-
మరీ ఇంత దారుణమా.. టీమిండియా బౌలర్లపై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్
టీమిండియా చేతిలో 0-1 తేడాతో టీ20 సిరీస్ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. ఆక్లాండ్ వేదికగా ఇవాళ (నవంబర్ 25) జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (80), శిఖర్ ధవన్ (72), శుభ్మన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేయగా, 307 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ మరో 17 బంతులు మిగిలుండగానే ఆడుతూపాడుతూ విజయం సాధించింది. టామ్ లాథమ్ (104 బంతుల్లో 145; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (98 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) భారీ అర్ధశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా, ఈ మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని సైతం కాపాడుకోలేక దారుణంగా విఫలమైన టీమిండియా బౌలర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత పేలవమైన బౌలింగా అని మండిపడుతున్నారు. భారత బౌలర్ల ప్రదర్శన నానాటికీ మరీ తీసికట్టుగా మారుతుందని ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా.. కీలక దశలో ఒకే ఓవర్లో 25 పరుగులు సమర్పించుకుని, జట్టు ఓటమికి ప్రధాన కారణమైన శార్దూల్ ఠాకూర్పై దుమ్మెత్తిపోస్తున్నారు. శార్దూల్ను బౌలర్ అనే వాడిని గూబ గుయ్ అనేలా వాయించాలని సోషల్మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 8.1 ఓవర్లు వేసి 68 పరుగులు సమర్పించుకున్న అర్షదీప్ను సైతం ఏకి పారేస్తున్నారు. మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంట్రా బాబూ అని తలలుపట్టుకుంటున్నారు. కశ్మీర్ ఎక్స్ప్రెస్ అని గొప్పలు చెప్పుకున్న ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీసి పర్వాలేదనిపించినా, ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో మండిపడుతున్నారు. ఎన్ని మ్యాచ్లు అవకాశం ఇచ్చినా చహల్ తీరు మారడం లేదని, ఇతన్ని కూడా పక్కకు పెడితే బుద్ధి వస్తుందని అంటున్నారు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ (4.2 ఎకానమీ)ను మినహాయించి భారత బౌలర్లందరిపై ఓ రేంజ్లో దుమ్మెత్తిపోస్తున్నారు. -
హడలెత్తించిన ఉమేశ్, సిరాజ్
చెస్టర్ లీ స్ట్రీట్: భారత బౌలర్ల ప్రాక్టీస్ అదిరింది. కౌంటీ సెలెక్ట్ ఎలెవన్తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేశారు. బుధవారం బ్యాటింగ్కు దిగిన కౌంటీ జట్టు 82.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. పేసర్లు ఉమేశ్ యాదవ్ (3/22), మొహమ్మద్ సిరాజ్ (2/32) పదునైన బంతులతో కౌంటీ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టారు. ఓపెనర్ హసీబ్ హమీద్ (246 బంతుల్లో 112; 13 ఫోర్లు) శతకంతో జట్టును ఆదుకున్నాడు. అతడు మినహా మిగిలిన బ్యాట్స్మెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కౌంటీ తరఫున బరిలోకి దిగిన భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (1) ప్రాక్టీస్ను సద్వినియోగం చేసుకోలేదు. భారత్ 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 306/9తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్... మరో ఐదు పరుగులు మాత్రమే జోడించి 93 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ మిల్స్ నాలుగు వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్ అవుట్ భారత యువ పేసర్ అవేశ్ ఖాన్ ఇంగ్లండ్ పర్యటన అర్ధాంతరంగా ముగిసిపోయింది. గాయంతో ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల సిరీస్కు దూరమయ్యాడు. భారత్తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో సెలెక్ట్ ఎలెవన్ తరఫున అవేశ్ ఖాన్ బరిలోకి దిగాడు. తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్ 10వ ఓవర్ను అవేశ్ ఖాన్ బౌలింగ్ చేయగా.... విహారి కొట్టిన రిటర్న్ షాట్ను ఆపే ప్రయత్నంలో అతడి ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. స్కానింగ్లో అవేశ్ వేలు విరిగినట్లు తేలింది. అతడు కోలుకోవడానికి కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
భళా... భారత బౌలర్లు
సునీల్ గావస్కర్ ఈ సిరీస్లో భారత్ శ్రీలంకతో అద్భుతంగా ఆడుతోంది. అయితే ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో లంక బలమైన ప్రత్యర్థి కాదు. బౌలింగ్ పేలవంగా ఉంది. అంతర్జాతీయ స్థాయికి అదేమాత్రం సరితూగదు. కానీ... బ్యాటింగ్లో కొందరు మేటి ఆటగాళ్లున్నారు. అయితే వీరిని భారత బౌలర్లు చక్కగా కట్టడి చేశారు. బ్యాటింగ్ పిచ్లపై కూడా వారికి అవకాశం ఇవ్వకుండా దెబ్బ తీసిన బౌలర్లను తప్పకుండా అభినందించాల్సిందే. నాలుగో వన్డేలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగిన తీరు అద్భుతం. నిప్పులు చెరిగే బౌలింగ్తో... వైవిధ్యమైన యార్కర్లతో లంక బ్యాట్స్మెన్ను బాగా ఇబ్బంది పెట్టాడు. వారి ఇన్నింగ్స్ను కోలుకోలేని దెబ్బతీశారు. కొత్త కుర్రాడు శార్దుల్ ఠాకూర్ కూడా ఫ్లాట్ పిచ్పై చక్కగా రాణించాడు. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇలా అందరూ కలిసి లంక ఇన్నింగ్స్ను కూల్చారు. ఈ మ్యాచ్లో భువనేశ్వర్తో పాటు, కేదార్ జాదవ్, యజువేంద్ర చహల్ను డగౌట్కు పరిమితం చేసి రాహుల్కు మరో అవకాశమిచ్చారు. అయితే వెస్టిండీస్ సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచిన రహానేను మరోసారి పక్కన బెట్టడం ఆశ్చర్యపరిచింది. రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లి భాగస్వామ్యం భారీస్కోరుకు బాట వేసింది. కోహ్లి నిష్క్రమణ తర్వాత హార్దిక్ పాండ్యాకు బదులుగా రాహుల్ను బరిలోకి దించి ఉంటే అతను క్రీజులో నిలదొక్కుకునేందుకు మంచి అవకాశం ఉండేది. అయితే కోహ్లి, రోహిత్ల సెంచరీలతో పాండ్యా, రాహుల్ల వైఫల్యం లెక్కలోకి రాలేదు. ధనంజయ అద్భుతమైన డెలివరికి రాహుల్ పెవిలియన్ చేరాడు. ఏదేమైనా ఆటగాడిపై నమ్మకముంచడం మంచి పనే కానీ... ఇందుకోసం ఓ ఫామ్లో ఉన్న బ్యాట్స్మన్ (రహానే)ను కాదని ఇవ్వడం మాత్రం తగని పని. మొత్తానికి లంక పర్యటనలో భారత ఆటగాళ్లంతా తమ ప్రతిభను చాటుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని రంగాల్లో సత్తా కనబరిచారు. -
భారత బౌలర్ల అరుదైన రికార్డు
చాంపియన్ట్రోఫీలో మరో అరుదైన రికార్డు నమోదైంది. ట్రోఫీలో భారత బ్యాట్మెన్లు తమ సత్తాచాటుతుంటే , బౌలర్లు తమ పదునైన బౌలింగ్తో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, బూమ్రా, జడేలతో బౌలింగ్ లైన్ అసాధారణ రీతిలో చెలరేగిపోతోంది. అనూహ్యంగా అశ్విన్ సైతం జట్టులో వచ్చి బౌలింగ్ బలాన్ని మరింత పెంచాడు. తొలిమ్యాచ్లో భారత్ బ్యాట్మెన్ల రాణింపుతో 319 పరుగులు చేయగా, బౌలర్లు తమ పదునైన బౌలింగ్తో పాకిస్తాన్ను కేవలం 164 పరుగులకే నేలకూల్చారు. అయితే తరువాతి మ్యాచ్లో భారత బౌలింగ్ తేలిపోయింది. లంకను ఏ పరిస్థితిల్లో కూడా ఇబ్బంది పెట్టలేక పోయారు. 322 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. భారత బౌలర్లు కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగారు. అది కూడా ఐదో ఓవర్ నాలుగోబంతికి భువనేశ్వర్ డిక్వెల్లా 7(18)పరుగుల వద్దను పెవిలియన్కు పంపాడు. అనంతరం గుణతిలక, మెండిస్ల వికెట్లు పడ్డా ఆరెండూ రన్నౌట్లు. మరొకటి రిటైర్డ్ నాటౌట్గా పెరీరా వెనుదిరిగాడు. అంటే శ్రీలంకతో కేవలం ఒక్కవికెట్ మాత్రమే అదికూడా4.4 ఓవర్లల్లో. మిగతా 45.2 ఓవర్లలో ఒక్క వికెట్కూడా బౌలర్లు తమ ఖాతాలో వేసుకోలేకపోయారు. అనంతరం దక్షిణాఫ్రికా మ్యాచ్లో తొలి వికెట్గా ఆమ్లా35(69), అశ్విన్ బౌలింగ్లో 17.3 ఓవర్లో అవుట్ అయ్యాడు. అంటే శ్రీలంకతో 45.2 ఓవర్లు, ఇటు దక్షిణాఫ్రికాతో 17.2 ఓవర్లు మెత్తం 62.4 ఓవర్లలో భారత బౌలర్లు ఒక్క వికెట్కూడా తమ ఖాతాలో వేసుకోలేకపోయారు. అంతార్జాతీయ క్రికెట్లో ఇదీ ఓ రికార్డే. -
వదిలినా దొరికారు
► ఇంగ్లండ్ 268/8 బెయిర్ స్టో అర్ధసెంచరీ ► సమష్టిగా రాణించిన భారత బౌలర్లు ► నాలుగు క్యాచ్లు వదిలేసిన ఫీల్డర్లు ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగు క్యాచ్లు వదిలేశారు. పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లేదు... ఇలాంటి స్థితిలో ఏ ప్రత్యర్థరుునా దొరికిన అవకాశాలను వినియోగించుకుని చెలరేగుతుంది. కానీ ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ మాత్రం నిర్లక్ష్యపు షాట్లతో... ఏ మాత్రం బాధ్యత లేని ఆటతీరుతో తొలిరోజే భారత్కు దొరికారు. ఫీల్డర్ల నుంచి సహకారం లేకపోరుునా... బౌలర్లు మాత్రం క్రమశిక్షణతో రాణించి మూడో టెస్టులో భారత్కు మంచి ఆరంభాన్నిచ్చారు. మొహాలీ: ఆరంభంలో బౌన్స... పాత బంతితో పేసర్ల రివర్స్ స్వింగ్... స్పిన్కు అనుకూలిస్తుందని భావించిన పిచ్ నుంచి సహకారం లేకపోరుునా బంతుల్లో వైవిధ్యంతో స్పిన్నర్లు... వెరసి బౌలర్ల సమష్టి కృషితో మూడో టెస్టు తొలి రోజును భారత్ సంతృప్తికరంగా ముగించింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో మొదటిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలిఇన్నింగ్సలో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. బెరుుర్స్టో (177 బంతుల్లో 89; 6 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్సతో అర్ధసెంచరీ చేయగా... బట్లర్ (80 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరూ ఆరో వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లండ్ను ఆదుకున్నారు. స్టోక్స్ (29) పర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సమయానికి రషీద్ (4 బ్యాటింగ్), బ్యాటీ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేశ్, జయంత్, జడేజా తలా రెండు వికెట్లు తీసుకోగా... షమీ, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు. సెషన్ 1: ఆరంభంలో వికెట్లు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ జాగ్రత్తగా ఇన్నింగ్సను ప్రారంభించింది. మూడు, పదో ఓవర్లలో షమీ బౌలింగ్లో కుక్ ఇచ్చిన రెండు క్యాచ్లను జడేజా, అశ్విన్లు వదిలేయడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. మరో ఎండ్లో డిఫెన్సకే ప్రాధాన్యమిచ్చిన హమీద్ (9)... ఉమేశ్ బౌలింగ్లో రహానేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండు బౌండరీలతో ధాటిగా ఇన్నింగ్సను ప్రారంభించిన రూట్ (15)కూడా ... వికెట్ల ముందు జయంత్కు దొరికిపోయాడు. అశ్విన్ తన తొలిబంతికే కుక్ (27)ను పెవిలియన్కు పంపించి ఇంగ్లండ్ వెన్నువిరిచాడు. దీంతో 51 పరుగులకే ఇంగ్లండ్ కీలకమైన మూడు వికెట్లను కోల్పోరుుంది. లంచ్ విరామానికి మరో రెండు ఓవర్లు ఉందనగా అలీ (16) వికెట్ను షమీ తీయడంతో సెషన్లో భారత్ ఆధిపత్యం కొనసాగింది. ఓవర్లు: 29; పరుగులు: 92; వికెట్లు: 4 సెషన్ 2: సూపర్ భాగస్వామ్యం ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ స్టోక్స్, బెరుుర్స్టో చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అద్భుతమైన బంతితో స్టోక్స్ (29)ను అవుట్ చేసి జడేజా ఈ జంటను విడదీశాడు. బట్లర్ అండతో 76 బంతుల్లో బెరుుర్స్టో అర్ధసెంచరీ మార్కును చేరుకున్నాడు. తర్వాత మరో వికెట్ పడకుండా ఈ జంట జాగ్రత్త పడింది. ఈ సెషన్లో పార్థీవ్ ఒక క్యాచ్ వదిలేశాడు. ఓవర్లు: 33; పరుగులు: 113; వికెట్లు: 1 సెషన్ 3: బ్యాటింగ్లో తడబాటు టీ విరామానంతరం జడేజా బౌలింగ్లో బట్లర్ (43) ఇచ్చిన క్యాచ్ను మిడాఫ్లో కోహ్లి ఒడిసిపట్టడంతో ఆరోవికెట్కు 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బెయిర్స్టో ఇచ్చిన క్యాచ్ను పార్థీవ్ వదిలేశాడు. అనంతరం మరో ఆరు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనగా బెరుుర్స్టోను... 89వ ఓవర్లో వోక్స్ను అవుట్ చేసి భారత బౌలర్లు రోజును ముగించారు. ఓవర్లు: 28; పరుగులు: 63; వికెట్లు 3 కోహ్లి, స్టోక్స్ వాగ్వాదం భారత కెప్టెన్ కోహ్లి, ఇంగ్లండ్ ఆల్రౌండర్ స్టోక్స్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. రెండో సెషన్లో నిలకడగా ఆడుతోన్న స్టోక్స్ను రవీంద్ర జడేజా అవుట్ చేయడంతో కోహ్లిసేన సంబరాల్లో మునిగింది. వికెట్ కోల్పోరుున ఉక్రోశంలో ఉన్న స్టోక్స్... పెవిలియన్కు వెళ్తూ వెళ్తూ కోహ్లిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. దీంతో కోహ్లి కూడా స్టోక్స్ను ఉద్దేశించి జవాబు ఇచ్చాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. చివరికి కోహ్లి ఈ విషయంపై అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఈ ఉదంతంలో స్టోక్స్ను ఐసీసీ మందలించింది. అతని ఖాతాలో ఒక డీమెరిట్ పారుుంట్ను చేర్చింది. రాహుల్కు మళ్లీ గాయం భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మళ్లీ గాయపడ్డాడు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా తన ముంజేతికి గాయమైంది. నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తను ఇబ్బందిపడ్డాడు. దీంతో రాహుల్ స్థానంలో కరుణ్ నాయర్ జట్టులోకి వచ్చాడు. గావస్కర్ చేతుల మీదుగా కరుణ్ టెస్టు క్యాప్ను అందుకున్నాడు. ‘క్రికెట్లో ఫీల్డర్ల నుంచి క్యాచ్లు చేజారిపోవడం సాధారణమే. ఒక్కోసారి వారే అద్భుతమైన క్యాచ్లతో బౌలర్కి న్యాయం చేస్తారు. ఇదంతా ఆటలో భాగంగానే చూడాలి. రోజురోజుకీ నా ఆట పరిణతి చెందుతుంది. కుంబ్లే, సంజయ్ బంగర్ చెప్పిన విధంగా నా బౌలింగ్ను మార్చుకున్నాను. ఆఫ్ స్టంప్ ఆవల బంతుల్ని సంధించి మంచి ఫలితాలను సాధిస్తున్నాను.’ - ఉమేశ్ యాదవ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement