-
అది చెత్తకుండి కాదు..! కంట్రోల్ వాల్వ్..!!
కరీంనగర్: నగరంలోని పలు రిజర్వాయర్లకు తాగునీటిని సరఫరా చేసే మెయిన్ కంట్రోల్ వాల్వ్ అది. కానీ చెత్తచెదారం.. మూత్రవిసర్జనకు నిలయంగా మారింది. నగరంలోని ఫిల్టర్బెడ్ నుంచి తాగునీటి ప్రధాన పైప్లైన్ భగత్నగర్లోని అంబేడ్కర్ స్టేడియం నుంచి రిజర్వాయర్లకు వెళ్తుంది. అంబేడ్కర్ స్టేడియం మెయిన్ గేట్ సమీపంలోని నాలా పక్కన దీనికి కంట్రోల్ వాల్వ్ ఉంది. దీని నిర్వహణపై అధికారులు ఇన్నాళ్లు దృష్టి పెట్టకపోవడంతో డస్ట్బిన్గా మారింది. సమీపంలోని వ్యాపారులు చెత్తాచెదారాన్ని ఇందులో పడేస్తుండటంతో గుట్టలుగా పేరుకుపోయింది. అలాగే ఈ ప్రాంత వాసుల కువాల్వ్ చాంబర్ సులభ్ కాంప్లెక్స్గా మారింది. రిజర్వాయర్లకు సరఫరా చేసే తాగునీరు కలుషితమ య్యే ప్రమాదం ఏర్పడింది. శనివారం నగరపాలక సంస్థ సిబ్బంది వాల్వ్కు మరమ్మతు చేసేందుకు వచ్చారు. వారు చెత్త గుట్టను చూసి, ఖంగుతిన్నారు. వెంటనే దాన్ని తొలగించారు. వాల్వ్కు భవిష్యత్లో ఇలాంటి పరిస్థితి రాకూడదంటే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
మన రోల్ మోడల్.. ఒక మంచి పనికి ఎవరో చెప్పడం ఎందుకూ!
పండ్లు అమ్మే ఒక మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని అంకోలా బస్టాండ్లో పండ్లు అమ్మే ఒక మహిళ ‘పండ్లు అమ్మడమే కాదు పరిసరాల పరిశుభ్రత కూడా నా బాధ్యత’ అంటోంది. బస్ స్టాండ్ పరిసరాల్లో ఎక్కడ పండ్ల తొక్కలు కనిపించినా వాటిని తీసుకువచ్చి చెత్త డబ్బాలలో వేస్తూ ఉంటుంది. ‘ఇలా చేయమని ఎవరైనా చెప్పారా?’ అని అడిగితే– ‘ఒక మంచి పనికి ఎవరో చెప్పడం ఎందుకూ’ అంటుంది. ఈ మహిళ వీడియో క్లిప్ను ఆదర్శ్ హెగ్డే అనే యువకుడు ట్విట్టర్లో షేర్ చేస్తే వైరల్ అయింది. నెటిజనులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ‘మన రోల్ మోడల్’ ‘ఎంత గొప్ప మనసో!’ ‘రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్’ ‘నిజమైన హీరో కోసం ఎన్నో ఏళ్లుగా వెదుకుతున్నాను. ఇవాళ్టికి దొరికింది’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. This lady is fruit seller & she sells fruits wrapped in leaves at Ankola Bus stand,Karnataka. Some people after finish eating they throw the leaves from bus window. But this lady goes there picks up the leaves and puts it in dustbin. Its not her work but she's doing it. 🙂🙏👍 pic.twitter.com/TaqQUGZuxP — Adarsh Hegde (@adarshahgd) April 10, 2023 -
చెత్త బుట్టలో ఉంగరాన్ని పడేసుకున్న మహిళ.. ‘స్పందన’తో స్పందన
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కార్పొరేషన్లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ఓ చిత్రమైన ఫిర్యాదు అందింది. ఒక మహిళ ఫోన్ చేసి తన ఉంగరం పొరపాటున ప్రభుత్వ చెత్త బుట్టలో పడిపోయిందని చెప్పింది. ఆ ఉంగరాన్ని వెతికించి.. ఇవ్వాలని కోరింది. దీంతో శానిటేషన్ సిబ్బంది చెత్తనంతా జల్లెడ పట్టి.. చివరకు ఉంగరాన్ని ఆమెకు అప్పగించారు. వివరాలు.. ఇన్నీస్పేటకు చెందిన నాగలక్ష్మి సోమవారం తన ఇంట్లోని చెత్తను తీసుకెళ్లి.. సమీపంలోని ప్రభుత్వ చెత్త తొట్టెలో వేసింది. ఆ తర్వాత కొంతసేపటికి.. తన చేతికి ఉన్న 6 గ్రాముల బంగారు ఉంగరం కనబడకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. చెత్త బుట్టలో జారిపోయి ఉంటుందన్న సందేహంతో.. అక్కడకు వెళ్లింది. కానీ అదంతా చెత్తతో నిండిపోయి ఉండటంతో.. నాగలక్ష్మి ‘స్పందన’ కార్యక్రమాన్ని ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కమిషనర్ దినేశ్కుమార్.. స్థానిక సచివాలయ సిబ్బందిని, పారిశుధ్య కార్మికులను అప్రమత్తం చేశారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ బుద్ధ శ్రీను, శానిటేషన్ సెక్రటరీ ఎం.రాజేశ్, పారిశుధ్య కార్మికులు బంగారు శ్రీను, జయకుమార్, మేస్త్రీ శ్రీను దాదాపు 5 గంటల పాటు చెత్తనంతా వెతికి.. ఉంగరాన్ని బాధితురాలికి అందజేశారు. దీంతో నాగలక్ష్మి వారికి కృతజ్ఞతలు తెలిపింది. -
చెత్త బ్యాగ్ రూ.లక్షా 40వేలు.. వైరలవుతోన్న మీమ్స్
అంతలేదని కొట్టి పారేస్తున్నారా? అది నిజం. లగ్జరీ బ్రాండ్ బలెన్సియాగా ఈ బ్యాగులను తయారు చేసింది. కంపెనీ ‘ట్రాష్ పౌచ్’గా పిలుస్తున్న ఈ బ్యాగులను దూడ తోలుతో తయారుచేసి.. గ్లాసీ కోటింగ్ ఇచ్చింది. నలుపు, తెలుపు, నీలం, పసుపు రంగుల్లో వీటిని తయారు చేసింది. బ్యాగును క్లోజ్ చేసేందుకు బ్యాక్పాక్కు ఉన్నట్టుగా త్రెడ్స్ను కూడా ఏర్పాటు చేసింది. అంతే లగ్జరీగా వింటర్–22 కలెక్షన్లో విడుదల చేసింది. ఆ వీడియోలు కాస్తా ట్విట్టర్లోకి వచ్చాయి. అంతే ఆ ధర చూసి కళ్లు తిరిగిన ట్విట్టర్ యూజర్స్ మీమ్స్తో ఆడుకుంటున్నారు. కొందరైతే తిట్ల దండకమే మొదలుపెట్టారు. ‘‘చెత్త బ్యాగుకోసం లక్షన్నర ఖర్చు చేయగలిగినవాళ్లకి దాన్నిండా నింపగలిగేంత క్యాష్ బ్యాంకులో ఉండే ఉంటుంది. అలా నింపేసి అవసరంలో ఉన్నవారికి చారిటీగా ఇచ్చేయొచ్చు కదా’’ అని ట్వీట్ చేశాడో యూజర్. ఇక ‘‘ఆ చెత్త బ్యాగ్ను తీసుకుని మీరు వెళ్తే... మిమ్మల్ని దోచుకోవడానికి కొంతమందిని పంపిస్తా’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా లగ్జరీ ఐటమ్స్తో వివాదాస్పదం కావడం బలెన్సియాకు కొత్తేం కాదు... ఇదే ఏడాది మేలో ‘రబ్బిష్ బిన్’ పేరుతో చిరిగిపోయిన షూస్ను రూ.2 లక్షల లకు అమ్మి విమర్శలు ఎదుర్కొందీ కంపెనీ. -
చెత్త లేని 'కొత్త నగరాలు'
సాక్షి, అమరావతి: ఎక్కడపడితే అక్కడ చెత్త.. పూడుకుపోయిన కాల్వలు.. రోడ్లపై పారే మురుగు నీరు.. దుర్గంధంతో ముక్కు మూసుకు నడవాల్సిందే.. వీధుల్లో నివాసముండే వారికి చెత్త, మురుగు వాసనతో నిత్యం నరకం.. రెండున్నరేళ్ల క్రితం వరకు పట్టణాలు, నగర వాసుల దుస్థితి ఇది. ఇప్పుడు ఈ నగరాలు కొత్తగా కనిపిస్తున్నాయి. చెత్త, మురుగు, దుర్గంధం నుంచి ప్రజలకు విముక్తి కలిగింది. రాష్ట్ర ప్రజలు మంచి ఆరోగ్యకర వాతావరణంలో జీవించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనే దీనికి నాంది పలికింది. ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో పాటు ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 2న ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా నిలబెట్టేందుకు పట్టణాలు, నగరాలను బిన్ ఫ్రీ, లిట్టర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీగా మార్చే చర్యలు చేపట్టింది. ఇందుకోసం చెత్తను ఇంట్లోనే సేకరించేందుకు ప్రతి ఇంటికీ చెత్త డబ్బాలు పంపిణీ చేసింది. ఇలా 1.20 కోట్ల చెత్త డబ్బాలను అందించి, ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను గార్బేజ్ స్టేషన్లకు తరలించేందుకు 4,220 వాహనాలను సమకూర్చింది. ఒకప్పుడు మురికి కూపాలుగా ఉన్న ప్రాంతాలను పరిశుభ్ర ప్రాంతాలుగా మార్చింది. మురుగు నీటి శుద్ధికి ఎస్టీపీల నిర్మాణం చేపట్టింది. డంపింగ్ యార్డ్ల్లో ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్త కుప్పలను తరలిస్తోంది. చెత్త ద్వారా సంపదను సృష్టిస్తోంది. ఇందులో కొన్ని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేపట్టగా, మరికొన్నింటిని పబ్లిక్– ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో చేపట్టింది. ఏడాది కాలంలోనే సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి పట్టణాలు, నగరాలకు కొత్త రూపును తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా చర్యలతో పలు నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ పలు నగరాలు జాతీయ స్థాయి అవార్డులను సైతం దక్కించుకున్నాయి. ఇంటింటికీ చెత్త డబ్బాలు గృహాల్లోనే తడి, పొడి, ప్రమాదకర (నాప్కిన్స్, సిరంజిలు, గ్లౌజ్లు, ఎలక్ట్రికల్ వ్యర్ధాలు) చెత్త వేరు చేసేలా ప్రతి ఇంటికి మూడు డస్ట్ బిన్లను క్లాప్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేసింది. 124 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని సుమారు 40 లక్షల గృహాలకు రూ.80.17 కోట్లతో 1.20 కోట్ల చెత్త డబ్బాలు అందించింది. ఇళ్ల నుంచి చెత్త సేకరణ, తరలింపునకు మరింత శ్రద్ధ తీసుకుంటోంది. ఇందుకోసం పీపీపీ విధానంలో 3,097 డీజిల్ ఆటో టిప్పర్లను పట్టణాల్లో అందుబాటులోకి తెచ్చింది. రూ. 60 కోట్లతో మరో 1,123 ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేసింది. సేకరించిన చెత్తను శుద్ధి చేసేందుకు 124 మున్సిపాలిటీల్లో 243 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల (జీటీఎస్)ను రూ.227.89 కోట్లతో నిర్మిస్తోంది. వీటిలో కొన్ని పూర్తవగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి అదనంగా వివిధ ఏజెన్సీల ద్వారా 72 మునిసిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఐఎస్డబ్లూఎం) ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తోంది. పట్టణాలకు జాతీయ స్థాయిలో అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా చర్యలతో నగరాలు చెత్త రహితంగా మారుతున్నాయి. 2021లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్లో దేశవ్యాప్తంగా 4,320 నగరాలు పోటీపడగా విజయవాడ అత్యుత్తమ పరిశుభ్రమైన నగరంగా మూడో స్థానంలో నిలిచింది. తిరుపతి, విశాఖపట్నం నగరాలు బెస్ట్ సిటీస్ ఇన్ పబ్లిక్ ఫీడ్బ్యాక్గా నిలిచాయి. దక్షణాదిలో పుంగనూరు సైతం బెస్ట్ సిటీగా అవార్డు దక్కించుకుంది. నెల్లూరు పట్టణం సైతం సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇదే ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్లో బెస్ట్ గార్వేజ్ ఫ్రీ సిటీలుగా దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాలను ఎంపిక చేయగా విజయవాడ 5 స్టార్ రేటింగ్ సాధించడం స్వచ్ఛతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. 2020లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్లో దేశవ్యాప్తంగా 4,242 నగరాలు పోటీపడగా విజయవాడ, విశాఖ, తిరుపతి ఉత్తమ నగరాలుగా అవార్డులు సాధించాయి. చెత్త నుంచి సంపద తయారీ ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ నగరాల నుంచి నిత్యం 6,900 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. గతంలో నగరాలు, పట్టణాల్లో సేకరించిన ఘన వ్యర్థాలను డంపింగ్ యార్డుల్లో వేయడంతో ఆ ప్రాంతాల్లో కొండలను తలపిం చేలా చెత్త గుట్టలు తయారయ్యాయి. పట్టణాల విస్తరణతో ఈ చెత్త గుట్టల చుట్టూ జనావాసాలు పెరిగాయి. చెత్త, దాని నుంచి వచ్చే దుర్వాసన ఆ ప్రాంతాలను కలుషితం చేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మెరుగైన చర్యలు చేపట్టింది. మొత్తం 124 పట్టణ సంస్థల్లో పేరుకుపోయిన దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తోంది. అంతే కాకుండా ఇళ్ల నుంచి తెచ్చిన చెత్త నగరంలో ఎక్కడా పోగుపడకుండా 243 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను (జీటీఎస్) ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్లలోనే వివిధ రకాల చెత్తను వేరుచేసి ఎరువు, విద్యుత్ కోసం వినియోగిస్తున్నారు. గుంటూరు, విశాఖపట్నం వద్ద చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లు నిర్మించింది. వీటిలో ప్రతిరోజు 2,,335 మెట్రిక్ టన్నుల చెత్తను విద్యుత్ తయారీకి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ట్రయల్ రన్లో ఉన్న ఈ ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి 22 మెగావాట్ల విద్యుత్ అందుతుంది. మరో 2,650 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి బయోగ్యాస్, ఎరువు తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ద్రవ వ్యర్ధాలను శుద్ధి చేసేందుకు 71 ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎఫ్ఎస్టీపీ)ను ఏర్పాటు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement