-
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
-
టీడీపీలో అంతే.. సీనియర్ నేతకు సీటు కష్టాలు!
ఆయన కర్నూల్ జిల్లాలో పేరు మోసిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఈయనేమో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ను పాతాళంలో పాతేయడంతో చేసేది లేక పచ్చ పార్టీలో చేరారు. టీడీపీలో ఆయన సీనియారిటీకి గౌరవం ఇవ్వడంలేదట. అసలు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం కూడా ఆ సీనియర్ నాయకుడు నానాపాట్లు పడుతున్నారని టాక్ నడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడిగా, కేంద్ర మంత్రిగా కోట్ల సూర్యప్రకాశరెడ్డికి పరిచయం అక్కర్లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైపోవడంతో సూర్యప్రకాశరెడ్డి అనివార్యంగా తెలుగుదేశంలో చేరారు. పార్టీలోకి ఆహ్వానించిన సమయంలో చంద్రబాబు కోట్లకు ఎన్నో హామీలిచ్చారు. కోట్ల వంటి సీనియర్లు పార్టీకి అవసరం అని చెప్పారు. అప్పుడు కోట్ల అడిగిన డిమాండ్స్ అన్నీ పూర్తి చేశారు. కానీ ఇప్పుడేమో కోట్ల కుటుంబాన్ని అసలు పట్టించుకోకుండా దూరంగా ఉంచుతున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో ఒక సీటు మాత్రమే ఇస్తామని..అది కూడా అన్నీ అనుకూలిస్తేనే అని మెలిక పెడుతున్నారు. అయితే, కోట్ల సూర్యప్రకాశరెడ్డి మాత్రం తనకు ఎమ్మిగనూరు సీటు ఇవ్వాల్సిందే అని పట్టుపడుతున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా ప్రస్తుతం బి.వి జయనాగేశ్వరరెడ్డి కొనసాగుతున్నారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇదే అదునుగా భావించిన కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అక్కడ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి తన వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అది తెలుసుకున్న జయనాగేశ్వరరెడ్డి టీడీపీ అధిష్టానానికి కోట్లపై ఫిర్యాదు చేసారు. అప్పటికి ఏదో సర్దుబాటు అయ్యింది కాని కోట్ల మాత్రం ఎమ్మిగనూరు సీటు కోసమే రాజకీయం చేస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చాలా బలంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డిపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. ఓడిపోయాక నియోజకవర్గానికి దూరంగా ఉండటం, కార్యకర్తల్ని పట్టించుకోకపోవడంతో మొత్తంగా తెలుగుదేశం పార్టీయే ఆయనకు దూరంగా జరిగింది. ఈ పరిస్థితుల్నే ఆసరాగా తీసుకుని కోట్ల సూర్యప్రకాశరెడ్డి అక్కడ కుంపటి పెట్టారు. కోట్ల ఎంట్రీ ఇచ్చాక జయనాగేశ్వరరెడ్డి నా సీటు అంటూ హడావుడి చేస్తున్నారు. ఇద్దరూ వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో టీడీపీ కేడర్కు ఇబ్బందిగా మారింది. నారా లోకేష్ పాదయాత్రలోనూ రెండు వర్గాలు ఆధిపత్య ధోరణి కొనసాగించాయి. ఎన్నికలకు ఏడాది ముందే ఇలా ఉంటే.. టిక్కెట్లు ప్రకటించేనాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని స్థానిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్న కోట్ల సూర్యప్రకాశరెడ్డి ఇప్పుడు తన రాజకీయ ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. చంద్రబాబు కోరిన టిక్కట్ ఇస్తారో లేదో తెలియదు.. అసలు టిక్కెట్ ఇస్తారో ఇవ్వరో కూడా అర్థం కాని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది కూడా చదవండి: TS: సైలెంట్ అయిన బీజేపీ నేతలు.. ఢిల్లీ పెద్దల డైరెక్షన్ ఇదే? -
ఎన్నికలకు రెండేళ్ల ముందే.. టీడీపీలో టిక్కెట్ల లొల్లి!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఎన్నికలకు రెండేళ్ల ముందే టీడీపీలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుని ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది? అందుకు ఇప్పటి నుంచే ఎలా సన్నద్ధం కావాలి? అనే దిశగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కనీసం కొన్ని స్థానాలైనా గెలిచి ఉనికి కాపాడుకోవాలని, అందుకు తగ్గట్లు ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని ఇటీవల పార్టీ ముఖ్యులతో చర్చించినట్లు తెలుస్తోంది. చదవండి: సీఎం జగన్ స్పీచ్ ప్రారంభం కాగానే.. ఇందులో భాగంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలో టిక్కెట్ల కేటాయింపుపై మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్రెడ్డితో చంద్రబాబు చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాలలో వైఎస్సార్, కర్నూలు మొదటిస్థానంలో ఉన్నాయి. జిల్లాలో 2004 నుంచి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా గెలిచిన ఎమ్మెల్యే సీట్లు కేవలం నాలుగు మాత్రమే. గత ఎన్నికల్లో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. ఆ పార్టీ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితాలే తప్పవని తేలినట్లు తెలుస్తోంది. దీంతో మార్పులు, చేర్పులపై చర్చించి నియోజకవర్గాలకు బాధ్యులను నియమించి పూర్తి స్వేచ్ఛ ఇస్తే బాగుంటుందని చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యేగా పోటీచేసే యోచనలో కోట్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల్లో కర్నూలు పార్లమెంట్ స్థానంలో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి తిరుగులేని నేత. తమకు పార్టీ బలం కాదని, పార్టీకి తామే బలమనే యోచనలో ఆయన ఉండేవారు. 2014లో కాంగ్రెస్, 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన కోట్ల ప్రస్తుతం ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. రెండు దఫాలుగా ఓటమి ఎదురవడంతో స్వతహాగా తనకు గెలిచే శక్తి లేదని, పార్టీ బలం కీలకమనే వాస్తవంలోకి వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2024లో కూడా కర్నూలు పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఉంటుందని గ్రహించారు. అత్యధిక అసెంబ్లీ సీట్లు ఆపార్టీ గెలుస్తుందనే నిర్ణయానికి వచ్చారు. పైగా టీడీపీ 40ఏళ్ల చరిత్రలో 1984లో ఏరాసు అయ్యపురెడ్డి, 1999లో కేఈ కృష్ణమూర్తి మినహా కర్నూలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. 2004 నుంచి జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పలేదు. ఈ క్రమంలో ఎంపీగా పోటీచేస్తే ఓటమి తప్పదని, అదే జరిగితే రాజకీయంగా ఇక శుభం కార్డు పడినట్లే అని కోట్ల ఆత్మరక్షణలో పడ్డారు. అసెంబ్లీకి పోటీచేస్తే కనీసం నియోజకవర్గంపై శ్రద్ధపెట్టి గెలిచేందుకు ప్రయతి్నంచొచ్చని ఎమ్మిగనూరు బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. కుటుంబానికి ఒకే టిక్కెట్ కోటాలో సుజాతమ్మ ఔట్ కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తామనే నిర్ణయాన్ని టీడీపీ అమలు చేస్తే కోట్ల సుజాతమ్మ ఆలూరు నుంచి తప్పుకోక తప్పదు. ఇప్పటికే ఆలూరు టిక్కెట్ రేసులో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, వీరభద్రగౌడ్ కూడా ఉన్నారు. వీరితో పాటు వైకుంఠం మల్లికార్జున చౌదరి కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గాలు బోయ, కురబ. ఈ క్రమంలో బోయ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని టీడీపీ భావిస్తే వీరిని కాదని చివరి నిమిషంలో కొత్త ముఖాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కర్నూలు టిక్కెట్ మైనార్టీలకే ఇచ్చే యోచన కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా టీజీ భరత్ ఉన్నారు. రాజకీయంగా చురుగ్గా లేకపోవడం, టీజీ వెంకటేశ్ బీజేపీలో, భరత్ టీడీపీలో ఉంటూ రాజకీయంగా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. పైగా వైఎస్సార్సీపీ కర్నూలులో అత్యంత బలంగా ఉంది. ఈ క్రమంలో టీజీ కుటుంబానికి టిక్కెట్ ఇస్తే ఓటమి తప్పదని, తాము కూడా మైనార్టీ నేతను బరిలోకి దింపితే కనీసం గట్టిపోటీ అయినా ఇవ్వగలమనే యోచనకు చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది. డీసీసీ మాజీ అధ్యక్షుడు అహమ్మద్ అలీఖాన్ను కర్నూలు బరిలో నిలిపేందుకు దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కోట్ల చొరవతోనే అహమ్మద్ అలీఖాన్ కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేశారని తెలిసింది. ఈ క్రమంలో ఐదునెలల కిందట కర్నూలు అసెంబ్లీ సీటుపై చంద్రబాబుతో జరిగిన సమీక్షలో భరత్ ఈ విషయాన్ని ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నుంచి భరోసా రాలేదు. దీంతో భరత్ నిరాశగా వెనుదిరిగారు. టీజీ వెంకటేశ్ కూడా టీడీపీలో చేరితే అప్పుడు కర్నూలు ఎంపీ లేదా రాజ్యసభ ఇచ్చి, అసెంబ్లీ నుంచి పక్కనపెట్టే యోచనకు టీడీపీ వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మిగనూరు టీడీపీ వర్గాన్ని కలుపునేలా పావులు ఎమ్మిగనూరులో గత డిసెంబర్లో టీడీపీ కార్యాలయాన్ని కోట్ల ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేశారు. జయనాగేశ్వరరెడ్డి వ్యతిరేక వర్గీయులైన గోనెగండ్ల మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు పరమేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ రంగమునితో పాటు పలువురిని ఆహ్వానించారు. పైగా పార్టీ ఆదేశిస్తే ఎవ్వరైనా పోటీ చేయొచ్చని కోట్ల ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ లద్దగిరిలోని ఆయన నివాసానికి వచ్చేవారిలో అత్యధిక శాతం ఎమ్మిగనూరు నేతలు, కార్యకర్తలే ఉంటున్నారు. జయనాగేశ్వరరెడ్డి కూడా నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా హైదరాబాద్లో మకాం వేశారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో కోట్లనే బరిలోకి దిగుతారని ఎమ్మిగనూరులోని కీలక టీడీపీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. -
కోట్ల, కేఈ కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు
సాక్షి, కర్నూలు: ఎన్నికల్లో వరుస పరాజయాలను మూట కట్టుకుంటున్న తెలుగుదేశం పార్టీకి జిల్లాలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. బలమైన వైఎస్సార్సీపీని ఎదుర్కొనలేక కుదేలైన టీడీపీ లో తాజాగా ఆ పార్టీ నేతల మధ్య నెలకొన్న అంతర్యుద్ధంతో ముసలం మొదలైంది. జిల్లా రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న కేఈ, కోట్ల కుటుంబాల మధ్య మళ్లీ ఆధిపత్యపోరు రగిలింది. కొన్ని దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న రెండు కుటుంబాలు.. రెండేళ్ల క్రితం టీడీపీ వేదికగా కలిసి పని చేసినా వైఎస్సార్సీపీ ప్రభంజనంతో ఘోర ఓటమి ఎదురైంది. తాజాగా రాజకీయ ఉనికిలో భాగంగా ఎవరికి వారు ఆధిపత్యపోరుతో సొంత పార్టీలోనే కుంపటి రగిల్చారు. ఈ పంచాయితీ ఏకంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లడం, ఇరువర్గాలకు ఆయన చేసిన సూచనలతో ఇటు కోట్లతో పాటు కేఈ వర్గం కూడా డీలా పడింది. ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా కోట్ల సుజాతమ్మ కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల అనంతరం కూడా పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఇటీవల కేఈ ప్రభాకర్ ఆలూరు నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. హాలహర్వి మండలం అమృతాపురం మారెమ్మ గుడిలో మొక్కు ఉందనే కారణంతో భారీగా టీడీపీ శ్రేణులకు విందు ఇచ్చారు. ఈ విందు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తల పరిచయ వేదికగా ప్రభాకర్ మలుచుకున్నారు. ఆపై దేవనకొండ మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆలూరుకు పదే పదే వస్తున్నారు. ఇక్కడి టిక్కెట్ ఆశిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నిస్తే ‘పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా!’ అని బదులిచ్చారు. దీంతో ఆలూరు టిక్కెట్ ఆశావహుల జాబితాలో తాను కూడా ఉన్నానని చెప్పకనే చెప్పినట్లయింది. ఆ తర్వాత కూడా ఈ నియోజకవర్గంలోని కీలక నేతలను పిలిపించుకుని మాట్లాడటం, వచ్చే ఎన్నికల్లో తాను ఆలూరు బరిలో ఉంటానని, అందరూ సహకరించాలని కోరుతున్నారు. కోట్ల కుటుంబానికి ఒక సీటే? కేఈ ప్రభాకర్ వ్యాఖ్యల నేపథ్యంలో సుజాతమ్మ చంద్రబాబును కలిశారు. జిల్లా రాజకీయ పరిస్థితులు వివరిస్తూ ఆలూరు అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆలూరులో జోక్యం చేసుకుంటున్నారని, పార్టీ తరఫున ఆయన జోక్యాన్ని అరికట్టేలా ఆదేశించాలని కోరినట్లు తెలిసింది. దీనికి చంద్రబాబు బదులిస్తూ ‘ఆలూరు కంటే మీకు డోన్ బాగుంటుందని, డోన్ బాధ్యత మీకు అప్పగిస్తా’నని చెప్పినట్లు సమాచారం. 2004లో డోన్ ఎమ్మెల్యేగా గెలిచావని, నియోజకవర్గంలో పరిచయాలు కూడా ఉన్నందున డోన్ బాగుంటుందని సూచించినట్లు తెలిసింది. అయితే ఎంపీగా తన భర్త కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి పోటీ చేస్తారు కాబట్టి, ఆలూరు అయితే పార్లమెంట్కు కూడా కలిసొస్తుందని చెప్పినా.. చంద్రబాబు ఆమె మాటను పెడచెవిన పెట్టి డోన్ను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆయన మాటల వెనుక వేరే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి కర్నూలు పార్లమెంట్ పరిధిలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కోట్ల కుటుంబానికి డోన్ ఇస్తే సూర్యప్రకాశ్రెడ్డి, సుజాతమ్మలో ఎవరు నిలబడినా పార్టీకి అభ్యంతరం లేదని, ఆ కుటుంబానికే ఒక సీటు మాత్రమే అనేది తేటతెల్లమవుతోంది. కేఈ ప్రతాప్కు టిక్కెట్టు లేనట్టే.. డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా 2014, 2019లో కేఈ ప్రతాప్ పోటీ చేశారు. 2014 ఎన్నికలకు ముందు వ్యాపారవేత్తగా ఉన్న ప్రతాప్ ఆర్థికంగా బాగా బలపడిన తర్వాత రాజకీయాలపై ఆసక్తి ఏర్పడి డోన్ టిక్కెట్ ఆశించారు. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తికి సోదరుడే కావడంతో ఆయన ప్రమేయంతో డోన్ టిక్కెట్ దక్కించుకున్నారు. అయితే రెండుసార్లు వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే 2024లో కోట్ల కుటుంబానికి డోన్ టిక్కెట్ ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉండటంతో ప్రతాప్కు టిక్కెట్టు దక్కనట్లేనని తెలుస్తోంది. నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం.. కేఈ, కోట్ల కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం నడుస్తోంది. కోట్ల విజయభాస్కర్రెడ్డి హయాం నుంచి కోట్ల కుటుంబం కాంగ్రెస్లో, కేఈ కుటుంబం టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగారు. వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఈ క్రమంలో సూర్యప్రకాశ్రెడ్డి రాజకీయ ప్రత్యామ్నాయం లేక విధిలేని పరిస్థితిలో టీడీపీలో చేరారు. దీంతో కేఈ, కోట్ల కుటుంబాలు ఒకేపార్టీ వేదికగా పనిచేయాల్సి వచ్చింది. అయితే రెండేళ్లలోనే తిరిగి రెండు కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. ఇప్పటికే జిల్లాలోని రెండు ఎంపీ, 14 అసెంబ్లీ స్థానాల్లో ఘోర ఓటమితో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. దీనికి తోడు అన్ని మునిసిపాలిటీలు, అన్ని మండల పరిషత్లతో పాటు జిల్లా పరిషత్ స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య రాజకీయ ప్రయాణం సాగిస్తోన్న తెలుగు తమ్ముళ్లకు కేఈ, కోట్ల కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆశించిన టిక్కెట్లు దక్కనపుడు రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీలో ఉంటూ, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని, అవి ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గత 20 ఏళ్లలో టీడీపీ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పెద్ద ఫలితాలు సాధించలేదని, కర్నూలు జిల్లాలో అత్యంత బలహీనంగా టీడీపీ ఉందని, ఎవరు ఏ స్థానం ఆశించినా, ఎలాంటి మార్పులు చేర్పులు జరిగినా ఫలితాల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
టీడీపీలో నాయకత్వ లేమి.. జిల్లాలో పూర్తి డీలా
తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? వరుస ఓటములతో పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన నేతలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారా? ఇప్పటికే కొందరు ఇతర రాజకీయ పార్టీలతో టచ్లోకి వెళ్లారా? 20 ఏళ్లుగా నాయకులకే దిక్కులేదు.. తమకేం భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలు కూడా పచ్చజెండాను వదిలేస్తున్నారా? జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. సార్వత్రిక సమరం తర్వాత నేతల వైఖరి, పార్టీ పరిస్థితి చూస్తే నాయకత్వ లేమితో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పాటు 20 ఏళ్లుగా జిల్లాలో పార్టీ పట్టు సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇంకెన్నేళ్లు ‘సైకిల్’పై ప్రయాణం చేసినా రాజకీయ లక్ష్యాన్ని చేరుకోలేమని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ∙ సాక్షి, కర్నూలు : రాయలసీమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. వైఎస్సార్ జిల్లా తర్వాత అత్యంత బలమైన నాయకత్వం, కేడర్ ఆ పార్టీ సొంతం. ఇదే క్రమంలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉండే జిల్లాల్లో కూడా వైఎస్సార్ జిల్లా తర్వాత కర్నూలే! గత 20 ఏళ్ల ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే టీడీపీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా ఉందన్న విషయం స్పష్టమవుతోంది. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో గత నాలుగు ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా గెలిచింది 2009 ఎన్నికల్లో మాత్రమే. అది కూడా నాలుగు స్థానాలే. తక్కిన మూడు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోరపరాభవం ఎదురైంది. ఈ ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ పరిస్థితి అట్టడుగుకు చేరింది. ఎన్నికల ఫలితాలు కొందరి రాజకీయ జీవితానికి ముగింపు పలకగా, మరికొందరు పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. జిల్లాలో టీడీపీ ఈ స్థాయిలో దెబ్బతినడానికి కారణం ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో పాటు నేతల తప్పులు కూడా కన్పిస్తున్నాయి. ఎన్నికలు ముగిసి ఐదు నెలలు దాటినా ఇప్పటి వరకూ కొంతమంది నేతలు చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మరికొంతమంది పార్టీ వీడి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. భూమా, కేఈ, కోట్ల కుటుంబాలు పూర్తిగా బలహీనపడటం, టీజీ వెంకటేశ్ లాంటి వ్యక్తులు స్వార్థరాజకీయాలతో రెండు పడవలపై ప్రయాణం చేస్తుండడంతో టీడీపీ భవిష్యత్తు అంధకారంగా మారింది. విశ్వాసం కోల్పోయిన కోట్ల సూర్యప్రకాశ్రెడ్డికి జిల్లాలో రాజకీయంగా గౌరవం ఉండేది. అయితే.. ఇటీవలి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరారు. ఈ పరిణామాన్ని కోట్ల వర్గంతో పాటు జిల్లా ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల్లో ప్రకాశ్రెడ్డితో పాటు ఆయన సతీమణి సుజాతమ్మను కూడా ఘోరంగా ఓడించారు. వారు కనీసం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఉంటే గౌరవం ఉండేది. కానీ కొన్నేళ్లుగా వైరం నడిపిన కేఈ కుటుంబం ప్రయాణిస్తున్న ‘సైకిల్’లోనే వీరు ఎక్కడంతో ప్రజల విశ్వాసం కోల్పోయారు. ఆయన వర్గంగా ఉన్న వారు కూడా ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఇప్పుడు కోట్ల కుటుంబం రాజకీయంగా చెల్లని కాసైపోయిందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. బలహీనపడిన ‘భూమా’, కేఈ వర్గాలు జిల్లా టీడీపీలో కేఈ కృష్ణమూర్తి, భూమా నాగిరెడ్డి బలమైన నేతలుగా ఉండేవారు. భూమా మృతితో కార్యకర్తలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు సైతం ఇతర పార్టీల్లో చేరారు. ముఖ్యంగా భూమా స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డి... అఖిల ప్రియతో విభేదించి తనవర్గాన్ని దూరంగా ఉంచారు. భూమా సోదరుడి కుమారుడు కిషోర్కుమార్రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి కూడా అఖిలతో విభేదించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. భూమా కుటుంబానికి బంధువైన శివరామిరెడ్డి కూడా అఖిలతో విభేదించారు. క్రషర్ విషయంలో అఖిల భర్తకు, శివరామిరెడ్డికి తలెత్తిన వివాదంతో ఇరువర్గాల మధ్య దూరం పెరిగింది. కుటుంబసభ్యులే ఆమెకు దూరం కావడం, రాజకీయంగా పరిణతి లేకపోవడంతో పాటు కుటుంబం కూడా టీడీపీ నుంచి పీఆర్పీ, ఆ తర్వాత వైఎస్సార్సీపీ, ఆపై తిరిగి టీడీపీలో చేరడంతో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది. మండల, గ్రామస్థాయి నేతలు కూడా వారికి దూరమవుతున్నారు. మరోవైపు ఎన్నికల ముందు టీడీపీలో చేరిన మాజీ ఎంపీ గంగుల ప్రతాప్రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలో టీడీపీ భవిష్యత్తు ఏంటో స్పష్టమవుతోంది. మరోవైపు మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి వయోభారంతో రాజకీయాల నుంచి నిష్క్రమించారు. గత ఐదేళ్లు టీడీపీలో కొనసాగినా, చంద్రబాబు కేఈకి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో తన కుమారుడిని కూడా టీడీపీని వీడి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్యాంబాబు పార్టీని వీడితే కేఈ ప్రభాకర్ కూడా అదే దారిలో నడిచే అవకాశం ఉంది. ఇదే జరిగితే డోన్, పత్తికొండలో టీడీపీకి గడ్డుకాలమే. ఆదోనిలో మీనాక్షినాయుడుకు వయసైపోవడంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే! ఇతర నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి పాణ్యం నియోజకవర్గంలో గౌరు చరిత కుటుంబం టీడీపీలో చేరడాన్ని సొంత వర్గీయులే జీర్ణించుకోలేకపోయారు. గతంలో టీడీపీ వైఖరితోనే గౌరు కుటుంబం దెబ్బతింది. అదే పార్టీలో చేరడంతో కేడర్కు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో చరిత, వెంకటరెడ్డి కొట్టుమిట్టాడుతున్నారు. టీడీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు కూడా ముగుస్తుందని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్రెడ్డి.. టీజీ ద్వారా బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక జిల్లా కేంద్రంలో టీజీ వెంకటేశ్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ తీర్థం పుచ్చుకునే టీజీ ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. తన కుమారుడిని మాత్రం టీడీపీలోనే కొనసాగిస్తున్నారు. వ్యాపార రంగంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకే టీజీ బీజేపీలో చేరారనేది బహిరంగ సత్యం. తండ్రీ కొడుకుల ‘డబుల్గేమ్’తో బీజేపీ, టీడీపీ ఇద్దరినీ విశ్వసించడం లేదు. ఇలా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ముందు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గస్థాయి నేతలు గత 20 ఏళ్ల ఫలితాలను బేరీజు వేసుకుని..మరో 20 ఏళ్లు టీడీపీతో ప్రయాణం చేసినా ఎమ్మెల్యేలం కాలేమని నిర్ధారణకు వస్తున్నారు. అందుకే ‘సైకిల్’ ప్రయాణాన్ని వీడి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement