-
హత్య: ఆయుధాలతో, అనంతరం తుపాకులతో..
భోపాల్: విశ్వహిందూ పరిషత్ సభ్యుడొకరు దారుణ హత్యకు గురైన సంఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. హోసంగాబాద్ జిల్లా వీహెచ్పీ గోరక్షక్ శాఖ ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవి విశ్వకర్మ (35)ని కొందరు దుండగులు కాల్చి చంపారు. తన ఇద్దరు మిత్రులతో కలిసి ఆయన శుక్రవారం కారులో ఇంటికి వెళ్తుండగా పిపారియా పట్టణం వద్ద 10 మంది మూక వారిపై పదునైన ఆయుధాలతో దాడి చేసింది. అనంతరం కాల్పులు జరిపింది. ఛాతీలో బుల్లెట్ దిగడంతో రవి అక్కడిక్కడే ప్రాణాలు విడువగా.. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పిపారియా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించి పట్టుకుంటామని ఎస్ఐ సతీష్ అంధ్వాన్ తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే రవి విశ్వకర్మను దారుణంగా హత మార్చారని వీహెచ్పీ ప్రాంతీయ సహ మంత్రి గోపాల్ సోని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. (చదవండి: కరోనాతో సీనియర్ వీడియో జర్నలిస్టు కన్నుమూత) -
ఆవు మూత్రం తాగించి, పేడ తినిపించారు
న్యూఢిల్లీ: గో రక్షణ సమితి సభ్యుల అకృత్యం ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బీఫ్ ను ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు యువకుల చేత బలవంతంగా ఆవు మూత్రం తాగించి, ఆవు పేడ తినిపించిన వైనం విమర్శలకు తావిచ్చింది. అక్రమంగా బీఫ్ ను తరలిస్తున్నారని ఆరోపిస్తూ వారిపై భౌతికంగా దాడిచేసి పంచగవ్య తినిపించారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. గో రక్షణ సమితి అధ్యక్షుడు ధర్మేంద్ర యాదవ్, అతని సహచరులు గుర్గావ్ లో ఇద్దరు యువకులు రిజ్వాన్, ముక్తియర్ లపై ఈ దారుణానికి పాల్పడ్డారు. యువకులిద్దరు 'పంచగవ్య'తో కూర్చొని ఉండడం, దాన్ని సులభంగా మింగడానికి గో రక్షణ కార్యకర్తలు నీళ్లు ఇవ్వడం.. తినమని గద్దించడం ఈ వీడియోలో చూడవచ్చు. 'గోమాత కీ జై', 'జై శ్రీ రామ్' అంటూ నినాదాలు చేశార. అయితే రిజ్వాన్, ముక్తియర్ అక్రమంగా 7 వందల కేజీ గొడ్డు మాంసాన్ని రవాణా చేస్తున్నారని ధర్మేంద్ర ఆరోపించారు. మేవాత్ నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. అందుకే వారికి గుణపాఠం చెప్పాలనే పంచగవ్య (ఆవు మూత్రం.. పేడ. పాలు పెరుగు, నెయ్యిల మిశ్రమం) తినిపించామని తెలిపారు. దీని ద్వారా వారిని పరిశుద్ధులను చేశామన్నారు. దీన్ని వీడియో ఎవరు తీశారో, బయటికి ఎలా వచ్చిందో తమకు తెలియదన్నారు. 3 వందల కేజీల బీఫ్ ను స్వాధీనం చేసుకున్నామని ఫరీదా పోలీస్ అధికారి తెలిపారు. గోవధ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపామన్నారు. అయితే బలవంతంగా పేడ, మూత్రం తినిపించిన అంశం తమ దృష్టికి రాలేదన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement