-
బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు 84 సెకెన్ల సూక్ష్మ ముహూర్తం!
రాబోయే జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. 84 సెకన్ల సూక్ష్మ ముహూర్తంలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. నూతన రామాలయంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు ఐదు ముహూర్తాలు ప్రతిపాదించారు. అయితే రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంతిమ నిర్ణయాన్ని గీర్వాణవాగ్వర్ధిని సభకు, కాశీ పండితులకు వదిలివేసింది. జనవరి 22న అత్యంత శుభ ముహూర్తంగా వారు నిర్ణయించారు. జనవరి 17, 21, 24, 25 తేదీలలో ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన శుభ ముహూర్తాన్ని దేశంలోని నలుమూలలకు చెందిన పండితులు అందించారు. వారిలో కాశీకి చెందిన పండితుతు పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ అందించిన ముహూర్తాన్ని ఎంపిక చేశారు. అభిజిత్ ముహూర్తంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించడానికి చాలా సూక్ష్మమైన శుభ సమయం ఉందని గణేశ్వర్ శాస్త్రి తెలిపారు. జనవరి 22న మేష రాశిలో వృశ్చిక నవాంశ వేళ.. మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 వరకు 84 సెకన్ల సమయం కలిగిన ఈ ముహూర్తాన బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని కాశీలోని వైదిక బ్రాహ్మణులు పర్యవేక్షించనున్నారు. కాశీ నుండే పూజలకు కావాలసిన సామగ్రిని తరలించనున్నారు. కాశీ నుండి పండితుల మొదటి బ్యాచ్ డిసెంబర్ 26న అయోధ్యకు బయలుదేరనుంది. వీరు యాగశాల, పూజా మండపం పనులు చేపట్టనున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో 51 మంది వేద పండితులు పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ఆ పదుగురు... 2023లో రాజకీయాలన్నీ వీరివైపే.. -
నవంబ్రాలు
భూమిపై పడ్డ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవలసిందే. ఇందులో ఏదైనా దురర్ధం ధ్వనిస్తుంటే మీరు మరీ సున్నిత మనస్కులైనట్లు! పెళ్లి చేసుకోబోయేవారు ప్రతి దాన్నీ తేలిగ్గా తీసుకునే తత్వాన్ని అలవవరచుకోవాలి. పెళ్లి అనేది భూతం ఏమీ కాదు. అలాగని భూతలం మీది అత్యున్నత సౌఖ్యమూ కాదు. బేసిగ్గా పెళ్లి అంటే బాధ్యత. బాధ్యతలను మీద వేసుకోడానికి ఈ నవంబరులో బలమైన ముహుర్తాలు చాలానే ఉన్నాయి. కార్తీకం ఆరంభం అయింది కదా! ఏయే తేదీలు, తిథులు ఈ నెలలో పెళ్లికి దివ్యంగా ఉన్నాయో పంచాంగం తిప్పే ముందు.. పెళ్లిళ్లు, భార్యాభర్తల విశేషాలు కొన్ని తెలుసుకోవడం వల్ల నూతన వధూవరులకు కొంత ఉపయుక్తంగా ఉండొచ్చు. ►తొలిచూపులోనే ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న దంపతులలో 75 మంది విడాకుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది. కంగారు పడకండి. మిగతా 25 మంది సక్సెస్ఫుల్ కపుల్స్లో మీరు ఉండొచ్చు కదా! ►‘బ్రైడ్’ అంటే వధువు. బ్రైడ్కి ‘గ్రూమ్’ని కలిపితే వరుడు. (బైడ్ గ్రూమ్). సరే, ఈ నాలెడ్జికేంగానీ, బ్రైడ్ అంటే అసలు అర్థం తెలుసా! ‘వంట చేయడం’ అని!! ప్రాచీన జర్మన్ భాషల నుంచి బ్రైడ్ అనే పదం పుట్టుకొచ్చింది. ►భర్తగానీ, భార్యగానీ రోజుకి కనీసం 45 నిముషాలు ప్రయాణంలోనే గడుపుతుంటే వాళ్ల పెళ్లి పెటాకులయ్యే ఛాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ అట. మీ ఇష్టం మరి. ►ఆ మధ్య 99 ఏళ్ల ఓ భర్త తన 96 ఏళ్ల భార్యకు పెళ్లయిన 77 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. నైంటీన్ ఫార్టీస్లో ఆమెకు ఎవరితోనో అఫైర్ ఉందని ఆయనకు తెలిసిందట! అదీ విడాకులకు కారణం. ►పెళ్లికి ముందు దీర్ఘకాలం కలిసి ఉన్నవారు, పెళ్లయ్యాక అంతకన్నా తక్కువ సమయంలోనే విడిపోతారట! ఇదింకో అధ్యయనంలో తేలిన విషయం. ►పెళ్లయిన మూడో ఏడాది.. ఏ దంపతుల జీవితంలోనైనా అత్యంత ఆనందకరమైన సంవత్సరంగా ఉంటుందట! మీరిప్పుడు పెళ్లి చేసుకుంటే అత్యంత ఆనందకరమైన ఆ ఏడాది కోసం రెండేళ్లు ఎదురు చూడాలన్నమాట. పెళ్లి ఖర్చు తక్కువగా ఉంటే ఎక్కువ కాలం, పెళ్లి ఖర్చు ఎక్కువగా ఉంటే తక్కువ కాలం దంపతులు కలిసి ఉంటారట! ఇది ఇంకో అబ్జర్వేషన్. ►పెళ్లంటే ఉండే భయాన్ని ‘గామోఫోబియా’ అంటారు. మరి ఇలాంటి విషయాలన్నీ చెప్పుకుంటే గామోఫోబియా రాదా అని మీరు అనుకుంటుంటే ఈ టాపిక్ని ఇక్కడితో ఆపేద్దాం. అనుకోకపోతే ఇంకో రెండు విషయాలు చెప్పుకుని ముగిద్దాం. ►ఒకటి: ధైర్యంగా పెళ్లి చేసుకోండి. ఏ ఫోబియాలూ మీ దరి చేరవు. ►రెండు: ముహూర్త బలం ఎంత బలమైనదో.. దాంపత్య ఫలం అంతే బలమైనది. భార్యాభర్తల్లోని ఇచ్చిపుచ్చుకునే సర్దుబాటు ధోరణి పెళ్లిని పదికాలాల పాటు పదిలంగా ఉంచుతుంది. ముహూర్తానికే వన్నె తెస్తుంది. భలే మంచి ముహూర్తము 8 నవంబర్ 2019 శుక్రవారం ముహూర్తం: మధ్యాహ్నం 12.24 నుంచి నవంబర్ 9 తెల్లవారుఝాము 06.39 వరకు; నక్షత్రం: ఉత్తరాభాద్ర; తిథి : ద్వాదశి 9 నవంబర్ 2019 శనివారం ముహూర్తం: ఉదయం 06.30 నుంచి నవంబర్ 10 ఉదయం 06.39 వరకు. నక్షత్రం: ఉత్తరాభాద్ర, రేవతి; తిథి: ద్వాదశి, త్రయోదశి. 10 నవంబర్ 2019 ఆదివారం ముహూర్తం: ఉదయం 06.39 నుంచి 10.44 వరకు; నక్షత్రం: రేవతి; తిథి: త్రయోదశి 14 నవంబర్ 2019 గురువారం ముహూర్తం: ఉదయం 09.15 నుంచి నవంబర్ 15 ఉదయం 06.43 వరకు; నక్షత్రం: రోహిణి, మృగశిర; తిథి: విదియ, తదియ 22 నవంబర్ 2019 శుక్రవారం ముహూర్తం: ఉదయం 09.01 నుంచి నవంబర్ 23 ఉదయం 06.50 వరకు; నక్షత్రం: ఉత్తర ఫల్గుణి, హస్త; తిథి: ఏకాదశి 23 నవంబర్ 2019 శనివారం ముహూర్తం: ఉ. 06.50 నుంచి మధ్యాహ్నం 02.46 వరకు; నక్షత్రం: హస్త; తిథి: ద్వాదశి 24 నవంబర్ 2019 ఆదివారం ముహూర్తం: మధ్యాహ్నం 12.48 నుంచి నవంబర్ 25 అర్ధరాత్రి 01.06 వరకు; నక్షత్రం: స్వాతి; తిథి: త్రయోదశి 30 నవంబర్ 2019 శనివారం ముహూర్తం: సాయంత్రం 06.05 నుంచి డిసెంబర్ 1 ఉదయం 06.56 వరకు; నక్షత్రం: ఉత్తరాషాఢ; తిథి: పంచమి. ►(నవంబర్ 15, 19, 20, 21, 22 తేదీలలో పెళ్లి ముహూర్తాలు అతి స్వల్ప నిడివిలో మాత్రమే ఉండగా.. 27, 28, 29 మంచి ముహూర్తాలు లేవనే చెప్పాలి). -
ముహూర్తం.. ముందరున్నదీ..
సాక్షి, భీమవరం: ఎన్నికల షెడ్యూలు విడుదల కావడం, నామినేషన్లు వేయడానికి రోజులు దగ్గర పడుతుండటంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ నాయకులు నామినేషన్ వేయడానికి మంచి ముహుర్తాల కోసం పండితులు, సిద్ధాంతుల వద్దకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు చిన్నపాటి పార్టీల నాయకులు, స్వతంత్య్ర అభ్యర్థులకు ఎన్నికల సెంట్మెంట్ ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా నామినేషన్ వేయడానికి మంచి ముహుర్తంతోపాటు ప్రచారం ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రారంభించాలనే సెంటిమెంట్ను వీరంతా ఫాలోఅవుతారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకూ నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంది. ఈ ఎనిమిది రోజుల్లో అభ్యర్థుల జాతకం ప్రకారం తిథి, నక్షత్రం ఆధారంగా సిద్ధాంతులు మంచిరోజులు నిర్ణయిస్తారు. ఈ పద్ధతి ఎప్పటినుంచో ఆచరణలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా మంచి ముహుర్తాల కోసం అన్వేషిస్తున్నారు. ఈసారి నామినేషన్లకు ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఉండగా వాటిలో 18వ తేదీ ద్వాదశి, 19వ తేదీ త్రయోదశి, 22వ తేదీ విదియ, 25వ తేదీ పంచమి మంచి రోజులుగా లెక్కలు వేస్తున్నారు. నామినేషన్లకు చివరి రోజు అయిన 25వ తేదీ పంచమి సోమవారం బలమైన ముహూర్తం ఉండటంతో ఆ రోజునే ఎక్కువ మంది నామినేషన్లు వేస్తారని పండితులు చెబుతున్నారు. అయితే పోటీచేసే అభ్యర్థి పేరు, జన్మనక్షత్రం, జాతకం ప్రకారమే ముహూర్తం నిర్ణయించాల్సి ఉంటుందంటున్నారు. మొత్తం మీద ఈ నాలుగు రోజులు పండితులు, సిద్ధాంతులను రాజకీయనాయకులు ఊపిరి సలపనివ్వరని తెలుస్తోంది. నామినేషన్ ముహూర్తంతోపాటు ఎన్నికల ప్రచారం ఎక్కడి నుంచి ఎప్పుడు ప్రారంభించాలనే దానికి కూడా ముహూర్తాలు తప్పవంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం నియోజకవర్గానికి ఈశాన్యం నుంచి ప్రారంభించడం పరిపాటి. అయితే కొందరు నాయకులు మాత్రం గతంలో ప్రచారం ప్రారంభించిన ప్రాంతం సెంటిమెంట్గా ఈసారి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సెంటిమెంట్ ఎవరిని విజేతలను చేస్తుందో చూడాలి మరి. -
ఒకే ముహూర్తాన 131 పెళ్లిల్లు
సాక్షి, ఆసిఫాబాద్: ఒకే ముహూర్తాన 131 జంటలు మూడు ముడులు, ఏడు అడుగుల బంధంతో ఏకమయ్యాయి. ఇందులో 91 ఆదివాసీ జంటలున్నాయి. ఈ అపూర్వ ఘట్టానికి కుమురంభీం జిల్లా కాగజ్నగర్లోని ఎస్పీఎం గ్రౌండ్ వేది కైంది. బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ వర్గాల యువతీ యువకుల వివాహాలను ఘనంగా జరిపించారు. ఈ వేడుకలకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేశ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన జంటలకు కోనేరు ట్రస్టు ద్వారా ఉచితంగా పుస్తె మట్టెలు, వస్త్రాలు, ఫ్యాను, బీరువా తదితర సామగ్రిని కోనప్ప అందజేశారు. జంటలకు కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్షా నూటపదహార్లు అందజేస్తామన్నారు. -
ముహూర్తం మార్చుకున్న ముఖ్యమంత్రి
సాక్షి, అమరావతి: అనుకున్న సమయంలో.. అనుకున్న విధంగా తాత్కాలిక సచివాలయ పనులు పూర్తి కాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల తరలింపు ముహూర్తాన్ని మార్చారు. సచివాలయం నుంచి పాలనా కార్యక్రమాలు ప్రారంభించేందుకు మరో రెండురోజులు వాయిదా వేశారు. ఈనెల 29న కేవలం ఐదవ బ్లాక్లో గ్రౌండ్ఫ్లోర్ను ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు శనివారం ప్రకటించారు. అదే రోజు పాలనా కార్యక్రమాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. జూలై 6న ఐదవ బ్లాక్లోని మొదటి అంతస్తు, 15న 2, 3, 4 బ్లాక్ల్లోని గ్రౌండ్ఫ్లోర్లు, 21వ తేదీ 2, 3, 4 బ్లాక్ల్లోని మొదటి అంతస్తులను ప్రారంభించి పాలనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన రెండవ అంతస్తు, ఆరవ బ్లాక్లను ఎప్పుడు పూర్తిచేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం! మొత్తంగా జూలై చాలా ముఖ్యమైన నెల అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పనులను ముఖ్యమంత్రి శనివారం పరిశీలించారు. ఈనెల 29న ప్రారంభించనున్న ఐదవ బ్లాక్ను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లను పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. కుంగిన బ్లాక్ను పరిశీలించకుండానే వెనుదిరిగిన సీఎం వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పనుల ప్రారంభం నుంచి రకరకాల ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇటీవల సచివాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం కుంగటం. ఆ తరువాత కొద్దిరోజులకే తాత్కాలిక సచివాలయంలోని రెండవ బ్లాక్లో ఫ్లోర్ కుంగటంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న అధికారయంత్రాంగం, ఇంజనీర్లు ఉలిక్కిపడ్డారు. అయితే భవనం కుంగిన విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. సాక్షి ద్వారా తెలుసుకున్న మిగిలిన పత్రికలు, మీడియా ప్రతినిధులు భవనం కుంగిన విషయాన్ని ప్రముఖంగా ప్రచారం చేశాయి. అయితే ఈ విషయాన్ని అధికారపార్టీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. కొన్ని పత్రికలు, ప్రతిపక్ష పార్టీ నేతలు పనిగట్టుకుని కావాలనే ప్రచారం చేస్తున్నాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలో శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశం, తుళ్లూరులో శనివారం చేపట్టిన ప్లాట్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సాక్షిపై ప్రత్యక్ష దాడికి దిగారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలచే తిట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే తుళ్లూరులో నిర్వహించిన బహిరంగ సమావేశంలో సాక్షిపై తిరగబడాలంటూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అదే విధంగా సాక్షితో పాటు మిగిలిన ప్రతికలు, మీడియా కూడా సచివాలయం నిర్మాణం కుంగిందని ప్రముఖంగా రాయటం, ప్రసారం చేయడంపైనా సీఎం చిందులు వేశారు. అయితే తాత్కాలిక సచివాయలం ఫ్లోర్ కుంగిన విషయాన్ని సీఎం చంద్రబాబు పరోక్షంగా ఒప్పుకున్నారు. 'ఇంతపెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు చిన్ని చిన్న పొరబాట్లు సహజం. అదేదో జరిగిందని భూతద్దంలో చూపించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలనుకోవటం పొరబాటు. ఏదైనా ఉంటే చెబితే సరిచేసుకుంటాం' అని బాబు చెప్పటం గమనార్హం! ఇలా తప్పుడు రాతలు రాసేవారిపై, తప్పుడు ప్రచారం చేసే వైఎస్సార్ కాంగ్రెస్పై యాక్షన్ తీసుకుందామా? మీరు ఎలా చెబితే అలా చేస్తామంటూ అనుకూల కార్యకర్తలచేత చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే శనివారం తాత్కాలిక సచివాలయం పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు కుంగిన రెండవ బ్లాక్లోని ఫ్లోర్ను పరిశీలించకుండా వెనుదిరిగి వెళ్లిపోవటం గమనార్హం!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement