-
మూడోరోజూ మార్కెట్ ముందుకే...
ముంబై: స్టాక్ సూచీలు గురువారం స్వల్పంగా లాభపడి మూడోరోజూ ముందడుగేశాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్, దేశీయ క్యూ2 జీడీపీ వృద్ధి రేటు, అక్టోబర్ ద్రవ్యలోటు డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. అమెరికా మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్పై ప్రభావం చూపాయి. ట్రేడింగ్లో 460 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 87 పాయింట్లు పెరిగి 66,988 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు బలపడి 20,133 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు నవంబర్ నెలవారీ డెరివేటివ్ల గడువు ముగింపు కావడంతో ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఫార్మా, కన్జూమర్, రియలీ్ట, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. బ్యాంకులు, యుటిలిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియాలో చైనా, హాంగ్కాంగ్ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 5 పైసలు బలహీనపడి 83.37 వద్ద స్థిరపడింది. -
నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ ప్రెస్మీట్..
సాక్షి, ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం కానుంది. వివరాల ప్రకారం.. నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేయనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్, మిజోరాంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించనుంది. ఇక, తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే. #Election2023 Election dates for Mizoram, Chhattisgarh,Madhya Pradesh, Rajasthan & Telangana to be announced today at 12 noon by Election Commission of India. pic.twitter.com/YTOrIPlLo4 — Aishwarya Paliwal (@AishPaliwal) October 9, 2023 ఇక, డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్లో 230 స్థానాలు, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్లో 200 స్థానాలు, ఛత్తీస్గఢ్లో 90 స్థానాలు, మిజోరాం 40 స్థానాలకు ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానుంది. కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. -
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఫార్ములా ఇదే..
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ ఐదు రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించే పనిలో పడింది. స్థానిక నాయకత్వం.. ఇదే ఏడాది కర్ణాటక ఎన్నికల్లోనూ తర్వాత జరిగిన ఉపఎన్నికలలోనూ బీజేపీ వెనుకబడటంతో ఈ విడత ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని నిర్ణయించుకుంది. బీజేపీ పార్టీ ప్రధానంగా 'మోదీ నాయకత్వాన్ని' నమ్ముకోగా రెండో అంశంగా ఆయా రాష్ట్రాల్లో 'పార్టీ సమిష్టి నాయకత్వానికి' పెద్దపీట వేయనుంది. హిందీ భాషా ప్రాబల్యమున్న రాష్ట్రాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ప్రాధాన్యతనివ్వకుండా నాయకుల మధ్య సమన్వయం కుదర్చడానికే ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వాన్ని బలపరచాలన్న యోచనలో ఉంది పార్టీ అధిష్టానం. నో వారసత్వం.. ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ఎలాంటి ప్రస్తావన చేయకుండా ఉంటే స్థానిక నాయకులకు తమ అభ్యర్థిత్వాన్ని బలపరచుకునే అవకాశం కల్పించినట్లు ఉంటుందన్నది అధిష్టానంని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అదే విధంగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తోన్న ప్రధాని తమ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టే యోచనలో ఉన్నారు. ప్రస్తుత సంచరం ప్రకారం బీజేపీ ఒక కుటుంబం నుంచి ఒకే టికెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్.. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్ ప్రాధాన్యతను తగ్గించడమే కాకుండా ఇప్పటివరకు ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనికి తోడు నలుగురు ఎంపీలు, ముగ్గురు కేంద్ర మంత్రులతో పాటు జాతీయ జనరల్ సెక్రెటరీ విజయ్ వర్గియా కూడా ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. శివరాజ్ సింగ్ భవితవ్యంపై ఎలాంటి సూచనలు లేని కారణంగా వీరిలో ఎవరినైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్.. బీజేపీ అదే ఫార్ములాను రాజస్థాన్లో కూడా అమలు చేయాలని చూస్తోంది. ఇక్కడైతే బీజేపీ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్ధికి కొదవే లేదు. గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘవాల్, కిరోడీ లాల్ మీనా, దియా కుమార్, రాజ్యవర్ధన్ రాథోడ్, సుఖవీర్ సింగ్, జౌన్పురియాలతో పాటు సింధియా రాజ కుటుంబీకురాలు వసుంధరా రాజే కూడా ఉండనే ఉన్నారు. వీరిలో కూడా అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండా బీజేపీ ఎన్నికలకు వెళ్లాలన్నది పార్టీ యోచన. ఛత్తీస్గడ్.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఛత్తీస్గడ్లో బీజేపీ కాస్త భిన్నమైన ప్రణాలికను అమలు చేయనుంది. ఇప్పటికే ఆ పార్టీ అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్ మేనల్లుడు విజయ్ బాఘేల్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కుటుంబ వైరం ద్వారా లబ్దిపొంది పార్టీని బలోపేతం చేయాలన్నది బీజేపీ అధిష్టానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. విజయ్ ఈసారి ఎన్నికల్లో పఠాన్ జిల్లాలోని దుర్గ్ నుంచి పోటీ చేయనున్నారు. 2003 నుంచి భూపేష్, విజయ్ల మధ్య ఈ స్థానంలో ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. వీరితోపాటు కేంద్రమంత్రి రేణుకా సింగ్, రాజ్యసభ ఎంపీ సరోజ్ పాండే తోపాటు మాజీ ముఖ్యమంత్రి రామం సింగ్ కూడా ఉన్నప్పటికీ బాఘేల్ కుటుంబానికే ప్రాధాన్యతనిచ్చింది బీజీపీ అధిష్టానం. తెలంగాణ.. ఇప్పటివరకు దక్షిణాదిన ఖాతా తెరవని బీజేపీకి ఈసారి కొద్దోగొప్పో ఊరటనిచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. మిషన్ సౌత్లో భాగంగా ఇక్కడ కూడా సీఎం అభ్యర్థిత్వానికి నాయకుల మధ్య పోరే కొలమానం కానుంది. ఇక్కడ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, మరో ఎంపీ ధర్మపురి అరవింద్, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ లలో ఎవరైనా సీఎం కావచ్చు. అభ్యర్థిని మాత్రం ముందు ప్రకటించకుండా ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం సమిష్టిగా పనిచేయాలని సూచించింది. మిజోరాం.. ఇక బీజేపీకి ఈ ఎన్నికల్లో క్లిష్టతరమైన రాష్ట్రం మిజోరాం. ఈ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రమైన మణిపూర్లో జరిగిన అల్లర్లు ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయండంలో సందేహంలేదు. దీంతో బీజేపీ ఇక్కడ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరముంది. వారి ప్రధాన అజెండా 'మోదీ నాయకత్వం' 'స్థానిక సమిష్టి నాయకత్వం' రెండూ ఇక్కడ పనిచేయకపోవచ్చు. ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక -
ఈ విజయం ఎలా సాధ్యమైంది?
నవభారతంలో అభివృద్ధి మాత్రమే చిట్టచివరి డెలివరీగా ఉంటుందని ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు నిరూపించాయి. కేంద్ర పాలనా నమూనా దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి బాటలేసిందనడానికి ఈ ఎన్నికల ఫలితాలే గీటురాయి. ఈ ఫలితాలు సాంప్రదాయిక రాజకీయ వివేచనను ప్రశ్నించాయి. ఈ విజయానికి కారణమైన ప్రభుత్వ నమూనా ఏమిటి? ప్రధానిపై ప్రజలు పెట్టుకున్న అసాధారణ విశ్వాసం, అభిమానంలో ఈ నమూనా పాదుకుని ఉంది. ఇది సహకారాత్మక సమాఖ్య వ్యవస్థ సూత్రాలతో ప్రభావితమైంది. నూతన భారత్ వైపుగా సాగే ప్రయాణంలో అత్యంత వెనుకబడిన ప్రజానీకాన్ని కలుపుకొని పోవడమే లక్ష్యంగా కేంద్ర పథకాలు అమలవుతూ వచ్చాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంతో సరిపెట్టుకోకుండా, భారతీయ పౌరులతో ప్రత్యక్షంగా సంబంధం పెట్టుకోవడమే ఈ పాలనా నమూనాకు ఆత్మ. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన అఖండ విజయానికిగానూ, నా తోటి కార్యకర్తలకూ, పార్టీ నేతలకూ, తోటి ముఖ్యమంత్రులకూ అభినందనలు తెలుపుతున్నాను. ఈ చారిత్రక విజయం వైపు మనల్ని ఏది నడిపించింది అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ వచ్చాను. భారత రాజకీయ చరిత్రలో 2014 సంవత్సరం మూల మలుపును తీసుకొచ్చింది. ప్రజలను హృదయంలో నిలుపుకొన్న సరికొత్త పాలనా వ్యవస్థ, పరిపాలన ఆ సంవత్సరమే ఉనికిలోకి వచ్చింది. నరేంద్ర మోదీ పాలనా నమూనా దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి బాటలేసిందనడానికి ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే గీటురాయి అని చెప్పాలి. మోదీ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో మాత్రమే శక్తిమంతంగా పనిచేస్తుందనీ, రాష్ట్రాల ఎన్నికల్లో అది పెద్దగా ప్రభావం చూపదనీ రాజకీయ పండితులు చెబుతూ రావడంతో ప్రతిపక్ష పార్టీలు దాని ఆధారంగా అనేక తప్పులెక్కలు వేసుకున్నాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, కులపరమైన ప్రయోగాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వారికి అనుకూలంగా పనిచేయలేదు. ఈ ఫలితాలు సాంప్రదాయిక రాజ కీయ వివేచనను ప్రశ్నించాయి. సత్పరిపాలనను కీలకంగా తీసుకోని అల్పరాజకీయాలను అవి తుంగలో తొక్కాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఉత్తరప్రదేశ్లోనూ (37 సంవత్సరాలు), ఉత్తరా ఖండ్లోనూ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీనే మళ్లీ అధికారంలోకి వచ్చింది. ప్రజాతీర్పు ఇంత అద్భుతంగా ఉంటుందని కొన్ని సంవత్స రాల క్రితం అయితే ఏ రాజకీయ పండితుడూ, వ్యూహకర్తా ఊహించ లేదు. ఈ అభివృద్ధి నమూనా ఏమిటి? మరి, మోదీ ప్రభుత్వ నమూనా అంటే ఏమిటి? గత పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నేను చాలా సన్నిహితంగా ఈ నమూనాను పరిశీలుస్తూ అసోంలో విజయం కోసం ప్రయత్నిస్తూ వచ్చాను. ప్రధానిపై ప్రజలు పెట్టుకున్న అసాధారణ విశ్వాసం, అభిమానంలో ఈ నమూనా పాదుకుని ఉంది. ఇది సహకారాత్మక సమాఖ్య వ్యవస్థ సూత్రాలతో ప్రభావితమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి కార్యాలయంతో, ఇతర కేంద్ర మంత్రివర్గ కార్యాలయాలతో సంపూర్ణంగా మిళితం అయ్యాయి కాబట్టే ప్రధాని ప్రారంభించిన కీలక పథకాలను కూడా అత్యంత నిర్దిష్టంగా చివరివరకూ అమలు చేయగలుగుతున్నారు. ఈ డబుల్ ఇంజిన్ పాలనా నమూనా వల్లే పథకాలను అమలు చేయగలుగుతున్నామని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని ప్రశంసిస్తున్నాయి. ఇదే గేమ్ చేంజర్ అయింది. ఉత్తరప్రదేశ్ ఉదంతమే తీసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ యోజన వల్ల 2.5 కోట్లమంది రైతులు ప్రయోజనం పొందారు. ఇక ప్రధానమంత్రి ఉజ్వల పథకం కిద 1.5 కోట్ల సిలిండర్లను ఉత్తరప్రదేశ్ మహిళలు పొందగలిగారు. అంటే ఆఖిల భారత స్థాయిలో ఇది 17 శాతం అన్నమాట. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద పది లక్షల గృహాలు నిర్మించి ఇచ్చారు. 1.3 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులను యూపీలో పంపిణీ చేశారు. మరో 15 కోట్లమంది ప్రజలు ప్రధాని గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ కార్డులు పొందారు. మణిపూర్లో ఈ పథకం కింద 22 లక్షలమంది ప్రజలు ఉచిత రేషన్ కార్డులు పొందారు. మరో 60 వేల గృహాలను పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించి ఇచ్చారు. ఇవన్నీ విజయవంతమైన పాలనకు సాక్ష్యాధారాలు. అలాగే ఈశాన్య భారత రాష్ట్రాలు, తీర ప్రాంత రాష్ట్రాలపై ప్రధాని ప్రత్యేక దృష్టి పెట్టినందువల్లే గోవా, మణిపూర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాలపై తమ విశ్వాసాన్ని మళ్లీ ప్రకటించారు. నేరుగా అందించే తరహా సంక్షేమం 2014 నుంచి ప్రధాని నరేంద్రమోదీ కొన్ని పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టినందువల్లనే కుటుంబం ఒక యూనిట్గా అసలైన అభివృద్ధినీ, దారిద్య్ర నిర్మూలననూ సాధించడానికి వీలుపడింది. జిల్లాల అభి వృద్ధితో మొదలై బ్లాక్ అభివృద్ధి వరకు పథకాలు సాధించిన విజయం గానీ, జల్ జీవన్ మిషన్ గానీ, దేశవ్యాప్తంగా టాయిలెట్ల నిర్మాణం గానీ ఏది తీసుకున్నా సరే... నూతన భారత్ వైపుగా సాగే ప్రయా ణంలో అత్యంత వెనుకబడిన ప్రజానీకాన్ని కలుపుకొని పోవడమే లక్ష్యంగా కేంద్ర పథకాలు అమలవుతూ వచ్చాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంతో సరిపెట్టుకోకుండా, భారతీయ పౌరులతో ప్రత్యక్షంగా సంబంధం పెట్టుకోవడమే ఈ పాలనా నమూనాకు ఆత్మగా నిలుస్తుంది. జన్ధన్, ఆధార్, మొబైల్ త్రయం వంటి టెక్నాలజీని విస్తృతంగా వినియోగించడం ద్వారా పేదల్లోని నిరు పేదలకు ప్రయోజనాలను నేరుగా అందించే తరహా సంక్షేమ నమూనాకు ఈ పాలనా నమూనా అత్యంత సన్నిహితంగా ఉంటుంది. టెక్నాలజీ ప్రాతిపదికన సాగే ఈ వైఖరి ఉచిత సరఫరా యంత్రాంగానికి సరైన నిర్వచనం ఇచ్చింది. ‘యూపీఏ’ ప్రభుత్వ హయాంలో ఇలాంటి వైఖరి ఉండేది కాదు. వాస్తవానికి మోదీ ప్రభుత్వ నమూనా ఆయన రేడియో షో ‘మన్ కీ బాత్’కు విస్తృత రూపమే అని చెప్పాలి. ఈ షోలో ఆయన తన ప్రజలతో నేరుగా కనెక్ట్ అవుతారన్నది తెలిసిందే. దీన్ని మరింతగా వివరించాలంటే, ఈ నమూనా నుంచి పుట్టుకొచ్చిన అన్ని పథకాలూ అంటే పీఎం ఉజ్వల, పీఎం కిసాన్, జన్ ధన్, ఎన్ఆర్ఈజీఏ, పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం గరీబ్ కళ్యాణ్... ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించిన అన్ని రాష్ట్రాల్లోనూ విజయవంతంగా అమలవుతూ వచ్చాయి. ఈ పథకాలకు చాలావరకు కేంద్రమే నిధులిచ్చింది గానీ రాష్ట్రస్థాయిలో అమలయ్యాయి. ప్రధానమంత్రి కార్యాలయంతో ముఖ్యమంత్రి కార్యాలయం సన్నిహితంగా సమన్వయంతో పనిచేసింది కాబట్టే ఈ విజయం సాధించగలిగాము. ప్రధాని నిర్దేశించిన అన్ని పథకాలూ లబ్ధిదారులకు అందేలాగా అమలు చేయాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రిగా నేను తీసుుకున్నాను. పథకాలే గెలిపించాయి ఇటీవలే ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ప్రధాని గరీబ్ కళ్యాణ్ యోజన, పీఎమ్ కిసాన్, పీఎమ్ ఉజ్వల, జన్ధన్, ఆయుష్మాన్ భారత్ పథకాలను అత్యంత సమర్థవంతమైన ప్రభుత్వ పథకాలుగా భావించారని 2022 సీఎస్డీఎస్ పోస్ట్ పోల్ సర్వే నివేదించింది. ప్రత్యేకంగా ఈ పథకాల లబ్ధిదారులు, ముఖ్యంగా పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా లబ్ధి పొందినవారే బీజేపీకి ఎక్కువగా ఓటేశారని సర్వేలు చెప్పాయి. ఈ వివరాలు బీజేపీ కార్యకర్తలను ఆశ్చర్యంలో ముంచెత్తలేదు గానీ... ఇతరులకు మాత్రం ఈ నమూనా ప్రభుత్వ వ్యతిరేకతనూ, వ్యతిరేక ప్రచారాన్నీ తటస్థం చేసిందని బోధపడేలా చేసింది. ప్రధానమంత్రి కార్యాలయంతో అవాంఛిత ఘర్షణలకు దిగే వారికీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉద్దేశపూర్వకంగా వంచించే వారికీ ఎన్నికల్లో విజయాలు సిద్ధించవని రాజకీయ పరిశీలకులకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గుణపాఠం నేర్పాయి. పంజాబ్ దీనికి చక్కటి ఉదాహరణ. నూతన భారత ఓటర్లు అభివృద్ధిని డిమాండ్ చేస్తున్నారు గానీ డ్రామాలను కాదు. నవభారతంలో అభివృద్ధి మాత్రమే చిట్టచివరి డెలివరీగా ఉంటుంది. దీనికోసం రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా శ్రమించాల్సి ఉంటుంది. భారతదేశాన్ని మరోసారి విశ్వగురుగా మార్చాలనే దార్శనికతతో మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను జరుపుకొంటున్నాం. మనం కలిసి పనిచేయడం ద్వారానే ఈ లక్ష్యాన్ని సాధించగలం. మోదీ నమూనా ఈ లక్ష్యాన్ని సాధించేలా కనబడుతోంది. హిమంతా బిశ్వ శర్మ వ్యాసకర్త అస్సాం ముఖ్యమంత్రి (‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో...) -
యూపీలో కీలకంగా మారిన ఓటింగ్ శాతం.. అధికార పార్టీపై ఎఫెక్ట్..?
ఉత్తరప్రదేశ్లో ఆరు దశల ఓటింగ్ తర్వాత పార్టీల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటిదాకా అన్ని దశల పోలింగ్లో తగ్గిన ఓటింగ్ శాతంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టమన్నదే ఆ చర్చ. దీనిపై బీజేపీ, సమాజ్వాదీ పార్టీలు వాటికి అనుకూలమైన వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ‘నిశ్శబ్ద నో షో’, అంటే ఓటేయని వారి వల్ల ఎవరికి నష్టమన్నదే రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుల మధ్య ఇప్పుడు హాట్ టాపిక్. ‘తగ్గిన ఓటింగ్ శాతం ఫలితాన్ని మారుస్తుందా అంటే, కచ్చితంగా తారుమారు చేస్తుంది. కానీ అది ఎవరికి లాభం, ఎవరికి నష్టమో తేలాలంటే 10వ తేదీ దాకా ఎదురు చూడాల్సిందే’ అని బెనారస్ హిందూ యూనివర్సిటీ మాలవీయ రీసెర్చి సెంటర్ కు చెందిన ప్రొఫెసర్ కవితా షా అన్నారు. తగ్గిన పోలింగ్ శాతాలపై ఆమె అధ్యయనం చేస్తున్నారు. ఓటు వేయకపోవడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఫిబ్రవరి 10, 14 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్లో జరిగిన తొలి, రెండో విడత పోలింగ్లో 2017 కంటే ఈ సారి పోలింగ్ శాతం తగ్గింది. 2017లో తొలి దశలో 64.6 శాతం, రెండో దశలో 65.5 శాతం నమోదైతే ఈసారి 62.5, 64.7 శాతానికి తగ్గింది. మూడు, నాలుగో దశల్లో కూడా గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగలేదు. ‘ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోయినప్పుడు పోలింగ్ శాతం పెరుగుతుందంటారు. కానీ యూపీలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని భావిస్తున్నాను’ అని సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ (జేఎన్యూ) హెచ్ఓడీ ఆర్.నరేంద్రకుమార్ విశ్లేషించారు. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గిన జిల్లాల్లో ఆయన తన రీసెర్చి విద్యార్థులతో పర్యటిస్తున్నారు. రాజధాని లక్నోకు పొరుగున ఉన్న సీతాపూర్ పట్టణంలో 2017లో 61.8 శాతం పోలింగ్ జరిగితే ఈసారి 52.6కు పడిపోయింది. అంటే దాదాపు 35 వేల ఓట్లు పోలవలేదు. 2017లో ఇక్కడ బీజేపీ 24 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలిచింది. సీతాపూర్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో సగటున 62.7% ఓటింగ్ నమోదైంది. ఇది కూడా గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 6 శాతం తక్కువ. ఆ ఎన్నికల్లో బీజేపీ వీటిలో ఏడింటిని గెలుచుకుంది. అయితే, ‘గతంలో ఆగ్రా సౌత్, శ్రీనగర్, ఉన్నావ్ వంటిచోట్ల బీజేపీ పెద్ద పెద్ద మెజారిటీలతో గెలిచింది. కాబట్టి అలాంటి చోట్ల ఓటింగ్ శాతం తగ్గినా బీజేపీ అభ్యర్థులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు’ అని ఇండియన్ జర్నల్ అఫ్ పొలిటికల్ సైన్స్ (వారణాసి) డైరెక్టర్ వి.కె.బాజ్పేయి విశ్లేషించారు. 139 సీట్లలో తగ్గింది! తొలి నాలుగు దశల్లోని 231 స్థానాల్లో చూసుకుంటే ఏకంగా 139 చోట్ల ఓటింగ్ శాతం బాగా తగ్గింది. సీతాపూర్, సేవాత నియోజకవర్గాల్లో 2017తో పోలిస్తే 9 శాతం తగ్గుదల ఉంది. ఆరు స్థానాల్లో ఎటువంటి మార్పు కనిపించకపోగా 86 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం కాస్త పెరిగింది. తక్కువ నమోదైన 139 సీట్లలో 28 చోట్ల దాదాపు 10 వేల చొప్పున ఓట్లు తగ్గాయి. వీటిలో 24 సీట్లను 2017లో బీజేపీ గెలుచుకుంది. అయితే వాటిలో చాలావరకు తక్కువ ఓట్ల తేడాతో గెలిచినవే. ఉదాహరణకు సీతాపూర్ జిల్లాలోని మహోలీలో కేవలం 3,700 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచింది. ఇక్కడ 2017లో 68.7 శాతం ఓటింగ్ జరిగితే ఈసారి 63.5కు తగ్గింది. ఇది ఎవరిపై, ఎలా ప్రభావం చూపుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బరిలో ఉన్న కర్హాల్ నియోజకవర్గంలోనేమో పోలింగ్ ఈసారి 7 శాతం పెరిగింది. తగ్గిన ఓటింగ్ శాతం ఫలితాలపై ప్రభావం చూపుతుందా? 2017లో 403 సీట్లకు గాను బీజేపీ రికార్డు స్థాయిలో ఏకంగా 312 నెగ్గి అఖండ విజయం సాధించినప్పుడు కూడా ఓవరాల్ ఓటింగ్ శాతం తక్కువే నమోదైంది. కాబట్టి ఈసారి మరో ఒకట్రెండు శాతం తగ్గినా అది మొత్తం ఫలితాలపై ప్రభావం చూపుతుందా అంటున్న వారూ లేకపోలేదు. ‘ఇక్కడ బీజేపీ, ఎస్పీ మధ్య పోటీ తీవ్రంగా లేదు. ఓటింగ్ శాతం తగ్గడానికి అదీ ఓ కారణం కావచ్చు. అంతమాత్రాన తక్కువ ఓటింగ్ శాతం వల్ల ఫలితాలే తారుమారు అవుతాయనుకోవడం పొరపాటు. మా ప్రభుత్వమే కొనసాగాలనుకునే వారు ఓటింగ్పై బహుశా ఆసక్తి చూపలేదేమో’ అని వారణాసిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఓటేయకపోవడానికి కారణాలెన్నో ‘ఓటరు ఓటేయలేదంటే, లిస్ట్లో పేరు కనిపించకపోవడం, పోలింగ్ బూత్ దూరంగా ఉండటం వంటి అనేక కారణాలుండొచ్చు’ అని వారణాసి అదనపు జిల్లా మేజిస్టేట్, రిటర్నింగ్ అధికారి కౌశల్ రాజ్ శర్మ సాక్షి ప్రతినిధులతో చెప్పారు. ఓటేయాలని తాము విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వివరించారు. -వారణాసి (యూపీ) నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధులు కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement