-
స్వాతంత్ర్యం రాకపూర్వం నుంచి నేటికీ నిరంతర అన్నదానం..
సాక్షి, వేటపాలెం(ప్రకాశం): గొల్లపూడి రాధాకృష్ణయ్య దాతృత్వం.. ముందుచూపు. 88 ఏళ్లగా పేదవిద్యార్ధుల ఆకలి తీరుస్తుంది. స్వాతంత్య్రంరాక పూర్వమే ప్రారంభించిన హాస్టల్ నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కష్టపడి చదువు కొనే విద్యార్ధులకు కులమతాలకు అతీతంగా పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పానికి భవిష్యత్లోను డోకాలేని విదంగా శాశ్వత నిధి ఏర్పాటు చేసిన రాధాకృష్ణయ్యకు విద్యార్ధులు నిత్యం జ్యోహార్లు అర్పిస్తుంటారు. వేటపాలెంలో 1921 సంవత్సరంలో ఏర్పాటు చేసిన రావుసాహెబ్ బండ్ల బాపయ్య శెట్టి పాఠశాలకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్ధులు వస్తుండేవారు. రవాణా సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేక భోజనం కోసం ఇబ్బందులు పడుతుండేవారు. దీన్ని గొల్లపూడి రాధాకృష్ణయ్య గమనించారు. పేద విద్యార్ధులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దుస్తులు వ్యాపారం నిర్వహించే ఈయన మద్రాసులోని షావుకారు పేటలో ఉన్న హిందూ థీయోసాఫికల్ స్కూల్ ప్రధానోపాద్యాయుడు రంగస్వామి అయ్యర్ ప్రేరణతో 1933 సంవత్సరంలో మొదటి సారిగా వేటపాలెంలో బిబిహెచ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు బోజనం సౌకర్యం కల్పించారు. మొదటి హాస్టల్ నిర్వహణకు తన వ్యాపారం నుంచి నిధులు సమకూర్చేవారు. కానీ తన అనంతరం కూడా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఆలోచన ట్రష్టును ఏర్పాటు చేసేలా చేసింది. శాశ్వత భవనం, పర్నిచర్తో పాటు మూలనిధిని కూడా ఏర్పాటు చేయడంతో పాటు 88 సంవత్సరాలుగా విద్యార్ధులు కడుపు నిండా బోజనం తింటున్నారు. రాధాకృష్ణయ్య అనంతరం ఆయన దత్తపుత్రుడు గొల్లపూడి సీతారం 1977లో హాస్టల్ నిర్వహణ బాద్యతలను చేపట్టి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. భోజనం ఎవరికి పెడతారంటే... ప్రతి ఏడాది బండ్ల బాపయ్య శెట్టి కళాశాల్లో అడ్మిషన్లు జరుగుతాయి. కళాశాల్లో చేరిన విద్యార్థులకు హాస్టల్ నిర్వాహకులు ఒక పద్యం నేర్పిస్తారు. ఈ పద్యం తప్పుపోకుండా చెప్పిన పేద విద్యార్థులను గుర్తించి వారికి బోజనం కోసం టోకేన్లు అందిస్తారు. ఈ టోకెన్ పొందిన విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం పాఠశాలకు వచ్చే ముందు వారు పొందిన టోకెన్లను హాష్టల్ వద్ద ఏర్పాటు చేసిన బాక్సులో వేసిరావాల్సి ఉంటుంది. టోకెన్లు ఆదారంగా హాస్టల్లో బోజనం తయారుచేస్తారు. ప్రతి రోజు 6 నుంచి ఇంటర్మీడియట్ చదువుకోనే 100 నుంచి 150 మంది విద్యార్థులు హాష్టల్లో భోజనం చేస్తుంటారు. బోజనానికి ముందుగా ప్రార్ధన చేయాల్సి ఉంటుంది. -
నాలుగు నమూనాలు
నేను దాదాపు రోజూ టీ. నగర్లోని అగస్త్య గుడికి వెళ్లి కూర్చుని వస్తూం టాను. అక్కడ పనిచేసే ఓ ముసలాయన ఉన్నాడు. దాదాపు ఒకే కాషాయ రంగు ధోవతిని కట్టుకుంటాడు. అది మాసిపోయి ఉంటుంది. రోజూ వదల కుండా అదే ఎలా కట్టుకుంటాడు? రాత్రి వేళల్లో ఏదయినా గోచీ కట్టుకుని ఈ ధోవతిని ఉతుక్కుని ఆరవేసుకుంటాడేమో? అది ఏనాడూ తెల్లగా ఉండదు. కానీ ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. తెల్లని జుత్తు. హడావుడిగా నడుస్తూంటాడు. అతను చేసేవి– నాకు తెలిసి– రెండే పనులు. స్వామికి దీపం వెలిగించడానికి గుడ్డ వొత్తిని సిద్ధం చేస్తూ ఉంటాడు. పెద్ద నల్లటి గుడ్డని చిన్న ముక్కలుగా స్వామి ముందు వెలిగించడానికి పీలికలుగా కత్తిరిస్తాడు. ఆ పనివాడితనం చూసి తీరవలసిందే. మరొక పని? సరిగ్గా 11 గంటలకి గుడి రెండు తలుపులూ మూస్తాడు. చేతికి వాచీ లేదు. కానీ అతను తాళం చెవులు పట్టుకు తలుపులు మూయడానికి వెళ్తే– 11 గంటలయిందని అర్థం. మరొకాయన ఉన్నాడు. అందగాడు. వయస్సు 48. పేరు నీరవ్ మోదీ. వజ్రాలు, రత్నాలు అంతర్జాతీయంగా అమ్ముతాడు. గత పదేళ్లలో బ్యాంకుల దగ్గర దొంగ లెక్కలతో 13 వేల కోట్లు అప్పు చేశాడు. ఇందుకు అతని మేనమామ మద్ధతు. చివరికి తన ఆట కట్టుబడే సమయం వచ్చిందని కాస్త ముందు గ్రహించి దేశం ఎల్లలు దాటిపోయాడు. బ్యాంకుల్లో 28 నకిలీ అకౌంట్లు ఉన్నవాడు. బెల్జియంలో పౌరసత్వం ఉన్నవాడు. చట్టం నుండి తప్పించుకోవడానికి– యునైటెడ్ అరబ్ రిపబ్లిక్, సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాలు తిరిగినవాడు. గత్యంతరం లేక ఇంగ్లండులో చట్టానికి దొరికిపోయి లండన్ జైలులో ఉన్నవాడు. ఇప్పుడు అతని గతి ఏమిటి? మరో వారం రోజుల్లో ఇంగ్లండు చట్టం నిర్ణయిస్తుంది. మరొకాయన ఉన్నాడు. ఆయన జిమ్మీ కార్టర్. 42 సంవత్సరాల కిందట ఈ ప్రపంచంలో అతి ధనవంతమయిన, శక్తివంతమయిన దేశాన్ని– అమెరి కాని పాలించాడు. పదవిలోకి వచ్చిన మరునాడే– అలనాడు వియత్నాం యుద్ధానికి వెళ్లని వీరులకి క్షమాభిక్ష పెట్టాడు. దేశంలో ఎన్నో సంస్కరణలు చేశాడు. అమెరికా చరిత్రలో ఎక్కువ కాలం బతికిన హెర్బర్టు హూవర్ కన్నా ఒక అడుగు ముందు నిలిచాడు. ఉరిశిక్షను వ్యతిరేకించాడు. నోబెల్ బహుమ తిని పుచ్చుకున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? ఎల్విస్ ప్రెస్లీ పాటలు వింటూ, పెన్సిల్వేనియాలో 1961లో తాను కట్టుకున్న అతి మామూలు ఇంట్లో మనశ్శాం తితో హాయిగా జీవిస్తున్నాడు. ఆయనకిప్పుడు ఎన్ని సంవత్సరాలు? 94. మరొక్క నమూనా. ఆవిడ పుట్టడమే రాచరికపు పుట్టుక. 93 సంవత్సరాల కిందట పుట్టింది. ఎనిమిదవ ఎడ్వర్డ్ రాజు ఇంగ్లండుని పాలిస్తే ఆమె మామూలు జీవితాన్ని గడిపేది. కానీ 1936లో ఆయన సింప్సన్ అనే ఓ మామూలు వ్యక్తి ప్రేమలో పడి కిరీటాన్ని, సింహాసనాన్నీ వదులుకున్నాడు. తన దేశంలోనూ, ప్రపంచంలోనూ జరిగిన ఎన్నో రాజకీయ, సామాజిక పరిణామాలకి ఆమె ప్రత్యక్ష సాక్షి. సంప్రదాయాన్నీ, రాచరికాన్నీ ప్రేమించి, గౌరవించే వ్యవస్థలో ఆమె సింహాసనం, హోదా యథాతథంగా నిలిచాయి. ఎన్నో ప్రపంచ యుద్ధాలూ, దేశీయ పరిణామాలలో వ్యక్తిగతంగానూ, వ్యవస్థాగతంగానూ తన హోదానీ, అర్హతనీ నిలదొక్కుకుంటూ– ప్రస్తుతం ‘బ్రెక్సిట్’ పరిణామాన్ని ఎదుర్కోబోతున్న ఏకైక రాజకీయ ప్రతీక ఎలిజబెత్ మహారాణీ. నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు అని. ఒక్కసారి ఆ వ్యవస్థలో ‘సోషలిస్టు’ భావజాలం తొంగిచూస్తే. అయితే ‘పరిణామం’ కంటే ‘చరిత్ర’ ఉన్నతమయినదని వారూ భావిస్తే? ఇంతకూ ఆమె స్థిరత్వానికి కారణం– ఇంగ్లిష్లోనే చెప్పాలి– వ్యవస్థ dignity, జాతి సంప్రదాయ నిబద్ధత. ఒక వ్యక్తి జీవనంలో ఆనందం, ఆరోగ్యం, అభిరుచి, అభిజాత్యం– ఇన్నిటి పాత్ర ఉంది. వీటన్నిటినీ జయించే మరొక ముఖ్యమైన లక్షణం మరొకటి ఉంది. ఇది వ్యక్తిత్వ వికాసానికి మూలస్తంభం. స్వామి ముందు వెలిగించే దీపపు ఒత్తుల్ని సిద్ధం చేస్తూ సమాజంలో తన ఉనికికే అర్థం కాంక్షించని ఓ మూగ జీవనానికీ, తన ఉనికిని, అస్తిత్వాన్నీ మార్చుకుని తనదికాని కోట్ల ధనాన్ని అవినీతితో అనుభవించాలన్న లక్ష్యానికీ, ఈ ప్రపంచాన్ని శాసించగల అధికారాన్ని చేతి వేటు దూరంలో నిలిపి– ఇప్పటికీ ‘మనశ్శాంతి’కి పట్టం కట్టిన ఓ సంస్కారికీ, తన పుట్టుకకీ, తన జీవనానికీ గంభీరమయిన వంతెనను నిర్మించుకుని– ఆ జాతికి గర్వకారణంగా జీవించే– ‘వ్యవస్థ’ ప్రాతినిధ్యానికీ ఎంత దూరం. అయితే వ్యక్తి జీవనంలో– వ్యక్తిత్వ నిర్ధారణలో వీటన్నిటి వెనుకా ఓ సామాన్య లక్షణం ఉంది. దాని పేరు– తృప్తి. అది కూడా కాదు. తృప్తితో జీవిస్తున్న గర్వం. అది కూడా కాదు. గర్వం పట్ల అవగాహన. అది కూడా కాదు. అవగాహనను స్వభావం చేసుకున్న అలవాటు. గొల్లపూడి మారుతీరావు -
అధికారం–అపశ్రుతులు
నేను అందరిలాగే పత్రిక లలో రాజకీయ పరిణా మాలు తెలుసుకుని స్పందించే ఓటర్ని. ఏ రాజ కీయ పార్టీకీ చెందినవాడినీ కాను. ఆ కారణానికే కొన్ని పరిణామాలు వింతగా, విడ్డూరంగా, వికృతంగా, విపరీతంగా కనిపిస్తాయి. పార్టీలో నాయకత్వం పట్ల అందరికీ అన్నివి ధాలా విధేయత ఉండాలి. ఇది అందరు రాజకీయ నాయకులు ఒప్పుకునే, గర్వంగా చెప్పుకునే సద్గు ణం. లోగడ కనీసం అయిదారు సందర్భాలలో మెజా రిటీ సాధించిన కాంగ్రెస్ అతిగర్వంగా ‘మేం అధి ష్టాన వర్గం మాటని అక్షరాలా పాటిస్తామ’ని చెప్ప డం మనకి తెలుసు. నిజానికి వారేం చెప్తారో ముందు మనకే తెలుసు. కానీ తీరా నాయకుడి ఎన్నిక జరిగాక చాపకింద నీరులాగ మెల్లగా తమ తమ అసంతృప్తు లను అనుచరుల ద్వారానో– ఇంకా బరితెగిస్తే తామో బయటపడి చెప్పడం మనం విన్నాం. నిజా నికి కాంగ్రెసులోంచి విడిపోయి మరో పార్టీగా అవతరించిన అన్ని పార్టీల మూల కథ ఇదే. అలనాటి దేవరాజ్ ఉర్స్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్, శరద్యాదవ్, సంగ్మా ప్రభృతుల కథలన్నీ ఇవే. అయితే ఈ నాయ కులు ఉన్నతులు. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు. కాగా–ముఖ్యమైన విషయం– అప్పటి అధిష్టాన వర్గం గురుతరమైనది. కాగా, ఇప్పటి నాయకులు మరుగుజ్జులు. అంత వ్యక్తిత్వాలున్న నాయకులు లేరు. ఉదాహరణకు అలనాడు ఆనంద శర్మ, గులాంనబీ ఆజాద్ పేర్లు చిన్నవి. రెండో పేరు చెప్తే అలనాడు పాలకవర్గానికి చెందిన ఒకాయన చర్రుమన్న సందర్భం నాకు తెలుసు. ఏతావాతా ఇవాళ ముఖ్యమంత్రి పదవికి ఎన్ని కైన నాయకులలో ఒకాయన మీద 1984 మారణ కాండ ‘మచ్చ’ ఉంది. మరొకాయన ‘నీతులు మాట్లాడే’ పార్టీ మీటింగు ముందు వరసలో కనిపిం చారు. వీరంతా అద్భుతమైన కాఫీ డికాషన్ కింద మిగిలిన ‘మడ్డి’ లాంటి వారు.ఈ మధ్య కాంగ్రెస్ పదవిలోకి వచ్చి చాలా రోజు లయింది. అదిన్నీ చావు తప్పి కన్నులొట్టపోయినట్టు ఎదుటి పార్టీ లోపంవల్ల మిగిలిన చచ్చు మెజారిటీ. వెంటనే ఈ నాయకుల భాషణ విన్నాం. ‘మా అధి ష్టానం ఏం చెప్తే అది పాటిస్తాం’ అంటూ. అధిష్టానం ఏం చెప్పాలో తాము చెప్పడానికి ఢిల్లీ పరిగెత్తిన సంఘటనలు మనం చూస్తున్నాం. తీరా అధిష్టానం– రాజస్తాన్లోలాగ సీనియర్ నాయకుని పదవిలో నిలి పితే ఛోటా నాయకుని వర్గీయులు ‘కాంగ్రెస్ని నాశ నం చేస్తాం’ అని టీవీ కెమెరాల ముందు బోరవిరు చుకోవడం మనం చూశాం. సరే. మధ్యప్రదేశ్ నాయ కుని మీద 1984 ‘పొడ’ ఉందని విమర్శలు లేచాయి. కర్ణాటకలో చచ్చీ చెడీ పదవిలోకి వచ్చిన ప్రభు త్వంలో అధిష్టానానికి ఎదురు తిరిగిన సభ్యులు, ముష్టియుద్ధాలు ఇప్పుడు టీవీల్లో చూస్తున్నాం. వారు అధికార అసెంబ్లీ సమావేశానికి హాజరు కాలేదు. ఇక అటువేపు చూద్దాం. మనం ఎప్పుడూ ఆనందీ బెన్ పేరు వినలేదు. విజయ్ రూపానీ పేరు వినలేదు. దేవేంద్ర ఫడ్నవీస్ పేరు తెలీదు. ఆ మాటకి వస్తే నితిన్ గడ్కరీ పేరు వినలేదు. ఇవాల్టి స్పీకర్ సుమిత్రా మహాజన్ గారి పేరు వినలేదు. కానీ వీరి ఎంపిక జరిగాక ఎవరూ టీవీల ముందు కాంగ్రెస్లో లాగ సన్నాయి నొక్కులతో విరగబడలేదేం? అలాగే పదవిలో ఉన్న ముఖ్యమంత్రి (ఆనందీబెన్) ‘నాకు వయస్సు మీద పడింది. పదవిలో ఉండను’ అని తప్పుకోవడం వినలేదు. మనకు హైదరాబాద్ రాజ్ భవన్లో శృంగార కార్యకలాపాలు వెలగబెట్టిన ముసిలి గుజ్జు ఎన్డీ తివారీలే తెలుసు. పార్టీ పదవి లోకి వచ్చాక ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషికి పదవులు రాకపోవడం తెలీదు. అడ్వాణీని రాష్ట్రపతిని చేయడం తెలీదు. ఏమైంది? అధికారానికి బేషరతయిన, అకల్మషమయిన భక్తి అయినా ఉండాలి. శక్తి అయినా ఉండాలి. ఉదా హరణలు బోలెడు: జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ. మొదటి వ్యక్తిపట్ల భక్తి, రెండవ వ్యక్తిది శక్తి. ఎమ్.జీ.ఆర్, ఎన్.టీ.ఆర్ నికార్సయిన మెజారిటీ. అందుకనే మహిళలకు ఆస్తిలో వాటా, గ్రామాలలో అధికారాల సరళతరం, మద్యపాన నిషేధం వంటి పనులు నల్లేరుమీద బండిలాగ చేయగలిగారు. అధికారంలో ఆత్మవంచన, అవకాశవాదం, స్వార్థం, పరిస్థితులకు పబ్బం గడుపుకునే స్వభావం– ఆ అధికారాన్ని గబ్బు పట్టిస్తాయి. ఉదాహరణ–10 జనపథ్ ఒక్కటి చాలు. అలనాడు శ్రీరాముడిది ప్రజల భక్తి. రావణుడిది శక్తి. అయినా రాముడి పాలనలో రజకుడు ఉన్నాడు. లంకలో రజకుడు నోరెత్తలేడు. అవిధేయత పునాదులు పెకలించలేనంత బలంగా, లోతులకు పాతుకున్నప్పుడు– అధికారా నికి తప్పనిసరిగా ‘శక్తి’ అవసరం. ఇది సమకాలీన వ్యవస్థకి అవసరమైన ఆయుధం. ఇప్పటి వ్యవస్థలో దీని పేరు ‘మెజారిటీ’. అధికారానికి పట్టిన ‘గబ్బు’ని అచిరకాలంలోనే మనం చూశాం. 70 ఏళ్ల వ్యవస్థలో ప్రజాస్వామ్యం కంపు కొడు తోందని ఆనాడే గుర్తించిన గాంధీగారు కాంగ్రెస్ పార్టీని ఆనాడే అటకెక్కించమన్నారు. ఎక్కించకపోతే ఏమవుతుంది? ముందు రోజులు చెప్తాయి. గొల్లపూడి మారుతీరావు -
ఉల్లిపాయ–ఉక్కు మనిషి
ఉల్లిపాయకీ ఉక్కుమనిషికీ దగ్గర సంబంధం ఉన్నదని చెప్పడం తాటిచెట్టుకీ తాత పిల కకీ ముడిపెట్టడం అని చాలామందికి అనిపించవచ్చు. ముఖ్యంగా మన దేశంలో ఉల్లిపాయని చిన్నచూపు చూడటానికి వీలు లేదని అనుభవజ్ఞులకు ఈపాటికే అర్ధమయివుంటుంది. నిజానికి ఉల్లిపాయని ‘రాజకీయ’ ఆయు ధంగా మనం గుర్తించాలి. 1998లో ఉల్లిపాయ బిజేపీ ప్రభుత్వాన్ని అల్లల్లాడించింది. ఈ సందర్భంగా రెండు జోకులు గుర్తుచేసుకోవాలి. ఆ రోజుల్లో ఢిల్లీలో ఉల్లిపాయ ధర కిలో 60 రూపాయలు కాగా, ఒక వ్యాపారి ఒక కిలో ఉల్లిపాయ కొన్నవారికి రెండు టీ–షర్టులు ఉచితమని ప్రకటించాడట! గ్రేటర్ కైలాష్లో దొంగలు ఒక ఇంట్లో దొంగతనానికి వచ్చారు. 500 రూపాయలు దోచుకుని బొత్తిగా ఇంట్లో ఏమి విలువైన వస్తువులు ఉంచనందుకు యజమానిని హింసించబోయి–5 కిలోల ఉల్లిపాయలు చూశారట. తృప్తిపడి ఉల్లిపాయ సంచీతో వారు నిష్క్రమించారట! అలనాడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గారు తమ రాష్ట్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించడానికి నిర్ణయించారు. ప్రపంచంలోకెల్లా ఎల్తైన ఈ విగ్రహాన్ని ప్రధానిగా మొన్న ఆవిష్కరిం చారు. కేవలం 33 నెలలలో నిర్మితమైన ఈ విగ్రహం 2,989 కోట్ల ఖర్చుతో నిర్మితమైంది. ఈ స్ఫూర్తితోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మొన్న సరయు నదీతీరాన 151 మీటర్ల ఎత్తున శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మింపజేయనున్నట్టు ప్రకటించారు. ఇంతకూ ఉల్లిపాయకీ పటేల్గారికీ ఏం సంబంధం? పటేల్గారు ‘ఐరన్ మాన్’ మాత్రమే కాక ‘ఆనియన్ మాన్’ అని ఒకానొక పత్రికలో పేర్కొన్నారు. రెజినాల్డ్ రేనాల్డ్స్ అనే గాంధీజీ అనుయాయుడు సబర్మతి ఆశ్రమంలో తన అనుభవాల గురించి ఒక పుస్తకాన్ని (టు లివ్ ఇన్ మాన్కైండ్) రాశారు. ఒకసారి ఎవరో ఆశ్రమానికి కూరగాయల సంభారాన్ని బహుకరించారట. అందులో ఉల్లిపాయలున్నాయి. ఉల్లిపాయలు బ్రహ్మచారులకు నిషిద్ధం–అవి రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి కనుక . ఆశ్రమంలో ఉన్న మరో బ్రిటిష్ అనుయాయురాలు మిరాబెన్–అందరికన్నా చాదస్తురాలు. ఈ ఉల్లిపాయలని వెంటనే నిషేధించాలని అన్నారట. కాని పటేల్ గారు ‘‘ఉండనీయండి. నేనూ రెజినాల్డ్ ఈ ఉల్లిపాయల్ని తింటాం’’ అన్నారట. వీరిద్దరూ నరభక్షణ చేస్తున్నట్టు అందరూ నిర్ఘాంతపోయి చూస్తుండగా వీరు భుజించారట. తరు వాత తరువాత గాంధీజీ ఉల్లిపాయ ఉపకారాన్ని గ్రహిం చారు. ముఖ్యంగా వెల్లుల్లిపాయ చేసే మేలుని ఆయన గుర్తించారు. కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలకు అనుగుణంగా పటేల్ తన కర్తవ్యాన్ని మలుచుకోవడానికి ఈ సందర్భం ఒక గుర్తుగా నిలుస్తుంది. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సమైక్య భారత స్థాపనకు–ఆస్థానాల విలీనానికి అప్పటి వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యమించిన ఉక్కుమనిషి కర్తవ్య మూలాలు ఇలాంటి సందర్భాలలో కనిపిస్తాయి. ఒకే ఒక సంస్థాన విలీనానికి నెహ్రూగారు తలదూర్చారు–కశ్మీర్. ఆ సమస్య ఇప్పటికీ రావణకాష్టంలాగా రాజుకుం టూనే ఉంది. మరొక సంస్థానంలో నెహ్రూ కలగజేసుకోబోయారు–హైదరాబాదు. అదృష్టవశాత్తూ పటేల్ ఆయన్ని దృష్టి మళ్లించి పోలీసు యాక్షన్ జరిపించారు. లేకపోతే దక్షిణాన మరో కాష్టం ఈనాటికీ రాజు కుంటూ ఉండేది. మహాత్ముడు దక్షిణాఫ్రికా నుంచి వచ్చి–అక్కడ ఆచరించిన సత్యాగ్రహాన్ని మన దేశంలో అమలు జరపాలనుకున్నప్పుడు–1918లో ఖేడాలో–గ్రామీణులని మేల్కొల్పడానికి పటేల్ ఉల్లిపాయను గాంధీగారికి తీసుకువచ్చారట. ఆ ప్రాంతంలో ఉల్లి రైతులకు జీవనాధారం. అయితే పంటలు పండకపోయినా రైతులు శిస్తుకట్టాల్సిందేనని బ్రిటిష్ ప్రభుత్వం పట్టుబట్టారు. అప్పటి స్థానిక కలెక్టరు ఫెడిరిక్ ప్రాట్ బ్రిటిష్ ఆదాయానికి ఆటపట్టు ఉల్లి పంటల భూముల శిస్తు అని గాంధీకి హెచ్చరించి చెప్పారట. అప్పుడే పాలకవర్గాన్ని గద్దె దించేది ‘ఉల్లిపాయ’ అని గాంధీజీ గ్రహించారు. దండి యాత్రలో కూడా గాంధీజీ ‘బ్రిటిష్ వారి జులుంకి మనం తలవొంచం. అవసరమైతే ఉల్లిపాయలు కారణంగా వెయ్యిసార్లు జైలుకి వెళ్తాం’’ అన్నారట. ఈవిధంగా పటేల్ గారి ప్రమేయంతో, స్ఫూర్తితో–సామాన్య రైతు జీవనాన్ని, తద్వారా ప్రజానీకానికంతటికీ వినియోగపడే ఉల్లిపాయ ‘జాతీయో ద్యమం’లో భాగమైనది అంటే పరోక్షంగా ‘ఉప్పు’ సత్యాగ్రహంలో ‘ఉల్లి’ సత్యాగ్రహం భాగమన్నమాట. నాకనిపిస్తుంది–ఇదంతా వింటున్నప్పుడు–కొద్దిలో తప్పిపోయింది కానీ–అది ప్రపంచ ప్రఖ్యాత ‘‘ఉప్పు–ఉల్లి సత్యాగ్రహం’’ అయ్యేదని. ఆవిధంగా 1998లో ఉల్లిపాయకీ అప్పటి ప్రభుత్వానికీ, 1918లో ఉల్లిపాయకీ బ్రిటిష్ ప్రభుత్వానికీ సంబంధించిన ‘చరిత్ర’ ఉన్నది. మొదటి చరిత్రకి మూలపురుషుడు–సామాన్య ప్రజానీకం అవసరాలను తీర్చి, ప్రతీక్షణం వారి జీవికకు ఆసరాగా నిలిచే ప్రాణ ధాతువుని పట్టుకున్న ఘనుడు–నేడు ప్రపంచంలో అందరికన్నా ఎత్తుగా నిలిచిన ఉక్కుమనిషి–సర్దార్ పటేల్. గొల్లపూడి మారుతీరావు -
కొత్త ఉపద్రవం
జీవన కాలమ్ బతికున్నవారు బుద్ధిగా, బాధ్యతగా ‘చావడం’ ఎంత ముఖ్యమో, ఎంత తప్పనిసరో ప్రచారం చేసే ఉద్యమాలు రావచ్చు. స్వచ్ఛందంగా చచ్చిపోయేవారికి ప్రభుత్వాలు తాయిలాలు ప్రకటించవచ్చు. దావోస్లో జరుగుతున్న సర్వదేశ సమ్మేళనంలో సత్య నాదెళ్ల ప్రసంగిస్తూ కొద్దికాలంలో మానవుడు 140 సంవత్సరాలు జీవించబోతున్నాడని సోదాహరణంగా వక్కాణించారు. ఇది మానవాళి మీద పెద్ద గొడ్డలిపెట్టు. మా చిన్నతనంలో ఏదైనా అనర్థం జరిగినప్పుడు మా నాయనమ్మ అంటూండేది: ‘ఈ ఘోరాలు చూడటానికా నేను ఇంకా బతికి ఉన్నాను. నన్ను త్వరగా తీసుకుపో దేవుడా!’ అని. ఇది తేలికగా 70 సంవత్సరాల కిందటిమాట. ఇప్పటి మనుషులు 140 ఏళ్లు బతకబోతున్నారు. రోజుకి లక్షల గాలన్ల చమురును తవ్వుకుంటున్న నేపథ్యంలో భూమిలో చమురు నిల్వలు మరో 22 సంవత్సరాలలో పూర్తిగా నిండుకుంటున్నాయి. మనం ఇప్పుడే తాగే మంచినీళ్లని కొనుక్కుంటున్నాం. అచిరకాలంలో పీల్చే గాలిని కొనుక్కోవలసిన రోజులు వస్తాయని ఒక శాస్త్ర జ్ఞుడు అన్నాడు. 70 సంవత్సరాల తర్వాత ఇప్పటిలాగ విరివిగా వాడుకోడానికి నీరు దొరకదు. స్నానానికి బదులు రసాయనాలతో ఒళ్లు శుభ్రం చేసుకునే ప్రత్యా మ్నాయ ధోరణులు వస్తాయన్నారు. ధృవాలలో మంచు కరిగిపోతోంది. ఈ సీజనులోనే ఒక హరియాణా రాష్ట్ర మంత మంచు శకలం కరిగి సముద్రంలోకి దూసుకు వచ్చిందట. ఇది ఒక పార్శ్వం. ఈ మధ్య అమెరికాలో ఉద్యోగం చెయ్యని పిల్లలు లేని కుటుంబాలు లేవు. లక్షల ఆస్తి ఉన్న, పోస్టు మాస్ట ర్గా రిటైరయి పెన్షన్ తీసుకుంటున్న ఒకాయన తమ కూతురు అమెరికాలో 40 ఏళ్లుగా ఉంటూ చుట్టపు చూపుగా వచ్చిపోతూంటే– ఆయన వృద్ధాశ్రమంలో కాలం చేశారు. ఒక దశలో సంపాదనకి విలువ పోయి, జీవితం యాంత్రికమై, తమ పిల్లలు– బంధువులకీ, భాషకీ, భారతీయ జీవన విధానానికీ దూరమై బతుకు తూంటే– నిస్సహాయంగా ఆత్మవంచన చేసుకుంటు న్నారు. ఇది మరొక పార్శ్వం. ఈ దేశంలో సుప్రీంకోర్టు తీర్పులనే ఖాతరు చేయ కుండా–ఓ సినీమాలో లేని అభ్యంతరాలని, లేవని నిరూపించినా–మారణ హోమాన్ని సృష్టించే గూండాలు, వారి అకృత్యాలకు భయపడి.. సుప్రీంకోర్టు అదిలించినా చేష్టలుడిగిన రాష్ట్ర ప్రభుత్వాలు, పరీక్షలు వాయిదా కోసం హత్య అవసరమని భావించే హింసాత్మకమైన ‘ఆలోచన’లకి పసితనంలోనే పునాదులు పడుతున్న విష సంస్కృతి, చదువుకోలేదని గదమాయించిన టీచర్ని కాల్చి చంపిన విద్యార్థి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతీ దశ లోనూ కోట్లు నొల్లుకునే ‘నీచపు’ ఆఫీసర్ల ఉద్యోగుల వీర విహారం– ఇది మరొక పార్శ్వం. సరే. 140 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ప్రతీ పౌరుడికీ కనీసం రెండు హత్యలు–సజావయిన కారణాలకు చేసుకునే రాయితీని ప్రభుత్వం కలిగిం చవచ్చు. లల్లూ వంటి మహా నాయకుల ఆరో తరం మునిమనుమడు–ప్రతీ మనిషీ తన జీవితంలో 570 టన్నుల గడ్డి తినే అనుమతిని కల్పించవచ్చు. ప్రతి పౌరుడూ విధిగా మోసుకుతిరిగే ఆక్సిజన్ సిలిండర్ల దొంగ తనం చేసి అమ్ముకునే వ్యాపారాలు దావూద్ ఇబ్రహీం ఏడో తరం వారసుడు ప్రారంభించవచ్చు. ఏ భక్తుడైనా తన జీవితకాలంలో తనకు నచ్చిన మూడు క్షేత్రాలలో క్షుద్ర పూజలు చేసుకునే అవకాశాన్ని కల్పించవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు–సాలీనా కనీసం 120 కోట్లు భక్షించవచ్చునని అనుమతిని ఇవ్వవచ్చు. తన ఆరో తరం ముని మనుమడు చదువుతో హింసి స్తున్న బడిపంతుల్ని క్లాసులో బాంబు పెట్టాలనుకుంటు న్నట్టు 120 ఏళ్ల ముత్తాతకి తెలిస్తే–రెండు హత్యలకు రాయితీ ఉన్న ఈ మనుమడు–తాతని పొడిచి చంపవచ్చు. గూండాలు నాయకులవొచ్చు. హంతకులు ప్రవచనాలు చెప్పవచ్చు. సెక్స్ కథలు పాఠ్య పుస్తకాలలోనే చోటు చేసు కోవచ్చు. సాయంకాలం పార్కుల్లో కనిపించే ముసిలి గుంపుల లక్ష్యం ‘ఆరోగ్యం’ కాదు– ఇంట్లో వారి చాద స్తాన్ని భరించలేని పిల్లలు, కోడళ్లూ కనీసం ఆ రెండు గంటలు విశ్రాంతికి వాళ్లకి కార్లిచ్చి తగలెయ్యడం. మరి 80, 100, 120, 130 సంవత్సరాల ముసిలి వొగ్గుల మాటే మిటి? వృద్ధాశ్రమాలు మాత్రమే కాక, ముసిలివారి ‘చాదస్త’ విముక్తి ఆశ్రయాలు కల్పిస్తారేమో! ఇర్విన్ షా అనే ఆయన ‘బరీ ది డెడ్’ (Bury the Dead) అనే నాటిక రాశాడు. చచ్చిపోయినవాళ్లు చచ్చి నట్టు సమాధుల్లో ఉండక లేచి నిలబడ్డారు. ఎంత పెద్ద విపత్తు? ఎవరి బంధువులు వారి దగ్గరికి వచ్చి ‘చచ్చి నవారు చచ్చినట్టు’ ఉండటం ఎంత అవసరమో నచ్చ చెప్తారు. ఈ ఇబ్బంది ఇప్పుడు బతికున్నవారికి రాబో తోంది. బతికున్నవారు బుద్ధిగా, బాధ్యతగా ‘చావడం’ ఎంత ముఖ్యమో, ఎంత తప్పనిసరో ప్రచారం చేసే ఉద్య మాలు రావచ్చు. స్వచ్ఛందంగా చచ్చిపోయేవారికి ప్రభు త్వాలు తాయిలాలు ప్రకటించవచ్చు. ఇందులో మళ్లీ దొంగదారిన అనుమతులు తెచ్చుకుని బతికేస్తున్నవారూ, లంచాలిచ్చి బతికేసేవారు... ‘అయ్యో దేవుడా! నన్ను ఎప్పుడు తీసుకు పోతావు!’ అని మా నాయనమ్మలాగా ప్రాధేయపడే రోజులు ముందున్నాయి. - గొల్లపూడి మారుతీరావు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement