-
వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు భారీ ఊరట!
సింగూర్ నానో ఫ్లాంట్ వ్యవహారంలో సుదీర్ఘ పోరాటం చేస్తున్న ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్కు ప్రతిఫలం దక్కింది. మధ్యవర్తిత్వ అవార్డు (arbitral award) కింద అసలు, వడ్డీ మొత్తం రూ.766 కోట్లు పొందనుంది. వెస్ట్బెంగాల్ సింగూర్లో ‘టాటా మోటార్స్ లిమిటెడ్ (టీఎంఎల్) ఆటోమొబైల్ మ్యానిఫ్యాక్చరింగ్ ఏర్పాటు కోసం కేటాయించిన కేపిటల్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో నష్టపోయాం. ఈ వ్యవహారంలో ఎట్టకేలకు ఊరట లభించింది. వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (డబ్ల్యూబీఐడీసీ)..టీఎంఎల్కు అసలు, వడ్డీ చెల్లించేలా ముగ్గురు సభ్యుల ఆర్బిట్రల్ ట్రిబ్యూనల్స్ బృందం తీర్పు వెల్లడించారు’ అని టాటా మోటార్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. ట్రిబ్యునల్ నిర్ణయంతో.. టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా సెప్టెంబర్ 1, 2016 నుంచి అసలు, ఏడాదికి 11 శాతం వడ్డీతో రూ.765.78 కోట్ల మొత్తాన్ని అందుకోనున్నారు. టాటాకు వెయ్యి ఎకరాల భూమి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం టాటా మోటార్స్కు నానో కార్లను తయారు చేసుకునేందుకు సుమారు 1,000 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించింది. అయితే, ఆ ప్రాంతంలోని రాజకీయ నాయకులు, రైతుల నుండి తీవ్ర నిరసనతో టాటా మోటార్స్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్కు అప్పటికే టాటా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. దీంతో పెట్టుబడులు విషయంలో తమకు నష్టం వాటిల్లిందని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని న్యాయ పోరాటం చేస్తుంది. ఎట్టకేలకు ఈరోజు ట్రిబ్యూనల్ టాటా మోటార్స్కు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇక నాటి పరిస్థితుల దృష్ట్యా టాటా మోటార్స్ నానో కార్ల తయారీ ప్లాంట్ను పశ్చిమ బెంగాల్ నుంచి తయారీ యూనిట్ను గుజరాత్లోని సనంద్కు మార్చింది. అక్కడే టాటా నానో తయారైంది. -
మార్కెట్లోకి టాటా నానో ఈవీ..?
-
బీజేపీ ఆఫీస్ ఎదుట నానో కారు కలకలం.. బాంబు స్క్వాడ్కు ఫిర్యాదు!
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బీజేపీ కార్యాలయం ఎదుట మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్న ఓ కారు కలకలం సృష్టించింది. సోమవారం నుంచి నానో కారు బీజేపీ కార్యాలయం ఎదుటే ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నానో కారులో సూట్కేసు ఉంది. దీంతో బాంబు స్క్వాడ్కు సమాచారం అందించారు బీజేపీ నేతలు. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్స్ సైతం కారులో తనిఖీలు చేపట్టారు. అయితే, కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చారు. కారులోని సూట్కేసులో దుస్తులు తప్పా ఎలాంటి ఇతర వస్తువులు లభించలేదని స్పష్టం చేశారు పోలీసులు. అబిడ్స్ పోలీస్ స్టేషన్కు కారును తరలించి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇదీ చదవండి: విషాద ఘటన: దేశభక్తితో ప్రసంగిస్తూనే కుప్పకూలాడు -
ఇండియా@75: లక్షకే కారు.. నానో జోరు
మోటర్సైకిళ్లు, స్కూటర్లు నడిపేవారికి సైతం అందుబాటులోకి తెచ్చేందుకు టాటా మోటర్స్ కంపెనీ ‘నానో’ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మొత్తం అంతా కలిపి లక్ష రూపాయలకే చేతి కొచ్చే ఈ కారును కొనేందుకు భారత ప్రజలు ఉత్సాహం చూపారు. ఏడాదికి 2,50,000 కార్లు విక్రయించాలని టాటా మోటర్స్ లక్ష్యం పెట్టుకుంది. అయితే ఫ్యాక్టరీని రాజకీయ కారణాల వల్ల పశ్చిమబెంగాల్లోని సింగూరు నుంచి గుజరాత్లోని సనంద్కు మార్చవలసి రావడంలో జరిగిన జాప్యం కారణంగా లక్ష్యాన్ని సాధించలేక పోయింది. అంత తక్కువ ధర గల కారు సురక్షితం కాదేమోనని వినియోగదారులు భావించడం కూడా నానో విక్రయాలు మందగించడానికి ఒక కారణం అయింది. అయినప్పటికీ రతన్ టాటాకు ఈ బ్రాండ్తో ఉన్న సెంటిమెంటు వల్ల 2017 వరకు బండిని లాక్కొచ్చారు. సనంద్ ఫ్యాక్టరీ ఇప్పుడు టియాగో, టైగర్ బ్రాండ్ రెగ్యులర్ కార్లను ఉత్పత్తి చేస్తోంది. వాటి ధర సుమారు 6 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్పటికీ నానో కారు నడిపేవారు రోడ్లపై కనిపిస్తారు కానీ, నానో కారు ఉత్పత్తులు 2018లోనే ఆగిపోయాయి. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, బాబా ఆమ్టే, రఘువరన్, శ్యామ్ మానెక్షా, మహేంద్ర కపూర్, వి.పి.సింగ్ కన్నుమూత. జైపూర్లోని మోతీ డూంగ్రీ ఫోర్ట్ వద్ద ల్యాండ్ మాఫియాకు వ్యతిరేకంగా తన 88 ఏళ్ల వయసులో ధర్నాకు కూర్చున్న జైపూర్ రాజమాత గాయత్రీదేవి. హైదరాబాద్లో రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం. హిమాచల్ ప్రదేశ్లోని నైనా దేవి ఆలయంలో తొక్కిసలాట. 162 మంది మృతి. ముంబైలో నవంబర్ 26 నుంచి 29 మధ్య పాక్ ప్రేరేపిత ఉగ్రవాద బాంబు పేలుళ్లు. 175 మంది పౌరులు దుర్మరణం. (చదవండి: మహోజ్వల భారతి: బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిసత్వ నిషేధం) -
రతన్టాటా సింప్లిసిటీ.. కోట్లు విలువ చేసే కారున్నా..
Ratan Tata Nano Car: సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచే రతన్టాటా మరోసారి తాను నమ్ముతున్నవాటిని ఆచరణలో పెట్టి చూపించారు. భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. రతన్టాటా తన అభిమానులకు ఆకట్టుకున్నారు. దేశంలోనే పేరెన్నికగల టాటా గ్రూపులకు బిగ్బాస్గా ఉంటున్నా గ్రౌండ్ టూ ఎర్త్ ఉండటంలో ఆయనకు ఆయనే సాటిగా నిలుస్తున్నారు. ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న ప్రముఖ తాజ్ హోటల్ టాటా గ్రూపు నిర్వాహణలోనే ఉంది. బడా పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ దురందరులు, కార్పొరేట్ బిగ్షాట్స్, విదేశీ టూరిస్టులతో ఈ హోటల్ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ హోటల్ గ్యారేజీలో ఇంపోర్టెడ్ కార్లే ఎక్కువగా కనిపిస్తాయి. కనీసం యాభై లక్షల విలువ చేయని కారు ఈ హోటల్ గేటు దాటి లోపలికి వెళ్లదని ప్రతీతి. అలాంటి హోటల్లోకి 2022 మే 17 సాయంత్రం దేశంలోనే చీపెస్ట్ కార్లలో ఒకటైన నానో ఎంటరైంది. నమ్మలేకపోయారు ది గ్రేట్ తాజ్ హోటల్కి మరీ చీప్గా నానో కారులో వచ్చిన వ్యక్తి ఎవరా అంటూ అక్కడున్న వారు వింతగా చూశారు. అప్పుడు కనిపించిన దృశ్యం చూసి వారు అవాక్కయ్యారు! ఆ కారులో వచ్చింది రతన్టాటా కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు! తాము చూస్తున్నది నిజమేనా అని అనుమాన పడ్డారు. తాజ్ ఎదుట నానోలో వచ్చింది సాక్షాత్తు రతన్టాటా అని గుర్తించారు. తేరుకుని తమ ఫోన్లను చేతుల్లోకి తీసుకున్నారు. తమ కెమెరాల్లో నానోలో వచ్చిన రతన్టాటాను బంధించించారు. లగ్జరీ కార్లను కాదని టాటా గ్రూపు పరిధిలోనే ల్యాండ్రోవర్, జాగ్వార్ వంటి లగ్జరీ హై ఎండ్ కార్లు ఉన్నాయి. అయినా సరే వాటిని పక్కన పెట్టి సామాన్యుల కోసం, ఈ దేశ మధ్యతరగతి ప్రజల కోసం ఆయన రూపొందించిన నానో కారునే రతన్టాటా తన ప్రయాణానికి ఎంచుకోవడం చూపరులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు లక్షల కోట్ల రూపాయల విలువైన టాటా గ్రూపును నడిపిస్తున్నా కనీసం బాడీగార్డు కూడా లేకుండా ఎటువంటి హంగామా చేయకుండా ఓ కామన్మ్యాన్లా వ్యవహరించిన రతన్టాటాను మెచ్చుకోలుగా చూశారు. వైరల్ వీడియో తాజ్ హోటల్కి నానో కారులో వచ్చిన రతన్ టాటా వీడియో నెట్టింట వైరల్గా మారింది. లవ్ యూ రతన్టాటా, వీ రెస్పెక్ట్ రతన్టాటా, సింప్లిసిటికీ ప్రతిరూపం, హ్యాట్సాఫ్ టాటా, మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నావ్.. అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టా అని తేడా లేకుండా అంతటా రతన్టాటాకు జై కొడుతున్నారు. Ratan Tata arrives at Taj Mumbai in a Nano sitting in front seat with his driver. No security either. Exemplary simplicity personified. 💯👏🏾 pic.twitter.com/XAbyLLoCpt — Maya (@Sharanyashettyy) May 17, 2022 చదవండి: Ratan Tata: ‘టాటా ఎప్పుడు అలాంటి పనులు చేయదు’
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement