-
ఇకపై ఆ పని చేయను.. పక్కన బెట్టేస్తున్నా: హీరో ఆకాశ్
'ఆనందం' లాంటి సినిమాతో తెలుగులోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆకాశ్.. ఆ తర్వాత కాలంలో సరైన మూవీస్ చేయకపోవడంతో అలా అలా టాలీవుడ్కి దూరమైపోయాడు. గత ఏడెనిమిదేళ్ల నుంచి తమిళంలో మాత్రమే చిత్రాలు చేస్తున్నాడు. నటనతో పాటు దర్శక నిర్మాతగానూ పనిచేస్తున్నాడు. (ఇదీ చదవండి: కాంగ్రెస్ పార్టీలోకి హీరో అల్లు అర్జున్ మామ.. త్వరలో ఎన్నికల్లో పోటీ?) అయితే చిన్న చిత్రాలకు థియేటర్ల దొరక్కపోవడంతో తనే సొంతంగా 'ఏ క్యూబ్ మూవీస్' అనే యాప్ లాంచ్ చేశాడు. తన సినిమాలతో పాటు పలు చిన్న చిత్రాల్ని ఇందులో రిలీజ్ చేస్తున్నాడు. జై ఆకాశ్.. గతేడాది 'జై విజయం' చిత్రంలో హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. ఓటీటీలోనూ ఇది సక్సెస్ అయిన సందర్భంగా.. చిత్ర విజయోత్సవాన్ని స్థానిక వడపళనిలోని ఘనంగా నిర్వహించారు. తాను నటించిన 'అమైచర్ రిటర్న్', 'మామరం' వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయని జై ఆకాశ్ చెప్పాడు. ప్రస్తుతం హీరోగా నటించడానికి నాలుగు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయని.. ఈ క్రమంలోనే ఇకపై దర్శకత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు నటుడు జై ఆకాష్ క్లారిటీ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
హీరోగా జైఆకాశ్.. 10 ఏళ్ల పాటు షూటింగ్, ట్రైలర్ చూశారా?
ఆనందం, పిలిస్తే పలుకుతా, నవ వసంతం వంటి చిత్రాలతో తెలుగులో సక్సెస్ఫుల్ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు జై ఆకాశ్. ఈయన ఏ తరహా పాత్రలు చేసినా తన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటారు. రామకృష్ణ సహా తదితర సినిమాలతో కోలీవుడ్లోనూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రయోగాలకు మారుపేరైన ఈయన నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా రాణిస్తున్నారు. అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోసం ఎదురుచూడకుండా, వారిపై ఆధారపడకుండా తానే ఏ క్యూబ్ మూవీస్ అనే యాప్ను ప్రారంభించి తద్వారా తన చిత్రాలనే కాకుండా ఇతర చిత్రాలను అందులో విడుదల చేస్తున్నారు. సొంతంగా యాప్.. అలా ఈయన ఇటీవల హీరోగా నటించి నిర్మించిన 'జై విజయం' ఏ క్యూబ్ మూవీస్ యాప్లో విడుదలై ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. ఆ తరువాత ఇప్పుడు థియేటర్లలోనూ ప్రదర్శింపబడుతోంది. కాగా తాజాగా జై ఆకాష్ కథానాయకుడిగా నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం మామరం. ఇందులో బ్రహ్మానందం, కాదల్ సుకుమార్, రాహుల్దేవ్ ముఖ్యపాత్రలు పోషించారు. నందా సంగీతాన్ని, పాల్పాండి చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఆడియో లాంచ్ ఈ సందర్భంగా సోమవారం చైన్నెలో కమలా థియేటర్లో చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జై ఆకాష్ మాట్లాడుతూ.. ఇది తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రమని చెప్పారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని గత 2012లో ప్రారంభించి 10 ఏళ్లుగా షూటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కథ డిమాండ్ కారణంగా ఇన్నేళ్లు షూటింగ్ చేసినట్లు చెప్పారు. ఇందులో తన పాత్ర 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు మూడు కోణాల్లో సాగుతుందని చెప్పారు. అందుకే రియాలిటీ కోసం 10 ఏళ్లు దశల వారీగా షూటింగ్ నిర్వహించినట్లు వివరించారు. చదవండి: బిగ్బాస్ సిరితో గొడవ.. సినిమా డిజాస్టర్.. స్పందించిన నందకిశోర్ -
ఆనందం హీరో కొత్త సినిమా.. ఒకే రోజు థియేటర్, ఓటీటీలో రిలీజ్..
ఆనందం సినిమాతో తెలుగులో గుర్తిపు తెచ్చుకున్న హీరో జైఆకాశ్ ద్విపాత్రాభినయం చేసిన తమిళ చిత్రం యోగ్యన్. మూన్ స్టార్ పిక్చర్స్ పతాకంపై మాదేశ్ నిర్మించిన ఈ చిత్రంలో కవిత, ఆర్తి, ఖుషీ హీరోయిన్లుగా నటించారు. జైఆకాశ్ శిష్యుడు సాయిప్రభా మీనా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి జూపిన్ సంగీతాన్ని, పాల్పాండి ఛాయాగ్రహణం అందించారు. ఇందులో జైఆకాశ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. చెడ్డవాడైన తండ్రికి పుట్టిన కొడుకు ఎలా మారతాడన్న కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శక్రవారం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం చైన్నె, వడపళనిలోని శిఖరం ఆవరణలో చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో జైఆకాశ్ మాట్లాడుతూ విలన్ పాత్రలో నటించాలన్నది తన చిరకాల కల అని అది ఈ చిత్రంతో నెరవేరిందన్నాడు. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా నటించడానికి చాలా కసరత్తులు చేశానన్నాడు. సినిమా బాగా వచ్చిందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడం ఎంతకష్టంగా మారిందో తెలిసిందేనని పేర్కొన్నాడు. చాలా తక్కువ థియేటర్లే తమకు దొరికాయని, దీంతో యోగ్యన్ చిత్రాన్ని థియేటర్లతో పాటు ఏకకాలంలో ఓటీటీలోనూ విడుదల చేయనున్నట్లు చెప్పాడు. ఇందుకోసం ఏ క్యూబ్ మూవీస్ అనే సరికొత్త ఓటీటీ యాప్ను ప్రారంభించినట్లు చెప్పారు. ఓటీటీలో రోజుకు రూ.50 చెల్లిస్తే ఫోన్లోనూ, టీవీల్లోనూ ఒక రోజంతా చూడవచ్చునని చెప్పారు. ఓటీటీలో తమ చిత్రాలతో పాటు ఇతర చిత్రాలను విడుదల చేస్తామని చెప్పారు. చిన్న నిర్మాతలకు, చిన్న నటీనటుల చిత్రాలకు ఈ ఓటీటీ చాలా హెల్ప్ అవుతుందన్నారు. అదేవిధంగా ఇతర చిత్రాల నిర్మాతలకు ఏ క్యూబ్ మూవీస్ యాప్లో విడుదల చేస్తే వచ్చే ఆదాయంలో 80 శాతం వాళ్లకు, 20 శాతం తమ సంస్థకు చేరుతుందని జైఆకాశ్ తెలిపారు. చదవండి: కార్తీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ -
సీరియల్ యాక్టర్గా మారిన బ్లాక్ బస్టర్ మూవీ హీరో
2001లో విడుదలైన తెలుగు సినిమా ఆనందం మీకు గుర్తుందా? ఆ సినిమాలో హీరో మీకు గుర్తున్నారా? అతనేనండి జై ఆకాశ్. ఆ ఆనందం హీరో ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? అతను త్వరలోనే ఓ తెలుగు సీరియల్లో అరంగేట్రం చేయబోతున్నాడు. మీరు విన్నది నిజమే. అప్పుడు సినిమా హీరో.. ఇప్పుడు సీరియల్ హీరోగా మరోసారి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సీరియల్ సెట్స్లో చిత్రాలను ఆయన తన ఇన్స్టాలో పంచుకున్నారు. అక్కడే జై ఆకాశ్తో పాటు మోనిషా, జబర్దస్త్ ఫేమ్ సన్నీ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. కాగా.. జై ఆకాశ్ తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించారు. శ్రీలంకలో జన్మించిన ఆకాశ్ ఆ తర్వాత యూకేలోని లండన్లో స్థిరపడ్డారు. కె బాలచందర్ నిర్మించిన రోజావనం (1999) చిత్రంలో రెండో ప్రధాన పాత్ర కోసం ఎంపికయ్యారు. ఆ తర్వాత 2001లో వచ్చిన ఆనందం చిత్రంతో తెలుగులో అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్లాక్బస్టర్గా నిలిచిన చిత్రంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు. పలు తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. ఆకాశ్ చివరిసారిగా 2010లో నమో వెంకటేశ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత మరోసారి తెలుగు చిత్రసీమలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. జై ఆకాశ్ నటించిన రాబోయే డైలీ కొత్త టీవీ షో పేరు 'గీతాంజలి'లో నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ బుల్లితెర నటి సుజిత ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Jai Akash (@jaiakash252) -
ఆ కారణంగానే హీరో ఆకాశ్ సినిమాలకు దూరమయ్యాడా?
‘ఆనందం’ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన హీరో ఆకాశ్. అప్పటికే అతడు పలు సినిమాల్లో నటించినప్పటికి శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం మూవీ ఆయనకు కమర్షియల్ హిట్ను అందించింది. ఈ మూవీతో జై ఆకాశ్కు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇందులో హీరోయిన్తో గొడవ పడుతూ, తండ్రికి భయపడే కుమారుడిగా ఆకాశ్ లేడీ ఫ్యాన్స్ ఆకట్టుకున్నాడు. ఇందులో తన హేర్స్టైల్, స్టైలిష్ లుక్ అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఆనందం మూవీ సమయంలో ఆకాశ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వరుస సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ ఆకాశ్ హీరోగా ఎక్కువ కాలం రాణించలేకపోయాడు. అయితే దీనికి కారణం తనకు వచ్చిన స్టార్ స్టేటస్ను చూసుకుని దర్శక-నిర్మాతలను తన డిమాండ్లతో ఇబ్బంది పెట్టడమే అని సినీ వర్గాల అభిప్రాయం. జై ఆకాశ్ అసలు పేరు.. సతీష్ నాగేశ్వరన్. శ్రీలంక తమిళ కుటుంబం నుంచి 1981 మార్చి 18న కొలంబోలో జన్మించాడు. విద్యాభ్యాసమంతా శ్రీలంకలో చేశాడు. పై చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడ స్థిరపడిన ఆకాశ్ సినిమాలపై ఆసక్తితో చెన్నై వచ్చాడు. ఈ క్రమంలో ‘రోజా వనం’ అనే తమిళ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగులో సుమంత్ హీరో వచ్చిన ‘రామ్మా చిలకమ్మ’లో సైడ్ హీరోగా చేశాడు. ఆ వెంటనే ‘ఆనందం’ సినిమాలో మెయిన్ హీరోగా నటించే చాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత తెలుగు, హిందీ, కన్నడ, తమిళ పరిశ్రమల్లో పలు సినిమాలు చేసి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా నంది అవార్డుతో పాటు పలు పురస్కారాలు అందుకున్న ఆకాశ్ ఎక్కువ కాలం హీరోగా రాణించలేకపోయాడు. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూనే దర్శకుడిగా మారాడు. తమిళం, తెలుగులో పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అలాగే స్వయంగా దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటించాడు. ఈ క్రమంలో తమిళ హీరోయిన్ నిషాను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటివరకు అంత బాగానే ఉంది. కానీ తను నిర్మించిన చిత్రాలు అన్ని బాక్సాఫీసు వద్ద అంతగా రాణించలేదు. అలాగే తన యాటిట్యూడ్తో వచ్చిన సినిమా అవకాశాలు పోగొట్టుకోవడం, నటించిన సినిమాలు విడుదల కాకపోవడంతో నటుడిగా ఆకాశ్ కేరీర్ డౌన్ అయ్యింది. ఇక నిర్మాతగా తాను సంపాదించుకున్న ఆస్తులతో పాటు ఉన్న ఆస్తులను కూడా పోగొట్టుకున్నాడు. ఆర్థికంగా నష్టపోయాడు. అయితే ఒక్క సినిమా హిట్కే పెద్ద స్టార్నని ఫీల్ అవుతూ డైరెక్టర్స్ దగ్గర గొంతెమ్మ కోరికలు కోరేవాడట. సోనాలి బింద్రే, సిమ్రాన్ వంటి స్టార్ హీరోయిన్లు అయితేనే నటిస్తానని డిమాండ్ చేయడంతో ఆకాశ్కు అవకాశాలు వెనక్కిపోయేవట. దీంతో కొంతకాలం నటనకు దూరమై తెరపై కనుమరుగైన ఆకాశ్ ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ తనదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ తెరపైకి వచ్చాడు. తన సినిమాను పూరి దొంగలించారని, నష్టపరిహరంగా 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. అయితే దీనిపై పూరి ఇంతవరకు స్పందించలేదు. ఈ క్రమంలో ఆకాశ్ ఆర్థికంగా నష్టపోయాడని, డబ్బు, ఫేం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు నెటిజన్లు, పూరి అభిమానులు ఆకాశ్ను విమర్శించారు. దీంతో వాటిపై స్పందించిన ఆకాశ్..తనకు లండన్లో సొంతంగా 2, 3 పెట్రొల్ బంక్లు, సూపర్ మార్కెట్లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అలాగే తెలుగు పరిశ్రమ తనని దారుణంగా మోసం చేసిందంటూ ఇండస్ట్రీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement