-
మూడో కేంద్రం మూసివేత
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే మహబూబ్నగర్, హైదరాబాద్ విద్యానగర్లోని ఆరోగ్య శిక్షణ కేంద్రాలకు తాళాలు వేసిన ఆంధ్ర మహిళా సభ యాజమాన్యం సంగారెడ్డిలో మరో కేంద్రాన్ని మూసేసింది. గురువారం అర్ధరాత్రి ఈ కేంద్రానికి తాళం వేసింది. దీంతో తెలంగాణలోని మొత్తం 3 సెంటర్లు మూతపడ్డాయి. ఇందులో దాదాపు 60 మంది పేద విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఉన్నట్టుండి ఇలా సెంటర్లు మూసివేస్తే తమ భవిష్యత్తు ఏమౌతుందని విద్యార్థులు, అందులో పని చేస్తున్న ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కోసం ‘తెలంగాణ మహిళా సభ’ను ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా శిక్షణ తరగతులు నిర్వహించాలని కోరుతున్నారు. ఈ సెంటర్ల స్థలాలు ఆంధ్ర మహిళా సభ యాజమాన్యానివి కావడం వల్లే ఇలాంటి దౌర్జన్యానికి ఒడికట్టారని సెంటర్ల ప్రిన్సిపల్స్ అభిప్రాయపడుతున్నారు. ముందస్తు సమాచారం కూడా లేకుండా.. శిక్షణ కేంద్రాల మూసివేతపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి అమర్సింగ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలను రాష్ట్ర వైద్యశాఖ అధికారులకు వివరించారు. త్వరలోనే శిక్షణకు అయ్యే గ్రాంటును విడుదల చే స్తామని అధికారులు చెప్పినట్టు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. యాభై ఏళ్లుగా నిర్విరామంగా శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తున్న సెంటర్కి తాళం వేసే ముందు కనీసం జిల్లా కలెక్టర్కుగానీ, జిల్లా వైద్యాధికారికిగానీ చెప్పలేదని, ఆంధ్ర మహిళా సభ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 10 నెలల కిందటే మూసేయాల్సింది! శిక్షణ కేంద్రాల మూసివేత, విద్యార్థుల భవిష్యత్తుపై ఆంధ్ర మహిళా సభ ఉపాధ్యక్షురాలు ఉషారెడ్డిని ప్రశ్నించగా.. ‘‘ఇంత పెద్ద సంస్థను నడుపుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రావడం చాలా సహజం. నిజానికి పది నెలల క్రితమే ఈ సంస్థలకు గ్రాంట్ ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం మాకు తెలిపింది. అప్పుడే మూసేయాల్సింది. అప్పట్లో యాజమాన్య సభ్యులు ఆ పని చేయలేదు. మూడు నెలల క్రితం కొత్తగా వచ్చిన మా టీం సెంటర్లను మూసేయాలన్న నిర్ణయం తీసుకుంది’’ అని సమాధానమిచ్చారు. అలాం టప్పుడు విద్యార్థులను సెంటర్లలో ఎందుకు చేర్చుకున్నారని అడగ్గా.. ‘‘ఇప్పుడు చెప్పడం వల్ల ఏం నష్టం జరిగింది? ఉచితంగా ఇచ్చే శిక్షణే కదా!’’ అని వ్యాఖ్యానించారు. రోడ్డున పడ్డ బతుకులు శ్రీను అనే వృద్ధుడు విద్యానగర్ హెల్త్ సెంటర్లో గత కొన్నేళ్లుగా వంట మని షిగా పనిచేస్తున్నాడు. ఆయన పెద్ద కూతురు ఉష రోడ్డు ప్రమాదంలో భర్తను పోగొట్టుకుని తండ్రి చెంతకు వచ్చింది. ఇంటర్ చదువుకున్న ఉషను గత నెలలో ఈ శిక్షణ కేంద్రంలో చేర్పించాడు. పేద మహిళలకు, భర్తను పోగొట్టుకున్న మహిళలకు శిక్షణ ఇచ్చే ఈ కేంద్రాల్లో ఉషలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఉన్నట్టుండి సెంటర్లను మూసేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. ‘‘ఈ సెంటర్లో రెండేళ్లు నా బిడ్డ పని నేర్చుకుంటే ఆ తర్వాత ఆమె భవిష్యత్తు మంచిగుంటదని ఎన్నో ఆశలు పెట్టుకున్న. ఇట్ల ఈ సెంటర్ మూసేస్తరని మాకు తెల్వదు. రెండో బిడ్డకు పెళ్లి చేయడం కోసం ఆరోగ్యం బాగలేకపోయినా ఏవో తిప్పలు పడుతున్న..’’ అని శ్రీను గోడు వెళ్లబోసుకున్నాడు. -
ఆరోగ్య శిక్షణ కేంద్రాలకు తాళాలు!
* మూసివేసిన ఆంధ్ర మహిళా సభ యాజమాన్యం * 1న మహబూబ్నగర్లో, 3న హైదరాబాద్లోని కేంద్రం మూసివేత * ఆందోళనలో ఉద్యోగులు, విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థినిలకు ఉచితంగా నర్సింగ్ శిక్షణ ఇస్తున్న మల్టీపర్పస్ హెల్త్ సెంటర్లకు ఆంధ్ర మహిళాసభ యాజమాన్యం అకస్మాత్తుగా తాళం వేసింది! దీంతో ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. ఈ నెల 1న మహబూబ్ నగర్, 3న హైదరాబాద్లోని విద్యానగర్ సెంటర్కు తాళాలు వేశారు. అదేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వడం లేదని చెబుతోంది. ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా సెంటర్లకు తాళాలు వేస్తున్న యాజమాన్యంపై చర్య తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఆశలతో... జాతీయ ఆరోగ్య మిషన్ గ్రాంట్తో నడుస్తోన్న ఈ శిక్షణ కేంద్రాలకు రాష్ట్ర విభజన సమయంలో గ్రాంట్ రిలీజ్లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దీంతో గత 18 నెలలుగా కేంద్రాల్లోని ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. పదేళ్ల క్రితం వరకూ పదోతరగతి పూర్తిచేసుకున్న పేద, వితంతు మహిళలకు 18 నెలల పాటు ప్రాథమిక ఆరోగ్య శిక్షణ ఇస్తున్న ఈ కేంద్రాలు ప్రస్తుతం ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు రెండేళ్లపాటు శిక్షణ ఇస్తున్నాయి. సెంటర్కు 40 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ ఏడాది మొదటి జాబితా కింద మూడు సెంటర్లలో దాదాపు 50 మంది విద్యార్థులు కేంద్రాల్లో చేరారు. ఇలా అకస్మాత్తుగా సెంటర్లకు తాళం వేయడంతో ఏం చేయాలో అర్థం కాక విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. ‘‘పూట గడవని పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని నేను. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఈ సెంటర్లో చేరాను. ఇప్పుడు ఇలా అకస్మాత్తుగా సెంటర్ నుంచి బయటికి పొమ్మంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు’’ అని మహబూబ్నగర్కి చెందిన లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. వాణిజ్య సంపద కోసమేనా... ఈ సెంటర్ల మూసివేతలో కొత్త కోణం వెలుగు చూసింది. మహబూబ్నగర్లో ఉన్న సెంటర్పై ఒక వసతి గృహాన్ని, కమర్షల్ షాపులను నిర్మించారు. వీటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన ఆంధ్ర మహిళా సభ యాజమాన్యం కమర్షియల్గా వచ్చిన ఆదాయాన్ని జీతాలకు, విద్యార్థులకిచ్చే స్టైఫండ్కి ఉపయోగిస్తామని చెప్పింది. అయితే ఏనాడు ఆ మాట నిలబెట్టుకోలేదని అక్కడి విద్యా సంస్థల అధికారి జ్యోతి చెప్పారు. ‘‘దశాబ్దాలుగా ఈ కేంద్రాలనే నమ్ముకుని బతుకుతున్న మాపై దౌర్జన్యం చేసి బయటికి పంపాల్సిన అవసరం ఆంధ్ర మహిళా సభకు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఈ ఏడాది రెండు జాబితాల్లో మూడు సెంటర్లలో 120 మంది పేద విద్యార్థులు శిక్షణ తీసుకోనున్నారు. వారి సర్టిఫికెట్లు అన్నీ మా దగ్గరే ఉన్నాయి. సంక్రాంతి సెలవులకు వెళ్లిన వారికి ఇక కేంద్రాలకు రావొద్దని చెప్పాలని యాజమాన్యం మాకు ఆర్డర్ పాస్ చేసింది’’ అని ఆమె వివరించారు. ‘‘విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం అన్యాయం. ఉద్యోగులు, విద్యార్థుల ఇబ్బందులన్నింటినీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన వెంటనే స్పందించారు. త్వరలో మా విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ సాయంతో శిక్షణ ఇప్పించే ఏర్పాటు చేస్తామన్నారు’’ అని మహబూబ్నగర్ కేంద్రం ప్రిన్సిపల్ విజయకుమారి చెప్పారు. నేను తర్వాత మాట్లాతా: విమల సెంటర్లను మూసివేయడంపై ప్రశ్నించగా ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలు విమల మొక్కుబడి సమాధానమిచ్చారు. ‘‘నేను ప్రస్తుతం మద్రాసులో ఉన్నాను. దీనిపై తర్వాత మాట్లాడతా..’ అంటూ ఫోన్ పెట్టేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement