-
SBI: హెల్త్కేర్ బిజినెస్ లోన్ ద్వారా ఎంత రుణం పొందవచ్చు ?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఎస్బీఐ ‘ఆరోగ్యం హెల్త్కేర్ బిజినెస్ లోన్’ను ఆవిష్కరించింది. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఆరోగ్య సంరక్షణ రంగానికి మద్దతుగా రుణ పథకాన్ని తీసుకొచ్చింది. ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్లు, డయాగ్నోస్టిక్స్ ల్యాబ్లు, పాథాలజీ ల్యాబ్లు, తయారీ కంపెనీలు, సరఫరాదారులు, దిగుమతిదారులు, రవాణా సంస్థలు ఇలా ఆరోగ్యసంరక్షణ రంగంతో ముడిపడిన అన్ని రంగాల కంపెనీలకు ఈ పథకం కింద రుణాలను ఎస్బీఐ మంజూరు చేయనుంది. సామర్థ్య విస్తరణ లేదా ఆధునికీకరణ లేదా మూలధన అవసరాల కోసం టర్మ్లోన్ను తీసుకునేందుకు అర్హులని బ్యాంకు తెలిపింది. గరిష్టంగా రూ. 100 కోట్లు మెట్రో కేంద్రాల్లో అయితే ఒక్కో దరఖాస్తుదారు గరిష్టంగా రూ.100 కోట్లను తీసుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో రుణ గరిష్ట పరిమితి రూ.10–20 కోట్ల మధ్యనుంది. రూ.2 కోట్ల వరకు తీసుకునే రుణాలకు ఎటువంటి తనఖా / హామీనిగానీ సమర్పించాల్సిన అవసరం లేదు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత హెల్త్ కేర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా భారీ ఎత్తున రుణాలుఏ మంజూరు చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. దానికి తగ్గట్టుగా ఎస్బీఐ హెల్త్ కేర్ బిజినెస్ లోన్ను ప్రవేశపెట్టింది. చదవండి : డీమోనిటైజేషన్: ఆవి డబ్బులే, వివరణ అవసరం లేదు -
మన సన్నద్ధత ఎంత?
కరోనా ఫస్ట్ వేవ్ను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచ దేశాలతో భేష్ అనిపించుకున్నాం. సెకండ్ వేవ్ వచ్చేసరికి చతికిలపడిపోయి చిన్నాచితకా దేశాల సాయం కూడా తీసుకున్నాం. మరి ఒకవేళ మూడో వేవ్ వస్తే ఎలా ఎదుర్కోగలం? పులి మీద పుట్రలా కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్ మరింత దడ పుట్టిస్తోంది. ప్రస్తుతం కేసులు తగ్గి పరిస్థితులు ఆశాజనకంగా కనిపిస్తున్నా సెప్టెంబర్–అక్టోబర్లో థర్డ్ వేవ్ కాటేస్తుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ వ్యాక్సినేషన్తో పాటు థర్డ్వేవ్ను ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగ నిపుణులు చెప్పిన సలహాలు, సూచనలు, ప్రభుత్వాల సన్నద్ధత ఏమిటో చూద్దాం... కరోనా పరీక్షలు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కరోనా పరీక్ష కేంద్రాలు, శాంపిల్ సేకరణ కేంద్రాలు లేవు. దేశం మొత్తం మీద 735 జిల్లాలకు గాను 31 జిల్లాల్లో ప్రజలకి కరోనా సోకిందన్న అనుమానం వస్తే పరీక్ష చేయించుకోవాలంటే మరో జిల్లాకు వెళ్లాలి. కరోనాని అరికట్టాలంటే త్వరగా పరీక్షలు నిర్వహించడం అంత్యంత ముఖ్యం. ప్రతి ఒక్కరికీ కిలోమీటర్ దూరంలోనే శాంపుల్ కలెక్షన్ కేంద్రాలు పెడితేనే థర్డ్వేవ్ను ఎదుర్కోవడం సాధ్యపడుతుంది. నిరుపేదలకు వైద్యం మన దేశంలో నిరుపేదలకు వైద్యం అందుబాటులో లేదు. నేషనల్ స్టాటస్టికల్ ఆఫీసు (ఎన్ఎస్ఓ) గణాంకాల ప్రకారం మన దేశ జనాభాలో 30% మందికి జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటికి వైద్యుల్ని సంప్రదించే అలవాటు లేదు. సెకండ్ వేవ్లో కోవిడ్ గ్రామాలకూ విస్తరించింది. అందువల్ల గ్రామీణుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలి. లక్షణాలను తేలికగా తీసుకోవద్దనేది ప్రజల్లోకి వెళ్లాలి. అప్పుడే కరోనా వ్యాప్తి నిరోధానికి అడ్డుకట్ట పడుతుంది. ఆస్పత్రులు– ఆర్థిక భారం కరోనా సోకి ఆస్పత్రికి వెళ్లాలంటే దడ పుట్టే రోజులున్నాయి. లక్షలకి లక్షలు బిల్లు చెల్లించలేక జనం కుదేలైపోతున్నారు. దేశ ప్రజల్లో 81% మంది నెలకి వచ్చే ఆదాయంలోనే ఆస్పత్రి ఖర్చులు కూడా భరించాలి. కరోనా వంటివి వస్తే అప్పో సొప్పో చేయాల్సిన దుస్థితి. మిగిలిన వారు ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచాలి. హెల్త్ ఇన్సూరెన్స్లు మొదటి రెండు కరోనా వేవ్లలో ఆస్పత్రి పాలైన కోవిడ్–19 రోగుల్లో 75 శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ ఉన్న వారికి కరోనా చికిత్స మొత్తం కవర్ కావడం లేదు. నేషనల్ స్టాటస్టికల్ ఆఫీసు (ఎన్ఎస్ఓ) అంచనాల ప్రకారం రోగులకయ్యే మొత్తం ఖర్చులో 10 శాతం కూడా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తిరిగి రావడం లేదు. దీంతో లక్షల్లో బిల్లులు కట్టుకోలేక జనం కరోనా పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ వ్యవస్థను పటిష్టపరిస్తే కరోనా రోగులు ధీమాగా ఆస్పత్రికి వెళ్లే రోజులొస్తాయి. ఆక్సిజన్ ప్లాంట్స్ కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ లేక మనుషులు పిట్టల్లా రాలిపోయారు. థర్డ్ వేవ్లో ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పీఎం కేర్ ఫండ్స్ నిధులను వినియోగించి వివిధ జిల్లాల్లో 850 వరకు ఆక్సిజన్ ప్లాంట్లను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఏర్పాటు చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించి... పరిస్థితిని మెరుగుపరిచే దిశగా పలు చర్యలు చేపట్టాయి. స్వయం సమృద్ధంగా ఉండటానికే మొగ్గుచూపుతున్నాయి. మాడ్యులర్ ఆస్పత్రులు కరోనా సెకండ్వేవ్లో ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీ లేక, వైద్యం అందక సంభవించిన మరణాలు చూశాం. దానిని అధిగమించాలంటే మరిన్ని ఆస్పత్రులు ఉండాలి.. ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి ఆస్పత్రుల నిర్మాణం సాధ్యం కాదు కాబట్టి ఆరోగ్య రంగ నిపుణులు మాడ్యులర్ ఆస్పత్రుల వైపు చూస్తున్నారు. ప్రధాన ఆస్పత్రికి అనుబంధంగా కట్టే ఈ ఆస్పత్రుల్ని రూ.3 కోట్ల ఖర్చుతో మూడు వారాల్లో నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఆరు నుంచి ఏడు వారాల్లో ఈ ఆస్పత్రుల్ని అందుబాటులోకి తీసుకురావచ్చు. ఆక్సిజన్ ప్లాంట్, ఐసీయూ సౌకర్యాలన్నీ ఇందులో ఉంటాయి. వారం రోజుల వ్యవధిలో అవసరమైన చోటుకి తరలించే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ తరహా ఆస్పత్రుల్ని 20, 50, 100 పడకలతో 50 వరకు నిర్మించడానికి కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది. పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై అధిక ప్రభావం ఉంటుందనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ, దీనిపై ఎక్కువగా ప్రచారం జరగడంతో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్, గోవా, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు పీడియాట్రిక్ కోవిడ్ కేర్ వార్డుల్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జార్ఖండ్లు పీడియాట్రిక్ టాస్క్ఫోర్స్ని ఏర్పాటు చేశాయి. కొత్త వైద్యులకు శిక్షణ కోవిడ్ రోగుల సంఖ్య పెరిగపోవడం, కళ్ల ముందే రోగులు ప్రాణాలు వదిలేయడం, పీపీఈ కిట్లలో వాష్రూమ్కి వెళ్లే అవకాశం కూడా లేక గంటల తరబడి పని చేయడం వల్ల వైద్య సిబ్బంది నిస్సహాయులైపోతున్నారు. కోవిడ్ తర్వాత దేశంలో దాదాపు 13 లక్షల మంది డాక్టర్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన దేశంలో ప్రతీ 1,456 మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అందుకే వైద్య రంగంలోకి వచ్చిన జూనియర్ డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది కి శిక్షణ ఇస్తే వైద్యుల కొరత సమస్యని అధిగమించవచ్చు. మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడులు వైద్యలకు శిక్షణనిచ్చే అంశంపై దృష్టి సారించాయి. హోం క్వారంటైన్ వ్యవస్థ మన దేశంలో అధికశాతం కరోనా రోగులు ఇళ్లల్లోనే ఉండి కోలుకుంటున్నారు. ఇలాంటి రోగులకు కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ వారి ఆరోగ్యంపై పర్యవేక్షణ పెంచాలి. ఫోన్లలోనే వైద్యులు నిరంతరం వారి ఆరోగ్యాన్ని చూసే సదుపాయాలు కల్పించాలి. –సాక్షి, నేషనల్ డెస్క్ పర్యవేక్షణే కీలకం భారత్ కరోనా మూడో వేవ్ను సమర్థంగా ఎదుర్కోవాలంటే నిరంతర పర్యవేక్షణ అత్యంత కీలకం. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సమాచారంతో నిరంతరం అధ్యయనాలు చేస్తూ గ్రామాల్లో కోవిడ్ పరీక్షా కేంద్రాలను పెంచాలి. సెరో సర్వేలు చేస్తూ కరోనా ప్రబలే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలి. విస్తృతంగా పరిశోధనలు చేసి వివిధ కరోనా వేరియంట్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవాలి. దీనికి ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి. – డాక్టర్ సౌమ్య స్వామినాథన్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ -
ఆరోగ్యరంగానికి అరకొర వ్యయమే
‘ఆరోగ్య పరిరక్షణ ఎట్టకేలకు ప్రధాన పాత్ర పోషించబోతోంది’ అని మొన్న ఆర్థిక సర్వే ప్రక టించింది. బడ్జెట్లో ప్రతిపాదించిన ఆరు కీలక స్తంభాల్లో ఆరోగ్యం మొదటిది. ప్రజారోగ్యానికీ, శ్రేయస్సుకూ ఈసారి కేటాయింపులు 137 శాతం పెంచుతున్నామని సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సగర్వంగా చెప్పారు. అయితే మాట్లాడినంత ఘనంగా పరిస్థితేమీ లేదని బడ్జె ట్ను తరచి చూస్తే అర్థమవుతుంది. కరోనా మహ మ్మారి తీవ్రత నేపథ్యంలో ఆరోగ్యరంగానికి కేటా యింపులు ముందుగా ఊహించిందే. మన ఆరోగ్య వ్యవస్థ లోని లోపాలను కరోనా బహిర్గతం చేసింది. రోగ వ్యాప్తిగానీ, దాని పర్యవసానంగా కలిగిన మర ణాలుగానీ అంచనా వేసినంతగా లేకపోవటం అదృ ష్టమే. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యరంగానికి వన రులు పుష్కలంగా వుండేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద వుంది. ఆరోగ్యరంగంపై సమగ్ర దృష్టి సారిస్తూ వ్యాధి నిరోధకత, స్వస్థ పర చటం, శ్రేయస్సు అనే మూడు అంశాలను పటిష్ట పరచాలని నిర్ణయించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన అనే పేరిట కొత్త పథకాన్ని కూడా ప్రకటించారు. ఆరోగ్య పరిరక్షణ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రాథ మిక, మాధ్యమిక, ప్రాంతీయ స్థాయిల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచటం దీని ధ్యేయం. వచ్చే ఆరేళ్లలో ఇందుకోసం రూ. 64,180 కోట్లు వ్యయం చేస్తారు. అంటే ఏడాదికి దాదాపు రూ. 10,700 కోట్లు. నిరుడు ఆరోగ్యానికి రూ. 67,484 కోట్లు కేటాయించారు. సవరించిన అంచనాల ప్రకారం చూస్తే అది రూ. 94,452 కోట్లకు పెరి గింది. ఈ ఏడాది దాన్ని రెట్టింపు చేసి, వచ్చే మూడు నాలుగేళ్లలో క్రమేపీ పెంచుకుంటూ పోతే తప్ప ఆరోగ్య రంగ వ్యయంపై మనం పెట్టు కున్న లక్ష్యాలను సాధించటం సాధ్యం కాదు. ఆరోగ్య రంగ వ్యయాన్ని పెంచాల్సిన అవస రాన్ని ఆర్థిక సర్వే కూడా అంగీకరించింది. ఆరోగ్య పరిరక్షణకయ్యే ఖర్చులో 60శాతం ప్రజానీకం వాటా వుండగా మిగిలింది ప్రభుత్వ వ్యయం. మన జీడీపీలో ప్రస్తుతం ఆరోగ్యరంగ వాటా 1 శాతం కన్నా చాలా తక్కువ. దీన్ని 3 శాతానికి పెంచితే తప్ప ప్రజలపై భారం తగ్గదు. 2017నాటి జాతీయ జాతీయ ఆరోగ్య విధానం కూడా ఈ మాటే చెప్పింది. మెరుగైన ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రపంచంలోని 180 దేశాల్లో మన స్థానం 145. ఈసారి పరిస్థితి మారుతుందనుకుంటాము. కానీ ఆమె కేటాయించిన రూ. 2,23,846 కోట్లలో పౌష్టి కాహారం, మంచినీటి సదుపాయం, పారిశుద్ధ్యం అంశాలపై చేసే ఖర్చు కూడా వుంది. వీటికి ప్రాధా న్యత లేదని ఎవరూ అనరు. కానీ ఆరోగ్య వ్యయంగా ఆ అంశాలను చూపడం సరికాదు. అలాగే వ్యాక్సిన్ల కోసం చేసిన రూ. 35,000 కోట్ల కేటాయింపు కూడా ఈ ఏడాదికి పరిమితమైనది. దాన్ని రెగ్యులర్ ఆరోగ్య బడ్జెట్లో భాగంగా పరి గణించలేం. మన ఆరోగ్య రంగ బడ్జెట్ జీడీపీలో ఇప్పటికీ 0.34 శాతం మాత్రమే. జాతీయ ఆరోగ్య విధాన లక్ష్యాన్ని సాధించాలంటే 2021– 22లో జీడీపీలో 1.92 శాతం ఆరోగ్యానికి ఖర్చు చేయాలని ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే చెప్పింది. అందుకు మనం ఎంత దూరంలో వున్నామో చూస్తే ఆశ్చర్యం కలుగు తుంది. కరోనా మహమ్మారి వంటిది కూడా మన ప్రభుత్వాన్ని కదిలించలేకపోతే దాన్ని మరేది ప్రభావితం చేయగలదు? – ప్రొఫెసర్ దీపా సిన్హా -
దూసుకెళ్తున్న మార్కెట్లు : హెల్త్కేర్ షేర్లు జూమ్
సాక్షి, ముంబై: కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేయడంతో ఆ హెల్త్ కేర్ రంగ షేర్లు భారీ లాభాలతో కొనసాగతున్నాయి. ఆత్మనిర్భర్ హెల్త్ యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో హెల్త్ కేర్ షేర్లు ఒక్కసారిగా జూమ్ అయ్యాయి. నారాయణ హెల్త్ కేర్ 2 శాతం, అపోలో ఒకశాతం, గ్లోబల్హెల్త్ కేర్ ఫోర్టిస్ 2 శాతానికి పైగా లాభాలతో కొనసాగున్నాయి. దీంతో సెన్సెక్స్ 936 పాయింట్లు ఎగిసి 47 వేలను అధిగమించింది. నిఫ్టీ 241 పాయింట్ల లాభంతో 13875 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్,హెల్త్ కేర్ రంగ షేర్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. మహమ్మారి కట్టడిలో భారత్ ప్రపంచానికి మార్గదర్శనం చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశామన్న ఆమె... ఏళ్లలో రూ . 64,180 కోట్ల వ్యయంతో ఆత్మనిర్భర్ హెల్త్ యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సెంటర్ను బలోపేతం చేయనున్నామని, ఇందుకోసం దేశంలో కొత్త 15 సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. -
హెల్త్కేర్ కంపెనీలకు లిథియం బ్యాటరీలు
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డిటౌన్: దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారిపై పోరు సాగిస్తున్న హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీలకు ఐఐటీ హైదరాబాద్లో పురుడు పోసుకున్న ‘ప్యూర్ ఈవీ’స్టార్టప్ కంపెనీ లిథియం బ్యాటరీలను సరఫరా చేస్తోంది. ఈ బ్యాటరీలను వెంటిలేటర్లు, రోబోటిక్ శానిటరీ పరికరాల్లో ఉపయోగిస్తారు. లిథియం బ్యాటరీల ఉపయోగాపై ‘ప్యూర్ ఈవీ’కొంతకాలంగా పరిశోధలను చేస్తోంది. ఇప్పటికే ఈ స్టార్టప్ తయారుచేస్తున్న ఎలక్ట్రానిక్ వాహనాల్లో లిథియం బ్యాటరీలను ఉపయోగిస్తోంది. తేలికగా ఉండే లిథియం బ్యాటరీలను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లే వీలుండటంతో పాటు ఎక్కువసేపు పనిచేస్తాయి. వివిధ వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే ఈ బ్యాటరీలు ఇతర బ్యాటరీలతో పోలిస్తే అత్యంత మెరుగైనవి. జీవన్లైట్లో లిథియం బ్యాటరీలు ఐఐటీ హైదరాబాద్ అనుబంధ సెంటర్ ఫర్ హెల్త్కేర్ ఎంట్రప్రెన్యూర్షిప్ (సీఎఫ్హెచ్ఈ)కు చెందిన ఏరోబయోసిస్ ఇన్నోవేషన్ అనే స్టార్టప్ అత్యవసర సమయాల్లో ఉపయోగించే ‘జీవన్ లైట్’అనే వెంటిలేటర్ను తయారుచేసింది. తక్కువ ధరలో లభించే ఈ వెంటిలేటర్ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. జీవన్లైట్ వెంటిలేటర్లోనూ ప్యూర్ ఈవీ రూపొందించిన లిథియం బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఎమర్జింగ్ ఐటీ టెక్నాలజీ ద్వారా ఫోన్ యాప్ ద్వారా జీవన్లైట్ను ఆపరేట్ చేయొచ్చు. జేసీబీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం జీవన్లైట్ వెంటిలేటర్లను పెద్దసంఖ్యలో తయారుచేస్తోంది. కాగా రోబోటిక్ హెల్త్కేర్ టెక్ డివైజెస్ను తయారుచేస్తున్న ఓ ప్రైవేటు సంస్థకు కూడా ప్యూర్ ఈవీ లిథియం బ్యాటరీలను సరఫరా చేస్తోంది. ఐఐటీ హైదరాబాద్ స్టార్టప్ ప్యూర్ ఈవీ లిథియం బ్యాటరీలు అత్యంత నాణ్యత కలిగినవని మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ నిశాంత్ దొంగరి వెల్లడించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement