-
ఇండియన్ స్టూడెంట్కి వేధింపులు
-
ఎల్బ్రస్ శిఖరంపై సు'గంధం' పరిమళం
సాక్షి, అమరావతి: ఎనిమిదేళ్ల బాలుడు ఎత్తైన పర్వతాన్ని అధిరోహించాడు. యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన ప్రముఖ శిఖరం ఎల్బ్రస్ను అతి పిన్న వయసులోనే అధిరోహించిన తొలి భారతీయ బాలుడిగా రికార్డు సృష్టించాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడి కుమారుడైన గంధం భువన్ రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం (5,642 మీటర్లు)ను ఈ నెల 18వ తేదీన అధిరోహించి చరిత్ర సృష్టించాడు. అనంతపురానికి చెందిన కోచ్ శంకరయ్య, విశాఖపట్నానికి చెందిన పర్వాతారోహకుడు, అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ చాంపియన్ భూపతిరాజు వర్మ, కర్ణాటక నుంచి నవీన్ మల్లేష్ బృందంతో కలిసి భువన్ సెప్టెంబర్ 11న రష్యాకు బయలుదేరాడు. ఈ నెల 12న టెర్స్కోల్లోని మౌంట్ ఎల్బ్రస్ బేస్కు వెళ్లిన ఆ బృందం 13 వ తేదీన 3,500 మీటర్లు అధిరోహించి తిరిగి బేస్ క్యాంప్కు చేరుకుంది. అక్కడ కొంత శిక్షణ అనంతరం 18వ తేదీన 5,642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వత శిఖరాన్ని చేరుకుని ఉదయం 8:00 గంటలకు (మాస్కో సమయం) మన జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. ఈ బృందం ప్రస్తుతం పర్వతాన్ని దిగి బేస్ క్యాంప్నకు చేరుకుని ఈ నెల 23న భారత్కు తిరిగి రానుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కోచ్ శిక్షణతోనే ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న భువన్ తల్లిదండ్రుల ప్రోత్సాహం, శిక్షకులు అందించిన మెళకువల వల్లే తాను ఈ ఘనతను సాధించినట్టు వీడియో సందేశంలో పేర్కొన్నాడు. దేశంలో చాలామంది ప్రతిభావంతులైన పిల్లలున్నారని, వారికి తగిన ప్రోత్సాహం, అవకాశం కల్పిస్తే అద్భుతమైన రికార్డులు సృష్టిస్తారని స్పష్టం చేశాడు. అతి శీతల వాతావరణం సవాల్గా మారినప్పటికీ, పలు ఇబ్బందులు చవిచూస్తూ తాను అనుకున్న విధంగా సాహసోపేతమైన యాత్రను ముగించినట్టు తెలిపాడు. -
3,200 కి.మీ.ల సైకిల్ యాత్ర.. రూ. 3.7 లక్షల విరాళాలు
లండన్: ఐదేళ్ల తెలుగు బాలుడు 3,200 కిలోమీటర్ల సైకిల్ యాత్రలో పాల్గొని అక్షరాలా రూ.3.7 లక్షలు సేకరించాడు. భారత్లో కరోనా మహమ్మారిపై పోరాటానికి తనవంతు సాయం అందించేందుకు ఈ బాలుడు చేసిన సాహసం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన అనీశ్వర్ కుంచాల బ్రిటన్లోని మాంచెస్టర్ సిటీలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. ‘లిటిల్ పెడలర్స్ అనీశ్ అండ్ ఫ్రెండ్స్’ పేరిట మేలో సైకిల్ క్యాంపెయిన్ ప్రారంభించాడు. ఇందులో అతడితోపాటు 60 మంది బాలురు పాల్గొన్నారు. మొత్తం 3,200 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశారు. ప్రజల నుంచి రూ.3.7 లక్షల విరాళాలు సేకరించారు. బ్రిటన్లో కరోనాపై పోరాటంలో భాగంగా నేషనల్ హెల్త్ సర్వేకు సాయం చేసేందుకు క్రికెట్ చాంపియన్షిప్ కూడా అనీశ్వర్ ప్రారంభించాడు. ఐదేళ్ల అనీశ్వర్ యూకేలో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. నేతలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. -
14 ఏళ్లకే పైలెట్ అయిన భారత సంతతి బాలుడు
దుబాయి: భారతీయ సంతతికి చెందిన యూఏఈ బాలుడు అరుదైన రికార్డు సృష్టించాడు. 14 ఏళ్లవయస్సులోనే సింగిల్ ఇంజిన్ విమానాన్ని నడిపిన పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. షార్జాలోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న మన్సూర్ అనిస్(14)కి చిన్నప్పటి నుంచే పైలెట్ కావాలని కోరిక ఉండేది. దాన్ని సాధించేందుకు గాను కెనడాకు చెందిన ఏవియేషన్ అకాడెమీలో చేరాడు. సింగిల్ ఇంజిన్ సెస్నా-152 రకం విమానాన్ని పది నిమిషాల పాటు ఒక్కడే ఒంటరిగా నడిపి, ఏవియేషన్ సంస్థ నుంచి స్టూడెంట్ పైలెట్ ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. ఇందుకు సంబంధించి ఆగస్టు 30వ తేదీన కెనడా ఏవియేషన్ విభాగం నిర్వహించిన వివిధ పరీక్షల్లో 90శాతం స్కోరు సాధించాడు. అతి తక్కువ శిక్షణ సమయంలోనే పైలెట్గా అర్హత సాధించిన పిన్న వయస్కుడిగా కూడా మన్సూర్ రికార్డు నెలకొల్పాడని అతడి తండ్రి అలీ అస్గర్ అనిస్ తెలిపారు. వేసవి సెలవుల్లో తల్లితోపాటు మన్సూర్ కెనడా వెళ్లి విమాన పైలెట్ శిక్షణ పొందాడని అలీ తెలిపారు. తన సోదరుడు క్వాయిద్ ఫైజీ ఇండియాలో జెట్ ఎయిర్వేస్లో పైలెట్గా పనిచేస్తున్నాడని, అతని స్ఫూర్తితోనే మన్సూర్ పైలెట్ శిక్షణ పొందాడని మునీరా తెలిపారు. మన్సూర్ తండ్రి అలీ షార్జాలో అలీ సివిల్ ఇంజినీర్ కాగా, తల్లి మునీరా కెమిస్ట్రీ టీచర్గా పనిచేస్తున్నారు. కాగా, భారత్, దుబాయిలలో పైలెట్ అర్హత వయస్సు 18 ఏళ్లు కాగా, కెనడాలో 14 ఏళ్లకే పైలెట్ శిక్షణ పొందే అవకాశం ఉంది. -
నంబర్ తీసుకుని ఎంత పని చేశాడు..!
దుబాయి: భారత్కు చెందిన వికలాంగ బాలుడిపై పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. దుబాయిలోని అల్ రషిదియా పోలీస్స్టేషన్ పరిధిలో ఫిబ్రవరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. ఓ మానసిక వికలాంగుడు ఇంటి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న అతడి వద్దకు వచ్చి మాటలు కలిపాడు. స్నేహం పేరుతో బాలుడి ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నాడు. తరచూ అతను బాలుడితో మాట్లాడేవాడు. బాలుడి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ఆ వ్యక్తి మాయమాటలు చెప్పి తన కారులో ఎక్కించుకున్నాడు. అనంతరం నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితుడి తండ్రి అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు ఫిబ్రవరి 25వ తేదీన నిందితుడిని అరెస్టు చేశారు. అయితే నిందితుడు తన తప్పేమీ లేదని కోర్టులో వాదించాడు. బాలుడు తనను పది దిర్హామ్లు అడిగాడని తెలిపాడు. ఇవ్వకపోయేసరికి కారులో తనతోపాటు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించటంతో లైంగిక దాడి చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. వైద్య పరీక్షలో బాలుడి మానసిక అపరిపక్వత నిర్ధారణ కావటంతో కోర్టు అతని వాదనలను తోసిపుచ్చింది. నిందితుడు శిక్షార్హుడేనని కోర్టు తేల్చిచెప్పింది. దీనిపై తుది తీర్పు వెలువడాల్సి ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement