-
ఇదీ ఇండియన్స్ సత్తా! ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
Anand Mahindra Tweet: సోషల్ మీడియాలో చరుగ్గా ఉండే మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా విభిన్న అంశాలపై స్పందిస్తుంటారు. అధిక సంఖ్యలో ఉండే తన ఫాలోవర్లకు ఆయా అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా విదేశాల్లో భారతీయుల అభ్యున్నతికి సంబంధించిన అంశంపై స్పందించారు. అమెరికాలో బిలియన్ డాలర్ల కంపెనీలను స్థాపించిన విదేశీ వ్యక్తుల్లో భారతీయులే టాప్ లో ఉన్నారు. దీనికి సంబంధించిన గణాంకాలను ‘వల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్’ ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేయగా దాన్ని ట్యాగ్ చేస్తూ ‘ఆశ్చర్యపరిచే గణాంకాలు. ప్రవాస భారతీయులు తాము నివసిస్తున్న దేశాలకు ఎంత చేస్తున్నారో.. ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. ఒక బిలియన్ డాలర్ అంత కంటే ఎక్కువ విలువైన అమెరికన్ కంపెనీలలో సగానికిపైగా విదేశాల్లో జన్మించి ఆ దేశానికి వలస వచ్చినవారే. వీరిలో భారత్ నుంచి వలస వెళ్లినవారే అత్యధికులు. విదేశీ వలసదారులు స్థాపించిన మొత్తం అమెరికన్ కంపెనీల్లో అత్యధికంగా భారతీయులు 66 కంపెనీలను స్థాపించారు. 54 కంపెనీలతో ఇజ్రాయిల్, 27 కంపెనీలతో యూకే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. Astonishing figure. Demonstrates what value is brought by Indian Immigrants to a country of their adoption… https://t.co/TjcohqPsWP — anand mahindra (@anandmahindra) August 19, 2023 -
భార్యాభర్తలిద్దరికీ అదే సమస్య.. పరిష్కారం ఆలోచించి.. కంపెనీ పెట్టి..!
Traya Founders Success Story: ఉన్నత చదువులు చదివి సంపన్నులైన వ్యక్తుల గురించి, విదేశాలను వదిలి ఇండియా వచ్చి బాగా సంపాదించిన వ్యక్తులను గురించి మనం గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు నిజ జీవితంలో ఎదురైన సమస్యలను ఎదుర్కొని.. అలాంటి సమస్యలతో బాధపడేవారికి పరిష్కారం అందించడానికి మొదలెట్టిన వ్యాపారం వారిని కుబేరులను చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. త్రయ (Traya) సంస్థ ద్వారా సక్సెస్ సాధించిన 'సలోని ఆనంద్' & ఆమె భర్త 'అల్తాఫ్ సయ్యద్' ఇద్దరూ జుట్టు రాలడం సమస్యతో బాధపడ్డారు. అయితే ఈ సమస్యకు చక్కని పరిష్కారంగా సంపూర్ణ జుట్టు సంరక్షణ చేయాలని ఆలోచించి బిజినెస్ ప్రారంభించారు. త్రయ సంస్థ నిజానికి జుట్టు రాలడానికి ప్రధాన కారణం నీటి సమస్య, వాతావరణ కాలుష్యం మాత్రమే కాదు. శరీరంలో జరిగే కొన్ని అంతర్లీన సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయని గ్రహించి 2019లో త్రయను ప్రారంభించి, ఆయుర్వేద విధానంలో కారణాలను అన్వేషించి, మూలాలలో ఉండే సమస్యలను రూపుమాపడానికి ఉత్పత్తులు ప్రవేశపెట్టారు. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) నిజానికి సలోని ఆనంద్ మొదటిసారిగా అల్తాఫ్ను హైదరాబాద్లో కలుసుకుంది. ఆ తరువాత 2017లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సొంతంగా కంపెనీ ప్రారంభించడానికి ముందు హెల్త్కేర్ సంస్థ కాస్ట్లైట్లో మూడేళ్లపాటు పనిచేసింది సలోని. అప్పటికే మార్కెటింగ్లో ఎంబీఏ పట్టా కూడా పొందింది. (ఇదీ చదవండి: రూ. కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే!) ఇక అల్తాఫ్ విషయానికి వస్తే.. కంపెనీ ప్రారంభించడానికి ముందు ఫుడ్ డెలివరీ స్టార్ట్-అప్ బిల్ట్2కూక్ నడిపాడు. అంతేకంటే ముందు ఇతడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ, గ్లాస్గో యూనివర్శిటీలో మెడికల్ బయోకెమిస్ట్రీలో సైన్స్ చదివాడు. సలోని ఆనంద్ పెళ్లి చేసుకున్న తరువాత త్రయ కంపెనీ స్థాపించి కోట్లు సంపాదిస్తున్నారు. -
అన్ఎకాడమీ ఫౌండర్స్ సంచలన నిర్ణయం
సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ల దగ్గర్నించి, దిగ్గజ కంపెనీలుగా దాకా ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోతకు నిర్ణయిస్తున్నాయి. ఇందులో ఎడ్యుటెక్ యూనికార్న్ అన్ఎకాడెమీ కూడా మినహాయింపేమీ కాదు. అయితే తాజాగా అన్ఎకాడెమీ ఫౌండర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది(2024) ఏప్రిల్ వరకూ తమ వేతానల్లో కోత విధించుకుంటున్నట్టు కంపెనీ సీఈవో గౌరవ్ ముంజాల్ ప్రకటించారు. తొలగింపులను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. (మళ్లీ ఉద్యోగాల కోత..12 నెలల్లో 1400మందిని తొలగించిన స్టార్టప్) వ్యవస్థాపకులతో సహా టాప్ లీడర్షిప్ జీతాల్లో ఈ కోత ఉండనుంది. తాల్లో కోత 25 శాతం వరకు ఉండవచ్చని అంచనా. ఈ తగ్గింపు వారి ప్రస్తుత జీతం, పరిధి , పనితీరుపై ఆధారపడి ఉంటుందని, తిరిగి ఏప్రిల్ 2024లో మాత్రమే సవరిస్తామని కంపెనీ వెల్లడించింది. కాగా వరుసగా నాలుగోసారి 12 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. (IPL 2023: ఆ క్రికెటర్కు లక్కీ చాన్స్, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్ ఆఫర్లు) కాగా గత ఏడాది కాలంగా దాదాపు 1400 మందిఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 2022లో పలు రౌండ్ల తొలగింపుల ద్వారా సిబ్బంది సంఖ్యను 1,350 తగ్గించకుంది. 2020-21ఆర్థిక సంవత్సరంలో సంస్థ నష్టాలు రూ. 1,537 కోట్ల నుండి సంవత్సరానికి (YoY) 85 శాతం పెరిగి రూ.2,848 కోట్లుగా ఉన్నాయి. ఆదాయం రూ.719 కోట్లుగా ఉంది. -
ఉద్యోగాల ఊచకోత: ఫౌండర్స్ ఆ పనిచేయొచ్చుగా? అష్నీర్ గ్రోవర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: భారత్పే సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల్లో కోత ఎందుకు? సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్వయంగా ఫౌండర్స్ జీతాలు తగ్గించుకోవచ్చుగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదాయాలు క్షీణత, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులకు ఉద్వాసన పలికే బదులు ఫౌండర్లు తమ వేతనాల్లో కోత విధించుకోవచ్చు కదా ఆయన సూచించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేకుండా, వ్యవస్థాపకుడిగా దీర్ఘకాలికంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఐటీ, సహా పలు రంగాలల్లో ఉద్యోగాల కోతపై స్పందించిన గ్రోవర్ ఈ కీలక వ్యఖ్యలు చేశారు. ప్రతీరోజు ఉద్యోగాలు కోల్పోతున్న వార్తలు వినడం విచారకరం. అదృష్టవశాత్తూ తాను అలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సంతోషంగా ఉంది. నియామకాల విషయాల్లో జాగ్రత్తగా, శ్రద్ధగా ఉంటాం. అలాగే జాబ్స్ కట్లో ఫౌండర్స్గా దీర్ఘకాలికంగా ఆలోచించాల్సి ఉందంటూ తాజా లింక్డ్ఇన్ పోస్ట్లో గ్రోవర్ పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల తీసివేతకు ప్రత్యామ్నాయంగా తాను కొంతకాలం క్రితం 25-40 శాతం జీతం తగ్గించుకున్నా అని గుర్తు చేశారు. మిగిలిన, వ్యవస్థాపకులు ఈ మార్గంలో ఎందుకు ఆలోచించడం లేదో తనకు అర్థం కావడం లేదు. శక్తి, మూలధనం, సాంకేతికత, ప్రతిదానికీ ఉన్న ప్రాధాన్యత ఉద్యోగులకు ఎందుకు ఉండదు అంటూ ఆయన ప్రశ్నించారు. -
నైకా ఫల్గుణి సంచలనం: తగ్గేదేలే అంటున్న బిజినెస్ విమెన్
సాక్షి, ముంబై: ఫోర్బ్స్ 2022 భారతదేశపు 100 మంది సంపన్నుల జాబితాలో ఈ ఏడాది అనేక మంది కొత్త బిలియనీర్లు చోటు సంపాదించడం విశేషం. రూపాయి విలువ క్షీణత, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆందోళనలున్నప్పటికీ దేశం లోని టాప్-100 కుబేరుల సంపద అసాధారణంగా పెరిగిందని ఫోర్బ్స్ డేటా ద్వారా తెలుస్తోంది. ఫల్గుణి నాయర్: ముఖ్యంగా ఇటీవల ఐపీవోతోపాటు పలు సంచనాలకు మారు పేరు నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్ టాప్-50లో చోటు సంపాదించు కున్నారు. రూ. 32,951.71 కోట్లతో దేశంలోని అత్యంత ధనవంతుల స్వీయ-నిర్మిత బిలియనీర్గా ప్రశంస లందుకున్నారు. ఫోర్బ్స్ డేటా ప్రకారం 4.8 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఫల్గుణి నాయర్ జాబితాలో 44వ స్థానంలో నిలిచారు. ఐఐఎం అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్ నాయర్ 2012లో "మల్టీ-బ్రాండ్ ఓమ్నిచానెల్ బ్యూటీ-ఫోకస్డ్ రిటైల్ వ్యాపారాన్ని నిర్మించాలనే లక్క్ష్యంతో నైకాను స్థాపించారు. సావిత్రి జిందాల్: ఫోర్బ్స్ ప్రకారం ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్, సావిత్రి జిందాల్ టాప్-10లో ఉన్న ఏకైక మహిళా బిలియనీర్. 17.4 బిలియన్ డాలర్ల నికర విలువతో 72 ఏళ్ల సావిత్రి జిందాల్ ఈ సంవత్సరం జాబితాలో మొదటి పది మంది ధనవంతుల జాబితాలో ఉన్నారు. ఆమె భర్త ఓం ప్రకాష్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత, గ్రూప్ బాధ్యతలను చేపట్టారు. ఈ దంపతుల నలుగురు కుమారుల స్వతంత్రంగా కంపెనీలను నిర్వహిస్తున్నారు. రేఖా ఝున్ఝున్వాలా: దివంగత పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్ఝున్వాలా భార్య రేఖాఈ లిస్ట్లో 30వ స్థానంలో నిలిచి తన భర్తన స్థానాన్ని భర్తీ చేశారు. ఆమె నికర సంపద 5.9 బిలియన్ డాలర్లు. (ఫోర్బ్స్ టాప్ -10 లిస్ట్: బిలియనీర్లు అదానీ, అంబానీ ఎక్కడ?) నెహాల్ వకీల్: ఏసియన్ పెయింట్స్కు చెందిన నెహాల్ వకీల్ 0.52 బిలియన్ డాలర్లతో 46వ స్థానంలో నిలిచారు. తొలిసారి 2022 ఫోర్బ్స్ జాబితాలో ఎంట్రీ ఇచ్చారు. 1942లో స్థాపించిన ఏషియన్ పెయింట్స్ కంపెనీని నడుపుతున్న కుటుంబంలోని థర్డ్ జెనరేషన్ ప్రతినిధి నెహాల్. అంతేకాదు బోర్డులో ఉన్న ముఖ్య కుటుంబ సభ్యులలో నేహా ఒకరు. కిరణ్ మజుందార్-షా: బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్-షా 2.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో 76వ స్థానంలో నిలిచారు. 1978లో ఆదాయం ద్వారా భారతదేశంలో అతిపెద్ద లిస్టెడ్ బయోఫార్మాస్యూటికల్ సంస్థగా బయోకాన్ అవతరించింది. లీనా తివారీ: 3.7 బిలియన్ డాలర్ల నికర విలువతో, లీనా తివారీ ఈ సంవత్సరం అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో 51వ ప్లేస్లో నిలిచారు. ఫార్మాస్యూటికల్ దిగ్గజం యూఎస్వీ ఇండియా ఛైర్పర్సన్గా, తివారీ 2018లో జర్మన్ జెనరిక్స్ సంస్థ జూటా ఫార్మాను కొనుగోలు చేశారు. అను అగా: 80 ఏళ్ల అను అగా తిరిగి మళ్లీ రిచెస్ట్ ఇండియన్స్ జాబితాలో చోటు సంపాదించారు. 1.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో 88వ స్థానంలో నిలిచారు. థర్మాక్స్ అనే లిస్టెడ్ ఇంజనీరింగ్ సంస్థలో అగా మెజారిటీ వాటాను కలిగి ఉంది. అగా 1985లో తన జీవిత భాగస్వామి కంపెనీలో పని చేయడం ప్రారంభించారు. సుదీర్ఘం అనారోగ్యంతో భర్త మరణించడంతో 1996లో ఆమె కంపెనీ బాధ్యతలు చేపట్టారు. తరువాత కెమికల్ ఇంజనీర్ అయి అను కుమార్తె మెహెర్ బాధ్యతలు చేపట్టడంతో 2004లో అగా ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి సామాజిక కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. అలాగే ఇండియన్ ఎత్నిక్ వేర్ తయారీదారు, మన్యవార్ బ్రాండ్కు ప్రసిద్ధి చెందిన వేదాంత్ ఫ్యాషన్స్ ఓనర్ రవి మోడీ 3.6 బిలియన్ డాలర్లతో ఫోర్బ్స్ లో చోటు సాధించారు. ఇంకా యూఎన్వో మిండా (గతంలో మిండా ఇండస్ట్రీస్) సీఎండీ నిర్మల్ మిండా మెట్రో బ్రాండ్లకు చెందిన రఫీక్ మాలిక్ జాబితాలో కొత్తగా ప్రవేశించిన వారిలో ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement