-
‘అబద్దాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు’
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు నాయుడు తన అబద్దాలను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లారని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయంపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 2 కోట్ల ఎకరాలు సేంద్రియ ప్రకృతి సాగులోకి తెస్తామని చంద్రబాబు చెప్పారని, కానీ సోసియో ఎకనామిక్ సర్వే ప్రకారం 61వేల హెక్టార్ల భూమినే మాత్రమే వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారని, ఎరువుల వాడకంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఆరో స్థానంలో ఉందని, ఇలాంటప్పుడు 2 కోట్ల ఎకరాల్లో సేంద్రియ సాగు ఎలా చేస్తారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో పశువులను అమ్ముకుంటున్నారని, రాయలసీమలో రైతులు ఆత్మహత్యచేసుకుంటుంటే అక్కడేమో చంద్రబాబు ఫిడెల్ వాయిస్తున్నారని ఎద్దేవ చేశారు. చంద్రబాబు తన భాషతో దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నారని, ఆయన పబ్లిసిటి మనిషి అని దుయ్యబట్టారు. అంతర్జాతీయ వేదికపైనే అసత్యాలు చెప్పారన్నారు. ఎలక్షన్ పాలసీ, రహస్య ఎజెండాతోనే విదేశాలకు వెళ్లడం చంద్రబాబుకు అలవాటేనని తెలిపారు. అధికారంలోకి వస్తే ఇంటికి రూ 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో లక్షమంది మాత్రమే అర్హులైన వారున్నారని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి రూ.12వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై ఎదురుదాడి చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. దివంగత వైఎస్సార్ వారుసులమని, తప్పు చేసిన వారు ఎవరైనా వారిపై విచారణ చేయాలని కోరుతామన్నారు. 2016లో జరిగిన రక్షణ ఒప్పందంపై విచారణ జరిపించాలని తమ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాపై అనేక ఉద్యమాలు చేసింది వైఎస్సార్సీపీనే అని, హోదాను తాకట్టు పెట్టింది టీడీపీనే అని తెలిపారు. -
అబద్ధాలు చెప్పడంలో బాబుది ప్రపంచఖ్యాతి
-
'ఇక త్యాగాలు చేసే ఓపిక రాయలసీమ వాసులకు లేదు'
కడప: టీడీపీ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషాలు శనివారం కడపలో నిప్పులు చెరిగారు. ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తూ మరో ఉద్యమానికి ఉతమిస్తుందని వారు ఆరోపించారు. అప్పట్లో కృష్ణాజలాలు, రాజధానికి తరలించుకుపోయారని విమర్శించారు. ప్రస్తుతం తరలిస్తున్న సచివాలయ ఉద్యోగుల్లో రాయలసీమ ఉద్యోగుల వాటా ఎంతా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగుల వాటాపై శ్వేతపత్రం విడుదల చేయాలని వారు చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొత్త నియామకాల్లో రాయలసీమకు నష్టం జరగకుండా చూడాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఇక త్యాగాలు చేసే ఓపిక రాయలసీమ వాసులకు లేదని ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, అంజాద్ బాషా స్పష్టం చేశారు. -
'గొప్పలు చెప్పడం తప్ప బాబు చేసిందేమీ లేదు'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాచరిక పాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి శనివారం హైదరాబాద్లో ఆరోపించారు. చంద్రబాబు పాలనను ప్రవాస భారతీయులు కూడా అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో చోటు చేసుకోంటున్న పరిణామాలపై యూఎస్లోని ఉన్నవారిలో ఆందోళన నెలకొందని చెప్పారు. రాజధాని వ్యవహారాన్ని చంద్రబాబు కుటుంబ వ్యవహారంలా భావిస్తున్నారని విమర్శించారు. టీడీపీ వాళ్లకు ఓ న్యాయం మిగతా పార్టీలకు మరో న్యాయం చేస్తున్నారని శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. గొప్పలు చెప్పడం తప్ప చంద్రబాబు చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రలోభాలు, వలసలను అందరూ తప్పుబడుతున్నారన్నారు. చంద్రబాబు అవినీతి గురించి యూఎస్లోనూ చర్చించుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు అమలు చేయలేదని ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ విషయాన్ని నిలదీస్తే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాతో సహా అన్నింటినీ ఢిల్లీలో తాకట్టు పెట్టారని చంద్రబాబుపై శ్రీకాంత్రెడ్డి నిప్పులు చెరిగారు. -
అమెరికాలో 'సేవ్ డెమొక్రసీ'
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 'వాషింగ్టన్ డీసీ మెట్రో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' ఆధ్వర్యంలో ఆదివారం 'సేవ్ డెమొక్రసీ' సంఘీభావ సభ నిర్వహించారు. ఈ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లోపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజకీయ వ్యభిచారమని శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లను కట్టడి చేయకుంటే వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, తాగునీటి ఎద్దడితోపాటు అవినీతి తదితర సమస్యలపై తమ పార్టీ ప్రజల తరపున నిలదీస్తుందని ఆయన స్పష్టం చేశారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. 'తిరుగులేని నాయకత్వ పటిమ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నిజాయతీ గల ఎమ్మెల్యేగా తాను ప్రజల్లో ఉన్నానని... మీ ప్రలోభాలకు తలొగ్గి పార్టీ మారితే నీతిమాలిన ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతానని తనను పార్టీలోకి రావాలంటూ సంప్రదించిన టీడీపీ నేతలకు స్పష్టం చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పుస్తకాన్ని శ్రీకాంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ పుస్తకం చంద్రబాబు అవినీతి కుంభకోణాలకు అక్షర రూపమని పేర్కొన్నారు. తాము చెప్పేదే వేదం, చేసేదే అభివృద్ధి అంటూ మూర్ఖంగా ముందుకు పోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పక గుణపాఠం నేర్పుతారని టీడీపీ నేతలను శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ అడ్వైజర్ అండ్ మిడ్ అట్లాంటిక్ రీజియన్ ఇన్చార్జ్ వల్లూరు రమేష్ రెడ్డి, సెంట్రల్ రీజియన్ ఇన్ ఛార్జ్ శ్రీ సురేష్రెడ్డి బత్తినపట్లతోపాటు వైఎస్సార్సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ కన్వీనర్ రత్నాకర్ పండుగాయల, స్టూడెంట్ వింగ్ లీడర్ సాత్విక్ రెడ్డి, పలు రాష్టాల నుంచి విచ్చేసిన తెలుగు ఎన్ఆర్ఐలు, విద్యార్థులు, వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీలో మెట్రో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరును సురేష్రెడ్డి బత్తినపట్ల వివరించారు. అలాగే ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్న క్రమంలో పొందిన అనుభవాలను ఈ కార్యక్రమానికి హాజరైన వారితో పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కాగానే దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement