-
జూపల్లి వారసులపై సీబీ‘ఐ’
సాక్షి, హైదరాబాద్: వారిద్దరూ మంత్రి కుమారులు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను తమ పలుకుబడితో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కంపెనీలను ఏర్పాటు చేసి ఆ భూములను బ్యాంకుల్లో తనకా పెట్టారు. మార్కెట్ విలువ కన్నా నాలుగొంతులు అధిక విలువ చూపి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. వాటితో స్టేట్ ఆఫ్ ఇండి యా నుంచి కోట్ల రుణాలు తీసుకొని కంపెనీల్లోకి మళ్లించారు. రుణాలు చెల్లించకపోవడంతో తన ఖా పెట్టిన ఆస్తులను జప్తు చేసుకునేందుకు బ్యాం కు అధికారులు సిద్ధమయ్యారు. అప్పుడే అసలు కథ బయటపడింది. తనఖా పెట్టిన ఆస్తులకు, తీసుకున్న రుణాలకు పొంతన లేకపోవడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మంత్రి జూపల్లి కృష్ణారావు కుమారుల ఈ ‘తనఖా’మాయాజాలంపై సీబీఐ రంగంలోకి దిగింది. అసలేం జరిగింది? మంత్రి జూపల్లి కుమారులు వరుణ్, అరుణ్ ఇద్దరూ వ్యాపార రంగంలో ఉన్నారు. 2011లో వారు శైలి ఇన్ఫ్రా లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ స్థాపించారు. దాన్ని 2015లో క్రిద్యా ఇన్ఫ్రా లిమిటెడ్ పేరు మీదకు మార్చారు. ఈ కంపెనీ తీసుకున్న బ్యాంకు రుణాలకు జూపల్లి అరుణ్, వాసిరెడ్డి కిరణ్రెడ్డి హమీదారులుగా ఉన్నారు. అరుణ్.. అమీర్పేట్లోని రాయల్ పెవిలియన్ అపార్ట్మెంట్లోని మూడు ఫ్లాట్లు, గండిపేట కిస్మత్పూర్లోని 3.2 ఎకరాల భూమి, గగన్పహాడ్లోని ఇల్లును తనఖా పెట్టి 2015 నాటికి ఎస్బీఐ నుంచి రూ.64.80 కోట్ల రుణం పొందారు. వీటిని చెల్లించకపోవడంతో ఏడాదిన్నర క్రితం ఎస్బీఐ అరుణ్కు నోటీసులు ఇచ్చింది. 2016లో తనఖా పెట్టిన ఈ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రకటన ఇచ్చింది. తనఖా పెట్టిన ఈ ఆస్తులను బ్యాంకు అధికారులు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం పరిశీలించగా రూ.7.75 కోట్లే ఉందని తేలింది. దీంతో బ్యాంకు అధికారులు నోరెళ్లబెట్టాల్సిన వచ్చింది. కంపెనీ కోసం తీసుకున్న రుణాలు వడ్డీతో కలిపి ఈ ఏడాది జనవరికల్లా రూ.86.30 కోట్లకు చేరింది. మార్కెట్ విలువలో గోల్మాల్ చేసి అరుణ్ బ్యాంకు రుణం పొందినట్టు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. తనఖా పెట్టిన మొత్తం ఆస్తు ల విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.17.79 కోట్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అంటే ఆస్తులను స్వాధీనం చేసుకున్నా బ్యాంకుకు రూ.68.50 కోట్ల నష్టం మిగలనుంది. గతేడాదే సీబీఐ నోటీసు బోగస్ పత్రాలతో కోట్లు రుణం పొందిన జూపల్లి వారసులపై సీబీఐ దృష్టి సారించింది. దీనిపై ప్రధాని కార్యాలయానికి ఇప్పటికే ఫిర్యాదు అంది నట్లు తెలిపింది. గత జూలై 28నే జూపల్లి అరుణ్కు దర్యాప్తు సంస్థ నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరు కావాలంటూ గతేడాది ఆగస్టు 18న సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ సంజయ్ దూబే అరుణ్కు జారీ చేసిన నోటీసులో తెలిపారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జూపల్లి అనుచరులు, పార్టీ కార్యకర్తల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని, పూర్తి వివరాలను వెల్లడించలేమని ఢిల్లీలోని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదీ మాయాజాలం.. సాధారణంగా ఎవరైనా భూములు కొన్న సందర్భంలో మార్కెట్ విలువ కన్నా రిజిస్ట్రేషన్ విలువ తక్కువగా చూపిస్తారు. కానీ జూపల్లి అరుణ్ మాత్రం రిజిస్ట్రేషన్ విలువను మార్కెట్ విలువ కన్నా అధికంగా చూపాడు. అదీగాకుండా తనఖా పెట్టిన ఆ భూమిపై హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. కిస్మత్పూర్లోని 3.27 ఎకరాల భూమి మార్కెట్ విలువ ప్రకారం రూ.78.48 లక్షలుంంటే.. అరుణ్ దాని రిజిస్ట్రేషన్ విలువను రూ.3.30 కోట్లుగా చూపాడు. అలాగే గగన్పహాడ్లోని ఇల్లు మార్కెట్ విలువ ప్రకారం రూ.1.93 కోట్లు ఉంటే రిజిస్ట్రేషన్లో రూ.2.5 కోట్లుగా చూపించారు. -
వచ్చే ఎన్నికల్లో ఓడిపోనున్న జానా, ఉత్తమ్
సాక్షి, చౌటుప్పల్ (మునుగోడు): ప్రస్తుతం బీరాలు పలుకుతున్న సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోనున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. యాదాద్రి భువనగికి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గ స్థానాలను టీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తిరిగి మరోసారి టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, ఈ విషయాన్ని ఇప్పటికే జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం వెల్లడించాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీరు అందిస్తామన్నారు. -
ఆ కాంట్రాక్టర్ల నుంచి జరిమానా వసూలు చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై), నాబార్డ్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయకపోతే సదరు కాంట్రాక్టర్ల నుంచి నిబంధనల ప్రకారం జరిమానా వసూలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. నాబార్డ్, పీఎంజీఎస్వై పనుల పురోగతిపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా జరుగుతున్న పనులు, జాప్యానికి గల కారణాలపై ఈఈ, ఎస్ఈలతో చర్చించారు. ఆశించినంత వేగంగా పనులు జరగకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజూరైన పనులను పూర్తి చేయడం ద్వారా కేంద్రం నుంచి అదనంగా నిధులను పొందేందుకు వీలుంటుందని, ఎట్టి పరిస్థితుల్లోను మార్చి 31లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. 151 పనులకు టెండర్లు పూర్తి.. పీఎంజీఎస్వై కింద దాదాపు రూ.600 కోట్ల విలువైన పనులు పూర్తి కావాల్సి ఉందని జూపల్లి వెల్లడించారు. ఇందులో రూ.300 కోట్ల విలువైన పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని, మిగిలిన పనులను కూడా జూన్ 30లోగా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది 154 పనులను పూర్తి చేసే లక్ష్యం రూపొందించుకున్నామని, ఇందులో 151 పనులకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు. -
నిధుల్లేక నీరసిస్తున్న స్థానిక సంస్థలు
సాక్షి, హైదరాబాద్: నిధుల్లేక స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యులు గగ్గోలు పెట్టారు. దీంతో తాము స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లలేకపోతున్నామని ఏకరువు పెట్టారు. మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి సడక్ యోజన అమలు, ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ పనులకు సంబంధించి సభ్యులు పలు ప్రశ్నలు వేశారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.1,318 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.601 కోట్లే విడుదల చేశారని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. నిధుల్లేక గ్రామ పంచాయతీలు బలహీనపడిపోతున్నాయని టీఆర్ఎస్ సభ్యుడు భూపాల్రెడ్డి చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నాలుగు జిల్లా పరిషత్ సమావేశాలకు వెళ్లొస్తే వాస్తవం తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. సర్పంచులు, జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్రెడ్డి వాపోయారు. 14వ ఆర్థిక సంఘంలో మార్పుల వల్ల నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులు పోతున్నాయని, దీంతో మండల, జిల్లా పరిషత్లకు నిధులు రావట్లేదని టీఆర్ఎస్ సభ్యుడు భానుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఇస్తున్నట్లే జిల్లా పరిషత్లకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించాలని టీఆర్ఎస్ సభ్యుడు భూపతిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, పాత చట్టాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని పంచాయతీరాజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పంచాయతీల అభివృద్ధికి త్వరలోనే సమగ్ర పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. 2015–17 కాలంలో స్థానిక సంస్థలకు రూ.1,146.94 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు గ్రామ పంచాయతీలకే వెళ్తున్నాయని, మండల, జిల్లా పరిషత్లకు రావట్లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. రాష్ట్రంలో పంచాయతీ రహదారులు ఘోరంగా ఉన్నాయని షబ్బీర్ అలీ విమర్శించగా.. మంత్రి జూపల్లి బదులిస్తూ 20–30 ఏళ్లలో చేసిన దానికంటే ఒక్క ఏడాదిలోనే వేల కోట్ల రూపాయల పనులు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఇతర మంత్రులు జోక్యం చేసుకోవడంతో షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘సంబంధిత మంత్రికి జవాబు ఇవ్వడం రాదా? లేదా ఆయన శాఖ ఏమైనా మారిందా?’అంటూ విరుచుకుపడ్డారు. పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలి.. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) స్థానంలో పాత పద్ధతిని పునరుద్ధరించాలని టీఆర్ఎస్ సభ్యుడు జనార్దన్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్ వల్ల ఉద్యోగుల అభద్రతా భావంతో బతుకుతున్నారన్నారు. హైదరాబాద్లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో తినుబండారాల ధరలు 6 నుంచి 10 రెట్లు అదనంగా ఉంటున్నాయని, వీటిని కట్టడి చేయాలని సభ్యుడు పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. చౌక దుకాణాల్లో బియ్యం తప్ప వేరే ఇవ్వడం లేదని, దీంతో వేలాది మంది డీలర్లకు కనీస కమీషన్లు కూడా రావట్లేదని షబ్బీర్అలీ పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, గ్రూప్–1 ఫలితాలను నిలుపుదల చేయడంపై వాయి దా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని షబ్బీర్అలీ కోరగా.. మండలి చైర్మన్ స్వామిగౌడ్ తిరస్కరించారు. ఉస్మానియా భూముల లీజుకు రూపాయా?: ప్రభాకర్రావు ఉస్మానియా వర్సిటీలో కొన్ని భూములను ఏడాదికి ఎకరం రూపాయికే లీజుకు ఇవ్వడంపై ప్రభాకర్రావు ప్రశ్నించారు. కొందరికి ఎకరానికి రూపాయి, ఇంకొందరికి రూ.40, మరికొందరికి రూ.50 లక్షలకు లీజుకు ఇచ్చారని, వ్యత్యాసమెందుకు ఉందన్నారు. 24 ప్రభుత్వ, తదితర సంస్థలకు 187.5 ఎకరాలు లీజుకు ఇచ్చామని కడియం శ్రీహరి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక 4 సంస్థలు లీజుకు అడగగా, వాటికి లీజు రేట్లను పెంచే ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో పెట్రోల్ బంకుల టాయిలెట్లు పెట్రోల్ బంకుల్లోని టాయిలెట్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని మంత్రి కె.తారకరామారావు అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో టాయిలెట్ల పరిస్థితిపై పలువురు అడిగిన ప్రశ్నలపై మంత్రి మాట్లాడుతూ పెట్రోల్ బంకుల్లోని టాయిలెట్లు ప్రజలకు ఉపయోగపడేలా వాటి యాజమాన్యాలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పించామని చెప్పారు. కాగా, రాష్ట్రంలో 1,152 మంది అనాథ పిల్లలున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. అందులో 37 మందికి బీసీ–ఎ సర్టిఫికెట్ ఇచ్చామని ఆయన చెప్పారు. సరైన స్థలంలోనే కలెక్టరేట్ల నిర్మాణం: తుమ్మల ప్రజామోదం లేకుండా ఎక్కడా కలెక్టరేట్ల నిర్మాణాలను చేపట్టబోమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మండలిలో హామీ ఇచ్చారు. నిజామాబాద్ కలెక్టరేట్ కోసం అనువైన ప్రదేశం ఎంపిక చేయలేదని భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు కలెక్టరేట్ల స్థలాల మంజూరుపై బాలసాని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ మార్పుపై పొంగులేటì ప్రశ్నించారు. నిర్మల్లో కొండ మీద స్థలంపై విమర్శలు రావడంతో శంకుస్థాపన చేయలేదని తుమ్మల పేర్కొన్నారు. -
రెండేళ్లలో ఎల్ఈడీ కాంతులు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎంపిక చేసిన 60 మంది సర్పంచ్లకు ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుపై శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. 2019 మార్చి 31 నాటికి ప్రతి గ్రామానికి ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేసే లక్ష్యంతో 60 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నామన్నారు. ఇందుకోసం కేంద్ర ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఎఫ్ఎస్ఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ బల్బులు అమర్చడం వల్ల గ్రామ పంచాయతీలపై ఎలాంటి ఆర్థిక భారం పడదని, పెట్టుబడి లేకుండా పంచాయతీలు విద్యుత్ ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. థర్డ్ వైర్ సౌకర్యం ఉన్న పంచాయతీలు ముందుకు వస్తే ఈఎఫ్ఎస్ఎల్.. ఆయా గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తుందన్నారు. పంచాయతీలు సొంతంగా లేదా విద్యుత్ శాఖ ద్వారా లేదా 14వ ఫైనాన్స్ నిధుల నుంచి థర్డ్ వైర్ సౌకర్యం కల్పించుకోవచ్చన్నారు. 72 గంటల్లో పునరుద్ధరణ బల్బుల పనితీరును ఆన్లైన్ ద్వారా ఈఎఫ్ఎస్ఎల్ సంస్థ ప్రతినిధులు పర్యవేక్షిస్తారని తెలిపారు. వెలగని బల్బులను 72 గంటల్లో తిరిగి పునరుద్ధరిస్తారని, అలా పునరుద్ధరించకుంటే.. రోజుకి బల్బుకి రూ.5 చొప్పున పంచాయతీకి కంపెనీ చెల్లిస్తుందన్నారు. గ్రామ పంచాయతీలు సంస్థతో 5, 7, 10 ఏళ్లు ఒప్పందం కుదుర్చుకోవచ్చని తెలిపారు. ఒప్పందాన్ని బట్టి ఆదా అయిన డబ్బులో 80 శాతం సంస్థకు, 20 శాతం పంచాయతీకి దక్కుతుందన్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు ఉపయోగించుకోవాలన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement