-
అరుదైన శస్త్రచికిత్స... చచ్చుబడిపోయిన కాళ్లు యథాస్థితికి
సాక్షి, విశాఖపట్నం: ఏ కారణం లేకుండా చిన్న వయసులోనే 11 ఏళ్ల పాపకు చచ్చుబడిపోయి వంకరైన కాళ్లను ‘టెండన్ ట్రాన్సఫర్’ ఆపరేషన్ ప్రక్రియ ద్వారా తిరిగి యథాస్థితికి తీసుకొచ్చారు కేజీహెచ్ వైద్యులు. ప్లాస్టిక్ సర్జన్ హెచ్వోడీ, ఆంధ్ర మెడికల్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్ ఆధ్వర్యంలో ఈ శస్త్ర చికిత్స విజయవంతమైంది. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం సూరపురాజుపేటకు చెందిన 11 ఏళ్ల బంగారు యశోదకు చిన్న వయస్సులోనే కుడి కాలు నరాలు చచ్చుబడిపోయి వంకరగా మారిపోయింది. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 5న కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జన్ హెచ్వోడీ డాక్టర్ పి.వి.సుధాకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన డాక్టర్ విజయకుమార్తో కలిసి డిసెంబర్ 6న సర్జరీ చేశారు. ఇలాంటి ‘టెండన్ ట్రాన్స్ఫర్’ సర్జరీ ప్రక్రియ పూర్తయిన తర్వాత 30 నుంచి 35 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరిపీ చికిత్స అందించాలి. అందులో భాగంగానే ఫిజియోథెరిపీ చికిత్స పూర్తయిన తర్వాత గురువారం నాటికి పూర్తి స్థాయిలో రికవరీ అయినట్లు డాక్టర్ పి.వి.సుధాకర్ వెల్లడించారు. ఇలాంటి చికిత్సలు అరుదుగా విజయవంతమవుతాయని ఆయన పేర్కొన్నారు. -
రెండు రోజుల్లో పుట్టిన రోజు.. ఈ చిరునవ్వులు రాలిపోయాయి
ఆ చిరునవ్వులు ఇక లేవు..మృత్యుఒడిలో మాయమైపోయాయి. నిత్యం చలాకీగా సందడి చేసే ఆ నవ్వుల పూదోట వాడిపోయింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ ఇంట్లో విషాదం నింపింది. నేను లేని లోకంలో నిను చూసేది ఎవరు అనుకుందో ఏమో ఆ తల్లి తన కంటిపాపనూ తీసుకుపోయింది. సాక్షి,విశాఖపట్నం: కుటుంబ కలహా లతో వివాహిత రెండేళ్ల కుమారుడితో సహా అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గాజువాక ఎస్ఐ సూర్యప్రకాశరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన సంతోష్ బెహరా న్యూ పోర్టులో డెలివరీ విభాగంలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య జయంతి బెహరా(26), కుమారుడు రోనిత్ కుమార్ (2)తో కలిసి చుక్కవానిపాలెంలోని సువర్ణ శ్రీనివాసం అపార్ట్మెంట్లో రెండేళ్లుగా అద్దెకు నివాసం ఉంటున్నారు. రెండు రోజుల్లో వారి కుమారుడు రోనిత్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవలసి ఉంది. ఈ వేడుకలపై భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకోవడంతో గొడవలు జరగుతున్నాయని వారి బంధువులు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం జయంతి బెహరా తన కుమారుడిని తీసుకొని అపార్ట్మెంట్ పైకి వెళ్లి అక్కడ నుంచి దూకేసింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న రోనిత్ కుమార్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో సంతోష్ బెహరా విధుల్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభం’
సాక్షి, విశాఖపట్నం : విశాఖ కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కాలేజీల్లో కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభం అయినట్లు కేజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శనివారం సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. కేజీహెచ్తో పాటు మరో 17 చోట్ల క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామన్నారు. విశాఖ కేజీహెచ్లో 100 మందిపై క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని వెల్లడించారు.చదవండి: కరోనా సోకిందనడానికి ఈ లక్షణాలే ఆధారం ‘నిన్నటి నుంచి క్లినికల్ ట్రయల్స్ వలంటీర్లు ఎంపిక ప్రారంభించాం. మొదట 10 మంది ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉన్నవారు. 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనవచ్చు. సోమవారం నుంచి తొలి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్కు సిద్ధం అవుతున్నాం. మొత్తం అయిదు దశల్లో క్లినికల్ ట్రయల్స్ వ్యాక్షిన్ ఇచ్చి, వారి రక్త నమూనాలు నమోదు చేస్తాం. ఆరు నెలలు పాటు ఎంపికైన 100మందిలో 75 మందికి వ్యాక్సిన్ ఇస్తాము. ఆ తర్వాత సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు శాంపిల్స్ అన్ని పంపిస్తాము’. అని డాక్టర్ సుధాకర్ తెలిపారు.చదవండి:శిల్పారామాలకు పరిపాలనా అనుమతులు జారీ) -
‘నేను ఎలా బతికానో నాకే అర్థం కావడం లేదు’
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో చోటుచేసుకున్న విషవాయువు దుర్ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక ఎల్జీ పాలిమర్స్ నుంచి ప్రమాదవశాత్తు లీకైన విషవాయువు పీల్చి చుట్టుపక్కల ఉండే ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. తమని తాము కాపాడుకోవడానికి అనేకమంది రోడ్ల పైకి పరుగులు తీసుకుంటూ వచ్చారు. చాలా మంది ఈ విషవాయువు ప్రభావంతో స్పృహ తప్పి రోడ్డుపైనే పడిపోయారు. వారందరిని విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన జరిగిన సమయంలో తాము అనుభవించిన బాధను కొంత మంది బాధితులు పంచుకున్నారు. (గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన సీఎం జగన్) ‘నేను చనిపోతా అనుకున్నాను. నేను ఎలా బతికానో నాకే అర్థం కావడం లేదు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కాలేదు. అందరు తమ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి రోడ్లపైకి పరుగులు తీశారు. చాలా మందిని చికిత్స కోసం కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు’ అని విశాఖ గ్యాస్ లీకేజీ నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఒక మహిళ తెలిపింది. మరో బాధితురాలు మాట్లాడుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో పిల్లలు తాను నిద్రలేచామని, చూసేటప్పటికి పరిస్థితి అంతా అమోయమంగా ఉందని తెలిపింది. ఆ గందరగోళంలో పిల్లలు తన నుంచి తప్పిపోయారని, తరువాత స్పృహ కోల్పొయానని తెలిపింది. కళ్లు తెరిచే సరికి ఆసుపత్రిలో ఉన్నాని, ఇద్దరు పిల్లలు కూడా ఆసుపత్రిలో కోలుకుంటున్నారని తెలిపింది. (ఏంటిదా గ్యాస్.. పీల్చితే ఏమవుతుంది?) ‘మాకు ఒకరకమైన వాసన వచ్చింది. మాకు మంటలు కూడా కనిపించాయి. ఆ సమయంలో మాకు కడుపుతో తిప్పినట్లు అనిపించి వాంతులు కూడా అయ్యాయి. అసలు ఆ సమయంలో ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాలేదు. తరువాత మేం హాస్పటల్కి చేరుకన్నాం’ అని మరో భాదితులు తెలిపారు. అయితే అక్కడ ఉన్నవారిని అప్రమత్తం చేయడానికి సైరన్ను మ్రోగించడంతో అందరూ రోడ్లపైకి వచ్చేశారు. దీని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు కాల్వలో పడి మృతి చెందారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసు, ప్రభుత్వ సిబ్బంది ఆంబులెన్స్ల ద్వారా చాలా మందిని ఆసుపత్రికి తరలించారు. ప్లాంట్కి దగ్గరలో ఉన్న ఐదు గ్రామలపై ఈ గ్యాస్ ప్రభావం అధికంగా పడింది. (మృత్యుపాశమై వెంటాడిన విషవాయువు) -
ఇదీ అసలు కథ
సాక్షి, విశాఖపట్నం: పోలీస్ బాస్ ఏం చెప్పారో అవే మాటలు నిందితుడు శ్రీనివాసరావు నోటి వెంట చెప్పించేందుకు ‘సిట్’ బృందం తమదైన పాత్ర పోషిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఆసుపత్రికి తీసుకెళ్లే ముందురోజు ఎవరికంటా పడకుండా రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి పోలీస్ శైలిలో కోటింగ్ ఇచ్చి తాము చెప్పినట్లే మీడియాకు చెప్పాలని కోచింగ్ ఇచ్చినట్లు తెలిసింది. కస్టడీకి తీసుకున్న మూడోరోజు ప్రైవేటు వైద్యుడు సూచించాడంటూ కేజీహెచ్కు తరలిస్తూ హైడ్రామా ఆడారు. పోలీస్స్టేషన్ లోపలినుంచి గుమ్మం వరకు తనంతట తానుగా నడిచి వచ్చిన అతడు ఉన్నట్టుండి కూలబడి పోయాడు. ('పిచ్చి’ కుట్రలు) పోలీసులు రెండు చేతులు పట్టుకుని జీపు ఎక్కించడం.. ఆ వెంటనే నేను ప్రజలతో మాట్లాడాలి.. అంటూ అతను కేకలు వేయడం.. అక్కడనుంచి మీడియాను ఏమారుస్తూ కేజీహెచ్కు తరలించడం. అక్కడ అతనితో మీడియాకు చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. తాను జగన్ అభిమానని, జగన్ కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని, అతనితో పోలీసులు చెప్పించేందుకు విఫల యత్నం చేశారు. చివరకు తనకు ప్రాణహాని ఉందని, తనను చంపి రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. (‘బాస్’ల నివేదిక సిద్ధం) వెలుగులోకి వచ్చిన హైడ్రామా... ఈ కథ వెనుక పోలీసులు ఆడిన హైడ్రామా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి సీపీ మహేష్ చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడిన తర్వాత మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా నిందితుణ్ని గాజువాక సబ్ డివిజన్ పరిధిలోని ఓ మారుమూల పోలీస్ స్టేషన్కు తరలించారు. తెల్లవారు జామువరకు పోలీసులు తమదైన శైలిలో కోటింగ్, కోచింగ్ ఇచ్చి ‘రేపు కేజీహెచ్కు తీసుకెళ్తాం.. మీడియాకు మేము చెప్పినట్టు చెప్పు’ అంటూ ఒత్తిడి తీసుకొచ్చారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. (జగన్ను చంపేయాలనుకున్నా) మీడియా వెళ్లిపోయిన తర్వాత వేరే పోలీస్ స్టేషన్కు తరలించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న తలెత్తగా... కస్టడీకి ఇచ్చే సమయంలో కోర్టు నిబంధనల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే విచారణ సాగించాలి. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే అతని కదలికలు పూర్తిగా రికార్డు చేయాల్సి ఉంది. ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్లో కూడా కెమెరాల పర్యవేక్షణలోనే విచారణ సాగిస్తున్నారు. ఇక్కడ తమదైన శైలిలో నిందితుడిపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో అర్ధరాత్రి తర్వాత లైట్లన్నీ ఆర్పేసి ఆ తర్వాత నిందితుడ్ని వేరే స్టేషన్కు తీసుకెళ్లి మరీ తమ బాస్ చెప్పిన ఆ నాలుగు మాటలు చెప్పించేందుకు లాఠీలకు పని చెప్పారని చెబుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement