-
ఆకట్టుకోని పురాణం అతకని అబద్ధం
చీపురుపల్లి: అబద్ధం ఆడితే అతికినట్లు..పురాణం చెప్తే ఆకట్టుకునేలా ఉండాలంటారు. ఇదే తరహాలో ఎన్నికల ప్రచారంలో శతవిధాలా ప్రయత్నిస్తున్న చీపురుపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీకి చెందిన కళా వెంకటరావు తీరును చూస్తూ ఆయన చెబుతున్న అబద్ధాలు వింటూ సొంత పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు నవ్వుకుంటున్నారు. నోటికొచ్చిన అబద్ధం చెప్పడం ప్రజలను మోసం చేసి మభ్యపెట్టడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అనుకుంటారు అంతా. ఎందుకంటే సాక్షాత్తు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడే పూటకో అబద్ధం, రోజుకో మోసం అనే చందాన తొలి నుంచి రాజకీయాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటున్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఆ పార్టీ నేతలు మన బాస్ ఇష్టారాజ్యం అబద్ధాలు చెబుతున్నప్పుడు మనం చెప్తే ఏముందిలే అనుకుంటున్నారేమో గాని చంద్రబాబునే డిటోగా ఫాలో అయిపోతున్నారు. అందులో భాగంగానే చీపురుపల్లి కూటమి అభ్యర్థిగా కొత్తగా నియోజకవర్గానికి వచ్చిన కిమిడి కళా వెంకటరావు కూడా మద్యపాన నిషేధం, డ్వాక్రా రుణమాఫీ, తోటపల్లి సాగునీటి కాలువ కోసం అబద్ధాలే ప్రచార అస్త్రాలుగా ప్రతి రోజూ ప్రజలను మభ్యపెట్టే ప్రక్రియ ప్రారంభించారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అసలు ఇక్కడి ప్రజలకు ఏమీ తెలియదన్నట్లు, రెండు దశాబ్దాల క్రితంలో మాదిరిగా ఏం చెప్పినా పర్లేదునుకుంటున్నారేమో గానీ మరీ అబద్ధాలు చెప్పేస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఎంతో విజ్ఞత కలిగిన ఓటర్లు ఉన్న చీపురుపల్లిలో ఇలాంటి పుక్కిటి పురాణాలు ఎవరూ నమ్మరని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నట్లు సమాచారం. మద్యపాన నిషేధం ఎత్తేసి, మంచి లిక్కర్ ఇస్తామంటూ.. పేదలకు మద్యం దూరం చేయాలన్న లక్ష్యంతో టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం విధించారు. ఆ తరువాత ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కుని ము ఖ్యమంత్రి అయిన చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసిన సంగతి అందరికీ గుర్తుంది. మూడుశాబ్దాల క్రితం నుంచి మద్యం తాగించి పేదల ప్రాణాలు తోడేస్తున్నది చంద్రబాబేనని మద్యపాన నిషేదం కోసం మాట్లాడే అర్హత బాబుకు ఎక్కడుందంటూ చర్చ జరుగుతోంది. అంతేకాకుండా మరొకడుగు ముందుకేసి గత కొంతకాలంగా నాణ్యమైన లిక్కర్ ఇస్తానని చంద్రబాబు బహిరంగ సభల్లో ప్రకటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మద్యంలో కూడా మంచి, చెడు రకాలు ఉన్నాయా అంటూ కొత్త అర్థాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు మరోవైపు మద్యపాన నిషేధం కోసం మాట్లాడుతుండడం, ఆ విషయాన్ని ఇక్కడ కళా వెంకటరావు ప్రజలపై రుద్దేందుకు చేస్తున్న కృషి చూస్తుంటే విడ్డూరంగా ఉందని అంతా అనుకుంటున్నారు. వైఎస్సార్ హయాంలోనే తోటపల్లి సాకారం.. తోటపల్లి కోసం టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. తోటపల్లి ప్రాజెక్టు కోసం కేటాయించిన నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించి ప్రాజెక్టు పనులు నిలిపివేశారు. అదే 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత మహానేత వైఎస్సార్ రూ.400 కోట్లు నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసుకోవాలని రైతులు అంటున్నారు. 2009లో మహానేత మరణ సమయానికి 90 శాతం పనులు కూడా పూర్తయిన సంగతి అందరికీ తెలిసిందే. మహిళలను మోసం చేసింది చంద్రబాబు.. మహిళలను జగన్మోహన్రెడ్డి మోసం చేశాడని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న నేపథ్యంలో మహిళలను మోసం చేసింది చంద్రబాబు కదా అంటూ నవ్వుకుంటున్నారు. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, అప్పులు తీర్చొద్దని మహిళలకు మాట ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీ ఊసెత్తని చంద్రబాబు మహిళలను మోసం చేశాడు. అదే 2019 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు విడతల్లో మహిళల రుణాలను పూర్తిస్థాయిలో వారి ఖాతాల్లోనే జమ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. -
‘నా టికెట్ను తన్నుకుపోయారు’.. కిమిడి నాగార్జున కన్నీళ్లు
సాక్షి, విజయనగరం: చీపురుపల్లి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. చీపురుపల్లి టికెట్ ఆశించి కిమిడి నాగార్జున భంగపడ్డారు. పెద్దనాన్న కళా వెంకట్రావుకు చాలా అవకాశాలు ఉన్నాయని.. అయిన సరే తన టికెట్ను తన్నుకుపోయారంటూ చీపురుపల్లి క్యాడర్ వద్ద కన్నీటి పర్యంతం అయ్యారు. తన జీవితం చెడిందని.. యువత ఎవరూ రాజకీయాల్లోకి రావద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి విదేశాల్లో ఉద్యోగం వదులుకొని వచ్చేసి 2019 ఎన్నికల్లో పోటీచేసిన కళా వెంకటరావు సోదరుడి కుమారుడు నాగార్జునకు ఓటమి తప్పలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో తుడిచిపెట్టుకుపోయింది. అలాంటి పరిస్థితుల్లో జిల్లాలో పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు సహా ఎవ్వరూ ముందుకురాన్నప్పుడు నాగార్జున భుజానికెత్తుకున్నారు. ఐదేళ్లూ అడపాదడపా కార్యక్రమాలతో టీడీపీ ఉనికి చాటుతూ వచ్చారు. ఈసారి చీపురుపల్లి నుంచి పోటీచేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చంద్రబాబు ఆయన్ను కరివేపాకులా తీసిపడేశారు. తనను నమ్మించి గొంతు కోశారని, నిలువునా మోసం చేశారని నాగార్జున లబోదిబోమంటున్నారు. -
పాపం.. కళావెంకటరావు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకప్పుడు చక్రం తిప్పింది ఆయనేనా? అనే సందేహం కళా అనుచరులను వెంటాడుతోంది ఇప్పుడు! గ్రామస్థాయి నాయకుడైన నడికుదిటి ఈశ్వరరావు (ఎన్ఈఆర్) టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించి మరీ ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి టికెట్ను తన్నుకుపోయారు. అతనికి ఇప్పించేందుకు చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆడిన రాజకీయ వైకుంఠపాళిలో కళా పావుగా మారిపోయారని ‘సాక్షి’ ఇప్పటికే వెలుగులోకి తెచ్చింది. ఆఖరి నిమిషంలో కళా తేరుకొని హైదరాబాద్, విజయవాడ మధ్య చక్కర్లు కొట్టినా వ్యయప్రయాసలు మాత్రమే మిగిలాయి. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఈశ్వరరావు పేరును బీజేపీ బుధవారం ప్రకటించింది. తూర్పు కాపు (బీసీ) సామాజికవర్గ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గంలో ‘కమ్మ’ని వ్యూహం ఫలించింది. టీడీపీలో మరో సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు వద్దు వద్దంటున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కటే కళావెంకటరావు ముందు కనిపిస్తోంది. కుటుంబ హెచ్చరికలను బేఖాతరు చేసి అక్కడికి వెళ్తారా అనేదీ సందేహమే. ఇక మిగిలిన మరో దారి విజయనగరం లోక్సభ టిక్కెట్ మాత్రమే. తీరా అక్కడ ఐవీఆర్ఎస్ సర్వేల్లోనూ కళావెంకటరావు వినిపించట్లేదు. దీన్నిబట్టి అక్కడా టికెట్ వచ్చేట్లు కనిపించట్లేదు. పాపం... కళావెంకటరావు! ఆయన పరిస్థితి కరివేపాకు కన్నా అధ్వానంగా అయిపోయిందని ఆయన అనుచరులు చంద్రబాబుపై లోలోనే రగిలిపోతున్నారు. -
వచ్చే ఎన్నికల్లో తేడా వచ్చినా... తట్టుకోలేం
నర్సీపట్నం/మాకవరపాలెం: వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం తేడా జరిగిన పులి పంజాను ఏమాత్రం తట్టుకోలేమని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి టీడీపీ మాజీ మంత్రి కళావెంకటరావు అన్నారు. టీడీపీ భవిష్యత్తు గ్యారంటీ చైతన్య యాత్రలో భాగంగా నర్సీపట్నంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారన్నారు. ఇప్పటి నుంచే పార్టీ విజయానికి శ్రమించాలని, ఏమాత్రం తేడా వచ్చినా పులి పంజాకు తట్టుకోలేమన్నారు. మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు ఉపన్యాసంలో ఎప్పుడు చెప్పే విషయాలే తప్ప కొత్తదనం లేదు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, బండారు సత్యనారాయణమూర్తి ఊకదంపుడు ఉన్యాసం చేశారు. టీడీపీ నేతలు బస్సు యాత్ర పేరుతో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. సభ నిండుగా కనిపించేందుకు ప్రైవేట్ స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. జనాలను నింపేందుకు టీడీపీ నేతలు నానాతంటాలు పడ్డారు. సమయానికి గ్యాలరీ నిండకపోవడంతో మీటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. వచ్చిన జనాలు సైతం సభ జరుగుతుండగానే జారుకున్నారు. అంతకు ముందు మాకవరపాలెం మండలంలోని శెట్టిపాలె, రాచపల్లి జంక్షన్ వద్ద బస్సు యాత్రజరిగింది. -
పెళ్లిలో కూడానా.. ఇదేమి ఖర్మరా బాబు..!
సాక్షి, శ్రీకాకుళం: ‘ఎన్నిసార్లు పార్టీ పరువు తీస్తారు కళా వెంకట్రావు? మీరు ఇంకా ఇన్చార్జిగా ఉండడం మా ఖర్మ! పెళ్లికి వెళ్లి పార్టీ ప్రోగ్రాం చేసే ఖర్మ తెలుగుదేశం ఇన్చార్జికి పట్టిందా? ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్నే వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా చిత్రీకరించి పార్టీలో చేర్చుకునే ఖర్మ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జికి పట్టిందా? 10 మందితో పేరుకి ప్రోగ్రామ్ చేస్తారా? కారులో నుంచి దిగి 5 నిమిషాలు స్టేజీ మీద ఉండి నాలుగు మాటలు మాట్లాడితే అదే ప్రోగ్రామా? కేశవరాయునిపాలెం గ్రామంలో మీరు ఇవాళ ఏం పని మీద వచ్చారు? ఏమి చేశారు? పెళ్లికి వచ్చిన బంధువులు, కార్యకర్తలతో కలిసి ఇదేమి ఖర్మ బ్యానర్ పెట్టి నాలుగు ఫోటోలు దిగితే ప్రోగ్రామ్ ఐపోయినట్టేనా? పార్టీ పరువు ఎన్ని విధాలుగా.. ఎన్ని సార్లు తీస్తారు?’ అంటూ సాక్షాత్తు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు చేస్తే ఆరోపణలు, విమర్శలవుతాయి. అదే సొంత పార్టీ కార్యకర్తలు.. అదీ పార్టీ కార్యక్రమంపైన ధ్వజమెత్తితే ఏమనుకోవాలో టీడీపీ మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావే చెప్పాలి. టీడీపీ సీనియర్ నేత, పొలిట్బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావును సొంత పార్టీ కార్యకర్తలే ఏకిపారేస్తున్నారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలతో ఏకంగా పార్టీ అప్రతిష్ట పాలవుతుందని తెలుగు తమ్ముళ్లు మండి పడుతున్నారు. ఎంతో సీనియరై ఉండి జూనియర్ కంటే దారుణమైన రీతిలో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. అక్కడా ఇక్కడా అని కాకుండా సోషల్ మీడియాలో, పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో కడిగి పారేస్తున్నారు. పెళ్లి వేడుకకు వచ్చిన నాయకులతో ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. లావేరు మండలం కేశవరాయునిపాలెంలో పార్టీ నాయకుడు నాయన శంకర్రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు కళా వెంకటరావు శుక్రవారం హాజరయ్యారు. మండల పార్టీ నాయకులతో కలిసి వధూవరులను ఆశీర్వదించారు. అయితే, అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమాన్ని అక్కడికక్కడే నిర్వహించారు. మరోసారి పిలుపిస్తే వచ్చే కొద్ది పాటి కార్యకర్తలు, నాయకులు హాజరవరనో.. పార్టీ కార్యక్రమాన్ని ప్రజలు విశ్వసించరనో గానీ అప్పటికప్పుడే బ్యానర్ పెట్టి కార్యక్రమాన్ని కానిచ్చేశారు. ఇప్పుడిదే టీడీపీలో చర్చనీయాంశమైంది. ప్రత్యర్థి పార్టీ విమర్శలు చేస్తే వేరు.. సాక్షాత్తు తోటి టీడీపీ కార్యకర్తలు, నాయకులు కళా వెంకటరావుపై భగ్గుమంటున్నారు. పాలఖండ్యాంలో పార్టీలో చేరికల పేరుతో టీడీపీ కార్యకర్తల్నే చేర్పించి సాధించిందేంటి? ఎచ్చెర్ల పార్టీ కార్యాలయంలో చేరికలు పేరుతో మీరు చేసిందేంటి? ఎన్నిసార్లు మీ తప్పులు మీకు ఎత్తి చూపించినా మారకపోతే ఏమనాలి? అని గట్టిగా నిలదీస్తున్నారు. మీ లాంటి వారిని మోయాల్సి రావడం నిజంగా మా ఖర్మ.. అంటూ సోషల్ మీడియా, పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో కళా తీరును కడిగిపారేస్తున్నారు. వాస్తవంగా టీడీపీకి, ఆయనకు జనాదరణ లేకపోవడంతో పెళ్లికొచ్చిన జనాలతో కార్యక్రమాన్ని చేసేద్దామనుకోవడం బూమ్రాంగైంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement