-
తీవ్రవాద ప్రాంతాల్లో రోడ్లకు రూ.1,290 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు అందజేసేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల పరిధిలోని రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.1,290 కోట్లను మంజూరు చేయనుందని రోడ్లు, భ వనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 10వ తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో కేంద్ర గ్రామీణ, పంచాయతీరాజ్, తాగునీటి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ను కలసి రాష్ట్రం తరపున మరోసారి ప్రతిపాదనలు అందజేశామని పేర్కొన్నారు. గత జూన్ నెలలో పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ఓ స్పష్టతకు వచ్చిందని, తాజా ప్రతిపాదనలకు ఆ శాఖ మంత్రి కూడా సానుకూలత వ్యక్తం చేస్తూ తనకు లేఖ రాశారని ఆయన వెల్లడించారు. నాలుగు జిల్లాల పరిధిలో మొత్తం 24 రోడ్డు పనులుంటాయని, ఇందులో రెండు వంతెనలను కూడా నిర్మించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపాదిత పనులివే... ►ఆదిలాబాద్ జిల్లా- నాలుగు పనులు- 87 కిలోమీటర్ల నిడివి-అంచనా రూ.250 కోట్లు. హా కరీంనగర్ జిల్లా- ఐదు పనులు- 102 కిలోమీటర్లు - రూ.265కోట్లు అంచనా. హా వరంగల్ జిల్లా-ఐదు పనులు- 139.97 కిలోమీటర్లు - రూ.315 కోట్ల అంచనా. ► ఖమ్మం జిల్లా- 12 పనులు- 207.90 కిలోమీటర్లు -రూ.460 కోట్లు అంచనా. -
రియల్ దందాకు.. సలాం!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సాగునీటి శాఖ అధికారులు సలాం చేస్తున్నారు. రియల్దందాకు సహకరించేందుకు వీలుగా ఏకంగా కర్నూలు-కడప (కేసీ) కెనాల్ నుంచి పొలాలను సాగునీరు అందించే ఫీల్డ్ చానల్ను మూసేశారు. ఇందుకోసం ఆధునీకరణ అనే పేరును తెరమీదకు తెచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఫీల్డ్ చానల్ను మూసివేయడంతో కర్నూలు గ్రామంలో సర్వే నెంబరు 62లో ఉన్న వ్యవసాయ భూములకు సాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా వ్యవసాయ భూములు పనికిరాకుండా పోతున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. అంతేకాకుండా.. ఈ సర్వే నెంబరులోని వ్యవసాయ భూమికి ఫీల్డ్ చానల్ ద్వారానే దారి ఉండేది. ఫీల్డ్ చానల్ మూతపడిపోవడంతో.. ఈ సర్వే నెంబరులోని వ్యవసాయ భూములకు దారిని కూడా రియల్ దందాదారులు మూసివేశారు. దారి కావాలంటే సెంటు భూమికి రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వక్ఫ్ భూమిని ఆక్రమించుకున్న ధనలక్ష్మీ నగర్ రియల్ ఎస్టేట్ దందాదారులు.. వ్యవసాయ భూమికి నీళ్లు కూడా లేకుండా చేశారు. బీళ్లుగా మారిన వ్యవసాయ భూములు వాస్తవానికి సుంకేసుల రోడ్డులోని కర్నూలు గ్రామంలోని సర్వే నెంబరు 62తో పాటు 215లోనూ వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూములకు కేసీ కెనాల్ నుంచి ఫీల్డ్ చానల్ ద్వారా సాగునీరు సరఫరా అయ్యేది. అయితే, ఈ సర్వే నెంబర్ల పక్కనే 64 సర్వే నెంబరులో ఉన్న వక్ఫ్ భూములను ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. ఈ భూములకు దారి లేకుండా చేసేందుకు పథకం పన్నారు. ఇందులో భాగంగా కేసీ కెనాల్ నుంచి ఈ భూములకు సాగునీరు అందించే ఫీల్డ్ చానల్ను ఆధునీకరణ పేరుతో మూసివేయించారన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి ఈ సర్వే నెంబర్లలోని వ్యవసాయ భూములకు ఈ ఫీల్డ్ చానల్ మీదుగానే దారి ఉండేది. ఈ దారి నుంచే రైతులు తమ బండ్లలో పొలాలకు వెళ్లేవారు. అయితే, ఈ ఫీల్డ్ చానల్ను సాగునీటిశాఖ అధికారులు మూసివేశారు. దీంతో క్రమంగా ఈ ప్రాంతాల్లో రైతులు తప్పనిసరిగా పంటలను వేసుకోకుండా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఫలితంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములు కాస్తా పనికిరాకుండా పోయాయి. వీటి ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారడంతో ఇప్పుడు సర్వే నెంబరు 62లో మాత్రమే వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి ఫీల్డ్ చానల్ మీదుగా ఉన్న దారిని కూడా వక్ఫ్భూమిని కాజేసిన రియల్ ఎస్టేట్ దందాదారులు ఆక్రమించేశారు. దీంతో ఈ పొలానికి సాగునీరు లేదు. దారి లేకుండా మూసుకుపోయింది. అయితే, ఈ ఫీల్డ్ చానల్ కింద వ్యవసాయ భూములకు ప్రత్యామ్నాయ సాగునీరును అందిస్తున్నామంటూ సాగునీటిశాఖ అధికారులు చెబుతుండటం విశేషం. ఇక్కడ ఎక్కడా ప్రత్యామ్నాయ సాగునీరు లేకపోవడం గమనార్హం. పొంతనలేని సమాధానాలు.. కేసీ కెనాల్ ఆధునీకరణ చేయాలన్న ఉద్దేశంతోనే ఫీల్డ్ చానల్ను మూసివేశామని సాగునీటిశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఈ ఫీల్డ్చానల్ ద్వారా ఉన్న ఆయకట్టులో ఉన్న భూముల్లో హాస్పిటల్స్, అపార్టుమెంట్లు వెలిశాయని.. మిగిలిన వ్యవసాయ భూములకు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సాగునీరు అందిస్తున్నామని సాగునీటిశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఇక్కడ ఇప్పటికీ ఉన్న వ్యవసాయ భూమికి ప్రత్యామ్నాయ సాగునీరు అందించడం లేదు. ఫీల్డ్ చానల్ ఉన్న స్లూయిస్కు కూడా అడ్డుకట్ట వేశారు. వీటికి సాగునీటిశాఖ అధికారులు సరైన సమాధానం మాత్రం చెప్పడం లేదు. సెంటుకు రూ.5 లక్షలు కట్టండి సుంకేసుల రోడ్డులోని సర్వే నెంబరు 64లో ఉన్న వక్ఫ్ భూములను ఆక్రమించుకున్న రియల్ దందాదారులు.. మరో కొత్త దందాకూ శ్రీకారం చుట్టారు. ఫీల్డ్ చానల్ మూసివేయడంతో దారి మూసుకుపోయిన వ్యవసాయ భూములు ఉన్న రైతులకు దారి కావాలంటే తమకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దారి కావాలంటే.. సెంటుకు రూ.5 లక్షలు చెల్లించాలని రైతులను డిమాండ్ చేస్తున్నారు. వక్ఫ్ భూమితో పాటు తమకు ఉన్న దారిని ఆక్రమించేసి.. ఇప్పుడు మళ్లీ తమనే డబ్బులు డిమాండ్ చేయడం దారుణమని రైతులు వాపోతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement