-
వృద్ధురాలి ఆత్మహత్య
గార్లదిన్నె : మండలంలోని ఎం.కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఓ వృద్ధురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. కేశమ్మ(75) అనే వృద్ధురాలు గత కొంత కాలంగా మోకాళ్ల నొప్పి, అనారోగ్యంతో బాధపడుతుండేది. పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా నయం కాకపోవడంతో కుటుంబసభ్యులతో రోజూ మధనపడుతుండేది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త చెన్నారెడ్డి, కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రదీప్కుమార్ తెలిపారు. -
కటిక పేదరికంలోనూ వీడని దురదృష్టం!
►దాతలూ ఆదుకోరూ... ► గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కుమార్తె ► తట్టుకోలేక కుప్పకూలి మృతి చెందిన తండ్రి ► చందాలతో చికిత్స చేయిస్తున్న గ్రామస్తులు మందస: చిన్నతనం నుంచీ కూతురిని ప్రేమగా పెంచాడు. అయితే పేదరికం కారణంగా వివాహం జరిపించలేకపోయాడు. భార్య మరణంతో మరింత కుంగిపోయిన ఆశలన్నీ కూతురిపైనే పెట్టుకున్నారు. ఓ వైపు పేదరికం పట్టిపీడిస్తున్న ఆ కుటుంబాన్ని మరోవైపు దురదృష్టం వెంటాడింది. హఠాత్తుగా కుమార్తె గుండెపోటుతో ఆస్పత్రి పాలవగా..విషయం తెలిసిన ఆ తండ్రి కుప్పకూలి కన్నుమూశాడు. ఈ సంఘటన మండలంలోని డిమిరియా గ్రామంలో చోటుచేసుకుంది. కుమార్తెకు తండ్రి మరణ వార్త తెలియజేయకుండా గ్రామస్తులు జాగ్రత్తలు పడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...గ్రామానికి చెందిన డంకూరు రాములు(65) వృత్తిరీత్యా రజకుడు. ఆయన భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. వీరికి కేశమ్మ, ఇద్దరు కుమారులున్నారు. కుమారులు బతుకుదెరువు కోసం వలసపోయారు. రాములు తన కుమార్తెతో కలసి గ్రామంలోనే ఓ పూరిగుడిసెలో నివాసం ఉండే వారు. కుమార్తెకు పెళ్లీడు వచ్చినప్పటికి పెళ్లి చేసే స్తోమత లేకపోవడంతో అవివాహితగానే ఉండిపోయింది. ఆమె కొన్నాళ్ల క్రితం నుంచి వెలుగు కార్యాలయంలో సీసీగా పని చేస్తున్నారు. కాయకష్టంపై ఆధారపడి జీవిస్తున్న సమయంలో దురదృష్టం వారిని వెంటాడింది. కేశమ్మ మూడు రోజుల క్రితం హఠాత్తుగా గుండెపోటుకు గురవడంతో గ్రామస్తులు 108లో కాశీబుగ్గలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి, చందాలు వేసుకుని ఆమెకు చికిత్స చేయిస్తున్నారు. ఆ సమయంలో తండ్రి రాములు కూలి పనికోసం వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి విషయం తెలిసి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే ఊపిరి వదిలేశాడు. దీంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. దాతలసాయం కోసం ఎదురు చూపు నిరుపేద కుటుంబానికి చెందిన కేశమ్మ గ్రామస్తుల సహకారంతో ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమెకు విశాఖపట్నంలోని ఓ పెద్ద ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించాలని, అందుకు సుమారు రూ.3లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో తెలియక గ్రామస్తులు, బంధువులు విలపిస్తున్నారు. సహృదయం గల దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిండు జీవితం ప్రసాదించాలని కేశమ్మ కోరుతోంది. దాతలు 9866386936 సెల్ నంబర్ను సంప్రదించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement