-
డీటీసీతో ‘పన్ను’ ఊరట!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ) సమీక్ష కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ప్యానెల్.. పన్నుల భారం తగ్గించే దిశగా కీలక సిఫారసులు చేసింది. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలని, డివిడెండ్ పంపిణీపై పన్ను (డీడీటీ)ను ఎత్తివేయాలని ప్యానెల్ చేసిన సిఫారసుల్లో ముఖ్యమైనవి. అదే సమయంలో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)ను, సెక్యూరిటీ లావాదేవీల పన్నును (ఎస్టీటీ) మాత్రం కొనసాగించాలని సూచించింది. గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సమర్పించిన నివేదికలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్యానెల్ తన సిఫారసులను పేర్కొంది. ఆదాయపు పన్ను మూడు రకాలే... వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలన్నది డీటీసీ టాస్క్ ఫోర్స్ సిఫారసుల్లో అత్యంత కీలకమైన సంస్కరణ. ప్రస్తుతం 5, 20, 30 శాతం పన్ను శ్లాబులు ఉండగా, వీటిని క్రమబద్ధీకరించి, 5 శాతం, 10 శాతం, 20 శాతం రేట్లను తీసుకురావాలని సూచించింది. అంటే పై స్థాయిలో 30 శాతం, 20 శాతం పన్ను రేట్లను కలిపేసి.. 20 శాతం పన్నునే తీసుకురావాలని పేర్కొనడం పన్ను భారాన్ని భారీగా తగ్గించే కీలక సిఫారసు. మరో ప్రతిపాదన ప్రకారం... రూ.5–10 లక్షల మధ్య ఆదాయ వర్గాలపై 10 శాతం, రూ.10–20 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.30 లక్షలు మించి రూ.2 కోట్ల వరకు ఆదాయంపై 30 శాతం పన్ను విధించాలన్నదీ ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల ఆదాయంపై ఎటువంటి పన్ను లేదు. రూ.2.5–5 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రాయితీ ఉంది. అంటే రూ.5 లక్షల వరకు పన్ను వర్తించే ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.5–10 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.10 లక్షలు మించిన ఆదాయంపై 30 శాతం పన్ను రేటు అమల్లో ఉంది. రూ.2.5–5 లక్షల ఆదాయంపై ఎలానూ పన్ను రిబేటు ఉంది కనుక ఇకపై రూ.5 లక్షల వరకు ఆదాయ వర్గాలను పన్ను నుంచి మినహాయించే అవకాశం ఉంది. ‘‘పన్ను శ్లాబులను సమీక్షించడం వల్ల స్వల్ప కాలం పాటు ఇబ్బంది ఉంటుంది. ప్రభుత్వ ఖజానాపై 2–3 ఏళ్ల ప్రభావం చూపిస్తుంది. కానీ పన్నుల సరళీకరణతో పన్ను చెల్లించే వారు పెరుగుతారు’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. 58 ఏళ్ల క్రితం నాటి ఆదాయపన్ను చట్టాన్ని సమీక్షించి, వ్యక్తులు, కంపెనీలపై పన్నుల భారాన్ని తగ్గించడంతోపాటు, పన్ను నిబంధనల అమలును పెంచే దిశగా సిఫారసుల కోసం ప్రభుత్వం అత్యున్నత స్థాయి టాస్క్ఫోర్స్ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ సిఫారసులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డీడీటీకి మంగళం? ‘‘డీడీటీని తొలగించాలన్న ఆలోచన వెనుక ఉద్దేశం పన్నులపై పన్ను ప్రభావాన్ని తొలగించడమే’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. కంపెనీలు వాటాదారులకు పంపిణీ చేసే డివిడెండ్పై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా 12 శాతం సర్చార్జ్, 3 శాతం ఎడ్యుకేషన్ సెస్సు కూడా కలుపుకుంటే డివిడెండ్పై నికర పన్ను 20.3576 శాతం అవుతోంది. డివిడెండ్పై కార్పొరేట్ ట్యాక్స్, డీడీటీ, ఇన్వెస్టర్ ఇలా మూడు సార్లు పన్నుల భారం పడుతున్నట్టు మార్కెట్ పార్టిసిపెంట్లు (బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు) రెండు వారాల క్రితం ఆర్థిక మంత్రితో భేటీ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల అంతర్జాతీయంగా భారత క్యాపిటల్ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడం లేదని పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు భారత్లో చెల్లించే పన్నులకు తమ దేశంలో క్రెడిట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే డివిడెండ్పై పన్నును కంపెనీలే చెల్లిస్తున్నందున వారు దానిపై క్రెడిట్ పొందడానికి అవకాశం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో డీడీటీని ఎత్తివేసి, దీనికి బదులు సంప్రదాయ విధానంలోనే పన్ను వేయాలన్నది టాస్క్ ఫోర్స్ సూచన. ప్రతిపాదిత డీడీటీని రద్దు చేస్తే, ఆదాయంపై బహుళ పన్నులు తొలగిపోయి కంపెనీలపై భారం తగ్గుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని రద్దు చేస్తే డివిడెండ్ అందుకున్న వాటాదారులే దాన్ని ఆదాయంగా చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను స్టాక్ ఎక్సేంజ్ల ద్వారా చేసే సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను ను కూడా కొనసాగించాలని పేర్కొంది. -
స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి
ఏలూరు అర్బన్ : స్కూల్ బస్లు పూర్తి కండిషన్లో లేకుంటే సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఎస్ మూర్తి హెచ్చరించారు. రవాణా శాఖ అధికారులు 6 బృందాలుగా ఏర్పడి మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్కూల్ బస్లను తనిఖీ చేశారని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 11 బస్లను గుర్తించి సీజ్ చేశారన్నారు. సంబంధిత విద్యాసంస్థల నుంచి రూ.లక్ష వరకు అపరాధ రుసుం వసూలు చేశామని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో గడువు ముగి సిన అన్ని విద్యాసంస్థల బస్లకు విధిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో బస్లు తిప్పుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోమని స్పష్టం చేశారు. ఏలూరు నగరంలో ఆర్టీఓ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఏఎంవీఐలు ఎం.పౌల్రాజు, సిద్ధిఖ్, చైతన్యసుమ, ప్రసాద్ తనిఖీలు చేశారు. -
నోట్ల రద్దు స్కాం అన్నవారే అవకతవకలకు..
పాతనోట్ల మార్పిడిలో అవకతవకలకు పాల్పడుతున్నారనే నేపథ్యంలో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ)పై ఆ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చార్జీల రూపంలో వసూలుచేసిన చిన్నమొత్తంలో విలువ కలిగిన నోట్లను, కాయిన్లను టీడీసీ పాత నోట్ల మార్పిడికి ఉపయోగిస్తుందని పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించినట్టు సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నిజంగానే పాత నోట్ల మార్పిడిలో మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతుందనే తెలిస్తే, ఈ విషయంలో ప్రభుత్వం క్రిమిషన్ విచారణకైనా వెనుకాడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రెవెన్యూలుగా డీటీసీ రూ.3కోట్లను డిపాజిట్ చేసిందని, అవన్నీ పాత కరెన్సీ నోట్లేనని ఢిల్లీ ప్రభుత్వ అధికార వర్గాలు చెప్పాయి. ఈ రెవెన్యూలు ఎక్కువగా రద్దైన నోట్ల రూపంలోనే ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డీటీసీ అవతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నగదంతా ఆమ్ ఆద్మీ పార్టీ విరాళాల రూపంలో సేకరించిన మొత్తమేనని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆమ్ఆద్మీ పార్టీ విరాళాలుగా సేకరించిన మొత్తాన్ని ఈ రూపంలో మార్చుకోవడానికి ప్రయత్నిస్తుందంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ కూడా లెఫ్టినెట్ గవర్నర్ నజీబ్ జంగ్కు లేఖ రాశారు. డీటీసీ బస్సులో ప్రయాణించే వారంతా దిగువ మధ్యతరగతికి చెందినవారే ఉంటారని, వారందరూ చిల్లర రూపంలోనే టిక్కెట్లను కొనుగోలుచేస్తారని ఉపాధ్యాయ చెప్పారు. ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజాసంస్థలకు మరక అంటకముందే టీడీసీ మేనేజ్మెంట్ను మేలుకొల్పాలని ఉపాధ్యాయ డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం ప్రకటించగానే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయనపై మండిపడ్డారు. ఇది ఓ పెద్ద స్కాం అంటూ తెగ రాద్ధాంతం చేశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ప్రభుత్వంలోనే పాత నోట్ల మార్పిడిలో అవకతవకలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. -
మోహన్రావు ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రవాణా ఉప కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న మోహన్రావు ఇంటిపై ఏసీబీ దాడులు శుక్రవారం రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ. 50 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మోహన్రావు బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. కాగా మోహన్ రావు ఇంటి నుంచి 2.5 కేజీల బంగారంతోపాటు 5.5 కేజీల వెండిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అలాగే సొదాల్లో భాగంగా మోహన్రావు కుమార్తె పేరు మీద 9 ఎకరాలు, 6 బినామీ కంపెనీలను అధికారులు గుర్తించారు. హైదరాబాద్లోని కొంపల్లి, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్లో మోహన్రావు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు కనుగొన్నారు. మోహన్రావును నేడు ఏసీబీ కోర్టు కు తరలించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు డీటీసీ మోహన్ రావుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ గురువారం దాడి చేసింది. -
ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్పై ఎన్జీటీ ఆగ్రహం
న్యూఢిల్లీ: కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)తో కలిసి బస్సుల ప్రమాణాల పరీక్షించి నివేదికను సమర్పించడంలో విఫలమైన ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ)పై జాతీయ హరిత ట్రిబ్యూనల్(ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని బస్సులను ఎవరు పర్యవేక్షిస్తారని, ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించిన ఒక్క బస్సు నివేదికనైనా తమకు ఇవ్వాలని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుండడంతో వాటి మూలాలను కనుగొని అడ్డుకట్ట వేయాలని వర్ధమాన కౌశిక్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు. డీటీసీ బస్సులు, గ్యాస్ ఆధారిత బస్సుల ప్రమాణాలను డీటీసీ, సీపీసీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యుల బృందం పరీక్షించి నివేదిక ఇవ్వాలని, నిబంధనలకు విర్ధుంగా ఉన్నవాటిని రోడ్ల మీద తిరగనివ్వద్దని 2014 నవంబరు 26న ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో బస్సులన్ని ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని న్యాయవాది అవ్నిష్ అల్హావాట్ డీటీసీ తరుఫున వాదించారు. కానీ ధర్మాసనం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో రవాణా శాఖ సంయుక్త కమిషనర్ 186 బస్సులు కాలుష్య నియంత్ర నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని 2014 డిసెంబర్ 28న నివేదిక సమర్పించారు. దీంతో 15 ఏళ్లనాటి వాహనాలను రోడ్ల మీద తిరగకుండా నిషేధం విధించింది, ఒక వేళ అలాంటి వాహనాలు దేశ రాజధానిలో తిరిగితే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement