఒకటో వంతు వాటాకే హక్కుదారులు అవుతారు. మరో రెండు భాగాల్లో మరణించిన జీవిత భాగస్వామి తల్లిదండ్రులకు ఒక భాగం, పిల్లలకు ఒక భాగం లభిస్తుంది. ఉమ్మడిగా రుణం తీసుకునే ముందు, భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా అధిగమించడంపై కార్యాచరణను ముందే సిద్ధం చేసుకోవాలి. -
మధ్య తరగతి సొంతింటి కల నెరవేరుస్తాం
చిలకలపూడి (మచిలీపట్నం): పేదవారికి ఇప్పటికే సొంతింటి కల నెరవేర్చి స్థల పట్టాలు ఇచ్చామని, మధ్య తరగతి కుటుంబీకులకు కూడా అతి తక్కువ ధరతో సొంతింటి కలను నెరవేర్చేందుకు వైఎస్ జగన్ స్మార్ట్ కాలనీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నెలకు రూ.12 వేలకు పైగా ఆదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాల వారికి మూడు కేటగిరీల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి 150, 200, 240 గజాల చొప్పున స్థలాలు విభజించి.. వాటిలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. వీటన్నింటికి అయిన ఖర్చును మాత్రమే దరఖాస్తుదారుని వద్ద తీసుకుని ఇంటి పట్టా అందజేయటం జరుగుతుందన్నారు. ఆ స్థలాల కోసం సచివాలయాల్లో ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో మొదటిదశగా మచిలీపట్నం, గుడివాడ మునిసిపాలిటీలను గుర్తించినట్టు చెప్పారు. మునిసిపాలిటీ పరిధికి అతి దగ్గరగా ఈ కాలనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement