-
మేక్ ఫర్ ఇండియా ఉత్పత్తులపై ప్రధాన దృష్టి
♦ కొత్త ఆవిష్కరణలపై కసరత్తు ♦ శాంసంగ్ ఫోరంలో సంస్థ ప్రెసిడెంట్ హెచ్సీ హాంగ్ ♦ నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ ♦ కౌలాలంపూర్ నుంచి పార్థ సారథి నండూరి భారత మార్కెట్లో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా మేక్ ఫర్ ఇండియా ఉత్పత్తుల రూపకల్పనపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్ హెచ్సీ హాంగ్ తెలిపారు. భారత్లో దాదాపు 45వేల పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని, సుమారు పన్నెండు వేల మంది పరిశోధన, అభివృద్ధి విభాగాల్లో ఉన్నారని ఆయన చెప్పారు. దీంతో పాటు ప్రాంతీయ అవసరాలకు అనుగుణమైన ప్రోడక్టుల తయారీ, నెట్వర్క్ను పటిష్టపర్చుకోవడం తదితర చర్యలపై ఈ ఏడాది మరింతగా కసరత్తు చేయనున్నట్లు ఆయన వివరించారు. శాంసంగ్ సౌత్వెస్ట్ ఆసియా ఫోరంలో పాల్గొన్న సందర్భంగా హాంగ్ ఈ విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏ5, ఏ7 స్మార్ట్ఫోన్ల కొత్త వెర్షన్లతో పాటు ఫ్రిజ్లు, ఓవెన్లు తదితర పలు ఉత్పత్తులను ఆయన ఆవిష్కరించారు. గతేడాది స్మార్ట్ఫోన్లలో తమ మార్కెట్ వాటా 11 శాతం పెరిగిందని 34.5 శాతం నుంచి సుమారు 45.9 శాతానికి చేరిందని హాంగ్ వివరించారు. భారత్లో 4జీ సేవలు విస్తృతమవుతున్న నేపథ్యంలో తాము వివిధ ధరల శ్రేణిలో 18 మోడల్స్ హ్యాండ్సెట్స్ను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. సొంత ఆపరేటింగ్ సిస్టం టైజెన్ ప్రధాన ఉత్పత్తులను మరింతగా అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. మొబైల్స్ కొత్త వెర్షన్లు..: శాంసంగ్ ఏ5, ఏ7 కొత్త వెర్షన్లు ఫిబ్రవరి 15 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. వీటి విక్రయాల కోసం ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్డీల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు శాంసంగ్ ఇండియా మొబైల్స్ వ్యాపార విభాగం డెరైక్టర్ మను శర్మ తెలిపారు. అలాగే వీటి కొనుగోలుపై టెలికం సంస్థ ఎయిర్టెల్ 30 జీబీ డేటాను అందించనున్నట్లు వివరించారు. బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మరింత వేగంగా చార్జ్ అయ్యేలా వీటిని రూపొందించినట్లు శర్మ చెప్పారు. ఇందులో ఫింగ్ప్రింట్ స్కానర్, 13 ఎంపీ (వెనుక) 5 ఎంపీ (ఫ్రంట్) కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. ఏ7 ధర రూ. 33,400, ఏ5 ధర రూ. 29,400 గా ఉండనుంది. 5 ఇన్ 1 రిఫ్రిజిరేటర్ .. స్మార్ట్ ఏసీలు.. విద్యుత్ను ఆదా చేసే విధంగా అయిదు కన్వర్షన్ ఫీచర్లతో స్మార్ట్ కన్వర్టబుల్ 5 ఇన్ 1 రిఫ్రిజిరేటర్లను శాంసంగ్ ఆవిష్కరించింది. ఇందులో ఫ్రిజ్, ఫ్రజర్ కంపార్ట్మెంట్లకు వేర్వేరు కూలింగ్ సిస్టమ్లను ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చని, దీంతో సందర్భాన్ని బట్టి విద్యుత్ను ఆదా చేయొచ్చని కంపెనీ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భుటానీ తెలిపారు. 393- 670 లీటర్ల సామర్థ్యంతో లభించే ఈ ఫ్రిజ్తో విద్యుత్ దాదాపు 74 శాతం మేర ఆదా అవుతుంది.. మరోవైపు, వాషింగ్ జరుగుతుండగానే మరిన్ని దుస్తులను జోడించే వీలు కల్పించే వాషింగ్ మెషీన్ను ప్రవేశపెట్టారు. అటు, మరింత స్పష్టమైన చిత్రాన్ని అందించే క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో పనిచేసే స్మార్ట్ అల్ట్రాహెచ్డీ టీవీలను ఆవిష్కరించారు ఇది టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. మరోవైపు, దాదాపు 68 శాతం దాకా విద్యుత్ను ఆదా చేసే విధంగా భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన స్టార్ఫ్లవర్ ఏసీలను శాంసంగ్ ఆవిష్కరించింది. -
తయారీ హబ్గా ఎదగాలంటే ఎగుమతులూ కీలకమే
న్యూఢిల్లీ: కేవలం దేశీ వినియోగానికే పరిమితం కాకుండా ఎగుమతులూ పెరిగినప్పుడే భారత్ .. తయారీ హబ్గా ఆవిర్భవించగలదని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ చెప్పారు. మేకిన్ ఇండియా నినాదం తీరుతెన్నులపై ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శలు చేసిన నేపథ్యంలో కాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనా బాటలో ఎగుమతులపై కాకుండా దేశీ మార్కెట్పై దృష్టి సారిస్తూ మేక్ ఫర్ ఇండియా విధానాన్ని అమల్లోకి తేవాలంటూ రాజన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అమితాబ్ కాంత్.. రాజన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా సరే ప్రాథమికంగా దేశీ మార్కెట్ కోసం ఉత్పత్తి చేసినా .. ఆ తర్వాత క్రమంగా విదేశీ మార్కెట్లలోకి విస్తరించాలని యోచిస్తారని, నిజమైన వ్యాపారవేత్త చేయాల్సిన పని కూడా అదేనని కాంత్ పేర్కొన్నారు. ఎగుమతుల ప్రాధాన్యాన్ని గుర్తెరిగి, మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ప్రధాన పాత్ర పోషించాలంటే దేశీ పరిశ్రమ పోటీతత్వాన్ని మరింతగా అలవర్చుకోవాల్సి ఉంటుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ఖేర్ పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement