-
భారత్కు భారీ ఓటమి
పెర్త్: ఆ్రస్టేలియాతో ఐదు టెస్టుల హాకీ సిరీస్ను భారత జట్టు పరాజయంతో మొదలు పెట్టింది. శనివారం జరిగిన తొలి టెస్టులో ఆ్రస్టేలియా 5–1 గోల్స్ తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. ఆరంభంనుంచి చివరి వరకు తమ పట్టు నిలబెట్టుకున్న కంగారూలు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ఆసీస్ సాధించిన ఐదు గోల్స్లో నాలుగు ఫీల్డ్ గోల్స్ కావడం విశేషం. ఆస్ట్రేలియా తరఫున బ్రాడ్ టిమ్ (3వ నిమిషం), వికామ్ టామ్ (20వ ని., 38వ ని.), రింటాలా జోయెల్ (37వ ని.), ఒగిల్వి ప్లయిన్ (57వ ని.) గోల్స్ కొట్టారు. భారత్ తరఫున ఏకైక గోల్ను గుర్జంత్ సింగ్ (47వ ని.) నమోదు చేశాడు. మ్యాచ్ మొదలైన కొద్ది సేపటికే లాంగ్ పాస్ అందుకున్న బ్రాడ్... భారత ఆటగాడు జర్మన్ప్రీత్ను దాటి గోల్ పోస్ట్ను ఛేదించడంలో సఫలమయ్యాడు. 10వ నిమిషంలో భారత్కు పెనాల్టీ దక్కినా అది గోల్గా మారలేదు. ఆ తర్వాత ఆసీస్ భారత డిఫెన్స్పై ఒత్తిడి పెంచింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచిన ఆసీస్ మూడో క్వార్టర్లోనూ దూకుడు సాగించింది. అయితే చివరి క్వార్టర్లో కోలుకున్న భారత్ ప్రతిఘటించింది. రెండు నిమిషాలకే రాహిల్ ఇచి్చన పాస్ను అందుకున్న గుర్జంత్ దానిని గోల్గా మలిచాడు. కొద్ది సేపటికే పెనాల్టీ వచి్చనా భారత్ దానిని సది్వనియోగం చేసుకోలేకపోయింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు నేడు జరుగుతుంది. -
Ind Vs Aus: భారత జట్టుకు మరో ఓటమి.. సిరీస్ ఆస్ట్రేలియాదే
India Vs Australia- Hockey Series: ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత జట్టు 1–4తో కోల్పోయింది. అడిలైడ్లో జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 4–5తో ఓడింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ (24వ, 60వ ని.లో) రెండు గోల్స్... అమిత్ రోహిదాస్ (34వ ని.లో), సుఖ్జీత్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఆస్ట్రేలియా తరఫున విఖామ్ (2వ, 17వ ని.లో) రెండు గోల్స్.. జలెవ్స్కీ (30వ ని.లో), అండర్సన్ (40వ ని.లో), వెటన్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కాగా ఈ సిరీస్లో భారత్కు ఒకే ఒక్క విజయం దక్కింది. మూడో మ్యాచ్లో టీమిండియా గెలుపొందింది. తద్వారా ప్రపంచ నంబర్వన్, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుపై ఆరేళ్ల విరామం తర్వాత తొలి విజయం నమోదు చేసిన జట్టుగా హర్మన్ప్రీత్ బృందం చరిత్ర సృష్టించింది. అయితే తొలి, చివరి రెండు మ్యాచ్లలో ఓడి ఆతిథ్య జట్టుకు సిరీస్ను అప్పగించింది. చదవండి: Ind Vs Ban: రాహుల్ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల కాదు.. బంగ్లా చేతిలో ఓటమికి కారణం వాళ్లే: భారత దిగ్గజం మా ఓటమికి కారణం అదే.. కానీ వారు అద్భుతంగా పోరాడారు: రోహిత్ శర్మ -
ఆరేళ్ల తర్వాత ఆసీస్పై భారత్ తొలి విజయం.. చివరి నిమిషంలో..
అడిలైడ్: ప్రపంచ నంబర్వన్, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుపై భారత జట్టు ఆరేళ్ల విరామం తర్వాత తొలి విజయం నమోదు చేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన భారత్... సిరీస్లో నిలబడాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసింది. చివరకు 4–3 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్లో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 1–2కి తగ్గించింది. నాలుగో మ్యాచ్ శనివారం జరుగుతుంది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (12వ ని.లో), అభిషేక్ (47వ ని.లో), షంషేర్ సింగ్ (57వ ని.లో), ఆకాశ్దీప్ సింగ్(60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఆకాశ్దీప్ చివరి నిమిషంలో.. మ్యాచ్ చివరి నిమిషంలో ఆకాశ్దీప్ గోల్ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా తరఫున జాక్ వెల్చ్ (25వ ని.లో), ఆరాన్ జలెవ్స్కీ (32వ ని.లో), నాథన్ ఎఫరాముస్ (59వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. నిర్ణీత సమయంలోపు ఫలితం తేలిన మ్యాచ్ల్లో భారత్ చివరిసారి 2016 నవంబర్ 29న ఆస్ట్రేలియాపై 3–2తో గెలిచింది. అనంతరం ఈ రెండు జట్ల మధ్య 13 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 10 సార్లు ఆసీస్ నిర్ణీత సమయంలోపు నెగ్గగా... నిర్ణీత సమయంలోపు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిసి వర్గీకరణ పాయింట్ల కోసం పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం నిర్ణయించిన రెండు మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. మరో మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. చదవండి: Lionel Messi: ప్రిక్వార్టర్స్లో అర్జెంటీనా! అయినా.. మెస్సీ అభిమానులకు తప్పని నిరాశ! Ind Vs NZ: 12 బంతుల తేడాతో టీమిండియాకు తప్పిన పరాజయం! ఎలాగంటే.. -
దక్షిణ కొరియా హాకీ సిరీస్కు రజని
న్యూఢిల్లీ: మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నీకి సన్నాహాల్లో భాగంగా దక్షిణ కొరియాలో పర్యటించే భారత హాకీ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులుగల ఈ జట్టుకు రాణి రాంపాల్ నాయకత్వం వహించనుంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరపు రజని రెండో గోల్కీపర్గా జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. జిన్చున్ నగరం వేదికగా జరిగే ఈ సిరీస్లో కొరియా జట్టుతో భారత్ మే 20, 22, 24 తేదీల్లో తలపడుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారత మహిళల జట్టు స్పెయిన్, ఐర్లాండ్, మలేసియాలలో పర్యటించింది. స్పెయిన్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత్ రెండు మ్యాచ్ల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని ఒక దాంట్లో ఓడిపోయింది. మలేసియాతో జరిగిన సిరీస్లో భారత్ 4–0తో గెలిచింది. భారత మహిళల హాకీ జట్టు: సవిత, ఇతిమరపు రజని (గోల్కీపర్లు), రాణి రాంపాల్ (కెప్టెన్), సలీమా, సునీత లాక్రా, దీప్ గ్రేస్ ఎక్కా, కరిష్మా యాదవ్, గుర్జీత్ కౌర్, సుశీలా చాను, మోనిక, నవ్జ్యోత్ కౌర్, నిక్కీ ప్రధాన్, నేహా గోయల్, లిలిమా మిన్జ్, వందన కటారియా, లాల్రెమ్సియామి, జ్యోతి, నవనీత్ కౌర్. -
భారత్ అజేయంగా
కౌలాలంపూర్: మలేసియాతో జరిగిన ఐదు మ్యాచ్ల హాకీ సిరీస్లో భారత మహిళల జట్టు అజేయంగా నిలిచింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లోనూ భారత్ 1–0తో మలేసియాపై గెలుపొందింది. మ్యాచ్లో నమోదైన ఏకైక గోల్ను ఆట 35వ నిమిషంలో నవ్జ్యోత్ కౌర్ సాధించింది. ఈ సిరీస్లో భారత్ వరుసగా తొలి నాలుగు మ్యాచ్ల్లో 3–0, 5–0, 4–4, 1–0 గోల్స్తో ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఐదో మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించి 4–0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఆరంభంలో ఇరు జట్లు పోటాపోటీగా తలపడటంతో రెండు క్వార్టర్ల పాటు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే మూడో క్వార్టర్లో నవ్జ్యోత్ కౌర్ అద్భుత ఫీల్డ్ గోల్తో భారత్ ఖాతా తెరిచింది. ఆధిక్యాన్ని దక్కించుకున్న భారత మహిళలు ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ముగించారు. ఈ విజయంపై కోచ్ జోయెర్డ్ మరీనే మాట్లాడుతూ ‘ భారత్ గోల్ చేసే అవకాశాలు సృష్టించుకున్న తీరు అభినందనీయం. ప్రత్యర్థి గోల్ ఏరియాలోకి చాలా సార్లు దూసుకెళ్లి వారిపై ఒత్తిడి పెంచాం. కానీ పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచలేకపోతున్నాం. దీనిపై దృష్టి సారించాలి’ అని పేర్కొన్నాడు. ఓవరాల్గా ఈ టూర్ యువ క్రీడాకారిణులకు మంచి అనుభవాన్ని ఇచ్చింది’ అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement