-
పాలమూరుకు కృష్ణమ్మ..
- జూరాలకు వరద నేపథ్యంలో ఎమ్మెల్యే ఆలకు సీఎం ఫోన్ - కోయిల్సాగర్ లిఫ్టు పంపులను ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, మహబూబ్నగర్: పాలమూరును కృష్ణమ్మ జలాలు ఈ ఏడాది ముందే పల కరించాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండటంతో కోయిల్సాగర్ లిఫ్టు పంపులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. జూరాలకు ఎగువ నుంచి 7 వేలకు పైగా క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుం డడంతో ప్రాజెక్టులో రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కోయిల్సాగర్ లిఫ్టులను ప్రారంభించి చెరువులను నింపాలని సీఎం కేసీఆర్ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి బుధవారం ఫోన్ చేసి ఆదేశించారు. దీంతో జిల్లా పర్యట నలో ఉన్న మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఒక పంపును ఆన్ చేశారు. ఒక పంపును ఆన్ చేయడం ద్వారా 315 క్యూసెక్కుల నీరు పంపింగ్ అవుతోంది. పంపు ద్వారా ప్రాజె క్టులోకి రోజూ 0.05 టీఎంసీల నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయకట్టు రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. దారి పొడ వునా ఉన్న గొలుసుకట్టు చెరువులను కూడా నిం పాలని నిర్ణయించారు. కోయిల్ సాగర్ లిఫ్టు పనులను ప్రారంభించిన తర్వాత మంత్రి మాట్లాడుతూ సీఎం ముందుచూపు వల్లే పం పులను ప్రారంభించినట్లు తెలిపారు. జూన్ లో ఎత్తిపోతల పంపులను ప్రారంభించడం చరిత్రలో ఇదే ప్రథమమన్నారు. -
కల్తీ నివారణకు ఐదంచెల ప్రణాళిక
అధికారులకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశం సాక్షి, హైదరాబాద్: కల్తీ నివారణకు ఐదంచెల ప్రణాళిక రూపొందించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) అధికారులతో సచివాలయంలో కల్తీ నివారణపై మంత్రి సమీక్ష చేశారు. మంత్రి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ హానికరం, నాసిరకం, మిస్ బ్రాండెడ్ వస్తువుల తయారీపై దృష్టి సారించాలని, వాటి అమ్మకా లను కట్టడి చేయాలని ఆదేశించారు. అందుకు తగ్గ ప్రణాళి కలు రూపొందించాలని మంత్రి సూచించారు. దాడులు చేయడం, శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసుకోవడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. స్ట్రీట్ వెండర్స్ అవేర్నెస్ ప్రోగ్రా మ్ చేపట్టాలని సూచించారు. ఈ సమీక్ష సమా వేశంలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివా రీ, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాసుపత్రుల్లోనే 50% ప్రసవాలు జరగాలి
► అధికారులకు వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశం ► 3న సీఎం చేతుల మీదుగా కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రస్తుతం 30–40 శాతంగా ఉన్న ప్రసవాలను 50 శాతానికి పెంచాలని అధికారులను వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. మేడ్చల్ జిల్లా కేంద్రంలో వెంటనే మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వైద్యారోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, కేసీఆర్ కిట్ల పథకం సన్నాహాలపై శుక్రవారం సచివాల యంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్ల పథకాన్ని వచ్చే నెల 3న హైదరాబాద్లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ప్రసవాలు జరిపే అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. కేసీఆర్ కిట్ల పథకం కింద గర్భిణుల నమోదు మొదలైందని, ఇప్పటివరకు 2 లక్షల మందికిపైగా పేర్లు నమోదు చేసుకున్నారని, ఈ ప్రక్రియ నిరంతరం జరగాలని చెప్పారు. గర్భిణులకు మూడు విడతల్లో రూ.12 వేల ప్రోత్సా హకం అందిస్తామని, ప్రసవం తర్వాత రూ.2 వేల విలువైన 16 రకాల వస్తువులు గల కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏడాదికి 6.28 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయని, అన్ని ప్రసూతి కేంద్రాల్లో వైద్య బృందాలను పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించామన్నారు. వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నమాట నిజమేనని, నియామకాలు పూర్తయ్యేలోగా అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బందిని క్రమబద్ధీకరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు రఘునందన్రావు, ఎంవీ రెడ్డి, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ వేణుగోపాల్, ఆరోగ్య పథకం సీఈఓ పద్మ పాల్గొన్నారు. -
జూన్ 2 నుంచి అమ్మఒడి
- ఆరోజు నుంచే కేసీఆర్ కిట్లు ప్రారంభం - వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి - ఆధార్తో గర్భిణులకు బ్యాంకు ఖాతాలు సాక్షి, హైదరాబాద్: అమ్మఒడి, కేసీఆర్ కిట్ల కార్యక్రమాన్ని జూన్ 2న ప్రారంభించను న్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఇందుకు శక్తిమంతమైన సాఫ్ట్వేర్ని రూపొందించామని, పైలట్ ప్రాజెక్టుగా పాలమూరు వివరాలు పొందు పరిచామని చెప్పారు. పథకాల ఏర్పాట్లపై సోమవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అమ్మఒడి, కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమా న్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారుల ను ఆదేశించారు. గర్భిణులను ప్రాథమిక దశలోనే గుర్తించడం, వివరాలు నమోదు చేయడం, నెల నెలా పరీక్షలు చేయించడం విధిగా జరగాలన్నారు. పరీక్షల సమయం లోనే హైరిస్క్ కేసులని గుర్తించాలని, ఆ ప్రకారం ఆస్పత్రిలో ప్రసవం చేయించాల న్నది నిర్ణయించాలన్నారు. ఆ నిర్ణయాన్ని ముందుగానే గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు తెలిపి నిర్ణీత కేంద్రాల్లోనే ప్రసవా లు జరిగేట్లు చూడాలన్నారు. సిజేరియన్ సంఖ్యని మరింత తగ్గించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని లక్ష్మారెడ్డి చెప్పారు. ఆధార్ అనుసంధానంతో గర్భిణీలకు బ్యాంకు ఖాతాలు తెరిపించాలని.. వృద్ధులకి అందిస్తున్న ఆసరా పెన్షన్ల మాదిరిగా వేగంగా డబ్బులు జమచేయడం, విత్డ్రా చేసుకునే వీలుండాలన్నారు. ఆటంకం లేకుండా డబ్బులందాలి గర్భిణీలకు ఏఎన్సీ పరీక్షల సమయంలో రూ.4 వేలు, ప్రసూతి సమయంలో రూ.4 వేలు, ప్రసవానంతరం బిడ్డలకి టీకాల కోసం రూ.4 వేలు ఆటంకం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆడ బిడ్డ పుడితే అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ల పథకంలో ప్రభుత్వం ఇస్తున్న అదనపు రూ.వెయ్యి కలిపి ఇవ్వాలన్నారు. గర్భిణీ వివరాలు నమోదు చేసుకున్నప్పటి నుంచి టీకాలిచ్చే వరకు పూర్తి సమాచారం సాఫ్ట్వేర్లో ఉండాలని చెప్పారు. పథకం సరిగా అమలవడానికి ప్రభుత్వ ప్రసవ కేంద్రాల్లో అన్ని వసతులుండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు పీజీ వైద్య ఫీజుల పెంపు!
వైద్యారోగ్య శాఖ సూత్రప్రాయ నిర్ణయం - ప్రైవేటు మెడికల్ కాలేజీలతో మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు - ఫీజులు రెండింతలు చేయాలంటున్న ప్రైవేటు కాలేజీలు - ఉమ్మడి కౌన్సెలింగ్పై న్యాయ సలహాకు సర్కారు యోచన సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య విద్య కాలేజీల్లో పీజీ వైద్య సీట్ల ఫీజును పెంచాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాంతోపాటు పీజీ, యూజీ వైద్య సీట్లను ‘నీట్’ ర్యాంకుల ఆధారంగా ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలన్న కేంద్ర నిర్ణయంపై న్యాయ సలహా తీసుకోవాలని యోచిస్తోంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతారని, అనంతరం ఫీజుల పెంపు, ఉమ్మడి కౌన్సెలింగ్పై ప్రకటన వెలువడనుందని వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. చర్చల సందర్భంగా ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం ఉమ్మడి కౌన్సెలింగ్ వద్దని కోరాయి. కానీ భారత వైద్య మండలి (ఎంసీఐ) ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించి తీరాలని, అయినా ఈ అంశంపై న్యాయ సలహా తీసుకోవాలని యోచిస్తున్నామని మంత్రి వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక పీజీ వైద్య సీట్ల ఫీజును రెండింతలకుపైగా పెంచాలని యాజమాన్యాలు మంత్రిని కోరగా.. దీనిపై మంత్రి ఎటువంటి హామీ ఇవ్వలేదని, సీఎంతో మాట్లాడాక నిర్ణయిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. నీట్ ర్యాంకుల ఆధారంగా సీట్ల భర్తీ ఉండనున్నందున ఫీజుల పెంపు విషయంలో సర్కారు తమ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని యాజమాన్యాలు కోరినట్లు తెలిసింది. డొనేషన్లకు చెక్..! ప్రస్తుతం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా క్లినికల్ సీట్లకు రూ.3.2 లక్షలు, యాజమాన్య కోటాలోని క్లినికల్ సీట్లకు రూ.5.8 లక్షలుగా ఫీజు ఉంది. కానీ యాజమాన్యాలు పీజీ సీట్లకు డొనేషన్ల పేరుతో రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు వసూలు చేస్తున్నాయి. అయితే నీట్ ర్యాంకులతో ఈసారి నుంచి డొనేషన్లకు చెక్ పడనుంది. ఈ నేపథ్యంలోనే యాజమాన్య కోటా సీట్లకు ఫీజులు భారీగా పెంచాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఇది సున్నితమైన వ్యవహారం కనుక ఆచితూచి అడుగు వేయాలని, విద్యార్థులపై అధిక భారం పడకుండా నిర్ణయం తీసుకోవాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి కౌన్సెలింగ్కే వెళ్లాలన్న కేంద్రం ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారానే పీజీ, యూజీ వైద్య సీట్లను భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు తాజాగా మరోసారి రాష్ట్రానికి లేఖ రాసింది. కన్వీనర్, యాజమాన్య కోటా, ఎన్నారై సీట్లన్నింటికీ ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు న్యాయ సలహాకు వెళ్లినా ప్రయోజనం ఉండదన్న చర్చ జరుగుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement