-
మార్కెట్ వద్ద బాంబు పేలి 10 మంది మృతి
అబుజా: మరోసారి నైజీరియా రక్తంతో తడిసి ముద్దయ్యింది. సోమవారం మధ్యాహ్నం బార్నో రాజధాని మైదుగురి నగర మార్కెట్లో బాంబు పేలి 10 మంది మృత్యువాత పడ్డారు. వరుసగా రెండు బాంబు దాడులు సంభవించడంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన బార్నోఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో పది మందికి పైగా మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలైయ్యాయి. గతవారం ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించి 35 మంది వరకూ మరణించిన సంగతి తెలిసిందే. స్థానికంగా స్థావరాలు ఏర్పరుచుకున్న ఒక ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపు వరుసగా ఆత్మాహుతి దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ టెర్రరిస్టులు జరిపిన దాడుల్లో మూడు వేల మందికి పైగా మృతి చెందారని బార్నో అధికారులు తెలిపారు. -
మసీదు వద్ద పేలుళ్లు : 35 మంది మృతి
అబూజా : ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 35 మంది మరణించగా... 150 మంది గాయపడ్డారని నగర పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ప్రారంభమయ్యే సమయంలో ఆగంతకులు మసీదు వద్ద కాల్పులు జరిపి పరారయ్యారని చెప్పారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారని.... ఆ వెంటనే పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు. ఈ పేలుళ్లకు బాధ్యులం తామేనంటూ ఇంత వరకు ఎవరు ప్రకటించలేదని చెప్పారు. నైజీరియాలోని బోకోహరామ్ తీవ్రవాదులే ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్నామని చెప్పారు. ఈ సంస్థ ఏడాది జరిపిన విధ్వంసంలో దాదాపు 3 వేలమందికి పైగా మరణించారని పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము వెల్లడించారు. -
నైజీరియాలో వంద మందిపైగా ఊచకోత
కానో: నైజీరియాలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు.ఈశాన్య నైజీరియా బోర్నో రాష్ట్రంలో క్రై స్తవులు అధికంగా ఉండే ఇఘే గ్రామంపై దాడిచేసి దాదాపు వంద మందిని ఊచకోత కోశారు. శనివారం రాత్రి ఆరు ట్రక్కులు, ద్విచక్ర వాహనాలపై ఆయుధాలతో సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బార్నాబాస్ అనే రైతు వెల్లడించారు. ఈ ఘటనతో భీతిల్లిన చాలామంది గ్రామస్తులు ఇళ్లను వదలి పారిపోయారు. ఆ దుండగులు బోకో హరామ్ ఇస్లామిస్ట్ బోకో హరామ్కు చెందినవారుగా అనుమానిస్తున్నట్లు స్థానిక సెనేటర్ అలీ డుమె ఏఎఫ్పీ వార్తాసంస్థకు వెల్లడించారు. 60 మంది మతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని, మిగతావాటికి చేయాల్సి ఉందని చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement