-
HYD: పబ్లిక్ వైఫై వాడాడు.. పైసలు పొగొట్టుకున్నాడు!
కుమార్.. (పేరు మార్చాం) చదువు పూర్తి చేసుకుని గ్రూప్స్ కోచింగ్ కోసం నగరానికి వచ్చాడు. కోచింగ్ కోసం ఓ ఇనిస్టిట్యూట్లో చేరేందుకు ఇంట్లోవాళ్లు డబ్బులు పంపించారు. బయటకు వెళ్లిన కుమార్.. ఓ షాపింగ్ మాల్ బయట ఫ్రీ వైఫైను ఉపయోగించుకునేందుకు యత్నించాడు. ఓటీపీతో లాగిన్ అయ్యి.. మెరుపు వేగంతో వస్తున్న ఇంటర్నెట్ నుంచి ఆశ్చర్యపోయాడు. అలా నెట్ను వాడుకున్న కాసేపటికే.. అతని మొబైల్కు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్లో ఉన్న 50 వేలు కొంచెం కొంచెంగా మాయం అయ్యాయి. భయాందోళనతో.. షాపింగ్ మాల్ వాళ్లను నిలదీశాడు. అసలు తమ మాల్కు ఫ్రీ వైఫై యాక్సెస్ లేదని చెప్పడంతో షాక్ తిన్నాడు. వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. సాక్షి, హైదరాబాద్: ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వాళ్లు.. మినిమమ్ 1 జీబీకి తక్కువ కాకుండా ఇంటర్నెట్ప్యాక్లు ఉపయోగిస్తున్నారు. అయితే అవసరానికి పబ్లిక్ వైఫైలు వాడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడంతా ఇంటర్నెట్ జమానా. నెట్తో కనెక్ట్ కాకుండా క్షణం ఉండలేని పరిస్థితి. ఆన్లైన్ చదువుల మొదలు.. ఆఫీస్కు ఇన్ఫర్మేషన్ పంపే వరకు ఎప్పుడైనా ఎక్కడైనా..ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి. కొన్నిసార్లు ప్రయాణంలో ఉన్నప్పుడు, బయట అనుకోని పరిస్థితుల్లో ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేనప్పుడు ఫ్రీ వైఫైల వైపు చూడడం పరిపాటే. పబ్లిక్ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే వైఫై వినియోగించి ఈ–మెయిల్, ఇతర సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయడం, ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీలు చేస్తే.. మనం నమోదు చేసే యూజర్ ఐడీ, పాస్వర్డ్లను సైబర్ నేరగాళ్లు మాల్వేర్ ద్వారా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉచిత వైఫై వాడాల్సి వస్తే.. అది అధికారికమేనా? సురక్షితమేనా? అనేది క్రాస్ చెక్ చేస్కోవాలి. అలాగే నమ్మదగిన వీపీఎన్ను ముందే ఇన్స్టాల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. -
హైదరాబాద్లో 3 వేల ఉచిత హాట్స్పాట్ సెంటర్లు.. ఎక్కడంటే..
హైదరాబాద్: తెలంగాణ ప్రజల హెల్త్ డెటాను డిజిటలైజ్ చేస్తున్నామని.. త్వరలో బస్తీ దవాఖానాలు, మాల్స్లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. కాగా, బుధవారం హైదరాబాద్లో 3 వేల ఉచిత హాట్ స్పాట్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యాక్ట్ ఫైబర్ నెట్వర్క్తో కలిసి హైఫై సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ హాట్ స్పాట్ల ద్వారా ప్రతిరోజు 1 జీబీ డేటాను.. 45 నిమిషాలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా, ప్రభుత్వ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు తదితర ప్రదేశాల్లో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. -
మన రైల్వే.. మొత్తం వైఫై
సాక్షి, హైదరాబాద్: ఉచిత వైఫై సేవలు అందించడంలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. జోన్లోని అన్ని స్టేషన్లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశంలో ఆ ఘనత సాధించిన రెండో జోన్గా నిలిచింది. ప్రస్తుతం 574 స్టేషన్లలో ఈ వసతిని కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్టెల్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ ద్వారా ఈ సదుపాయాన్ని అందజేస్తున్నారు. హాల్టింగ్ స్టేషన్లు మినహా జోన్లోని అన్ని ఏ–1 కేటగిరీ నుంచి ఎఫ్ కేటగిరీ స్టేషన్ల వరకు హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. 2015లో ఈ పనులకు శ్రీకారం చుట్టి నాలుగేళ్ల సమయంలోనే అన్ని స్టేషన్లకు విస్తరించటం పట్ల అధికారులను ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందించారు. తక్కువ సమయంలో వైఫై సేవలు ప్రారంభించటంలో కీలకపాత్ర పోషించిన అధికారులను జీఎం గజానన్ మాల్యా కూడా ప్రత్యేకంగా అభినందించారు. స్టేషన్ పరిధిలోకి వచ్చిన వారు తమ ఫోన్ ద్వారా ఉచితంగా వైఫై సేవలు పొందొచ్చు. నిర్ధారిత గడువు పూర్తయ్యాక మళ్లీ లాగిన్ అయి సేవలను కొనసాగించుకోవచ్చు. గొల్లపల్లి అనే గ్రామీణ ప్రాంతంలోని రైల్వేస్టేషన్ వైఫై ద్వారా పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విజ్ఞాన సముపార్జనతోపాటు నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నారని అధికారులు తెలిపారు. 2015లో ఏ–1 స్టేషన్ అయిన సికింద్రాబాద్లో ఉచిత వైఫై ప్రారంభించారు. ఇప్పటివరకు 5 ఏ–1 స్టేషన్లు, 31 ఏ కేటగిరీ స్టేషన్లు, 38 బీ కేటగిరీ స్టేషన్లు, 21 సీ కేటగిరీ స్టేషన్లు, 78 డీ కేటగిరీ స్టేషన్లు, 387 ఇ కేటగిరీ స్టేషన్లు, 2 ఎఫ్ కేటగిరీ స్టేషన్లు, 12 కొత్త స్టేషన్లలో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. -
400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ రైల్టెల్తో కలిసి దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని విజయవంతంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. అస్సాంలోని దిబ్రూగర్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ప్రారంభించడం ద్వారా 400 స్టేషన్లలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినట్టయిందని అధికారులు తెలిపారు. లక్షలాది ప్రయాణీకులకు హైస్పీడ్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావడం మరుపురాని అనుభవంగా గూగుల్ ఇండియా పార్టనర్షిప్స్ డైరెక్టర్ కే. సూరి పేర్కొన్నారు. 2016 జనవరిలో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో వైఫై కనెక్టివిటీ కార్యక్రమానికి ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్తో శ్రీకారం చుట్టారు. రైల్టెల్ సమకూర్చిన మౌలిక వసతులతో గూగుల్ తన వైర్లెస్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ను జోడించి ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. -
ఫ్రీ వైఫై.. జీవితాన్ని మలుపు తిప్పింది
తిరువనంతపురం: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తమ చుట్టూ పుస్తకాలు వేసుకుని గంటల తరబడి కుస్తీ పట్టడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ ఓ యువకుడు ఫ్రీ వైఫై సాయంతో తన తలరాతను మార్చుకున్నాడు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల రాత పరీక్షలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన ఓ రైల్వే కూలీ స్టోరీ ఇది. మున్నార్కు చెందిన శ్రీనాథ్ పదో తరగతి పాసయ్యాడు. కుటుంబ ఆర్థిక స్తోమత అంతగా లేకపోవటంతో చదువుకు స్వస్తి చెప్పి ఐదేళ్ల క్రితం ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో కూలీగా పనిలో చేరాడు. ఓవైపు కుటుంబానికి సాయంగా ఉంటూనే.. మరోపక్క ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని భావించాడు. అయితే అందుకు అవసరమైన మెటీరియల్ కొనుక్కునేందుకు అతని దగ్గర డబ్బులేదు. అయినప్పటికీ ఎలాగోలా కష్టపడి రెండుసార్లు పరీక్షలు రాశాడు. అలాంటి సమయంలోనే రైల్వే స్టేషన్లో ప్రవేశపెట్టిన ఫ్రీ వైఫై అతని జీవితాన్ని మలుపు తిప్పింది. స్టేషన్కు వచ్చే ప్రయాణికులను వైఫై వాడటాన్ని గమనించిన శ్రీనాథ్కు ఓ ఆలోచన తట్టింది. బంధువుల దగ్గర అప్పు చేసి ఓ స్మార్ట్ ఫోన్ కొనుకున్నాడు. దాని ద్వారానే పోటీ పరీక్షలకు కావాల్సిన మెటీరియల్ను సమకూర్చుకోవటం ప్రారంభించాడు. ఓవైపు లగేజీ మోస్తూనే.. మరోవైపు ఇయర్ ఫోన్స్ ద్వారా ఫోన్లో ఆడియో పాఠాలు విన్నాడు. తెలిసిన కొందరు లెక్చరర్ల సాయంతో ఫోన్ కాల్ ద్వారా పాఠాలు చెప్పించుకున్నాడు. రాత్రిపూట ఆ పాఠాలను రివిజన్ వేసుకుంటూ కష్టపడ్డాడు. చివరకు ఈ మధ్యే కేపీఎస్సీ, విలేజ్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించాడు. త్వరలోనే శ్రీనాథ్ ఇంటర్వ్యూకు హాజరుకాబోతున్నాడు. అందులో విజయం సాధిస్తే అతని కష్టాలు తీరినట్లే. ‘పరిస్థితులను మనకు అనుకూలంగా మల్చుకుంటే ఎతంటి కష్టానైనా అధిగమించొచ్చు’ అని శ్రీనాథ్ చెబుతున్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement