-
‘సాక్షి’ పెట్టుబడులు సక్రమమే..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని, చట్టబద్ధమేనని 2022 డిసెంబర్లో ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. జగతి పబ్లికేషన్లో ఇన్వెస్టర్లంతా చట్టానికి లోబడే పెట్టుబడులు పెట్టారని, ఇన్వెస్ట్మెంట్లు స్వీకరించడంలో కంపెనీలు చట్టప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ జగతి పబ్లికేషన్స్ పాటించిందని ఐటీ శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ కంపెనీలోకి పెట్టుబడులన్నీ క్విడ్–ప్రో–కో రూపంలో వచ్చాయి కనుక వాటిని ఆదాయంగా పరిగణించి, ఆ మొత్తం పై పన్ను చెల్లించాలంటూ 2011లో నాటి ఐటీ అధికారి ఇచ్చిన నోటీసులను ట్రిబ్యునల్ కొట్టివేసింది. ఐటీ విభాగం తమ వాదనకు మద్దతుగా సమర్పించిన సీబీఐ ఛార్జిషీట్లను... అసలు సాక్ష్యంగానే పరిగణించలేమని తెగేసి చెప్పింది. సాక్ష్యానికి ఉండాల్సిన కనీస లక్షణాలేవీ ఆ ఛార్జిïÙట్లకు లేవని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. ‘ఆ ఛార్జిషిట్లలో ఉన్నవన్నీ సీబీఐ చేసిన ఆరోపణలే తప్ప నిరూపితమైనవేమీ కావు. అయినా మీరు నోటీసులిచ్చిన అసెస్మెంట్ ఇయర్ దాటి ఇప్పటికి పదేళ్లు గడిచింది. మీరేమైనా దర్యాప్తు చేశారా? క్విడ్ ప్రోకో ఆరోపణలు నిరూపించే ఆధారాలేమైనా సంపాదించారా? సీబీఐ ఆరోపణలనే సాక్ష్యంగా సమర్పిస్తే ఎలా? సీబీఐ ఛార్జిషీట్లకు ఎలాంటి హేతుబద్దతా లేదు. ఈ కేసులో అవి అనవసరం, అప్రస్తుతం కూడా‘ అని జ్యుడిషియల్, అకౌంటింగ్ సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్ తేల్చిచెప్పింది. తద్వారా... సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులపై రామోజీరావు, టీడీపీ అధిపతి చంద్రబాబునాయుడు, మిగిలిన ఎల్లో గ్యాంగ్ పనిగట్టుకుని చేస్తున్న దు్రష్పచారానికి విలువ లేదని, అదంతా బూటకమని స్పష్టమయింది. సుదీర్ఘకాలం విచారించి, ఇరుపక్షాల వాదనలూ సమగ్రంగా విన్న అనంతరం 2022 డిసెంబరు 23న బెంచ్ 153 పేజీల ఉత్తర్వులను వెలువరించింది. ఒక్కొక్కరికీ ఒక్కో’లా’ ఎలా? ‘‘కొందరు ఇన్వెస్టర్ల విషయంలో ఇదే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. వారి విషయంలో ఎలాంటి క్విడ్ ప్రో కో లావాదేవీలూ జరగలేదని స్పష్టంగా చెప్పింది. పోనీ... మిగతా ఇన్వెస్టర్ల విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందని కూడా ఆ మెమోలో చెప్పలేదు. మరి క్విడ్ ప్రో కో అని మీరెలా అంటారు?‘ అని బెంచ్ తన ఉత్తర్వుల్లో ఐటీ విభాగాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు లిమిటెడ్లో షేరు ప్రీమియం అనేది ఇన్వెస్టర్లతో జరిగే చర్చలు, వారి అంచనాల వల్లే నిర్ణయమవుతుందని పేర్కొంది. ఇన్వెస్టర్ల వాదనను గమనించారా? సాక్ష్యాలుగా సమరి్పంచిన పలు వాదనల్లో నిమ్మగడ్డ గ్రూపు సంస్థల డైరెక్టరు నిమ్మగడ్డ ప్రకాశ్ చేసిన వాదనను బెంచ్ ప్రస్తావించింది. ‘‘ఈనాడులో పెట్టుబడులకోసం బ్లాక్స్టోన్ అనుకున్న విలువలో 20 శాతం డిస్కౌంట్కే సాక్షిలో వాటా దొరికింది. ఐదు ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెడదామని అనుకున్నాం. అందులో మీడియా ఒకటి. అందుకే సాక్షిలో పెట్టాం’’ అనే ప్రకాశ్ వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్ వ్యాఖ్యానించింది. వచి్చన పెట్టుబడులను ఆదాయంగా పరిగణించలేమని విస్పష్టంగా తేల్చిచెప్పింది. తెలియని మార్గాలంటే ఎలా? కోల్కతాలోని కొన్ని కంపెనీల నుంచి వచ్చిన రూ.15 కోట్లను తెలియని మార్గాల నుంచి వచ్చిన మొత్తంగా ఐటీ విభాగం పేర్కొంది. దాన్ని బెంచ్ తప్పుబడుతూ... కోల్కతా కంపెనీలతో సహా పెట్టుబడి ప్రతి కంపెనీ పాన్, రిజిస్ట్రేషన్ నెంబరు, అడ్రసు వంటి వివరాలన్నీ జగతి సంస్థ సమర్పించిందని, అన్నీ చట్టబద్ధంగానే ఉన్నప్పుడు ’గుర్తు తెలియని ఆదాయం’ ఎలా అవుతుందని ప్రశ్నించింది. వాల్యుయేషన్ నివేదిక నిజమేగా? ‘‘వాల్యుయేషన్ రిపోర్టును అస్సలు తప్పు బట్టడానికి లేదు. అందులో పేర్కొన్న అంశాలన్నీ సాక్షి పత్రిక విషయంలో నిజమయ్యాయి. అనుకున్నట్లుగానే సర్క్యులేషన్ పెరిగింది. పోటీపత్రిక ఈనాడు గుత్తాధిపత్యం తగ్గింది. పోటీపత్రిక 30 ఏళ్లలో సాధించిన సర్క్యులేషన్ను సాక్షి ఏడాదిన్నరలోనే సాధించింది. కనుక వాల్యుయేషన్ నివేదికను తప్పుబట్టలేం. సాక్షి యాజమాన్యానికి అనుభవం లేకున్నా అంత ప్రీమియం తీసుకున్నారనే వాదన అర్థరహితం. వారి లీడర్షిప్లో ఆ పత్రిక అంచనాలన్నిటినీ అందుకుంది. కాబట్టి క్విడ్ ప్రో కో వాదనకు అర్థమే లేదు’’ అని బెంచ్ పేర్కొంది. ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇంత విస్పష్టంగా తీర్పునిచ్చినా... రామోజీ, చంద్రబాబు గ్యాంగ్ మాత్రం ఇప్పటికీ పాత పాటే పాడుతూ... పాచి కథనాలనే మళ్లీ మళ్లీ ప్రచురిస్తూ ఏదో చేసేయాలని ఆరాటపడుతుండటమే విచిత్రం. -
ఇండెక్స్ ఫండ్ ఎంపిక ఎలా?
ఇండెక్స్ ఫండ్ ఎంపిక ఎలా? మల్టీక్యాప్ పేరుతో కొత్తగా వస్తున్న మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – ఆశిష్ ఈ తరహా పథకాల నుంచి సరైన రాబడులు అందుకోగలమా? అన్నది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం ఉంది. నేడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అనుసరిస్తున్న పెట్టుబడుల విధానాన్ని గతంలో మల్టీక్యాప్ ఫండ్స్ పాటించాయి. వాటిపై ఎటువంటి నియంత్రణలు లేవు. కనుక మార్కెట్ క్యాప్ పరిమితితో సంబంధం లేకుండా ఫండ్ మేనేజర్లు తమ స్వేచ్ఛ కొద్దీ అన్ని రకాల మార్కెట్ క్యాప్ ఆధారిత స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకునేవారు. దీంతో వాటి విధానం మార్చే దిశగా సెబీ మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇప్పుడు మల్టీక్యాప్ ఫండ్స్ కచ్చితంగా కనీసం 25 శాతం లార్జ్క్యాప్, 25% మిడ్క్యాప్, 25% స్మాల్క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. చాలా వరకు మల్టీక్యాప్ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల పెరంగా పెద్ద గా మారిపోయాయి. దీంతో 25% చొప్పున ప్రతీ విభాగంలో పెట్టుబడులు కచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలన్నది వాటికి ప్రతిబంధకంగా మారింది. ఎందుకంటే భారీ పెట్టుబడులకు తగ్గ అవకాశాలు స్మాల్ క్యాప్, మిడ్క్యాప్ విభాగంలో అన్ని వేళలా ఉండాలని లేదు. పరిశ్రమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సెబీ మార్కెట్కు ఇది ప్రతికూలంగా మారుతుందని గుర్తించి.. ఫ్లెక్సీక్యాప్ పేరుతో కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టింది. 25 శాతం చొప్పున కచ్ఛితంగా ప్రతీ విభాగంలో ఇన్వెస్ట్ చేయడం వీలు కాకపోతే మల్టీక్యాప్ పథకాలు ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి మారిపోవచ్చంటూ వెసులుబాటునిచ్చింది. దీంతో చాలా మల్టీక్యాప్ పథకాలు ఫ్లెక్సీక్యాప్ కిందకు మారిపోయాయి. కొత్త పథకం ఆవిష్కరించడం ద్వారా మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించొచ్చని మ్యూచువల్ ఫండ్ సంస్థలు భావించాయి. ఒక్కో విభాగంలో ఒక్క పథకమే ఉండాలన్నది సెబీ నిబంధన. దీంతో మల్టీక్యాప్ నుంచి ఫ్లెక్సీక్యాప్ కిందకు మారిపోయిన ఫండ్స్ సంస్థలు.. మల్టీక్యాప్ విభాగంలో కొత్త పథకాలను (ఎన్ఎఫ్వోలు) తీసుకొస్తున్నాయి. కనుక అవి తమకు అనుకూలమా? కాదా? అన్నది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల కాల వ్యవధి, రాబడుల అంచనాల ఆధారంగా నిర్ణయించుకోవాలి. మంచి ఇండెక్స్ ఫండ్ను ఎంపిక చేసుకునేందుకు ఎటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? – శశాంక్ ముందుగా పథకం ఎక్స్పెన్స్ రేషియో చూడాలి. ఇండెక్స్తో పోలిస్తే పథకం రాబడుల తీరు ఎలా ఉందన్నది పరిశీలించాలి. వ్యాల్యూ రీసెర్చ్ పోర్టల్లో అన్ని పథకాలకు సంబంధించి పనితీరు ప్యారా మీటర్లను పరిశీలించుకోవచ్చు. ఇండెక్స్తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారం కూడా లభిస్తుంది. కొంత ట్రాకింగ్ లోపం ఉండే అవకాశం లేకపోలేదు. అంటే ఇండెక్స్ 2 శాతం పెరిగితే.. ఫండ్ పెట్టుబడుల విలువ అదే కాలంలో 2.01%, 1.99%గా చూపించొచ్చు. ముఖ్యంగా ఎక్స్పెన్స్ రేషియో ఇక్కడ కీలకం అవుతుంది. రెండు ఇండెక్స్ పథకాల్లో ఒకటి 10 బేసిస్ పాయింట్లు చార్జ్ చేస్తుంటే, మరో పథకం 25 బేసిస్ పాయింట్లు చార్జ్ తీసుకుంటుంటే.. అప్పుడు 10 బేసిస్ పాయింట్ల పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. -
ఏపీలో హెచ్సీఎల్ రూ.750 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్న రెండు ఫెసిలిటీలకు రూ.750 కోట్లు వెచ్చిస్తున్నట్టు వెల్లడించింది. తద్వారా వచ్చే 10 ఏళ్లలో 7,500 ఉద్యోగావకాశాలు ఉంటాయని పేర్కొంది. రెండు దశల్లో విస్తరణ ఉంటుందని కంపెనీ వివరించింది. గన్నవరం సమీపంలో కేసరపల్లి వద్ద రూ.400 కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు నేడు (సోమవారం) భూమి పూజ జరుగనుంది. ఏడేళ్లలో పూర్తి కానున్న తొలి దశ ప్రాజెక్టులో 4,000పైగా ఐటీ ప్రొఫెషనల్స్కు ఉపాధి లభించనుంది. రెండో దశలో అమరావతిలో రూ.350 కోట్ల పెట్టుబడితో 20 ఎకరాల్లో క్యాంపస్ రానుంది. అయిదేళ్లలో ఇక్కడ 3,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని హెచ్సీఎల్ తెలిపింది. -
వేల్యూ ఇన్వెస్టింగ్ ప్రాధాన్యం అయితే...
ఇటీవలి మార్కెట్ కరెక్షన్లో పేరొందిన పలు ఫండ్స్ కూడా రాబడుల విషయంలో సమస్యలను ఎదుర్కొన్నాయి. కానీ, కొన్ని ఫండ్స్ మాత్రం ప్రతికూలతలను గట్టిగా ఎదుర్కొని నిలబడ్డాయి. వాటిలో పరాగ్ పారిఖ్ లాంగ్ టర్మ్ వేల్యూ ఫండ్ కూడా ఒకటి. ఈ పథకం ఏడాది రాబడులను పరిశీలిస్తే బెంచ్ మార్క్ (నిఫ్టీ 500) కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. మల్టీ క్యాప్ కేటగిరీ రాబడులతో పోలిస్తే సగటున ఐదు శాతం అధికం కావడం ఈ పథకం పనితీరుకు నిదర్శనాలు. ఈ పథకం ప్రారంభించి ఐదేళ్లు పూర్తయింది. అప్పటి నుంచి చూసుకుంటే వార్షికంగా సగటున 19.5 శాతం రాబడులు ఉన్నాయి. దీంతో ఈ విభాగంలో ఈ పథకం అగ్ర స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో ఈ పథకాన్ని కూడా చేర్చే అంశాన్ని పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం పరాగ్ పారిఖ్ లాంగ్ టర్మ్ వేల్యూ ఫండ్ పేరులో ఉన్నట్టు వేల్యూ ఇన్వెస్టింగ్ సూత్రాన్ని పాటిస్తుంది. బుల్ మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపని స్టాక్స్, విలువ పరంగా ఆకర్షణీయ స్థాయిల్లో ఉన్న వాటిని ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తుంది. బుల్స్ పరుగు నిదానించాక, ఈ స్టాక్స్ సత్తా చూపించే విధంగా ఉంటాయి. నాణ్యమైన స్టాక్స్ను, అది కూడా అధిక ధరల వద్ద కాకుండా సరసమైన ధరల వద్ద లభించే వాటిని దీర్ఘకాలిక దృష్టితో ఈ పథకం మేనేజర్లు పోర్ట్ఫోలియో కోసం ఎంపిక చేసుకుంటారు. బాటమ్ అప్, కొనుగోలు చేసిన తర్వాత వేచి ఉండే విధానాన్ని అనుసరిస్తారు. గత ఏడాదిన్నర కాలంలో ఈ పథకం నగదు నిల్వలను, ఆర్బిట్రేజ్ పొజిషన్లను పెంచుకుంది. 2016 డిసెంబర్ నాటికి 9 శాతంగా ఉంటే, 2018 జూన్ నాటికి 24 శాతానికి పెంచుకోవడం జరిగింది. దేశీయ స్మాల్ స్టాక్స్లోనూ ఎక్స్పోజర్ను 20 శాతానికి తగ్గించుకుంది. ఏడాదిన్నర క్రితం ఇది 30 శాతం స్థాయిలో ఉంది. దీంతో మిడ్, స్మాల్ క్యాప్స్ భారీ నష్టాలను చవిచూసిన తాజా మార్కెట్ కరెక్షన్లో ఈ పథకం మెరుగ్గా ఉండేందుకు తోడ్పడింది. ఈ పథకం పోర్ట్ఫోలియోలోని ఎంఫసిస్, మహారాష్ట్ర స్కూటర్స్ బాగా పెరిగాయి. ఈ పథకం తన పెట్టుబడుల్లో మూడింట ఒక వంతు అంతర్జాతీయ బ్లూచిప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ పెట్టుబడులు 28 శాతంగా ఉన్నాయి. రాబడులు ఏడాది కాలంలో ఈ పథకం 16.5 శాతం రాబడులను అందించింది. మరి ఇదే కాలంలో బెంచ్ మార్క్ రాబడులు 7.9 శాతమే కావడం గమనార్హం. మూడేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 12.7 శాతంగా ఉండగా, బెంచ్ మార్క్ రాబడులు 10.2 శాతం. ఐదేళ్ల రాబడులు 19.5 శాతం అయితే, బెంచ్ మార్క్ రాబడులు 16.1 శాతంగా ఉన్నాయి. వైవిధ్యం: అంతర్జాతీయంగా బ్లూచిప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఈ పథకంలో ప్రత్యేకత. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్లో ఈ పథకం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. మొత్తం పథకం నిధుల్లో 10% ఆల్ఫాబెట్లోనే ఉన్నాయి. తర్వాత ఫేస్బుక్లో 5% ఇన్వెస్ట్ చేసింది. విదేశీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఈ పథకం కనీసం 65% పెట్టుబడులను దేశీయ ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటుంది. -
ఆటుపోట్లలో పెట్టుబడికి అనువైనదే!!
ప్రస్తుతం మార్కెట్లు తీవ్ర హెచ్చు, తగ్గులతో ట్రేడవుతున్నాయి. ఇలాంటపుడు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు నష్టభయం తక్కువగా ఉండాలనే అనుకుంటారు. అలాంటి పథకాల కోసం అన్వేషించే వారు ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ను పరిశీలించొచ్చు. మొన్నటి వరకు ఎస్బీఐ మాగ్నం బ్యాలన్స్డ్ ఫండ్గా చెలామణి అయిన ఈ పథకం పేరు సెబీ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్గా మారింది. అయితే, పెట్టుబడుల పరంగా పథకం విధానాల్లో పెద్దగా మార్పులేమీ చేసుకోలేదు. ఈక్విటీల్లో కనీసం 65శాతం పెట్టుబడి పెడుతుంది. అంటే ఇంతకుమించి కూడా సందర్భానుసారంగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. మిగిలిన పెట్టుబడులను డెట్ విభాగంలో ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో పెడుతుంది. మార్కెట్ అస్థిరతల సమయాల్లో ఈ పథకం పనితీరు చెప్పుకోతగిన విధంగా ఉండటం గమనార్హం. నేర్పుతో కూడిన విధానం ఈక్విటీ, డెట్ మార్కెట్లలో అననుకూల సమయాల్లో నగదు నిల్వలను పెంచుకోవడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ఈక్విటీల్లో తక్కువ ఎక్స్పోజర్ కారణంగా 2011, 2015 అస్థిరతల మార్కెట్లలో నష్టాలు పరిమితమయ్యాయి. 2014లో బాండ్ మార్కెట్ ర్యాలీలో అధిక లాభాలను ఒడిసి పట్టుకుంది. ఆ ఏడాది 23 శాతం వరకు పెట్టుబడులను దీర్ఘకాలిక ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టింది. అంతకుముందు ఏడాది ఇది 10 శాతంగానే ఉంది. ఇక 2017 ఈక్విటీ మార్కెట్లలో భారీ ర్యాలీ అనంతరం కరెక్షన్ నేపథ్యంలో గడిచిన కొన్ని నెలల కాలంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకుంది. మిడ్క్యాప్స్కు 30–35 శాతం వరకు కేటాయింపులు చేయడం ద్వారా 2014 బుల్ ర్యాలీలో మంచి పనితీరు కనబరిచింది. అయితే, వీటిలో వాల్యుయేషన్లు గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో 2017 నుంచి ఎక్స్పోజర్ తగ్గించుకుంది. డెట్ వైపు గతేడాది కాలంలో 10 ఏళ్ల కాల పరిమితి గల ప్రభుత్వ సెక్యూరిటీలపై ఈల్డ్స్ 7.7 శాతానికి చేరిన నేపథ్యంలో దీర్ఘకాలిక బాండ్లలో పెట్టుబడులను తగ్గించుకుని షార్ట్టర్మ్ మనీమార్కెట్ ఇన్స్ట్రుమెంట్లలో ఎక్స్పోజర్ తీసుకుంది. రాబడులు ఇలా ఉన్నాయ్... పెట్టుబడుల పరంగా ఈ విధమైన వ్యూహాల కారణంగా ఈ పథకం సదరు కేటగిరీలో మెరుగైన పనితీరు చూపించగలుగుతోంది. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు కేటగిరీతో పోలిస్తే సగటున 1–5 శాతం అధికంగా ఉన్నాయి. ఏడాది కాలంలో 13.8 శాతం, మూడేళ్లలో 9.9 శాతం, ఐదేళ్లలో 16.8 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం అందించింది. పోర్ట్ఫోలియో:ప్రస్తుతం ఈ పథకం ఈక్విటీలో 65 శాతం, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లలో 13 శాతం, కార్పొరేట్ డిబెంచర్లలో 8 శాతం, 11 శాతం ప్రభుత్వ సెక్యూరిటీల్లో కలిగి ఉంది. కాలానుగుణంగా ఈక్విటీ హోల్డింగ్స్లో మార్పులు చేస్తుంటుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement