-
Krithi Shetty: నెల్లూరులో షాపింగ్ మాల్ ప్రారంభించిన ఉప్పెన భామ కృతిశెట్టి (ఫొటోలు)
-
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను: మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు విచారణలు ఎదుర్కోవాలి. నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. సీబీఐ విచారణ జరపాలని నేను అఫిడవిట్ దాఖలు చేశాను. టీడీపీ అధినేత చంద్రబాబులాగా స్టేలతో తప్పించుకోవాలని నేను చూడలేదు. నాపై టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయి అని స్పష్టం చేశారు. -
నెల్లూరు కోర్టులో చోరీ కేసు విచారణను సీబీఐకి అప్పగించిన హైకోర్టు
-
ఎవరా జడ్జి.. శిక్షణ సరిగా లేదా?.. సుప్రీంకోర్టు అసహనం
సాక్షి, న్యూఢిల్లీ: బెయిలు మంజూరు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలు సరిగా అర్థం చేసుకోలేకపోయిన జడ్జి ఎవరు? జ్యుడీషియల్ అకాడమీ శిక్షణ సరిగా లేదా? అని నెల్లూరు అదనపు సెషన్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నెల్లూరు కేంద్ర కారాగారంలో గృహహింస, హత్య కేసులో దోషిగా తొమ్మిదేళ్లు శిక్ష అనుభవిస్తున్న గోపిశెట్టి హరికృష్ణ అనే వ్యక్తిని మూడు రోజుల్లో ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టాలని, బెయిలు మంజూరు చేయాలని సెప్టెంబర్ 28, 2020న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. చదవండి: ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ 3 రోజుల్లో జైలు అధికారులు హరికృష్ణను ప్రవేశపెట్టని కారణంగా ట్రయల్ కోర్టు బెయిలు నిరాకరించింది. దీనిపై ఓ న్యాయవాది సుప్రీంకోర్టుకు లేఖ రాయడంతో ఏప్రిల్ 2022లో హరికృష్ణ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సమయంలో జైలు అధికారులు, ట్రయల్ కోర్టు జడ్జి, సుప్రీంకోర్టు రిజిస్ట్రీలు వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసును సోమవారం జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. గతంలో కోర్టు ఉత్తర్వులు తదనంతరం పరిణామాలను ధర్మాసనం ప్రస్తావించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ అయినా హరికృష్ణ కస్టడీలో కొనసాగారు. ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో పంపగా అక్టోబర్ 6న జైలు అధికారులకు అందాయని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చెబుతోంది. మరోవైపు సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల్ని ట్రయల్ కోర్టు సరిగా అర్థం చేసుకున్నట్టు కనిపించడం లేదు. మూడు రోజుల్లో ప్రవేశపెట్టాలంటే త్వరగా ప్రవేశపెట్టాలని అంతేకానీ తర్వాత ప్రవేశపెడితే బెయిల్ ఇవ్వకూడదని అర్థం కాదు. ఒక న్యాయాధికారి ఈ విధంగా అర్థం చేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది’’అని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారమంతా హైకోర్టుకు వదిలేస్తున్నామంది. 6 వారాల్లో హైకోర్టు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కింది కోర్టులు నెలవారీ నివేదికలను హైకోర్టుకు ఇస్తుంటే ఇలాంటివి జరగవని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి చెప్పారు. విచారణ సందర్భంగా ట్రయల్ కోర్టు జడ్జిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆ జడ్జికి పదేళ్ల సర్వీసు పూర్తయిందా.. ఇలాంటి న్యాయాధికారులు ఉండటంపై క్షమించండి.. అంటూ వ్యాఖ్యానించింది. -
నెల్లూరు కోర్టు సంచలన తీర్పు
సాక్షి, నెల్లూరు: డబుల్ మర్డర్ కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2013లో జరిగిన తల్లీకూతుళ్ల హత్యకేసులో న్యాయస్థానం గురువారం తీర్పును వెల్లడించింది. నిందితుడు షేక్ ఇంతియాజ్కు ఉరిశిక్ష విధిస్తూ ఎనిమిదో అదనపు న్యాయమూర్తి సత్యనారాయణ తీర్పునిచ్చారు. కాగా హరినాథపురం 4వ వీధికి చెందిన దినకర్ రెడ్డి భార్య శకుంతలతో పాటు మెడిసిన్ చదువుతున్న కుమార్తె భార్గవిని ముగ్గురు దుండగులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే నగరంలోని వాగ్దేవి డి-ఫార్మసీ కళాశాల కరెస్పాండెంట్ దినకర్ రెడ్డి, స్థానిక హరనాథపురంలో భార్య, కుమార్తెతో నివాసం ఉండేవారు. ఆయన కుమార్తె భార్గవి ఎంబీబీఎస్ చదువుతోంది. 2013 ఫిబ్రవరి 12న దినకర్రెడ్డి నూతన గృహానికి సంబంధించిన ప్లాన్ ఇచ్చేందుకు వచ్చిన ముగ్గురు..శకుంతల, భార్గవిపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర రక్తగాయాలైన తల్లీకూతురు కిందపడిపోయారు. వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement