-
అది ప్రేమే..కామం కాదు: పోక్సో కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ముంబై: పోక్సో కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. యువకుడు, మైనర్ రిలేషన్లో ఉన్నారని, వారి మధ్య ఏర్పడిన లైంగిక సంబంధం ప్రేమ కారణంగా కలిగినదే తప్ప.. కామం వల్ల కాదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఊర్మిళ జోషి పార్కే తీర్పు వెల్లడించింది. ‘బాలిక మైనర్యే కావచ్చు. కానీ ఆమె తన ఇష్టం మేరకే ఇంటిని వదిలి నిందితుడు నితిన్ ధబేరావుతో కలిసి ఉంటున్నట్లు పోలీసులతో చెప్పింది. ధబేరావు వయసు కూడా 26 ఏళ్లు. వారి ఇద్దరు ప్రేమ వ్యవహారం కారణంగానే కలిసి ఉండాలని అనుకున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం వల్లే లైంగికంగా ఒకటయ్యారు. అంతేగానీ నిందితుడు ఆమెను కామంతో లైంగిక వేధింపులకు గురిచేయలేదు. ఆమెపై బలవంతంగా జరిగిన దాడి కాదు’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి ఆంక్షలతో కూడి బెయిల్ మంజూరు చేసింది. కాగా 13 ఏళ్ల మైనర్ తన ఇంటి పక్కన నివసించే నితిన్ దామోదర్ ధబేరావ్ను ప్రేమించింది. 2020 ఆగస్టులో అతనితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కొన్ని రోజులు ఇద్దరు ఒకచోట నివసించారు. బాలిక తండ్రి కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వెతికి పట్టుకున్నారు. 2020 ఆగస్టు 30న దామోదర్పై పోక్సో కేసు నమోదు చేశారు. అక్టోబర్లో అతనిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ధబేరావ్తో ప్రేమించడం కారణంగానే.. తన ఇష్టపూర్వకంగా ఇంటిని వదిలి బయటకు వచ్చినట్లు బాలిక తెలిపింది. అతడు తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చినట్లు పేర్కొంది. అతనితో కలిసి జీవించేందుకే తన ఇంట్లో నుంచి బంగారం, డబ్బులు దొంగిలించినట్లు వెల్లడించింది. చదవండి: Divya Pahuja: ఎట్టకేలకు కాలువలో మృతదేహం లభ్యం -
మైనర్కు అబార్షన్.. కేరళ హై కోర్టు కీలక తీర్పు
కొచ్చి: పన్నెండేళ్ల వయసున్న బాలికకు అబార్షన్ కోసం ఆమె తల్లిదండడ్రులు పెట్టుకున్న అభ్యర్థనకు కేరళ హై కోర్టు నో అన్నది. ఇప్పటికే బాలిక గర్భంలోని పిండం వయసు 34 వారాలకు చేరినందున గర్భ విచ్ఛిత్తికి అనుమతించలేమని కోర్టు తెలిపింది. ‘గర్భంలో ఉన్న శిశువు వయసు ఇప్పటికే 34 వారాలకు చేరింది. బయటికి రావడానికి శిశువు సిద్ధమవుతోంది ఈ దశలో అబార్షన్ కుదరదు’అని జస్టిస్ దేవన్ రామచంద్రన్ బెంచ్ వ్యాఖ్యానించింది. మైనర్ అయినందున ఆ అమ్మాయిని తల్లిదండ్రుల పేరేంట్స్ కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఆమె గర్భానికి కారణమయ్యాడని ఆరోపణలున్న బాలిక మైనర్ సోదరుడిని ఆమెకు దూరంగా ఉంచాలని అధికారులకు సూచించింది. గతంలో బాలిక అబార్షన్కు అనుమతించాలని మెడికల్ బోర్డు కోర్టును కోరింది. బాలిక శిశువుకు జన్మనిస్తే మానసికంగా, సామాజికంగా మనోవేదనను అనుభవిస్తుందని బోర్డు కోర్టుకు తెలిపింది. అయితే కోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. ఈసారి ఆమె తల్లిదండ్రులు ఇదే విషయమై కోర్టుకు వెళ్లగా మళ్లీ కోర్టు నో అన్నది. ఇదీచదవండి..ట్రక్కు డ్రైవర్ల సమ్మె..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు -
క్రికెట్లో గొడవ... బాలుడి ప్రాణం తీసింది
మహారాష్ట్ర, చంద్రాపూర్: మహారాష్ట్రలోని బాగాడ్కిడ్కిలో దారుణం జరిగింది. చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా తలెత్తిన వివాదంలో 13 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల బాలుడిని బ్యాట్ తో కొట్టి చంపేశాడు. హత్య జూన్ 3న జరిగితే జూన్ 6న మృతుడి తల్లి ఫిర్యాదు చేయగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, అప్పటికే పాతిపెట్టిన బాలుడి మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు ప్రారంభించారు చంద్రాపూర్ పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకి... జూన్ 3న బాగాడ్కిడ్కిలో పిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా పిల్లల మధ్య చిన్న వాగ్వాదం మొదలైంది. అంతలోనే కోపగించిన 13 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల బాలుడిని బ్యాట్ తో బలంగా తలపై కొట్టాడు. దీంతో ఆ మైనర్ బాలుడు కుప్పకూలిపోగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ జూన్ 5న బాలుడు తుదిశ్వాస విడిచాడు. పోలీసులకి విషయం చెప్పకుండా బాలుడి తల్లిదండ్రులు మృతదేహాన్ని పాతిపెట్టారు. ఆ తర్వాతి రోజున బాలుడి తల్లి చంద్రాపూర్ జిల్లా పోలీసులను ఆశ్రయించి విషయాన్ని వివరించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా జూన్ 7న మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్షల నిమిత్తం పంపించి, హత్య చేసిన బాలుడిపై ఐపీసీ 302 సెక్షన్ను అభియోగించారు. ఇది కూడా చదవండి: చంపేస్తానని లైవ్ లోనే బెదిరించిన శివసేన నేత -
ఇదేం విడ్డూరం.. 16 ఏళ్ల బాలికను పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్!
ప్రేమకే కాదు, పెళ్లికి కూడా వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఓ వ్యక్తి. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆరు పదుల వయసు దాటిన ఆయన తాజాగా పట్టుమని 20 ఏళ్లు కూడా లేని మైనర్ను మనువాడాడు. 65 ఏళ్ల మేయర్.. 16 ఏళ్ల పాపను పెళ్లాడటమే కాకుండా పిల్లనిచ్చిన అత్తకు ఏకంగా ప్రభుత్వ శాఖలో పదోన్నతి కూడా కల్పించాడు. ఈ వింత పెళ్లి బ్రెజిల్ దేశంలో వెలుగుచూసింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఈ పెళ్లి వ్యవహారం మేయర్ను ఇరకాటంలో పడేసింది. వివరాలు.. దక్షిణ బ్రెజిల్లోని పరానా రాష్ట్రం అరౌకారియా సిటీ మేయర్ అయిన 65 ఏళ్ల హిస్సామ్ హుస్సేన్ దేహైనీ గత ఏప్రిల్ నెలలో తన కంటే 49 ఏళ్లు వయస్సులో చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చదవండి: తిండి లేదు.. తిప్పలు పడింది.. విశ్వాసమే మళ్లీ నెగ్గింది! కాగా బ్రెజిల్లో అమ్మాయిల కనీసం వివాహ వయసు 16 ఏళ్లు. అక్కడి చట్టాల ప్రకారం 16 ఏళ్లు దాటిన యువతులు తల్లిదండ్రుల అనుమతితో తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. తాజాగా మేయర్ సదరు అమ్మాయికి ఏప్రిల్ 11న, 16 ఏళ్లు నిండటంతో మరుసటి రోజే అంటే ఏప్రిల్ 12న ఆమెను పెళ్లాడాడు. అంతేగాక అప్పటికే విద్యాశాఖలో తక్కువ జీతంతో పనిచేస్తున్న వధువు తల్లిని సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమించాడు. ఇదే ప్రస్తుతం అతని కొంప ముంచింది. కూతురిని పెళ్లాడటం కోసం తల్లికి లంచంగా పదోన్నతి కట్టబెట్టినట్లు డిప్యూటీ మేయర్ సీమా ఆరోపించింది. దీంతో మేయర్పై వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. కాగా దేహైనీకి ఇది మూడో వివాహం. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాడు. కొత్త భార్యకు పదహారేళ్లే కావడంతో ఆమె కాలేజీకి వెళ్తోంది. చదవండి: వయాగ్రాపై బ్యాన్.. ఉడుం నూనె కోసం ఎగబడుతున్న యువత..! -
ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన చిన్న పార్టీలు
ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన చిన్న పార్టీలు -
అంకుల్కి గిఫ్ట్గా ఇచ్చేందుకు కిడ్నాప్ చేశా! నివ్వెరపోయిన పోలీసులు
ఒక వ్యక్తి ఇంటి బటయ ఆడుకుంటున్నా చిన్నారిని కిడ్నాప్ చేశాడు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించి నిందితుడిన అరెస్టు చేశారు. ఐతే విచారణలో అతడు చెప్పిన విషయాలు విని ఒక్కసారిగా పోలీసులు షాక్కి గురయ్యారు. వివరాల్లోకెళ్తే...21 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలోని గౌతమ్పురిలో ఇంటి ముంగిట ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాప్కి గురయ్యింది. దీంతో చిన్నారి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు రెండు రోజుల నుంచి చిన్నారి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బాధితుడు పొరిగింటి వ్యక్తి కిడ్నాప్ అయిన రోజే అతను కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, తిరిగి రాలేదని తెలిసింది. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తూ.. ఆవ్యక్తిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో నిందితుడిని గట్టిగా విచారించగా.. తన మేనమామకు పిల్లలు లేరని, తన మేనత్తకు నలుగురు పిల్లలు పుట్టి చనిపోయారని చెప్పాడు. అందుకని వారికి ఈ బాలుడిని గిఫ్ట్గా ఇచ్చేందుకే ఇలా చేశానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: భర్త నిద్రలో చనిపోయినట్లు నమ్మించింది..చివర్లో కూతురు షాకింగ్ ట్విస్ట్) -
టపాసులు కాల్చొద్దు అన్నందుకు హత్య
ముంబై: ఒక వ్యక్తి టపాసుల కాల్చొద్దని చెప్పినందుకు ముగ్గురు మైనర్ల చేతిలో హతమయ్యాడు. ఈఘటన శివాజి నగర్లోని గోవాండిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ముగ్గురు మైనర్లు బహిరంగంగా సీసాలో టపాసులు పెట్టి కాలుస్తున్నారు. దీంతో 21 ఏళ్ల వ్యక్తి వారిని అలా టపాసులు కాల్చొద్దు అని వారించాడు. ఆ తర్వాత ఇరువైపులా మాటా మాటా పెరిగి వాగ్వాదం తలెత్తింది. అంతే కోపంతో ఒక మైనర్ సదరు వ్యక్తిని దారుణంగా కొట్టి చాకుతో మెడపై పొడిచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ సదరు వ్యక్తీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఎందుకలా చూస్తున్నారు అని ప్రశ్నించాడని...కొట్టి చంపేశారు) -
మైనర్ల వివాహం వైరల్.. విస్తుపోయే విషయాలు
చెన్నై: సోషల్ మీడియా, సినిమాల ప్రభావం.. ముఖ్యంగా పిల్లలపై పెద్దల నిఘా కరువు యువతను పక్కదోవ పట్టిస్తున్నాయి. చెడు వ్యసనాలతో పాటు వయసుకు మించిన పరిణితితో చేయకూడని పనులు చేస్తున్నారు. తాజాగా తమిళనాడు కడలూరు జిల్లాలో మైనర్ల వివాహం వైరల్ కావడం సంచలనం సృష్టించింది. చిదంబరం జిల్లాలోని గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న బస్టాండ్ వద్ద జరిగన మైనర్ల వివాహం తీవ్ర చర్చనీయాంశంగా జరిగింది. ఈ వైరల్ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. అమ్మాయి(16)కి పసుపు కొమ్ము కట్టిన మైనర్(17)ను ఎట్టకేలకు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.. అబ్జర్వేషన్ హోంకు మైనర్ను తరలించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని, ఇలా చేస్తే అయినా అంగీకరిస్తారని స్నేహితులు వాళ్లను ప్రలోభపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అలా స్నేహితుల ప్రోద్భలంతోనే ఇంటర్ చదువుతున్న ఆమెను.. పాలిటెక్నిక్ చదువుతున్న ఆ అబ్బాయి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. సదరు బాలికతో మైనర్ బాలుడికి శారీరక సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో.. బాలికకు వైద్యపరీక్షలు చేయించారు పోలీసులు. అంతేకాదు.. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించి.. ఎస్సీ-ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. తమిళనాడు సేలం జిల్లాలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 20 ఏళ్ల కాలేజీ యువతి.. మైనర్ బాలుడు అయిన తన క్లాస్మేట్ను వివాహం చేసుకుంది. ఏప్రిల్లో ఈ ఇద్దరూ కనిపించకుండా పోయారు. అయితే అప్పుడే వీళ్లిద్దరూ వివాహం చేసుకుని.. అదే కాలేజీకి చెందిన ఓ సీనియర్ ఇంట్లో వీళ్లిద్దరూ కాపురం పెట్టినట్లు తెలుస్తోంది. మైనర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎట్టకేలకు ట్రేస్ చేసి ఇద్దరినీ కనిపెట్టారు. యువతి గర్భవతిగా తేలడంతో.. వైద్య పరీక్షలకు తరలించారు. మరోవైపు ఆమెపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయగా.. కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. ఇదీ చదవండి: ప్రేమ పేరుతో నిలువునా మోసం -
పెంచిన తండ్రినే కడతేర్చిన కసాయి కూతురు
ఉత్తరప్రదేశ్: ఒక బాలిక తన స్నేహితుడుతో కలిసి పెంచిన తండ్రినే కడతేర్చింది. ఈ ఘటన ఘజియాబాద్లో వైశాలి అపార్టమెంట్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆ బాలికను పుట్టిన వారం రోజులకే ఘజియాబాద్లోని ఒక దంపతులు దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక ఒక ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. 14 ఏళ్ల బాలిక తన స్నేహితుడుతో కలిసి 58 ఏళ్ల పెంచిన తండ్రిని చేతులు కాళ్లు కట్టేసి.. ఒక రోప్తో చంపేసి పరారయ్యింది. సాయంత్రం బాధితుడు భార్య ఇంటికి వచ్చి చూడగా అతను చనిపోయి ఉన్నాడు. ఐతే బాధితుడు భార్య తాము పెంచుకుంటున్న కూతురుపైన అనుమానంగా ఉందని తెలిపింది. ఆమె గత కొద్ది రోజులుగా ఒక వ్యక్తితో తరుచుగా మాట్లాడటం, చాటింగ్లు వంటివి చేసిందని కూడా ఆమె చెప్పింది. కొన్ని నెలల క్రితం సదరు బాలిక 19 ఏళ్ల యువకుడితో ఇంటి నుంచి పారిపోయింది. అప్పుడు బాధితుడు పోలీస్ స్టేషన్లో సదరు యువకుడిపై పోస్కో చట్టం కింద కేసు పెట్లి జైలుకి పంపించి, కూతురుని ఇంటికి తీసుకు వచ్చారు. తండ్రి ఇలాంటి యువకులను వదిలిపెట్టకూడదని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు చెబితే కూతురు మాత్రం ఆ యువకుడికి అనుకూలంగా పోలీస్టేషన్లో స్టేట్మెంట్లు ఇచ్చింది. ఐతే ఆ బాలిక మాత్రం తండ్రి తీరుపై కక్ష పెంచుకుని జైల్లో ఉన్న యువకుడితో టచ్లోనే ఉంది. అంతేగాదు తన తండ్రి వేధిస్తున్నాడని తనను తీసుకుపోవాలని చెబుతుండేది. దీంతో ఆ యువకుడు ఆమె మాటలకు జాలిపడి ఆమెతో కలిసి అతన్ని చంపేందుకు కుట్రపన్నాడు. దీంతో సదరు యువకుడు 23 ఏళ్ల మరో యువకుడిని పురమాయించి ఈ హత్యకు పథకం వేశాడు. బాలిక ఆ యువకుడితో కలిసి తండ్రిని రోప్తో చంపేసి ఇంట్లోంచి కొన్ని క్రెడిట్ కార్డులు తీసుకుని పరారయ్యింది. ఐతే పోలీసులు సీసీటీపీ పుటేజ్లు ఆధారంగా సదరు నిందితులను గుర్తించి ఫోన్ కాల్స్ ద్వారా ట్రేస్ చేసి పట్టుకున్నారు. విచారణలో నిందితులిద్దరు నేరం చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. (చదవండి: దారుణం...బ్లాక్మెయిల్ చేసి 8 మంది అత్యాచారం) -
దారుణం.. బ్లాక్మెయిల్ చేసి 8 మంది అత్యాచారం
జైపూర్: రాజస్థాన్ అల్వార్లో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. 8 మంది యువకులు 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేటు ఫోటోలు రహస్యంగా తీసి బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి బాధితురాలి నుంచి రూ.50వేలు వసూలు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం గతేడాది డిసెంబర్ 1న ప్రధాన నిందితుడు సోహిల్ తనకు సోదరి వరసయ్యే బాలికకు ఫోన్ చేసి ఓ చోటుకు రమ్మన్నాడు. అక్కడకి రాకపోతే సీక్రెట్గా తీసిన ప్రైవేటు చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె భయంతో అక్కడకు వెళ్లింది. ఒంటరిగా వెళ్లిన ఆమెపై సోహిల్, అతని స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరాన్ని ఫోన్లో చిత్రీకరించారు. ఆ తర్వాత నుంచి బాధితురాలిని తరచూ బ్లాక్ చేసి డబ్బు వసూలు చేశాడు సోహిల్. అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్-జూన్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఓసారి బాలిక డబ్బు ఇవ్వకపోవడంతో నిందితుడు ఆమె వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. వారిని అరెస్టు చేశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. చదవండి: భార్యపై అనుమానం.. బెడ్రూంలో సెల్ఫోన్ పెట్టి వీడియో రికార్డు.. ఆ తర్వాత! -
స్విగ్గీ డెలివరీ మ్యాన్ విషాదం: తండ్రి అలా, కొడుకు ఇలా..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ మ్యాన్ దుర్మరణం పాలైన ఘటన విషాదాన్ని నింపింది. ఒక మైనర్ నిర్ల్యక్షం గోలే మార్కెట్కు చెందిన రాహుల్ కుమార్ని బలి తీసుకుంది. దేశ్ బంధు గుప్తా రోడ్డు వద్ద శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంతో ఎంజీ హెక్టార్(ఎస్యూవీ) కారును నడపడంతో అదుపు తప్పి బైక్ను ఢీకొట్టాడు. ఆ తరువాత కారును అక్కడే వదిలేసి అక్కడినుంచి ఉడాయించాడు. ఈ ఘటనలో స్విగ్గీ డెలివరీ మ్యాన్ రాహుల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించి నప్పటికీ ఫలితంలేదు. చికిత్స పొందుతూ రాహుల్ మరణించాడు. బైక్పై వెనుక కూర్చున్న రాహుల్ స్నేహితుడు పవన్ కుమార్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఇంటర్ విద్యార్థి, మైనర్ బాలుడు కారును నడుపుతున్నాడు. కారులో నిందితుడితోపాటు, అతని స్నేహితుడు, మరో విదేశీ పౌరుడు కూడా ఉన్నారు. ఘటనాస్థలంలో వదిలేసి పారిపోయిన కారు ఆధారంగా రవాణా శాఖ సమాచారంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి తండ్రి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అంతేకాదు కోట్లా రూపాయల కుంభకోణంలో కొన్ని నెలల క్రితం అరెస్టయినట్టు పోలీసుల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన బాధితుడి స్నేహితులు, తండ్రి అలా, కొడుకు ఇలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అంకిత మైనర్!!.. ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసినవి
జార్ఖండ్ డుమ్కాలో ఓ ప్రేమోన్మాది ఒక స్టూడెంట్ను సజీవ దహనం చేసిన ఉదంతం మరో మలుపు తిరిగింది. బాధితురాలు మేజర్ కాదని.. మైనర్ అని చైల్డ్ వెల్ఫ్ఫేర్ కమిటీ నిర్ధారించింది. దీంతో పోక్సో చట్టం ప్రకారం కేసు, నిందితుడిపై అభియోగాలను నమోదు చేయాలని ఈ ప్యానెల్.. పోలీసులను ఆదేశించింది. రాంచీ: అకింతా సింగ్ హత్యోదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 12వ తరగతి చదువుతున్న బాధితురాలి వయసును తొలుత.. 19 ఏళ్లుగా రిపోర్ట్లో పొందుపర్చారు పోలీసులు. అయితే మీడియాకు మాత్రం వయసును 17ఏళ్లుగా చెప్పారు. అంకిత వయసుపై పోలీసులు చేస్తున్న వేర్వేరు ప్రకటనలపై ఆమె కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆమె వయసును 15ఏళ్లుగా నిర్ధారిస్తూ ప్రకటన చేసింది. అంతేకాదు.. రికార్డెడ్ స్టేట్మెంట్లోనూ ఆమె వయసును సవరించాలంటూ స్థానిక ఎస్పీకి సూచించింది. మతోన్మాది ఘాతుకం! డుమ్కా ప్రాంతానికి చెందిన అంకితా కుమారి సింగ్ను.. పొరుగింట్లో ఉండే షారూఖ్ హుస్సేన్(19) ప్రేమ, పెళ్లి పేరుతో వేధించసాగాడు. పెద్దలు మందలించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆగష్టు 23వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్ పోసి.. నిప్పటించి పారిపోయాడు. 90 శాతం తీవ్ర గాయాలతో ఫులో జానో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆగస్టు 28వ తేదీన అంకిత కన్నుమూసింది. ఈ ఘటనలో బాధితురాలిని వేధింపులు.. మతం మారాలనే ఒత్తిడి చేసినట్లు తేలడంతో ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలను దారి తీసింది. బీజేపీతో పాటు భజరంగ్ దల్ కార్యకర్తలు బాధితురాలి న్యాయం కోసం పోరాటానికి దిగారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ.. ఆందోళనలు చేపట్టారు. మరోవైపు బీజేపీ ఒత్తిడితో బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించగా.. ఆమె తండ్రి సంజీవ్ సింగ్ ఆ పరిహారాన్ని తిరస్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక కేసులో సత్వర న్యాయం కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఆ ఫొటోలు మార్ఫింగ్వి! ఇదిలా ఉంటే.. నిందితుడు షారూఖ్ హుస్సేన్తో సన్నిహితంగా ఉన్న బాధితురాలి ఫొటోలు కొన్ని నెట్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై అంకిత కుటుంబం స్పందించింది. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు, నిందితుడిని బయటపడేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయంటూ మండిపడింది. తమ కూతురికి సత్వర న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించింది అంకిత కుటుంబం. ఫొటోలు, వీడియోలు వైరల్ చేయకండి ఇదిలా ఉంటే.. డుమ్కా మైనర్ హత్యోదంతంపై జాతీయ మహిళా కమిషన్ నుంచి ఇద్దరు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ ఇవాళ(బుధవారం) డుమ్కాలో పర్యటించి.. వివరాలను సేకరించింది. అయితే.. బాధితురాలి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేయడంపై ఎన్సీడబ్ల్యూ లీగల్ కౌన్సెలర్ షాలిని సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది బాధితురాలి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, దానిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. Dumka, Jharkhand | People are circulating photos of victim on social media. Please ensure this is stopped, vital information is not misused & a woman's dignity is protected: Shalini Singh, Legal Counsellor, NCW pic.twitter.com/mj5jKRqMXo — ANI (@ANI) August 31, 2022 ఇదీ చదవండి: పెళ్లికి నిరాకరిస్తోందని యువతిపై దాడి...ఆ తర్వాత అతను -
చదువుకోవడం ఇష్టం లేక... మర్డర్ ప్లాన్ చేసిన విద్యార్థి!
తల్లిదండ్రులు పిల్లల అభిరుచి ఏంటో తెలుసకోవడమే కాకుండా వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి. లేదంటే వారు చెడ్డపనుల వైపు ఆకర్షితులై జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రతీది అందుబాటులో ఉండటంతో చిన్నారులు పెడదోవ పట్టే అవాకాశాలే పొంచి ఉన్నాయి. ఇక్కడొక విద్యార్థి కూడా అలానే చెడు మార్గంలో పయనించి స్నేహితుడినే హతమార్చి జైలు పాలయ్యాడు. వివరాల్లోకెళ్తే....పోలీసులు కథనం ప్రకారం...ఢిల్లీలోని ఒక 16 ఏళ్ల మైనర్ 13 ఏళ్ల తన స్నేహితుడి గొంతుకోసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు ఢిల్లీలోని మసూరి నివాసి. ఏడవ తరగతి చదువుతున్నాడు. ఈ మేరకు సదరు బాధితుడుని తన మైనర్ స్నేహితుడే ఇంటికి వచ్చి తీసుకువెళ్లినట్లు బాధితుడి తల్లిదండ్రులు చెప్పారు. దీంతో పోలీసులు సదరు మైనర్ ఇంటిని విచారించగా....అతను ఆ సమయానికి ఇంట్లో లేడు. పైగా అతని తల్లిదండ్రులకు కూడా ఈ విషయాలేమి తెలియవు. ఐతే పోలీసులు సదరు మైనర్ని ఒక టీ దుకాణం వద్ద గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో ఆ మైనర్ చెప్పిన విషాయలు విని ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. విచారణలో....సదరు మైనర్కి చదవుకోవడం ఇష్టం లేదని తన తల్లిదండ్రుల పోరు భరించలేక చదువుతున్నట్లు చెప్పాడు. ఈ చదువు నుంచి ఎలాగైన తప్పించుకుని ఏదైన శరణాలయానికి వెళ్లిపోవాలని గత ఐదేళ్లుగా ట్రై చేస్తున్నట్లు పేర్కొన్నాడు. కొన్ని సినిమాలు చూసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు చెప్పాడు. తన స్నేహితుడిని సరదాగా కారులో వెళ్దామని పిలిచి ఒక గాజు ముక్కతో గొంతు కోసి హతమార్చినట్లు పేర్కొన్నాడు. అంతేకాదు మరోక స్నేహితుడిని చంపేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. పోలీసులు తనను వెతుక్కుంటూ రాకపోతే తానే లొంగిపోదామని అనుకున్నట్లు వెల్లడించాడని పోలీసులు తెలిపారు. (చదవండి: సోదరుడి లైంగిక వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి) -
శ్రీకాకుళంలో బయటపడ్డ మైనర్ బాలుడి నేరాలు
-
Crime News: భర్త అనారోగ్యంతోనే.. ఆమె పక్కదారి పట్టింది
సాక్షి, హైదరాబాద్/గుడివాడ: వివాహ బంధాలు విలువ లేకుండా పోతున్నాయనే అభిప్రాయం పెరిగిపోవడానికి కారణం.. కొందరి చేష్టలే!. అలాంటి ఘటనే ఇది. భర్త అనారోగ్యం అనే కారణంతో.. ఎదురింట్లో ఉన్న ఓ మైనర్పై మనసు పారేసుకుంది నలుగురు పిల్లల తల్లి. అతనితో శారీరకంగా సంబంధం నడిపింది. ఆపై ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా అతనితో కలిసి బతకాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అతన్ని ట్రాప్ చేసి.. ఊరు విడిచి పారిపోయింది కూడా. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ కేసు సంచలనం రేపింది. ఎదురింట్లో ఉండే మైనర్ను తీసుకొని పారిపోయిన వివాహిత స్వప్నను పొక్సో యాక్ట్ కింద ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఆపై బుధవారం గుడివాడ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. అలాగే మైనర్కు కౌన్సెలింగ్ ఇప్పించిన పోలీసులు.. తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడంతో కథ సుఖాంతం అయ్యింది. భర్త దూరంగా.. కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను సీఐ దుర్గారావు వెల్లడించారు. భర్త అనారోగ్యం కారణంగానే మైనర్తో స్వప్న వివాహేతర సంబంధం నడిపిందని పేర్కొన్నారాయన. గుడివాడ గుడ్మెన్ పేటకు చెందిన వివాహిత స్వప్న(30)కు నలుగురు పిల్లలు. భర్త అనారోగ్యంతో వేరే చోట ఉంటున్నాడు. ఈ క్రమంలో తన ఎదురింటిలో ఉండే మైనర్(15)తో శారీరక సంబంధం పెట్టుకుంది. నెలరోజులు గుట్టుగా అతనితో వ్యవహారం నడిపించింది. ఈ నెల 19న అతనితో పరారయ్యింది. ఈ క్రమంలో మైనర్ తండ్రి గత సోమవారం పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు స్వప్న కూడా కనిపించపోయేసరికి.. అనుమానాలు మొదలయ్యాయి. స్వప్న, సదరు మైనర్ హైదరాబాద్ బాలానగర్లో ఓ గదిలో అద్దెకు దిగినట్లు పోలీసులు గుర్తించారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేసి.. హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి వారిద్దరినీ గుడివాడ తీసుకొచ్చారు. స్వప్నను బుధవారం గుడివాడ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. బాధితుడిని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. అశ్లీల వీడియోలతో ట్రాప్ ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్.. ‘ఆంటీ’ అంటూ స్వప్న ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి అశ్లీల వీడియోలు చూపించి.. శారీరకంగా లోబర్చుకుంది ఆమె. ఆపై భర్త, పిల్లలను వదిలేసి.. ఇద్దరం కలిసి బతుకుదామని, తన వెంట వచ్చేయమని మైనర్ని బలవంతం చేసింది. ఈ క్రమంలో భయం భయంగానే ఆమెతో పాటు హైదరాబాద్ వచ్చేశాడు బాలుడు. అయితే గుడివాడ టూటౌన్ పోలీసులు ఈ కేసు ఛేదించిన విషయం.. వారిద్దరినీ గుడివాడ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని బాలానగర్ సీఐ భాస్కర్ చెప్పడం గమనార్హం. ఇదీ చదవండి: విశాఖ ఆర్కే బీచ్ నుంచి గాయబ్.. భర్తకు సాయిప్రియ సర్ప్రైజ్ -
పసిమొగ్గపై కిరాతకం
బనశంకరి: గత పదేళ్లుగా నిరంతరం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బెంగళూరు తూర్పువిభాగ మహిళా పోలీస్స్టేషన్లో 8 మందిపై కేసు నమోదుచేశారు. లైంగికదాడి, పోక్సో చట్టాల కింద అభియోగాలను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. బాలిక తండ్రి చర్చ్ ఫాదర్గా పనిచేస్తుంటాడు. ఆమెకు 6 ఏళ్ల వయసులో స్నేహితుని ఇంట్లో వదలిపెట్టాడు. 10 ఏళ్లు వయసులో స్నేహితుని కుమారుడు బాలికకు మొబైల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడాలని బలవంతం చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. మూడునాలుగేళ్లు దారుణం కొనసాగించాడు. అతని వేధింపులను తట్టుకోలేక బాలిక పాఠశాల ఉపాధ్యాయునికి మొరపెట్టుకుంది. ఆ ఉపాధ్యాయుడు, అతడి భార్య కలిసి యువకున్ని మందలించారు. అదే సమయంలో నీ గురించి అందరికీ చెబుతానని బెదిరించిన ఆ ఉపాధ్యాయుడు బాధిత బాలిక మీద రెండేళ్ల నుంచి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. తన స్నేహితురాలిపై కూడా లైంగికదాడికి పాల్పడ్డాడని, ఇది తెలిసి మరో 6 మంది తమపై దారుణానికి ఒడిగట్టారని బాలిక ఆరోపించింది. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామాంధ తండ్రికి జైలుశిక్ష బనశంకరి: కంటికి రెప్పలా బిడ్డను చూసుకోవాల్సిన తండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి అకృత్యానికి ఒడిగట్టాడు. ఆ కిరాతక తండ్రికి 20 ఏళ్ల కఠిన శిక్ష విధిస్తూ బుధవారం మంగళూరు జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. విట్ల పేరువాయి గ్రామ నివాసి 2020 మార్చిలో మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేరంపై విట్ల పోలీస్స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి కేఎం.రాధాకృష్ణ దోషికి 20 ఏళ్ల కఠినశిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. (చదవండి: విశాఖ ఆర్కే బీచ్లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్) -
హైదరాబాద్: మైనర్ల ‘ప్రేమకథ’ విషాదాంతం
సాక్షి, హైదరాబాద్: తెలిసీ తెలియని వయసు.. ప్రేమ పేరుతో ఆకర్షణ.. ఆ వయసుకి స్వతహాగానే పెద్దల మందలింపు.. వెరసి ఆ బాధలో ఇద్దరు మైనర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. హైదరాబాద్ పేట్బషీరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. ఫాక్స్సాగర్లో దూకి ఓ మైనర్ జంట ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు.. ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన పెద్దలు.. అలాంటి పనులు వద్దంటూ మందలించారు. విద్యార్థినిని ఇంటి వద్దే ఉంచారు. ఈ క్రమంలో హఠాత్తుగా కనిపించకుండా పోయారు. తండ్రికి భోజనం బాక్స్ ఇచ్చే వంకతో బయటకు వెళ్లిన విద్యార్థిని.. అతన్ని కలుసుకుంది. ఆపై వేరే విద్యార్థి ఇంట్లో బ్యాగు పెట్టేసి.. సైకిల్పై వెళ్లిపోయారు. వాళ్లు కనిపించపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాల ఆధారంగా వాళ్లు చెరువు వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లతో వెతక్కగా.. ముందుగా విద్యార్థిని మృతదేహాం దొరికింది. ఇక ఇవాళ(శుక్రవారం) ఉదయం విద్యార్థి దేహం దొరకడంతో.. ఈ ప్రేమ వ్యవహారం విషాదాంతం అయినట్లు పోలీసులు నిర్ధారించారు. -
ప్రేమవద్దన్నందుకు బాలిక ఆత్మహత్య
జీడిమెట్ల: ప్రేమ వద్దని తల్లిదండ్రులు మందలించినందుకు మైనర్ బాలిక చెరువులో దూకి అత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు, బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. దర్గయ్య, లలిత దంపతులు కుత్బుల్లాపూర్ అయోధ్యనగర్లో ఉంటున్నారు. వీరి కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో శివ, ఇందిర దంపతుల కుమారుడు (14) 9వ తరగతి చదువుతున్నాడు. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం తల్లిదండ్రులకు తెలియడంతో బాలికను ఇంటి వద్దనే ఉంచుతున్నారు. బుధవారం ఉదయం బాలిక అపార్ట్మెంట్లో పని చేస్తున్న తండ్రి దర్గయ్యకు టిఫిన్ బాక్సు ఇచ్చి సుభాష్నగర్లో బాలుడిని కలిసింది. ఇద్దరు కలిసి వీరితో చదివే వేరే బాలుడి ఇంటికి వెళ్లి అక్కడ బాలుడి స్కూల్ బ్యాగును ఉంచారు. మద్యాహ్నం సైకిల్పై ఇద్దరూ వెళ్లారు. రాత్రైనా ఇద్దరు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు వేర్వేరుగా జీడిమెట్ల పోలీస్స్టేషన్లో పిర్యాదు చేశారు. సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు బాలిక, బాలుడి చెప్పులు, బాలుడి సైకిల్ను జీడిమెట్ల ఫాక్స్సాగర్ వద్ద గుర్తించారు. ఇద్దరు చెరువులో దూకి ఉంటారనే అనుమానంతో గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రం బాలిక(14) మృతదేహం చెరువు నీటిపై తేలడంతో ఒడ్డుకు తీసి మృతదేహాన్ని పోస్టుమార్డమ్ నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. లభించని బాలుడి ఆచూకీ? బాలుడు బాలికతో పాటు నీటిలో దూకాడన్న అనుమానంతో పోలీసులు చెరువులో వెతకడం మొదలుపెట్టారు. ఎంతసేపైనా బాలుడి అచూకీ లభించకపోవడంతో పాటు బాలుడి తండ్రి సదరు బాలుడికి ఈత వచ్చని తెలిపారు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. గురువారం చీకటి పడటంతో బాలుడికోసం గాలింపు చర్యలు సైతం చేపట్టారు. (చదవండి: కిడ్నాపర్ల చెరలో నందగిరి వాసి) -
Hyderabad: పబ్లో మైనర్లతో పార్టీ నిర్వహణ.. బడా నేత ప్రమేయం!
సాక్షి, హైదరాబాద్: వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. విమర్శలు వెల్లువెత్తుతున్నా.. హైదరాబాద్లో పబ్ల తీరు మారడం లేదు. తాజాగా.. జూహ్లీహిల్స్ అమ్నీషియా పబ్ తరహాలో ఓ పబ్లో మైనర్ల పార్టీ నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఓ పబ్లో రెండ్రోజుల పాటు మైనర్ల పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. సైబర్ హవర్స్ వాల్యూమ్-11 పేరుతో ఈవెంట్ను నిర్వహించారు. మైనర్ల పార్టీకి ఎక్సైజ్ శాఖ అనుమతి నిరాకరించింది. అయితే ఒక బడా నేత ప్రమేయంతో మైనర్ల పార్టీ ఎరేంజ్ చేసినట్లు సమాచారం. ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ల పార్టీకి కొందరు ఆహ్వానాలు పంపించారు. ఇక నిర్వాహకులేమో పబ్లో మద్యం సరఫరా చేయలేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు తెలియాల్సి ఉంది. -
ప్రేమ పేరుతో రూ.11 లక్షలు కాజేశాడు
యలమంచిలి రూరల్ : పెళ్లి పేరిట మైనర్ యువతిని మోసం చేసిన యువకుడిపై యలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెదపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక మోసపోయిందని తండ్రి యలమంచిలి రూరల్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సన్నిబాబు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. యలమంచిలి మండలం పెదపల్లి గ్రామానికి చెందిన మైనర్ యవతిని (16)ను కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన బొద్దపు నానాజీ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె నుంచి దశలవారీగా రూ.11 లక్షల కాజేసాడు. ఇంటిలో పెట్టిన డబ్బు కనిపించకపోవడంతో తండ్రి కూతురిని ప్రశ్నించగా విషయం బయట పడింది. దీంతో తండ్రి రూరల్ పోలీసులను ఆశ్రయించి యలమంచిలి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు నానాజీతో కలిసి అతని పిన్నమ్మ కరణం వెంకట లక్ష్మి, తల్లి బొద్దపు పాప, చెల్లి లల్లీలు కూడా తమ కుమార్తెను ఏమార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోల్ యలమంచిలి రూరల్ స్టేషన్కు వచ్చి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన సూచన మేరకు పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టారు. మొదట రూ.2 లక్షల వరకు ఫోన్ పే ద్వారా.. తర్వాత రూ.6 లక్షలు నేరుగా నగదు రూపంలో ఇచ్చినట్లు, మిగిలిన డబ్బు దశలవారీగా ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. నలుగురిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. (చదవండి: నమ్మించి.. రియల్టర్ కిడ్నాప్) -
జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో మరో మలుపు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లో మైనర్పై అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసులో ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా బాలిక అత్యాచారం కేసులో మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఓ ఎంఐఎం కార్పొరేటర్ని పోలీసులు విచారించనున్నారు. సదరు కార్పొరేటర్ని విచారణకు రావాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులు ఆదేశించినట్లు సమాచారం. గతంలో హైదరాబాద్ మాజీ మేయర్గా ఆ కార్పొరేటర్ సేవలందించారు. ఈ కేసులో నిందితులకు సహకారం చేశాడని కార్పొరేటర్పై పలు ఆరోపణలు వచ్చాయి. కారులో మొయినాబాద్ వరుకు కార్పొరేటర్ వెళ్లినట్టు, నిందితులకు సహకరించినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. చదవండి: ఉత్తర ప్రదేశ్లో అమానుషం.. కస్టడీలో ఉన్న వ్యక్తికి కరెంట్ షాక్, లాఠీ దెబ్బలు -
పోక్సో చట్టం కింద పూజారికి పదేళ్ల జైలు
విశాఖ లీగల్: బాలికను మోసగించి మాయమాటలతో వివాహం చేసుకుని లైంగికదాడికి పాల్పడిన యువకుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నగరంలోని పొక్సో నేరాల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. జైలుశిక్షతోపాటు రూ.20వేల జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో అదనంగా ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆ తీర్పులో స్పష్టం చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు పుల్లకందం సతీష్కుమార్ విజయనగరం జిల్లా జియ్యమ్మవలసకు చెందినవాడు. వృత్తిరీత్యా హైదరాబాద్లో పూజారి. బాధిత బాలిక విశాఖలోని గాజువాక నియోజకవర్గ పరిధి పెదగంట్యాడలో ఒక ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదివేది. ఈ నేపథ్యంలో 2015 ఏప్రిల్ 30న బాలిక తమ బంధువుల ఇంట్లో వివాహానికి విజయనగరం వెళ్లింది. పెళ్లిలో సతీష్కుమార్ బాలికను చూశాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. బాలిక విజయనగరంలోని సతీష్ ఇంటికి వెళ్లగా ఇద్దరూ గుడిలో సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం అన్నవరంలో కొన్ని రోజులు గడిపారు. ఈ క్రమంలో తమ కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తల్లి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తగిన సమాచారంతో సతీష్ని, బాధితురాలిని పట్టుకున్నారు. అనంతరం వివాహానికి సహకరించిన సతీష్ తల్లి పుల్లకందం గిరిజ, సోదరుడు పుల్లకందం సంతోష్కుమార్పై కూడా కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో లైంగికదాడికి సహకరించిన వారిద్దరికీ ఐపీసీ సెక్షన్ 366 కింద ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20వేలు చొప్పున జరిమానా విధించారు. సతీష్, అతని సోదరుడు, తల్లిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. (చదవండి: భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం) -
మైనర్ పై సాముహిక అత్యాచారం... ఫిర్యాదు చేసిందనే కోపంతో తోటి విద్యార్థులే...
పాట్నా: రాను రాను మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాల జరగడం అనేది సర్వసాధారణంగా అయిపోతుందేమో. ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా పరిస్థితి నానాటకీ దిగజారిపోతుందే గానీ చక్కబడుతుందనే ఆశ కానరావడం లేదు. ప్రతి నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు గురించే వింటున్నాం. చదువుకున్నవాళ్లు సైతం కామంధులై అత్యంత దారుణాలకి ఒడిగడుతున్నారు. అచ్చం అలానే బీహార్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బీహార్లోని జాముయ్లో ఒక మైనర్ కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి వస్తుండగా ఆమె పై ఐదుగురు విద్యార్థులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఐదుగురు అదే కోచింగ్ సెంటర్ విద్యార్థులు. ఐతే ఆ బాలిక గతంలో తనతో ఒక అబ్బాయి అసభ్యంగా ప్రవర్తించాడంటూ కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఆమె పై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ మైనర్ తల్లిదండ్రులు కోచింగ్ నిర్వాహకులు ఇకపై మీ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇవ్వడంతోనే కోచింగ్ సెంటర్ పంపామని పోలీసులకు చెబుతుండటం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అత్యాచారం చేశారని ఫిర్యాదు కోసం వస్తే.. స్టేషన్లో పోలీసులు..) -
మైనర్పై 59 ఏళ వ్యక్తి అఘాయిత్యం
శివాజీనగర: సీఎం సొంతూరిలో దారుణం జరిగింది. 59 ఏళ్ల వ్యక్తి 11 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన హావేరి శిగ్గాంవి తాలూకా బంకాపుర వద్ద జరిగింది. నిందితుడు నాగప్ప బాడదను బంకాపుర పోలీసులు మంగళవారం పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈతకు వెళ్లి ఇద్దరు బాలికల మృతి రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా మీర్జాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇందు (14), సుజాత (13) సోమవారం సాయంత్రం రాజోలుబండ కాలువలో ఈతకు దిగి నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈత రాకపోవడంతోనే నీట మునిగిపోయారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం గ్రామీణ ఎమ్మెల్యే బసవనగౌడ మృతుల కుటుంబాలను పరామర్శించి రూ. 20 వేలు పరిహారం అందించారు. (చదవండి: కన్నతండ్రి అఘాయిత్యం.. అపరకాళిగా మారిన తల్లి) -
బాలికపై సాముహిక అత్యాచారం... ఆపై వీడియో తీసి...
సాక్షి, బెంగళూరు: మహిళలు, బాలికల భద్రతకై ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నెన్ని చట్టాలు తీసుకువస్తున్నప్పటకీ ఈ అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. మైనర్లు, చిన్నపిల్లలు అని చూడకుండా వారిపై అఘాయిత్యాలకు పాల్పడటమే కాకుండా వీడియోలు తీసి బెదిరించడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....బెంగళూరులో 16 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ ఘటనను వీడియో తీసి తన స్నేహితులకు షేర్చేశాడు. అంతేకాకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని బెదిరిస్తూ తన ఏడుగురు స్నేహితులతో కలిసి ఆ బాలిక పై మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులోని యలహంకలో చోటుచేసుకుంది. అయితే బాధితురాలు ఆ నిందితుడి ఆగడాలు భరించలేక ఏడుస్తూ ఇంటికి రావడంతో.. తల్లిదండ్రులు ఏం జరిగిందో చెప్పమని ఆమెను బలవంతం చేశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ మేరకు బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మరొక నిందుతుడి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: పరీక్షలు రాయాలి.. బెయిల్ వచ్చిందని తెలియక విచారణ ఖైదీ ఆత్మహత్య)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement