-
ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూలై 10 నుంచి 17 వరకు జరగాల్సిన 2019–20 పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కోవిడ్–19 నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. దీంతో పాటు జూలై 11 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ, ఎస్సెస్సీ బోర్డు డైరక్టర్ ఎ.సుబ్బారెడ్డి తదితరులతో కలసి ఆయన ప్రభుత్వ ప్రకటన విడుదల చేశారు. ఎస్సెస్సీలో పరీక్షలు రాయాల్సిన 6,39,022 మంది విద్యార్థులు, ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారని స్పష్టం చేశారు. మంత్రి విడుదల చేసిన ప్రకటనలోని అంశాలు ఇలా ఉన్నాయి. గట్టి చర్యలు తీసుకున్నా.. ► పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం రెండు నెలల నుంచి లాక్డౌన్ రోజుల్లో సప్తగిరి చానెల్ ద్వారా ‘విద్యామృతం’, ఆకాశవాణి ద్వారా ‘విద్యాకలశం’ అనే పేర్లతో పాఠ్యాంశాలను బోధిస్తూ పరీక్షలకు సన్నద్ధం చేయించింది. ఊ 11 పేపర్లను 6 పేపర్లకు తగ్గించింది. 2,923 సెంటర్లను 4వేలకు పైగా పెంచి అదనపు సిబ్బందిని నియమించింది. భౌతిక దూరానికి వీలుగా ఏర్పాట్లు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్లు, థర్మల్ స్క్రీనింగ్ వంటి అనేక చర్యలు చేపట్టింది. ► అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో జూన్ 15న విద్యా శాఖ మంత్రి జిల్లా అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ, ఇంటి నుంచి వెళ్లి వచ్చే సమయంలో కరోనా వైరస్ సోకే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది. అన్ని అంశాలను బేరీజు వేసి.. ► జూలై నాటికి కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వివిధ సర్వేలు సూచిస్తున్నందున కంటైన్మెంట్ జోన్లు పెరిగితే పరీక్షల నిర్వహణ మరింత కష్టతరంగా ఉంటుందని, చాలా జిల్లాల్లో పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యాలు పునరుద్ధరించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ► ఈ అంశాలన్నింటినీ ఈ నెల 18న మంత్రి, అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షలకు హాల్ టికెట్లు పొందిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించాలని సీఎం పాఠశాల విద్యా శాఖను ఆదేశించారు. గ్రేడ్లు ప్రకటించడానికి కసరత్తు ► తమ పిల్లలు బాగా చదివారని, వారికి మంచి గ్రేడ్లు వస్తాయని భావించామని.. ఇప్పుడు అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించడం ద్వారా పిల్లలందరి ప్రతిభను ఒకే రీతిన పరిగణిస్తారేమోనని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ► ఈ దృష్ట్యా ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించాల్సి ఉంటుంది. వివిధ కోర్సుల్లో చేరడానికి మార్కులు, గ్రేడింగ్ అవసరమవుతాయి. ఇందుకోసం విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వనున్నాం. తగిన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించాం. ఇంప్రూవ్మెంట్ పరీక్షలు ఉండవు ► ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూలై 11 నుంచి జరగాల్సిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేసి వారందరినీ ఉత్తీర్ణులైనట్లు ప్రకటిస్తున్నాం. ► ఇంటర్ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు కూడా ఉండవు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు కట్టిన వారికి బోర్డు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. ఇంటర్ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుంది. ► ఎంసెట్ వంటి ఇతర పరీక్షలకు సంబంధించి కూడా షెడ్యూళ్లు ఇచ్చాం. ప్రస్తుతానికి అవన్నీ యధాతథంగా అవే షెడ్యూళ్లలో ఉంటాయి. ► పరీక్షల రద్దు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
మేలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: మేలో జరిగే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల అర్హతలు, ఇతర అంశాల మార్గదర్శకాలను తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు మంగళవారం జారీ చేసింది. ఇవీ మార్గదర్శకాలు... ప్రస్తుతం జరుగుతున్న (మార్చిలో) ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకావచ్చు. హా ప్రస్తుత పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కోసం కూడా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. హా తెలంగాణ ఇంటర్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండి, మార్చిలో పరీక్షల కోసం ఫీజు చెల్లించలేకపోయిన వారు కూడా ఫీజు చెల్లించవచ్చు. హా ఏదైనా కారణాలతో మార్చిలో పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులు నిర్ణీత ఫీజు చెల్లించి మే నెలలో పరీక్షలు రాయవచ్చు. హా ఈ విద్యార్థులంతా టీఎస్బీఐఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఆర్ఐఓలను లేదా బోర్డు డిప్యూటీ సెక్రటరీ మోహన్రెడ్డిని (మొబైల్: 98487 81806) సంప్రదించవచ్చు. వెబ్సైట్లోనూ (bietelangana.cgg.gov.in) పొందవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్లో ‘పర్యావరణం’ తప్పనిసరి సాక్షి, హైదరాబాద్: అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీలు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సబ్జెక్టును కచ్చితంగా ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. అలాగే ‘ఒక విద్యార్థి ఒక మొక్క’ విధానంతో ప్రతి విద్యార్థితో ఒక మొక్కను నాటించే కార్యక్రమాన్ని కాలేజీల్లో చేపట్టాలని తెలిపింది. మే 10న టీఆర్జేసీసెట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నాలుగు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి మే 10న ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఆర్జేసీసెట్-2015) నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి శేషుకుమారి తెలిపారు. ఏప్రిల్ 18లోగా ఆన్లైన్లో http://tsrjdc.cgg.gov.in) దరఖాస్తు చేసుకోవాలని, రూ. 150 పరీక్ష ఫీజు ఉంటుందని తెలిపారు. అలాగే ఏపీలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఏపీ గురుకుల విద్యాలయాల సొసైటీ మే 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోందని, అందులో తెలంగాణ విద్యార్థులకు కూడా సీట్లు ఇస్తారని వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో పరీక్ష ఉంటుందని, ఏప్రిల్ 17లోగా ఆన్లైన్లో (aprs.cgg.gov.in)) దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఫైనలియర్ బీడీఎస్ ఫలితాలు విడుదల విజయవాడ: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిబ్రవరిలో నిర్వహించిన ఫైనలియర్ బీడీఎస్ పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. విద్యార్థుల మార్కుల రీ-టోటలింగ్ కోసం సబ్జెక్టుకు రూ.2 వేలు చొప్పున చెల్లించి ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ విజయకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలు (హెచ్టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్) వెబ్సైట్లో పొందవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement