-
17 రాష్ట్రాల్లో రూ. 150 కోట్లు దోచిన కోహ్లీ
హైదరాబాద్: నగరంలో రైస్ పుల్లింగ్ పేరుతో దొంగ బాబా కోహ్లీ ముఠా ఏకంగా 17 రాష్ట్రాల్లో రూ. 150 కోట్లు దోచింది. యురేనియం, ఇరిడియం లాంటి లోహాలను వెలికి తీస్తామని చెబుతూ డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా కోట్ల రూపాయల వరకు కుచ్చుటోపి పెట్టింది. ‘రైస్ పుల్లింగ్ పాత్రను ఇంట్లో ఉంచుకుంటే డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుందనీ, ఈ పాత్రను ఒక్కసారి కొనుగోలు చేస్తే ఏళ్ల తరబడి లక్ష్మీదేవి కనికరిస్తుంది. కనకవర్షం కురిపిస్తుంది’ అంటూ ప్రధాన నిందితుడు దొంగ బాబా కోహ్లి నమ్మబలికాడు. అతడి మాయమాటలను నమ్మిన జూబ్లీహిల్స్కు చెందిన దామోదర్రెడ్డి అనే వ్యక్తి అడ్డంగా మోసపోయాడు. దశలవారీగా రూ.4 కోట్లు ఆయన నుంచి కోహ్లీ బాబా వసూలు చేశాడు. దాంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసపోయిన వ్యక్తి డీజీపీ అనురాగ్శర్మకు ఫిర్యాదు చేయగా.. కేసును సీఐడీకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ ప్రత్యేక బృందం బెంగళూరులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిందితులు కోహ్లీ, గంగధారరెడ్డి, రమేష్ బాబు హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. -
సొమ్ముల ‘పుల్లింగ్’
- నగరంలో రైస్ పుల్లింగ్ పేరుతో ఇంకో దోపిడీ - రూ.4 కోట్లకు బురిడీ కొట్టించిన మరో దొంగ బాబా - డీజీపీ అనురాగ్ శర్మకు బాధితుడి ఫిర్యాదు - నిందితుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న సీఐడీ సాక్షి, హైదరాబాద్: ‘లైఫ్స్టైల్’ భవన యజమానిని 1.33 కోట్లకు బురిడీ కొట్టించిన దొంగ బాబా శివానంద ఉదంతాన్ని మరువకముందే.. ఇదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. శివానంద బాబా మాదిరిగానే రైస్ పుల్లింగ్ పేరుతో మరో దొంగ బాబా హైదరాబాద్లో డబ్బున్న వారికి టోకరా వేశారు. ఉత్తరాది నుంచి వచ్చి కర్నూలులో స్థిరపడిన కోహ్లి అనే దొంగ బాబా సుమారు రూ.4 కోట్లకు ఎసరు పెట్టినట్టు సమాచారం. మోసపోయిన వ్యక్తి డీజీపీ అనురాగ్శర్మకు ఫిర్యాదు చేయగా.. కేసును సీఐడీకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ ప్రత్యేక బృందం బెంగళూరులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రైస్ పుల్లింగ్తో లక్ష్మీ కటాక్షం: ‘రైస్ పుల్లింగ్ పాత్రను ఇంట్లో ఉంచుకుంటే డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది. ఈ పాత్రనుఒక్కసారి కొనుగోలు చేస్తే ఏళ్ల తరబడి లక్ష్మీదేవి కనికరిస్తుంది. కనకవర్షం కురిపిస్తుంది’ అంటూ దొంగ బాబా కోహ్లి చెప్పిన మాయ మాటలకు జూబ్లీహిల్స్కు చెందిన దామోదర్రెడ్డి అనే వ్యక్తి మోసపోయాడు. అతీత శక్తులున్న పాత్రను అందజేస్తామంటూ దశలవారీగా రూ.4 కోట్లు ఆయన నుంచి కోహ్లీ బాబా వసూలు చేశాడు. ఇటీవల శివానంద బాబా ఉదంతం వెలుగు చూడటంతో.. తాను కూడా మోసపోయినట్లు గుర్తించిన దామోదర్రెడ్డి డీజీపీ అనురాగ్శర్మను ఆశ్రయించారు. దీంతో కర్నూలుకు చెందిన కోహ్లి బాబా బెంగళూరు కేంద్రంగా చేస్తున్న రైస్ పుల్లింగ్ డ్రామాలు వెలుగుచూశాయి. దొంగబాబా ఉచ్చులో పడి మోసపోయిన బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే విచారిస్తామని సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా ‘సాక్షి’కి చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మహిళలు వ్యాపారాల్లో రాణించాలి
అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
సీత్యతండాలో అగ్ని ప్రమాదం
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
కాంగ్రెస్, బీఆర్ఎస్ను భూస్థాపితం చేయాలి
Lok sabha elections 2024: ఢిల్లీ గల్లీలు...ఎవరివో!
దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
సరెండర్ చేసినా కుర్చీ వదలరు
బైక్తో సహా బావిలో పడి రైతు మృతి
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement