-
హైదరాబాద్లో కండ్లకలక కలవరం.. మందులకే 2 గంటలా?
సాక్షి, హైదరాబాద్: నగరంలో కండ్లకలక కేసులు కలవరం పుట్టిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం పదుల సంఖ్యలోనే వెలుగుచూసిన కేసులు తాజాగా వేలల్లో నమోదయ్యాయి. అయితే, చికిత్స కోసం వెళ్లిన బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్లోని సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో వసతులు కరువయ్యాయంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స అందించే డాక్టర్ల కొరతకు తోడు.. మెడిసిన్ తీసుకునేందుకు కూడా పేషంట్లు బారులు తీరారు. ఆస్పత్రి యాజమాన్యం ముందస్తుగా చర్యలు చేపట్టకపోవడంతో బాధితులు ఒకేచోట గుమిగూడాల్సిన పరిస్థితి తలెత్తింది. మందులకు అందించేందుకు ఒకే కౌంటర్ అందుబాటులో ఉండటంతో దాదాపు 2 గంటలు లైన్లో వేచి ఉంటే తప్ప మెడిసిన్ తీసుకునే పరిస్థితి లేదు. కాగా, వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కండ్లకలక ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా గుంపుగా ఉన్న ప్రదేశాల్లో ఈ వ్యాధి సొందరగా ఇతరులకు సోకుతుంది. కండ్లకలకను పింక్ ఐ లేదా ఐ ఫ్లూ అని అంటారు. (చదవండి: ఆ అలవాటే కరోనా అటాక్కి ప్రధాన కారణం! వెలుగులోకి విస్తుపోయే నిజాలు!) ✅గత కొద్ది రోజులుగా కళ్ల కలక 👁️కేసులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ✅మరి ఇలాంటి సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలిస్తే త్వరగా నయం అవుతుంది. ✅అవేంటో కింది ఇన్ఫోగ్రాఫ్ ద్వారా తెలుసుకోండి#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/EZ7TLH6axd — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 కళ్ల కలక లక్షణాలు! 👁🗨కళ్ళలో నొప్పి, మంట, దురద 👁🗨కళ్ళు ఎర్రగా మారడం 👁🗨కళ్ళ నుంచి తరుచుగా నీరు కారడం 👁🗨కళ్ళు వాపు 👁🗨నిద్ర లేచిన తర్వాత కనురెప్ప అతుక్కుపోవడం 👁🗨నిర్లక్ష్యం చేస్తే కండ్ల నుంచి చీము కారడం#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/rMmPxOdB0g — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 -
కంటి వ్యాధులకు జన్యు చికిత్స
న్యూఢిల్లీ: వంశపారంపర్యంగా వచ్చే కంటి వ్యాధులను నయం చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రిలయన్స్ లైఫ్ సైన్సెస్కు లైసెన్స్ ఇచ్చింది. ఈ జన్యు చికిత్సను రిలయన్స్ లైఫ్ మరింత అభివృద్ధి చేసి వాణిజ్యపరం చేయనుంది. జన్యు చికిత్సకు (జీన్ థెరపీ) సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, భారత్లోని ఒక విద్యాసంస్థ నుండి కంపెనీకి బదిలీ చేయడం ఇదే మొదటిసారి అని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఐఐటీ కాన్పూర్కు చెందిన బయాలాజికల్ సైన్సెస్, బయో ఇంజనీరింగ్ విభా గానికి చెందిన జయంధరణ్ గిరిధర రావు, శుభమ్ మౌర్య ఈ పేటెంటెడ్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. జంతువుల్లో దృష్టి లోపాన్ని సరిదిద్దడంలో ఇది మెరుగ్గా పనిచేసిందని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. -
అసలే వేసవి, ఆపై కంప్యూటర్ కాలం.. కళ్లు ‘కళ’ తప్పితే.. చిన్న వయసులోనే!
సాక్షి, పార్వతీపురం: కళ్లు నిత్యం తడిగా ఉంటాయి.. కంటినిండా నీరు ఉంటుంది.. ఒక విధంగా చెప్పాలంటే నేత్రాలు నిండు జలాశయాలు వంటివి. అయితే మనిషి నిర్లక్ష్యం కారణంగా కంటిలో తడి ఆరిపోతోంది. నేత్ర వ్యాధులు అధికమవుతున్నాయి. చివరకు చూపు మసకబారుతోంది. అన్ని ఇంద్రియాల్లో కంటే కన్ను చాలా విలువైనది. అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలంటే కళ్లు కలకాలం చల్లాగా ఉండాలి. చూపు శాశ్వతమవ్వాలి. కానీ మనిషి దుష్ప్రవర్తన కారణంగా కంటి సమస్యలు ఏర్పడి పిన్న వయస్సులోనే అంధత్వం ఏర్పడుతోంది. మనిషి నిమిషానికి ఎనిమిది సార్లు కంటి రెప్పలు ఆర్పుతుంటాడు. అలా చేయడం ద్వారా కార్నియాకు అవసరమైన నీరు చేరి కళ్లు ఎండిపోకుండా చేస్తాయి. వేసవి ప్రయాణాల్లో వేడి గాలులకు కళ్లు తడి ఆరిపోయి దురదలు ప్రారంభమవుతున్నాయి. వేసవి ప్రయాణాల్లో కంటి రెప్పలు నిమిషానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే కొట్టుకుంటున్నాయని వైద్యులు ఒక సర్వేలో పేర్కొన్నారు. ఫలితంగా కంటి సమస్యలు వచ్చి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు తలనొప్పి వంటివి కూడా వస్తున్నాయని వెల్లడించారు. చదవండి👉🏼 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే! అధిక వినియోగం ముప్పు.. ప్రస్తుతం సాంకేతికత రాజ్యమేలుతోంది. అన్ని చోట్లా కంప్యూటర్ వినియోగం పెరిగింది. ప్రతి పది మందిలో తొమ్మిది మందికి పైగా ప్రజలు మొబైల్ వినియోగిస్తున్నారు. నిత్యం కంప్యూటర్తో వర్క్ చేయడం, మొబైల్ ఆపరేటింగ్లో తలమునకలవ్వడం కారణంగా కళ్లు పొడిబారి పోతున్నాయి. ప్రస్తుతం ప్రతి 100 మందిలో 60 నుంచి 70 మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 99 శాతం మంది కార్నియ సమస్యలకు గురవుతున్నారు. వేడిగాలుల బారిన పడడం, ఆండ్రాయిడ్, కంప్యూటర్ వినియోగించడం, రాత్రి 12 గంటల వరకు సెల్ఫోన్తో గడపడం కారణంగా ఈ సమస్య వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. 15 నుంచి 40 ఏళ్ల మద్య ఉన్నవారే అధికంగా ఈ సమస్యకు గురవుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. చదవండి👉🏻 నోరూరించే అటుకుల కేసరి.. ఇంట్లో ఇలా సులువుగా తయారు చేసుకోండి! సాధారణ కన్ను పొడిబారిన కన్ను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► వేసవిలో ప్రయాణించే వారు తప్పనిసరిగా కళ్లజోడు ధరించాలి. ► ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగం తగ్గించుకోవాలి. ► కంప్యూటర్ల వద్ద గంటలకొద్దీ గడపరాదు. ► కంటి రెప్పలు ఎక్కువసార్లు కొట్టుకొనే విధంగా ప్రయత్నించాలి. ► తరచూ ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. ► కంటికి దురదలు వచ్చే సమయంలో చేతితో నలపరాదు ► కళ్లు ఎర్రగా ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. చదవండి👉🏾 చట్టం తనపని తాను చేసుకుపోతుంది: మంత్రి బొత్స అవగాహన తప్పనిసరి రోజురోజుకూ కంటి సమస్యలు అధిగమవుతున్నాయి. 70 శాతం మంది కంటి రోగాలతో బాధపడుతున్నారు. ఇవి చిన్నవైనప్పటికీ జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో బయట ప్రయాణాలు వద్డు. ఆండ్రాయిడ్ మొబైల్ను చిన్నారులకు ఇవ్వరాదు. టీవీ, సెల్ఫోన్, కంప్యూటర్ వాడే సమయంలో అరగంట కొకసారి ప్రతి పది నిమిషాలకు ఒకసారి విరామం ఇవ్వాలి. ఏవైనా కంటి సమస్యలు వస్తే నేరుగా వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ జీరు నగేష్రెడ్డి, వైఎస్సార్ కంటి వెలుగు జిల్లా ఇన్చార్జ్, పార్వతీపురం మన్యం -
చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం
చిన్నపిల్లలు మెుబైళ్లు, టీవీలు అధికంగా చూడటంతో దృష్టి లోపాలతో ఇబ్బంది పడుతుంటారు. పిల్లలు సరైన పోషకపదార్థాలు తీసుకోకపోవడం వలన చిన్న వయస్సులోనే కంటి జబ్బులు తప్పట్లేదు. కాయగూరలు, పండ్లు తినడం ద్వారా శరీరానికి స్వాభావికంగా కంటి జబ్బుల నుంచి దూరం చేసే శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జామ కంటికి ఎంతో సహాయపడుతుంది. దీంతోపాటు నల్లద్రాక్ష, కొత్తిమీర, మెంతికూరను ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటే దృష్టి లోపాలను నివారించవచ్చు. అందుకే పిల్లలు తీసుకునే ఆహారంలో బీన్స్, క్యారెట్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మునగ ఆకులు, అల్లం, గుమ్మడికాయ, సొరకాయ, పొట్లకాయ, మామిడి పండ్లు వంటివి చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ఇలా రకరకాలుగా తిండి పెట్టడం వలన మీరు వారి కంటి జబ్బులను దూరం చేయవచ్చు. ఈ కూరగాయలు, పండ్లలో విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక్క కంటి సమస్యలే కాదు... అనేక ర కాల సమస్యలకు ఆహారంతోనే చెక్ పెట్టవచ్చు. వీటితోపాటు రోజూ ఒక స్పూను తాజా వెన్నను తినిపించడం ద్వారా కూడా కంటిజబ్బులను నివారించవచ్చు. సీజన్లో లభించే పండ్లను తినడం పిల్లలకే కాదు, పెద్దల కంటికి కూడా మంచిదే. -
కంటి జబ్బులకు వినూత్న కాంటాక్ట్ లెన్స్!
కాలో చేయో విరిగితే అతికించవచ్చునేమోగానీ.. అలాంటి దెబ్బ కంటికి తగిలితే మాత్రం చాలా ఇబ్బంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్త ఒకరు వినూత్నమైన కాంటాక్ట్ లెన్స్ సిద్ధం చేశారు. మానవ ఉమ్మునీటితో తయారయైన ఈ కాంటాక్ట్ లెన్స్లలో లింబల్ మెసెన్కైమల్ స్టోమల్ కణాలతో నిండి ఉంటుంది. కనుగుడ్ల మార్పిడి శస్త్రచికిత్సల్లో వ్యర్థాలుగా ఉండే ఈ కణాలు కంటి గాయాలను మాన్పడంలో సాయపడతాయి. అలాగే ఉమ్మునీటితో తయారైన త్వచాలు మంట/వాపులు, గాయపు గుర్తులు మాన్పే లక్షణమున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. కనుగుడ్డుపై వచ్చే అల్సర్లు, సంప్రదాయ చికిత్స పద్ధతులకు లొంగని కొన్ని సమస్యలకు ఈ కొత్త పద్ధతి ద్వారా ఉపశమనం లభిస్తుందని అంచనా. ఇళ్లల్లో, ఫ్యాక్టరీల్లో ప్రమాదకరమైన రసాయనాలు సోకినప్పుడు ఏర్పడే గాయాలకూ ఈ వినూత్న కాంటాక్ట్ లెన్స్ను మెరుగైన చికిత్స కాగలవని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డేమియన్ హార్కిన్ అంటున్నారు. అయితే ఉమ్మునీటి త్వచాలు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండటం ఒక్కటే కొంచెం సమస్యగా ఉందని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఐదేళ్లలో ఈ కొత్త రకం కాంటాక్ట్ లెన్స్లు అందరికీ అందుబాటులోకి రావచ్చునని హార్కిన్ అంటున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దు
ఆదరించండి.. అభివృద్ధి చేస్తా
ప్రాణం తీసిన మామిడి కాయల గొడవ
బీజేపీ అనుకూల పార్టీలను ఓడించాలి
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement