-
కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా విన్నా నేరమే
జైపూర్/రాయ్పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్పై మరోసారి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో ప్రజలు వారి మత విశ్వాసాలు పాటించడం చాలా కష్టమని, కనీసం హునుమాన్ చాలీసా వినడం కూడా పెద్ద నేరం అవుతుందని అన్నారు. మంగళవారం రాజస్తాన్లోని టోంక్, ఛత్తీస్గఢ్లోని శక్తి, ధామ్తారీ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇటీవల హనుమాన్ చాలీసా వింటున్న ఓ దుకాణదారుడిని దారుణంగా కొట్టారని గుర్తుచేశారు. రాజస్తాన్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్లు విసిరారని చెప్పారు. రాళ్లు విసిరినవారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి రక్షణ కల్పించారని, రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలపై ఆంక్షలు విధించారని మండిపడ్డారు. రాజస్తాన్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజల మత విశ్వాసాలను ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారని చెప్పారు. ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా హనుమాన్ చాలీసా పఠించవచ్చని, శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవచ్చని, ఇది బీజేపీ గ్యారంటీ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. రిజర్వేషన్లపై ఇదే నా గ్యారంటీ ‘‘మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో కోత విధించి, ముస్లింలకు కట్టబెట్టే పనికి శ్రీకారం చుట్టింది. 2004 నుంచి 2010 దాకా ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లను అమలు చేసేందుకు నాలుగుసార్లు గట్టిగా ప్రయతి్నంచింది. కానీ, చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో కాంగ్రెస్ ఉద్దేశం నెరవేరలేదు. 2011లో దేశవ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లను అమల్లోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సాగించిన కుట్రలు ఫలించలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కొల్లగొట్టి, మరో వర్గానికి ప్రయోజనం కల్పించాలని చూశారు. భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను కాంగ్రెస్ ఏనాడూ గౌరవించలేదు. దళితులు, వెనుకబడిన గిరిజనులకు కల్పించిన రిజర్వేషన్లను విభజించి, ముస్లింలకు ఇచ్చేస్తామని బహిరంగంగా ప్రకటించే ధైర్యం కాంగ్రెస్కు ఉందా? కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల నుంచి దొంగిలించి, ముస్లింలకు ఇచ్చిన కోటాను బీజేపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ల గడువు 2020లో ముగిసిపోగా, మేము మరో పదేళ్లు పొడిగించాం. దళితులకు, వెనుకబడిన గిరిజనులకు రిజర్వేషన్లు ఎప్పటికీ అంతం కాబోవని నేను గ్యారంటీ ఇస్తున్నా. మతం పేరిట ఎవరైనా రిజర్వేషన్లను విభజించాలని చూస్తే సహించే ప్రసక్తే లేదు. రాజ్యాంగాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. రాజ్యాంగానికి విధేయుడిగా నడుచుకుంటున్నా. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ను ఆరాధిస్తున్నా’’ నక్సలిజం, మావోయిజాన్ని అంతం చేస్తాం ‘‘ఛత్తీస్గఢ్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి హింసను ప్రోత్సహించింది. కాంగ్రెస్కు, అభివృద్ధికి పొత్తు పొసగదు. అవి రెండూ కలిసి ముందుకు సాగలేవు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి, హింస పెరిగిపోతాయి. ఈశాన్య రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు నక్సలైట్ల హింసాకాండ విపరీతంగా పెరిగింది. హింసాకాండలో ఒకవైపు జనం మరణిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకున్నారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అవినీతి, మావోయిస్టు హింసాకాండ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో నక్సలిజాన్ని, మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నా’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు’’ కాంగ్రెస్ వస్తే ప్రజల సొమ్ముపై ఎక్స్–రే ‘‘దేశంలో వనరులపై మొదటి హక్కు మైనార్టీలకే ఉందని కాంగ్రెస్ పాలనలో ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అన్నారు. ఇది యాదృచ్చికం కాదు. బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ సిద్ధాంతం. ప్రజల ఆస్తులను, కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకొని, కొందరు ఎంపిక చేసిన వ్యక్తులకు పంపిణీ చేయాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతోంది. కాంగ్రెస్తోపాటు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలను బయటపెడుతున్నందుకే ఆ పార్టీ నాయకులు నన్ను దూషిస్తున్నారు. నిజం మాట్లాడితే వారు భయపడుతున్నారు. వారి రహస్య ఎజెండాలను బహిర్గతం చేస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను నమ్ముకుంది. అందుకే రాజ్యాంగాన్ని కూడా లెక్కచేయకుండా వ్యవహరిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులను, సొమ్ములను ఎక్స్–రే తీస్తామని కాంగ్రెస్ యువరాజు చెబుతున్నారు. అంటే ప్రజలు తమ దగ్గరున్న డబ్బులు, బంగారాన్ని పెట్టెలో దాచి, గోడల్లో రహస్యంగా భద్రపరిచినా కాంగ్రెస్ నాయకులు ఎక్స్–రే ద్వారా కనిపెట్టి, స్వాధీనం చేసుకుంటారు. తర్వాత ఎంపిక చేసిన వ్యక్తులకు ఆ సొమ్ము పంపిణీ చేస్తారు. కాంగ్రెస్ చెబుతున్న సంపద పునఃపంపిణీ వెనుక ఉన్న అసలైన అర్థం ఇదే’’ దేశాన్ని విభజించే కుతంత్రమే ‘‘కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని మతం పేరిట ముక్కలు చేసింది. స్వాతంత్య్రం వచ్చాక మొదటిరోజు నుంచే బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల ప్రజలు అధికారంలో భాగస్వాములు కావడాన్ని ఆ పార్టీ జీరి్ణంచుకోలేకపోతోంది. మరో నాటకానికి తెరతీసింది. దేశాన్ని విభిజించే కుట్రలకు పాల్పడుతోంది. దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా మార్చాలని ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ఎంపీ డిమాండ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు గోవాలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయొద్దని అంటున్నారు. ఇది ముమ్మాటికీ దేశాన్ని విభజించే కుతంత్రమే. రాజ్యాంగాన్ని అమలు చేయొద్దనడం రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ను అవమానించినట్లు కాదా? తమపై రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దడానికి ప్రయతి్నస్తున్నారంటూ గతంలో జమ్మూకశ్మీర్లో కొందరు వ్యక్తులు గగ్గోలు పెడుతుండేవారు. మీరు(ప్రజలు) బీజేపీని ఆదరించాక ఆ వ్యక్తుల నోళ్లు మూతపడ్డాయి. జమ్మూకశ్మీర్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారతదేశం కాంగ్రెస్ను తిరస్కరించింది. అందుకే దేశాన్ని చిన్నచిన్న దేశాలుగా, దీవులుగా విడగొట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ నేడు గోవాలో రాజ్యాంగం అమలును అంగీకరించడం లేదు. రేపు దేశమంతటా అమలు చేయొద్దని చెప్పడం ఖాయం. దేశ అభివృద్ధి పట్ల కాంగ్రెస్కు ఒక విజన్ లేదు. పేదల సంక్షేమం గురించి ఆ పార్టీకి ఏబీసీడీ కూడా తెలియదు. ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది. బీజేపీ సంగతి పక్కన పెట్టండి. సాక్షాత్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దిగొచ్చినా సరే రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు’’ -
కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినటం కూడా నేరమే: మోదీ
జైపూర్: రాజస్థాన్లోని టోంక్-సవాయి మాధోపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ జయంతిని సందర్భంగా హనుమాన్ చాలీసా వినడం కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో తప్పు అని అన్నారు. ప్రజల సంపదను లాక్కుని కొందరికి పంచిపెట్టే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. శ్రీ రామనవమి రోజు రాజస్థాన్లో మొదటిసారి శోభా యాత్ర ఊరేగింపు జరిగింది. రామ్-రామ్ అని జపించే రాజస్థాన్ వంటి రాష్ట్రంలో, ప్రజలు రామనవమి జరుపుకోకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పండుగను నిషేదించిందని మోదీ పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మోదీ కాంగ్రెస్పై కీలక వ్యాఖ్యలు చేస్తూ.. దేశ సంపదను ఎక్కువ మంది పిల్లలున్నవారికి, చొరబాటుదారులకు పంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. మీరు కష్టపడి సంపాదించిన మీ ఆస్తిని జప్తు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉందా? అని ప్రశ్నించారు. మహిళల దగ్గర ఉన్న బంగారానికి సంబంధించిన వివరాలు సేకరిస్తామని.. కాంగ్రెస్ మ్యానిఫెస్టో చెబుతోంది. ప్రజల కష్టార్జితం, వారి ఆత్మ గౌరవానికి సంబంధించిన సంపదని ఇతరులకు పంచిపెట్టడం ఎంతవరకు న్యాయమని మోదీ ప్రశ్నించారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల కీలక నేతలు విరుచుకుపడుతున్నారు. -
రాముడి పాటపాడి మరోసారి వార్తల్లోకి సీమా హైదర్
ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం తన ప్రియుడు సచిన్ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలోని రఘుపూర్లో నివసిస్తున్న ఈ మహిళా.. తాజాగా శ్రీరాముని కీర్తన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ముస్లిం మహిళ అయిన సీమా.. హిందూ ఆరాధన చేయడం విశేషంగా నిలిచింది. సీమాతోపాటు ఆమె కుమారుడు కూడా హనుమాన్ చాలీసా పఠించడం నెట్టింట్లో వైరల్గా మారింది. సచిన్-సీమా నివసించే రబూపురాలో ఇటీవల రాముడి భజన ఏర్పాటు చేశారు. రాముడి కీర్తనలు, హానుమాన్ పాటలు పాడారు. ఈ సందర్భంగా సీమా.. స్వాతి మిశ్రా పాడిన ‘రామ్ ఆయేంగే’ అనే పాటను ఆలపించారు. తలపై కాషాయ రంగు టోపి ధరించి ఆమె ఎంతో చక్కగా పాట పాడారు. ఆమెతోపాటు తన కుమారుడు కూడా హనుమాన్ చాలిసా పఠించాడు. ఆమె వెంట న్యాయవాది ఏపీ సింగ్ కూడా ఉన్నారు. ఈ వీడియోను ఆమెనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Jist (@jist.news) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనుమతి లభించిన వెంటనే తన కుటుంబంతో కలిసి అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి రామదర్శనం కోసం వెళతానని తెలిపారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. భారత్ మహిళలను గౌరవించే దేశమని అన్నారు. తను ఇప్పుడు పూర్తిగా హిందూ మతంలోకి మారినట్లు తెలిపారు. ఆమె శ్రీకృష్ణుడు, శ్రీరాముడి భక్తురాలినని అన్నారు. కాగా.. ఇండియాలోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్తో పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత నేపాల్లో వీరు కలుసుకుని.. అక్కడే పెళ్లి చేసుకున్నారు. అనంతరం సీమా తన నలుగురు పిల్లలతో పాకిస్థాన్ నుంచి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సచిన్ ఇంటికి వచ్చింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలుస్తోంది. సీమాకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టా ద్వారా తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ నెటిజన్లకు టచ్లో ఉంటున్నారు. -
‘బీజేపీకి ఆప్కు మధ్య తేడా ఎంటీ?’
అమ్ ఆద్మీ పార్టీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిండ్ కేజ్రీవాల్, రాష్ట్రం ప్రభుత్వం ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని నిర్ణయం తీసుకుంటే.. బీజేపీకి ఆప్ మధ్య తేడా ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ రెండు పార్టీల మధ్య ఏమాత్రం తేడా ఉండదని అన్నారు. ఢిల్లీలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించడానికి రానున్న రోజుల్లో సుమారు 2,600 ప్రాంతాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యపై స్పందించిన మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సదరు మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ తమను తాము గొప్పగా ఊహించుకుంటోందని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ అనుసరిస్తున్న హిందుత్వ రాగాన్ని ఆప్ అమలు చేస్తోందని మండిడ్డారు. ఆప్లో కొంత మంది నేతలు తాము సరయు నదికి వెళ్లుతామని అంటారు. మరికొందరు సుందరకాండ పఠనం పాఠశాలల్లో, ఆస్పత్రిలో అమలు చేయాలని వ్యాఖ్యాస్తారు. ఇలా చేస్తూ ఆప్ పార్టీ నరేంద్రమోదీ అడుగుజాడల్లో నడుస్తోందని విమర్శించారు. నరేంద్ర మోదీ ఏదైతే చేయాలనుకుంటారో మీరు (ఆప్) అదే చేస్తారని అన్నారు. ఇలా చేస్తూ వెళ్లితే.. మీకు(ఆప్), బీజేపీకి తేడా ఏం ఉందని ఓవైసీ సూటిగా నిలదీశారు. చదవండి: ‘ఇండియా కూటమి చరిత్రక గెలుపు నమోదు చేస్తుంది’ -
లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం..
ఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఉద్ధవ్ థాక్రే వర్గంపై నిప్పులు చెరిగారు. హిందుత్వ భావాజాలాన్ని, బాల్ థాక్రే ఐడియాలజీని వదిలేసినందుకు విరుచుకుపడ్డారు. ఇండియా కూటమితో కలిసి కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తున్న ఉద్ధవ్ థాక్రే వర్గంపై మండిపడ్డారు. అంతేకాకుండా లోక్సభలోనే హనుమాన్ చాలీసాను పఠించారు. కల్యాన్ నుంచి ఎంపీగా గెలుపొందిన శ్రీకాంత్ షిండే నేడు లోక్ సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. వచ్చే రోజుల్లో యుద్ధం ఎన్డీయే వర్సెస్ ఇండియా కాదు.. స్కీం వర్సెస్ స్కాం అని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి అంటేనే అవినీతికి మరోపేరు అని విమర్శించారు. లోక్సభలో నేడు అవిశ్వాస తీర్మాణంపై చర్చలో భాగంగా షిండే మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఉద్ధవ్ వర్గం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత విడిపోయి ప్రస్తుతం ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. శివసేన కాంగ్రెస్తో కలిసి పోటీచేస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించరని అన్నారు. చివరికి కరసేవకులపై దాడి చేసిన సమాజ్ వాదీ పార్టీతో కూడా కలిసిపోతారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కనీసం హనుమాన్ చాలీషా కూడా చదవనీయలేదని ఉద్ధవ్ వర్గంపై మండిపడ్డారు. ఉద్ధవ్ థాక్రే సీఎంగా ఉన్నప్పుడు ఆయన నివాసం వద్ద హనుమాన్ చాలీసా పాఠనం చేస్తామని ప్రకటించిన ఎంపీ నవ్నీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలను అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేసి షిండే.. లోక్ సభలోనే హనుమాన్ చాలీసా పఠించారు. తొందరగా ముగించాలని స్పీకర్ చెప్పడంతో ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఇదీ చదవండి: వీల్ ఛైర్లో మన్మోహన్సింగ్.. కాంగ్రెస్పై బీజేపీ ఫైర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నెల్లూరులో హోమ్ ఓటింగ్ ప్రారంభం
ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం
రిజర్వేషన్లు రద్దంటే చెప్పుతో ఉరికించి కొట్టండి
పదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు
కేంద్రంలో కాంగ్రెస్ రావడం అనివార్యం
అక్రమార్కులపై ఉక్కుపాదం
కూటమి మేనిఫెస్టోపై నమ్మకమేదీ..?
కలవని కూటమి జెండాలు
సీఎం జగన్ రాక నేడు
ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement