-
Tamilnadu: ఆగని వర్షాలు..జనజీవనం అస్తవ్యస్తం
చెన్నై:భారీ వర్షాలతో దక్షిణ తమిళనాడు అతలాకుతలం అవుతోంది. కన్యాకుమారి, తిరునల్వేలి, టెన్కాశి, తూత్తుకుడి జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల కారణంగా ఇప్పటివరకు నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. నాలుగు జిల్లాల్లో 7500 మందిని ఇప్పటికే రిలీఫ్ క్యాంపులకు తరలించారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఆర్మీ సహాయం కోరింది. తూత్తుకుడి జిల్లాలో కాయల్పట్టిణం ప్రాంతంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 94 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. రహదారులన్నీ జలమయమయ్యాయి.చాలా చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లే రైళ్ళను రద్దు చేశారు. కొమొరిన్ ప్రాంతంలో కేంద్రీకృతమైన తుపాను పొరుగు ప్రాంతాలకూ విస్తరిస్తోందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా కన్యాకుమారి, టెన్కాశి రెండు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేటు సంస్థలు, బ్యాంకులకు ప్రభుత్వం మంగళవారం(డిసెంబర్ 19) కూడా సెలవు ప్రకటించింది. అన్నా యూనివర్సిటీ పరీక్షలు వాయిదా వేశారు. తిరునల్వేలి జిల్లా కరుప్పంతురై ప్రాంతంలో వరదల కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 5-6 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ప్రజలు డాబాలపైనే తలదాచుకున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావంతో మొన్నటిదాకా చెన్నై నగరాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. எல்லாமே போச்சி😭💔 தென்காசி, கன்னியாகுமரி, திருநெல்வேலி, தூத்துக்குடி, விருதுநகர் போன்ற மாவட்டங்களில் கனமழை வெள்ளம். #தென்மாவட்டங்களுக்கு_உதவுவோம்#SouthTNRains #TNRains #HeavyRain #NellaiRains #Kanyakumari #Tirunelveli #TamilNadu pic.twitter.com/MoC7N0Fj6v — நீதிமான் (@Neethiman3) December 19, 2023 ఇదీచదవండి..లోక్సభ ఎన్నికల్లో యూపీ నుంచి రాహుల్, ప్రియాంక పోటీ? -
చేతులు కాలాక...
ప్రాణంమీదికొచ్చాక దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్యంపై ఆదరాబాదరాగా దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. డీజిల్ జనరేటర్లు వినియోగాన్ని ఆపేయాలని, థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఉత్త ర్వులిచ్చింది. నిర్మాణరంగం పనులు ఎక్కడికక్కడే నిలిపేయాలని ఆదేశించింది. అంతేకాదు... ఆ నగరంలో ఉన్న పాఠశాలలన్నిటికీ మూడురోజులు సెలవులు ప్రకటించారు. పని లేకపోతే బయటకు రావొద్దని పౌరులను కోరింది. పరిస్థితి తీవ్ర తను గమనించాక మంగళవారం సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఈ ఉప ద్రవాన్ని ఎదుర్కొనడానికి ఏం చేస్తారో 48 గంటల్లో చెప్పండంటూ కేంద్రాన్ని ఆదేశించింది. దీపావళి పండుగను బాణసంచాతో జరుపుకోవద్దన్న పర్యావరణ వేత్తల వినతులు... కోతలయ్యాక పంట చేలోని గడ్డి మోళ్లకు నిప్పెట్టవద్దన్న న్యాయ స్థానాల ఉత్తర్వులు అరణ్యరోదనగా మిగిలినప్పుడు ఇంతకన్నా వేరే స్థితిని ఊహిం చలేం. గడ్డి మోళ్లు తగలబెట్టడం వల్ల వచ్చే కాలుష్యం 20 శాతం మాత్రమేనని, మిగి లిందంతా ఢిల్లీలో పెట్రోల్, డీజిల్; బొగ్గు, కట్టెలు, ఎండుటాకులు, చెత్త తగ లేస్తుండటంవల్ల సంభవిస్తున్నదని ఈమధ్యే కేంద్ర పర్యావరణ మంత్రి అనిల్ దవే చెప్పారు. మంత్రి చెప్పిన జాబితాలో బాణసంచా లేదు. గడ్డి మోళ్ల ప్రస్తావన ఉన్నా దానివల్ల వచ్చేది 20 శాతమేనని ఆయన చెబుతున్నారు. మన దేశంలో సమస్య ఇదే. కాలుష్యం ముంచుకొస్తున్న వైనం తెలిసినా చురుగ్గా స్పందించరు. సమస్యను గుర్తించాకైనా లౌక్యం విడనాడి వ్యవహరించాలని భావించరు. కృత్రిమ వర్షం కురి పించడానికి గల సాధ్యాసాధ్యాలపై కేంద్రంతో చర్చిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంటున్నారు. అంతక్రితం ఎయిర్ ప్యూరిఫయర్ల గురించి కూడా ఇలాగే మాట్లాడారు. పరిమిత ప్రాంతంలో హెలికాప్టర్ల ద్వారా నీరు విరజిమ్మడం సాధ్యం కావచ్చేమోగానీ విస్తృతమైన భూభాగంలో అది అసాధ్యం. వాతావరణంలో మేఘా లుంటే క్లౌడ్ సీడ్ ప్రక్రియ ద్వారా వర్షం సాధ్యమవుతుంది. కానీ ఈ సమయంలో మేఘాలు ఎక్కడినుంచి వస్తాయి? రాగల నాలుగైదు రోజులు ఆకాశం నిర్మలంగా ఉంటుందని వాతావరణ కేంద్రం చెబుతున్నది. పైగా గాలి మంద్రంగానే వీస్తుం దని, తేమ శాతం పెరుగుతుందని, ఉష్ణోగ్రతలు పడిపోతాయని చావు కబురు మోసుకొస్తోంది. వాస్తవానికి ఈ సమయంలో సాధారణ స్థాయికి మించి గాలులు వీచడం, వాతావరణం పొడిగా ఉండటం రివాజు. కానీ పగబట్టినట్టు ఈసారి వాతా వరణం భిన్నంగా ఉంది. కేంద్ర మంత్రి చెప్పినట్లు గడ్డి మోళ్ల వల్ల జరిగే కాలుష్యం 20 శాతమే అనుకున్నా అదేమీ తక్కువ కాదు. న్యాయస్థానం జారీచేసిన ఉత్తర్వులు అమలు చేయలేకపోవడం మాట అటుంచి అసలు ఆ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్ట వచ్చునో అధికార యంత్రాంగం కసరత్తు చేసిన దాఖలాలు కనబడవు. పంజాబ్ ఎన్నికలు వచ్చిపడుతున్నాయి గనుక అక్కడి రైతుల జోలికి వెళ్లేందుకు ఆ రాష్ట్రం లోని అకాలీ-బీజేపీ ప్రభుత్వంగానీ, కేంద్రంగానీ సాహసించవు. బహుశా అందు వల్లే దాన్ని తగ్గించి చూపుతున్నారన్న అనుమానాలు కూడా అందరిలో ఉన్నాయి. రెండేళ్లనాడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఉంటే వాటి అమలుపై స్పష్టత వచ్చేది. పంజాబ్, హర్యానాల్లో ఎక్కువగా పెద్ద కమతాలుం డటం...వరి, గోధుమ పంటల కోతకు యంత్రాలే ఉపయోగించడం వాస్తవం. యంత్రాల సాయం తీసుకోవడం వల్ల పొలాల్లో మోళ్లు మిగిలిపోతాయి. వాటిని తగలబెట్టడం కాక తొలగించడానికి ప్రయత్నిస్తే రైతులకు తడిసి మోపెడు ఖర్చవు తుంది. ఇప్పటికే ఇన్పుట్ వ్యయం పెరిగి, సాగు ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించక ఇబ్బందులు పడుతున్న రైతులు మోళ్ల తొలగింపు పేరుతో మరింత భారాన్ని మోయగల స్థితిలో లేరు. మోళ్లను తగలబెట్టకుండా తొలగించే వారికి ఎకరానికి ఇంత చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వాలు ప్రకటించి ఉంటే రైతులు ఉత్సాహంగా ఆ పని చేసేవారు. ఎండు గడ్డిని సేంద్రియ ఎరువుగా మార్చే సాంకే తికత ఇప్పటికే అందుబాటులో ఉంది. దాంతోపాటు ఇంధన ఉత్పత్తి కోసం బయో మాస్ ప్లాంట్లకు ఆ వ్యర్థాలను తరలించవచ్చు. కానీ ఆ విషయంలో చొరవ తీసుకున్నవారేరి? మరికొన్ని రోజుల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం కోతలు మొదలవుతాయి. ఈలోగా పెనుగాలులు వీచి ఢిల్లీని ఆవరించి ఉన్న కాలుష్యం కొట్టుకుపోతే ఏమోగానీ... లేనట్టయితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుంది. ఢిల్లీ రాత్రికి రాత్రి గ్యాస్ చాంబర్గా మారిపోలేదు. దాదాపు రెండు దశా బ్దాలనుంచి అది క్రమేపీ ఆ దిశగా పోతోంది. కానీ ఎవరికి వారు పట్టనట్టు ఉన్నారు. కాలుష్యం విషయంలో సరి-బేసి కార్ల విధానాన్ని అమలు చేసినంత శ్రద్ధగా ఇతర అంశాలపైన కూడా దృష్టి పెట్టి ఉంటే వేరుగా ఉండేది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పటికిప్పుడు కాలుష్యంపై నగారా మోగించడంవల్ల రూ. 40కి మించని మాస్క్ల ధర రూ. 2,000 దాటిపోయిందని అంటున్నారు. నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థ పరమ అస్తవ్యస్థంగా ఉండటం వల్లనే వాహనాల సంఖ్య అపరిమితంగా పెరుగుతోందన్నది వాస్తవం. న్యూఢిల్లీలో మాత్రమే కాదు...తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖ తదితర నగరాలన్నిటా ఇదే దుస్థితి. సొంత వాహనాలుండటం హోదాకు చిహ్నంగా పరిగణించే రోజులు పోయి నగ రాల్లో బతకడానికి అవి తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. ఢిల్లీలో నిరుడు డిసెంబర్నాటికి దాదాపు 90 లక్షల వాహనాలున్నాయని ఒక సంస్థ అంచనా వేసింది. వీటికి రోజూ కొత్తగా రోడ్లపైకి వచ్చే వాహనాలు అదనం. మరోపక్క ఆ నగరంలో ఉండే సిటీ బస్సులు 6,000 మించవు. ఇందులో మరమ్మతులో ఉండేవి పోగా మిగిలినవి మాత్రమే ప్రయాణికుల అవసరాలు తీరుస్తాయి. ఇలాంటి పరి స్థితుల్లో సొంత వాహనాలు తప్ప సాధారణ పౌరులకు దిక్కేది? ఢిల్లీ దుస్థితి గమ నించాకైనా ఇతర రాష్ట్రాల్లోని పాలకులు గుణపాఠం నేర్చుకోవాలి. తమ నగరాల భవిష్యత్తు చిత్రపటాన్ని దర్శించుకుని తెలివి తెచ్చుకోవాలి. అపసవ్య విధానాలతో నగరాలను భ్రష్టుపట్టించే పోకడలను సరిచేసుకోవాలి. -
చిరుత కలకలం.. 134 స్కూళ్లకు సెలవు
బెంగళూరు: బెంగళూరులో చిరుతపులులు సంచరిస్తుండటంతో నగరంలోని 134 స్కూళ్లకు సెలవు ప్రకటించారు. బుధవారం నాడు 60 స్కూళ్లకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ గురువారం వాటి సంఖ్యను రెట్టింపు చేసింది. వారం రోజుల కిందట స్కూల్లోకి ఓ చిరుత వచ్చి నానా హడావుడి చేసి చివరకు తోక ముడిచి వెళ్లిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది కదూ. మరోసారి కూడా సరిగ్గా మళ్లీ అదే స్కూల్లోకి మరో చిరుత మంగళవారం ప్రవేశించింది. స్థానికులు మాత్రం తాము రెండు చిరుతలను చూసినట్లు చెబుతున్నారని అటవీ శాఖాధికారి ఒకరు వెల్లడించారు. వర్తూర్, మరాఠా హల్లి, దొడ్డనకనెల్లి, ఇమ్మాడిహల్లి, తూర్పు బెంగళూరు ఏరియాల్లోని అన్ని పాఠశాలలను మూసివేశారు. మంగళవారం చిరుతలు సంచరిస్తున్నాయన్న వార్తలతో బుధవారం నాడు కొన్ని ఏరియాల్లో స్కూళ్లకు ప్రకటించిన విషయం తెలిసిందే. పులులు ఉన్నాయని చెప్పడానికి తమ వద్ద రుజువులు లేనవి ప్రిన్సిపాల్ ఆఫ్ ఫారెస్ట్ చీఫ్ రవి రాల్ఫ్ పేర్కొన్నారు. అయినప్పటికీ తాము ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవడం లేదని, చిరుతల కోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలోనే పట్టుకుని తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విబ్జ్యార్ స్కూల్లోకి ఈనెల 7వ తేదీన ఒక చిరుత ప్రవేశించి, అటవీ శాఖాధికారులను గాయపరిచిన విషయం తెలిసిందే. మొత్తానికి బెంగళూరు వాసులు చిరుత సంచారంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement