-
వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్నిరకాల వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్రెడ్డి రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన రోడ్ సేఫ్టీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో జవహర్రెడ్డి మాట్లాడుతూ.. నూతన వాహనాలు కొనుగోలు చేసే వారికి సంబంధిత డీలర్లు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లతో వాహనాలను అందించేలా చూడాలన్నారు. పాత వాహనదారులు కూడా నిర్దిష్ట వ్యవధిలోగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వ వాహనాలపై అధికారుల హోదాతో కూడిన నేమ్ బోర్డులు ఉంటున్నాయని, ఆ విధంగా చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ వాహనం అని మాత్రమే ఉండాలన్నారు. రేడియం టేప్ అతికించాలి ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని రవాణా, అద్దె వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, ట్రక్కులు వంటి వాహనాల వెనుక భాగంలో విధిగా రేడియం టేప్ అతికించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ అవకాశాలున్న అన్ని ముఖ్య కూడళ్లలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించాలని రవాణా, పోలీస్ శాఖలను ఆదేశించారు. ఆర్ అండ్ బీ కార్యదర్శి ప్రద్యుమ్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండా అంశాలను వివరించారు. 15 ఏళ్లు దాటిన పాత వాహనాలు స్క్రాపింగ్ చేసేందుకు వీలుగా స్క్రాపింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నం, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో ఆటోమేషన్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ సివిల్ పనుల ప్రతిపాదనలకు కమిటీ ఆమోదించింది. కొన్ని జిల్లాల్లో ఈ ట్రాక్స్ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్కుమార్గుప్త, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, అదనపు డీజీపీ (రోడ్డు సేఫ్టీ) కృపానంద త్రిపాఠి ఉజేల, రవాణా శాఖ అదనపు కమిషనర్ ఎస్ఏవీ ప్రసాదరావు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 1 నుంచి షోరూంల్లోనే నంబర్ ప్లేట్
సాక్షి, హైదరాబాద్: హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విషయంలో రాష్ట్ర రవాణా శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోవడం తప్పనిసరయినా.. కొందరు వీటిపై ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఇలాంటి వారు సైతం విధిగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోవాలన్న ఆలోచనతో షోరూంల్లోనే వీటిని బిగించేలా రవాణా శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రతీ వాహనానికి సంబంధించిన సాంకేతిక వివరాలతోపాటు, వాహన యజమాని వ్యక్తిగత వివరాలు పొందుపరిచేలా.. బయోమెట్రిక్ యంత్రాలు సమకూర్చుకోవాలని షోరూంలకు ఆదేశాలు జారీ చేసింది. హైసెక్యూరిటీ ప్లేట్ల విషయంలోనూ ఇదే విధానం పాటించనుంది. ఇకపై షోరూంల్లో రిజిస్ట్రేషనయ్యే బైకులు, కార్లు, తదితర నాన్ట్రాన్స్పోర్టు వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్లు అక్కడే బిగించి బయటకు పంపుతారు. హైసెక్యూరిటీ తప్పనిసరి ఎందుకు? వాహనాల విషయంలో పలువురు అవకతవకలకు పాల్పడటం, ఒకే నంబర్పై అనేక వాహనాలు నడపటం, పేలుళ్లకు చోరీ చేసిన వాహనాలు వినియోగించడం తదితర ఘటనలు పెరుగుతున్న దరిమిలా.. 2012లోనే హైసెక్యూరిటీ ప్లేట్ల బిగింపును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2015, డిసెంబర్ నాటికి పాత, కొత్త వాహనాలకు వీటిని తప్పనిసరి చేసింది. అయితే, అప్పటి నుంచి కొత్త వాహనాలకు మాత్రమే వీటిని బిగిస్తున్నారు. బైక్కు రూ.245, ఆటోకు రూ.400, కారుకు రూ.619 వసూలు చేస్తున్నారు. షోరూంలో వాహనం కొనుగోలు సమయంలోనే ఈ రుసుము చెల్లించాలి. నంబర్ప్లేట్ సిద్ధం కాగానే వాహనదారుడికి ఎస్ఎమ్ఎస్ వస్తుంది. అపుడు వెళ్లి దాన్ని బిగించుకోవాలి. అసలు ఇలాంటి వాహనాలకు ఆర్సీలు పంపడం వల్లే వాహనదారులు కొందరు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లపై ఆసక్తి చూపడం లేదని తెలంగాణ ఆటోమోటార్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ ఆరోపించారు. వాస్తవానికి ఇలాంటి వాహనాలకు చలానాలకు బదులు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అమలులో అనేక లోపాలు.. వాస్తవానికి ఈ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు చాలా పలుచగా ఉన్నాయని విమర్శలున్నాయి. వీటిని పిల్లలు సైతం వంచడం లేదా పీకేయడం సులువుగా చేస్తున్నారు. దీంతో ఈ ప్లేట్లు అమర్చాక పట్టుమని 10 నెలలు కూడా ఉండటం లేదని వాహనదారులు వాపోతున్నారు. మరోవైపు ఇవి ఆకర్షణీయంగా లేవన్న కారణంతో యువకులు చాలామంది బిగించుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో చాలా వరకు హైసెక్యూరిటీ నంబర్ప్లేట్లు ఆర్టీఏ కార్యాలయాల్లో మూలకు పడుతున్నాయి. ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొందరు నంబర్ప్లేట్లను వంచడం, విరగ్గొట్టడం చేస్తున్నారు. ఈ నంబర్ ప్లేట్ రెండోసారి బిగించుకోవాలంటే ఎఫ్ఐఆర్ తప్పనిసరి. ఈ తతంగమంతా ఎందుకులే అని వాహనదారులు వారే కొత్త ప్లేట్ వేయించుకుంటున్నారు. హైసెక్యూరిటీ నంబర్ప్లేట్ లేకుండా తిరిగినప్పుడు ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు చలానా రాస్తారు. అయినా.. వాహనదారులు చలానాలు కడుతున్నారు తప్ప.. వీటిని బిగించుకోవడంపై ఆసక్తి చూపడం లేదు. -
వాహనదారులందరికి గమనిక!
న్యూఢిల్లీ : 2019 ఏప్రిల్1 నుంచి అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే వాటిపై తప్పనిసరిగా అధికారిక హోలోగ్రామ్ కలిగిన స్టిక్కర్ సైతం ఉండాలని, వాహన తయారీదారులందరూ ఈ విషయాన్ని తమ డీలర్లకు తెలియజేయాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీ లోక్సభకు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ట్యాంపర్ ప్రూఫ్ హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లతో దొంగతనాలను అరికట్టడమే కాకుండా, నకిలీ నెంబర్లకు అడ్డుకట్ట వేయొచ్చు. ఏప్రిల్ 1 నుంచి వాహనాన్ని తయారు చేసే కంపెనీలే వాహనంతోపాటు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్, థర్డ్ రిజిస్ట్రేషన్ మార్క్లను డీలర్లకు సరఫరా చేయాలని ఆదేశించినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్ 1989లో చేయాల్సిన మార్పులను ప్రజాభిప్రాయం కోసం ఉంచామని, దీనిపై సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ ఏడాది జూన్ 5న దీనికి సంబంధించి సమావేశం కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. -
ఆ నెంబర్ ప్లేట్.. ఎందుకంత లేట్..
సాక్షి, సిటీబ్యూరో: హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్. వాహనాల భద్రతకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పథకాన్ని ప్రారంభించిన 5 ఏళ్లు గడిచినా లక్షలాది వాహనాలు ఇంకా ఈ పథకానికి దూరంగానే ఉన్నాయి. హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) అమలులో రవాణ శాఖ చేపట్టే చర్యలు పూర్తిస్థాయి ఫలితాలను అందజేయలేకపోతున్నాయి. ఇటీవల కాగ్ నివేదికలోనూ ఇదే అంశం వెల్లడైంది. ఈ పథకం అమల్లోకి వచ్చి ఐదేళ్లయినా ఇంకా 2,92,843 వాహనాలు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు బదులు సాధారణ నెంబర్ ప్లేట్లనే వినియోగిస్తున్నట్లు కాగ్ స్పష్టం చేసింది. ఇక ఈ పథకం అమల్లోకి వచ్చిన 2013 సంవత్సరానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో నమోదైన మరో 30 లక్షల వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల ఏర్పాటు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. మొత్తంగా ఈ పథకం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా మారింది. భద్రతకు భరోసా ఏదీ...? హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల ఏర్పాటు ఒక ప్రహసనంగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో ఏ రోజుకు ఆ రోజు నమోదయ్యే కొత్త వాహనాలకు మొదట బిగించి, ఆ తరువాత క్రమంగా పాత వాహనాలకు కూడా ఈ నెంబర్ ప్లేట్లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ కొత్త వాహనాల లక్ష్యమే ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికీ 2.98 లక్షల వాహనాలు పెండింగ్లో ఉండటమే ఇందుకు ఉదాహరణ. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2015 డిసెంబర్ నాటికే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కానీ ఐదేళ్లు గడిచిన తరువాత కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమల్లోని జాప్యంపై కాగ్ అక్షింతలు వేయడం దీని అమల్లోని నిర్లక్ష్యాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రతిరోజు సుమారు 1,500 వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి. ఆర్టీఏ కార్యాలయంలో నమోదయ్యే ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్తో పాటు నెంబర్ ప్లేట్ కూడా అప్పటికప్పుడే బిగించే సదుపాయం ఉంటే చాలా వరకు జాప్యం లేకుండా ఉండేది. కానీ వాహనం నమోదుకు, నెంబర్ ప్లేట్ ఏర్పాటుకు మధ్య 15 రోజుల నుంచి నెల వరకు గడవు విధిస్తున్నారు. దీంతో వాహనదారుల్లో నిర్లక్ష్యం నెలకొంటోంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు ఖైరతాబాద్లో మాత్రం ప్రయోగాత్మకంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. హెచ్ఎస్ఆర్పీ ఉన్న వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ స్మార్ట్ కార్డు అందజేస్తున్నారు. అలాగే ఆదివారం సెలవు దినమైనా హెచ్ఎస్ఆర్పీ కేంద్రాన్ని తెరిచి ఉంచుతున్నారు. ఈ చర్యల వల్ల ఖైరతాబాద్లో వీటి అమలు బాగానే ఉంది. కానీ మిగతా ఆర్టీఏల్లో ఇలాంటి ప్రత్యేక చర్యలు లేకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. నాణ్యత డొల్ల... మరోవైపు వాహనాల భద్రతకు ప్రతీకగా భావించే హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లలో నాణ్యత కొరవడింది. విరిగిపోవడం, పూర్తిగా రంగు పోవడం, వాహనదారులు ఆశించిన విధంగా నెంబర్ ప్లేట్లు ఆకర్షణీయంగా లేకపోవడంతో చాలా మంది విముఖత చూపుతున్నారు. హెఎండ్ వాహనదారులు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు కలిగిన వారు, రకరకాల ఫ్యాన్సీ నంబర్లు, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్లు పొందిన వాహనదారులు వాటిని తమకు నచ్చిన విధంగా ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ నాణ్యత లేని, రంగు వెలిసిపోయే హెచ్ఎస్ఆర్పీని మాత్రం కోరుకోవడం లేదు. ఈ పథకం విజయవంతంగా అమలు కాకపోవడానికి ఇదీ ఒక కారణం. కాగ్ నివేదికపై సమీక్ష... కాగ్ నివేదికలో వెల్లడించిన అంశాలపై ఈ నెల 4వ తేదీన రవాణ మంత్రి మహేందర్రెడ్డి సమీక్షించనున్నారు. లోపాలను సరిద్దిద్దుకొని హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు, ఇతర అంశాలపైన కూడా చర్చించనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు. -
ప్లేట్ ఫిరాయింపు..
హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లంటే వాహనదారులు ముఖం చాటేస్తున్నారు. జిల్లాలో రవాణా శాఖ కార్యాలయంలో ఈ డిజిటల్ నంబరు ప్లేట్లు కుప్పలుగా పేరుకుపోయాయి. వివిధ కారణాలతో వాహనదారులు వీటిని నివినియోగించుకోవడం లేదు. కనీసం వీటిని వాహనానికి పెట్టుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో వాహనదారు ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్ల కోసం డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): ద్విచక్ర వాహనానికి రూ.245, మూడు చక్రాల వాహనాలకు రూ.282, నాలుగు చక్రాల వాహనాలకు రూ.619 చొప్పున వాహనాదారులు రవాణా శాఖ కార్యాలయంలో డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ డబ్బులను సంబంధిత హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ల తయారీ కాంట్రాక్టర్కు చెల్లిస్తారు. ఈ నంబరు వాహనం రిజిస్ట్రేషన్ అయిన 4 రోజులలోపే రవాణా శాఖ కార్యాలయానికి వస్తుంది. వాహనాదారు మొబైల్కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలల్లో డబ్బు చెల్లిస్తూ వాటిని సొంతం చేసుకుంటున్నారు వాహనాదారులు. ఈ హైసెక్యూరిటీ నంబరు పలకలను వాడటానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఊదాహరణకు టీఎస్ 36 జెడ్ 0001 నంబరు గల వాహనాన్ని వినియోగదారు ఫాన్సీ నంబరు కావడంతో వేలల్లో డబ్బు ఖర్చు చేసి ఈ నంబరును సొంతం చేసుకుంటున్నాడు. హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను మాత్రం వినియోగించుకోవడం లేదు. కారణం ఏమిటంటే అతను తన వాహనంపై టీఎస్ 36 జెడ్ 1 అని ఉంటే... 1ని హైలైట్ చేస్తు రాసుకుంటారు. ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లలో ఈలాంటి అవకాశం వాహనదారుకు లభించదు. అందుకే వాహనదారులు ఈ హైసుక్యూరిటీ ప్లేట్లను విస్మరిస్తున్నారు. వాహనం నంబరుపై తన ఇష్టమైన వేరే అంకేలు గల డూప్లికేట్ నంబరు ప్లేట్లను వాడుతున్నారు. దీంతో వీరు ప్రమాదంలో భాగస్వామ్యులైతే వారిని గుర్తించడం కష్టంగా ఉంటుంది. అందుకే ప్రతి వాహనదారు ఖచ్చితంగా హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లను వాడాలి. వీటితో అనేక లాభాలు వాహనదారులకు ఉన్నప్పటికీ వాటిపై వాహనదారుల్లో అవగాహన కరువైంది. దీంతో భారత ప్రభుత్వం 2013 డిసెంబర్ నుంచి ఏంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు గదుల్లోనే మూలుగుతున్నాయి. 2013 డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనానికి ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్లేట్లలోని లేజర్ కోడింగ్తో వాహనదారు పూర్తి వివరాలు ఉంటాయి. ఈ ప్లేట్లతో భారత దేశంలో గల వాహనాలన్నింటినీ ఆన్లైన్లో గుర్తించడం సాధ్యం అవుతుంది. ఒకవేళ వాహనం దొంగతనానికి గురైతే ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లతో వాహనాన్ని తొందరగా పట్టుకోవచ్చు. వాహనదారు వాహనాన్ని ఎవరైనా తస్కరిస్తే దాన్ని గుర్తించడం తెలికవుతుంది. వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, తదితర వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. వాడకపోతే ఏమవుతుంది ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను వాహనదారులు వాడకపోతే... వాహనానికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలైనా... నిలిపివేయబడతాయి. దీంతో వాహనదారులు వాహనాన్ని ఇతరులకు అమ్మాలన్నా... ఇతరుల నుంచి ఖరీదు చేయాలన్నా కష్టం అవుతుంది. రవాణా శాఖ అధికారులు వాహన ఇన్సూన్స్, ఫిట్నెస్, ట్యాక్స్ తదితర ముఖ్య సేవలు నిలిపివేస్తారు. జిల్లాలో 2013 నుంచి 46,535 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి వాహనాదారులు తీసుకుపోయిన నంబరు ప్లేట్లు 39,515 ఇంకా వాహనాదారులు వాడని ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు 7,020. హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లనే వాడాలి ప్రతి వాహనాదారు ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లనే తన వాహనానికి ఉపయోగించాలి. ఒకవేళ ఉపయోగించని వాహనాలు తనిఖీల్లో అధికారులకు పట్టుబడితే సీజ్ చేస్తారు. వాహన సేవలు నిలిపి వేస్తారు. వాహనాదారులు ఖచ్చితంగా ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను వాడాల్సిందే. ఈహైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు వాడటంతో వాహనాదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. – రామేశ్వర్రెడ్డి, సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
తప్పక చదవండి
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement