-
JJ Hospital: ఆస్పత్రిలో 132 ఏళ్ల నాటి సొరంగం
ఒక ఆస్పత్రి భవనం పునాది కింద 132 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి సొరంగం బయటపడింది. ఈ ఘటన ముంబైలోని బైకుల్లాలో చోటుచేసుకుంది. ముంబైలోని జేజే ఆస్పత్రి అండ్ గ్రాండ్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఈ టన్నెల్ని కనుగొన్నట్లు ఆస్పత్రి యజామాన్యం తెలిపింది. ప్రస్తుతం దీన్ని నర్సింగ్ కాలేజ్గా మార్చనున్నారు. కాలేజ్లో నీరు లీకేజీ అవుతుందంటూ ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టగా ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఆస్పత్రి 1890లో నిర్మించినట్లు పునాదిరాయిపై కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఈ మెడికల్ కాలేజ్ 1843 మార్చి 30న గ్రాండ్ మెడికల్ కాలేజ్ భవనానికి శంకు స్థాపన చేసినట్లు అధికారలు తెలిపారు. రెండేళ్లలోనే భవనం పూర్తి అయ్యి 1845లో ప్రారంభించబడినట్లు పేర్కొన్నారు. ఈ కాలేజీ వ్యవస్థాపకుడు సర్ జంషెట్జీ జేజీబోయ్ రూ లక్ష రూపాయ విరాళంతో స్కూల్ ఆఫ్ ప్రాక్టీస్ ఏకకాలంలో ఏర్పాటైందని చెప్పారు. ఒక వైద్యురాలు ఉపరితలంపై ఏర్పడిన రంధ్రం గురించి తెలుసుకునే క్రమంలో ఈ సోరంగం ఆచూకి బయటపడినట్లు తెలిపారు. ఈ సోరంగంపై తదుపరి దర్యాప్తు విషయమై కలెక్టర్ కార్యాలయానికి, పురావస్తు శాఖకు తెలియజేసి ప్రాథమిక వివరాలను నివేదించనున్నట్లు జేజే ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. (చదవండి: 21 రోజుల శిశువు కడుపులో ఎనిమిది పిండాలు) -
Covid-19: ప్రముఖ ఆస్పత్రిలో 61 మంది డాక్టర్లకు కరోనా
సాక్షి, ముంబై: నగరంలోని ప్రముఖ జేజే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 61 మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా సోకింది. ఈ విషయం స్వయంగా రెసిడెంట్ డాక్టర్ల సంఘం వెల్లడించింది. ఇప్పటికే ఈ ఆస్పత్రిలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనికి తోడు 61 మంది నివాస డాక్టర్లకు కరోనా సోకడంతో ఇంటికే పరిమితం కావల్సిన పరిస్ధితి వచ్చింది. ఇది ఆస్పత్రి వైద్య సేవలపై తీవ్రంగా ప్రభావం చూపే ఆస్కారముందని మార్డ్ అధ్యక్షుడు డా.అవినాశ్ దహిఫళే బుధవారం తెలిపారు. ఒకేరోజు, ఒకే ఆస్పత్రిలో ఇంత పెద్ద సంఖ్యలో డాక్టర్లకు కరోనా సోకడం కలకలం కలిగిస్తోంది. డాక్టర్ల కొరత కారణంగా ఇప్పటికే ఓపీడీ సేవలు సక్రమంగా సాగడం లేదు. చదవండి: (భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం..) గడచిన 24 గంటల్లో మొత్తం 120 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. మరికొంత మంది సైతం కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అవినాశ్ అభిప్రాయపడ్డారు. దీని ప్రభావం వార్డులో చికిత్స పొందుతున్న రోగులపై పడుతోందని చెబుతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇదివరకే అనేక మంది రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో తరుచూ ఆందో ళన, సమ్మెకు దిగుతున్నారు. ఫలితంగా అత్యవసర సేవలు మినహా ఇతర వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లలో కరోనా పాజిటివ్ ఇలాగే పెరిగితే పరిస్థితి వైద్య సేవలలో అంతరాయం చోటుచేసుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటికైనా వైద్య, విద్యా శాఖ, రీసర్చ్ డైరెక్టర్ల మండలి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అవినాశ్ డిమాండ్ చేస్తున్నారు. చదవండి: (Revenue Deficit: రూ.9,871 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం) -
వరవరరావును జేజే ఆస్పత్రికి తరలించేందుకు ఓకే!
ముంబై: ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన విప్లవ కవి వరవరరావును జేజే హాస్పటల్ ప్రిజన్ వార్డుకు తరలించేందుకు సుముఖంగా ఉన్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం వరవరరావు నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను డిశ్చార్జ్ చేయవచ్చని నానావతి హాస్పటల్ వర్గాలు గతవారం కోర్టుకు తెలిపాయి. డిశ్చార్జ్ అనంతరం ఆయన్ను నవీ ముంబైలోని తలోజా జైలుకు పంపాల్సిఉంటుంది. అయితే ఇందుకు బదులుగా ఆయన్ను జేజే హాస్పటల్ ప్రిజన్ వార్డుకు తరలించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ప్రభుత్వ న్యాయవాది దీపక్ ధాకరే చెప్పారు. అక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతుందని, ఆయన కుటుంబసభ్యులు ప్రొటోకాల్స్కు లోబడి ఆయన్ను కలవచ్చని చెప్పారు. తమ ప్రభుత్వం తరఫు ఈ సడలింపులకు ఓకేఅని, మిగిలిన అంశాలు ఎన్ఐఏ పరిధిలోనివని చెప్పారు. వరవరరావు పట్ల మానవీయ ధృక్పధాన్ని అవలంబించాలన్న కోర్టు సూచన మేరకు తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం ఎన్ఐఏ న్యాయవాది అనిల్ సింగ్ వాదిస్తూ, రావును జేజే ఆస్పత్రికి తరలించేందుకు సుముఖమన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అప్రస్తుతమైన అంశమని చెప్పారు. బెయిల్ ఇవ్వండి వరవరరావును బెయిల్పై విడుదల చేయాలని ఆయన భార్య తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. జైల్లో సరైన వైద్యసదుపాయం లేకుండా ఆయన్నుంచడం రావు ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. జైల్లో ఉన్నవారికి ఆరోగ్య సదుపాయాలు అందించకపోవడం క్రూరత్వమన్నారు. తలోజా జైల్లో ఉంటే ఆయన ఆరోగ్యం మరలా క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆయన పూర్తిగా కోలుకున్నట్లు నానావతి ఆస్పత్రి వర్గాలిచ్చిన రిపోర్టును న్యాయమూర్తులు గుర్తు చేశారు. డిశ్చార్జ్ అనంతరం జైల్లోకి మరలా వెళితే ఏమవుతుందో ఎవరూ చెప్పలేరని ఇందిరా వాదించారు. అందువల్ల కనీసం తాత్కాలిక ప్రాతిపదికనైనా ఆయనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే రావు బెయిల్కు ఎన్ఐఏ అభ్యంతరాలు చెప్పవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయన్ను హైదరాబాద్ పంపితే తిరిగి విప్లవ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని ఎన్ఐఏ అభ్యంతరం చెప్పవచ్చని తెలిపింది. ప్రభుత్వాన్ని పడదోయడానికి యత్నించారన్నదే ఆయనపై అభియోగమని గుర్తు చేసింది. తాము బెయిల్ అడుగుతున్నది ఆరోగ్యకారణాలపై కనుక, ఎన్ఐఏ అభ్యంతరాలు వర్తించవని, అలాగే ఆయనపై అభియోగాలు నిజం కాదని న్యాయవాది పేర్కొన్నారు. ప్రధాని హత్య గురించిన ఉత్తరం కనుగొన్నట్లు ఎన్ఐఏ చెబుతోందని, ఎవరైనా అలాంటి ఉత్తరాలు కంప్యూటర్లలో దాచుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ఇవన్నీ కట్టుకధలన్నారు. కావాలంటే కఠిన నిబంధనలతో కూడిన బెయిల్నైనా మంజూరు చేయాలని కోరారు. అయితే రావుకు అన్ని రకాల వైద్యసాయం అందించేందుకు తాము కృషి చేశామని ధర్మాసనం గుర్తు చేసింది. ఉపా చట్టం కింద అరెస్టయిన వారికి బెయిల్ ఇవ్వాలంటే పలు అభ్యంతరాలుంటాయని తెలిపింది. ఈ సందర్భంగా మానవహక్కులపై పలు డిక్లరేషన్లను ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు. రావు బెయిల్ పిటీషన్పై వాదనలు కొనసాగనున్నాయి. -
జేజే ఆస్పత్రికి వరవరరావు తరలింపు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ కవి వరవరరావును నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని వరవరరావు కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి వెల్లడించారు. పరీక్షల అనంతరం ఆస్పత్రిలో చేర్పిస్తారా.. లేదా? అని అనుమానం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించి, అమానుషంగా జైలులో దీర్ఘ కాలం నిర్బంధించిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాత్కాలిక బెయిల్ కోసం వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతోపాటు తన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్న దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది ఆర్.సత్యనారాయణ్ అయ్యర్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వరవరరావుకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ జూన్ 26న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఒక పిటిషన్, వరవరరావు మెడికల్ రికార్డులను అందజేసేలా నవీ ముంబైలోని తలోజా జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు. -
వరవరరావుకు అస్వస్థత!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉన్న విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు (80) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఆయనను నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వరవరరావు అనారోగ్య సమాచారాన్ని చిక్కపడపల్లి పోలీస్ స్టేషన్కు అందించినట్టు పుణె పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలు, ఎల్గార్ పరిషద్– మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో వరవరరావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, వరవరరావును ఉంచిన జైల్లోని కొందరు ఖైదీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో ఒక ఖైదీ మరణించినట్టు కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో 80 ఏళ్ల వృద్ధుడైన తమ తండ్రిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని వరవరరావు ముగ్గురు కూతుర్లు పి.సహజ, పి.అనల, పి.పవన మహారాష్ట్ర గవర్నర్కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తప్పుడు అభియోగాలతో తమ తండ్రిని జైల్లో వేశారని వాపోయారు. కొవిడ్-19 కారణంగా తలోజా జైలులో ఒక ఖైదీ మరణించాడన్న వార్త తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని లేఖలో వారు పేర్కొన్నారు. (చదవండి: జీవించే హక్కు వీరికి లేదా?)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
అకాల వర్షంతో ఆందోళన
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement