-
2023లోనూ టీఆర్ఎస్దే విజయం: ఎమ్మెల్సీగా పల్లా ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి గురువారం పల్లాతో ప్రమాణ స్వీకారం చేయించారు. మార్చిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత ఉత్కంఠ రేపిన ఎన్నికల ఫలితాల్లో చివరకు పల్లా విజయం సాధించారు. ప్రమాణం అనంతరం రాజేశ్వర్రెడ్డిని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి గోవర్ధన్ ఈ సందర్భంగా రాజేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మార్చిలో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భారతదేశ చరిత్రలో 72 మంది పోటీ చేయగా రికార్డు మెజారిటీతో పట్టభద్రులు తనను గెలిపించారని తెలిపారు. 10 లక్షల మంది ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచిన చరిత్ర సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. 2023లో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో నేరాలు తగ్గాయని చెప్పారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన సంఘటన దురదృష్టకరమని తెలిపారు. దుర్మార్గుడు రాజు తనకు తాను శిక్ష విధించుకున్నాడని, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదదని స్పష్టం చేశారు. చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం -
తెలంగాణలో గ్రాడ్యుయేట్ పోరుకు సై..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం మూడు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్తో పాటు, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. నల్లగొండ–ఖమ్మం–వరంగల్, రంగారెడ్డి–హైదరాబాద్– మహబూబ్నగర్ జిల్లాల గ్రాడ్యు యేట్ స్థానాలకు ఈనెల రెండో వారం నుంచి మార్చి మొదటి వారంలోపు ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలు వడే అవకాశం ఉండడంతో అభ్యర్థుల ఖరారు, ఎన్నికల వ్యూహాల రూపకల్పనపై పార్టీలు దృష్టి సారించాయి. కొం దరు తెలంగాణ ఉద్యమకారులు, స్వతంత్రులు సైతం బరిలో నిలుస్తుండడంతో ఎన్నికలపై ఆసక్తిని కలిగిస్తోంది. కారు జోరు టీఆర్ఎస్కు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో బాధ్యతలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన భుజాన వేసుకున్నారు. సిట్టింగ్ స్థానమైన నల్లగొండ–ఖమ్మం–వరంగల్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డినే బరిలో దింపాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయా జిల్లాల నేతలతో సమన్వయ భేటీలు నిర్వహించిన కేటీఆర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి సమావేశాలతో కారుదండు బిజీగా ఉంది. అయితే, తమకు ఎప్పుడూ కలసిరాని రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్నగర్ఎమ్మెల్సీ స్థానం విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు రంగారెడ్డి జిల్లాకు చెందిన నాగేందర్గౌడ్, శుభప్రద పటేల్, పీఎల్ శ్రీనివాస్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ల పేర్లు టీఆర్ఎస్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరో ఎన్ఆర్ఐ పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చినట్టు సమాచారం. మరోవైపు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్కు మద్దతు ఇచ్చే అంశంపై కూడా పార్టీలో చర్చ జరుగుతోందని తెలిసింది. కాంగ్రెస్ కసరత్తు ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న కాంగ్రెస్.. సామాజిక సమీకరణలతో పాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని నల్లగొండ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, రంగారెడ్డి నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డిల పేర్లను దాదాపు ఖరారు చేసింది. అయితే, నల్లగొండ నుంచి ఎస్టీ కోటాలో రాములు నాయక్ కన్నా ఆదివాసీ కాం గ్రెస్ జాతీయ నాయకుడు బెల్లయ్య నాయక్ మేలనే అభిప్రాయంతో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ దాసోజు శ్రావణ్, మానవతారాయ్ల అభ్యర్థిత్వాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇక, రంగారెడ్డి విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వియ్యంకుడు, దిల్సుఖ్నగర్ విద్యాసంస్థల అధినేత ఎ.వి.ఎన్.రెడ్డి అభ్యర్థిత్వాన్ని టీపీసీసీ తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఉండడం, విద్యావేత్త కావడం, రాజకీయ నేపథ్యం ఉండడంతో ఆయన పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని చెపుతున్నారు. కదనరంగంలో... కమలం ఇక ఇటీవలి విజయాలతో మంచి ఊపుమీదున్న బీజేపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. రంగారెడ్డి నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావు, నల్లగొండ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డిలు కార్యక్షేత్రంలోకి దిగారు. రాంచందర్రావుకు ఉన్న మంచి ఇమేజ్తో పాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ లాంటి ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న పట్టు మంచి ఫలితాలు సాధించి పెడతాయని, కనీసం సిట్టింగ్ స్థానాన్ని అయినా నిలబెట్టుకుంటామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. మరోవైపు నల్లగొండ స్థానానికి వామపక్షాల అభ్యర్థిగా జయసారథి రెడ్డి కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. రంగారెడ్డిలో వామపక్షాలు డాక్టర్. కె.నాగేశ్వర్కు మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్నాయి. -
అర్థరాత్రి తర్వాతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం !
నల్గొండ: వరంగల్ - ఖమ్మం - నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల తుది ఫలితాలు గురువారం అర్థరాత్రి తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ గెలుపునకు 7,013 ఓట్లు కావాల్సి ఉండగా, బీజేపీ గెలుపునకు 19,736 ఓట్లు కావాల్సి ఉందని వెల్లడించారు. మొదటి ప్రాధాన్యత కౌంటింగ్ పూర్తి అయిందన్నారు. అలాగే రెండో ప్రాధాన్యత కౌంటింగ్ కొనసాగుతుందని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement