-
మూడేళ్లయినా ఖరారు కాని జిల్లా కేంద్రం
సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటై ఈ దసరాతో మూడేళ్లవుతున్నా.. జిల్లా కేంద్రం ఎక్కడ అనేది ఖరారు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు కలెక్టరేట్ సముదాయాలు చివరి దశలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా రూరల్ జిల్లా కేంద్రం ఉండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. -
ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుతో తగ్గిన దూరభారం
సాక్షి, ఆసిఫాబాద్: దేశంలోనే అత్యంత వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఆవిర్భావించి ఈ దసరాతో మూడేళ్లు కావస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలను వేరు చేస్తూ పోరాటయోధుడు కుమురం భీం పేరు మీదుగా కొత్త జిలాను ఏర్పాటు చేశారు. అప్పటి వరకూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతవాసులకు కొత్త జిల్లా ఏర్పాటుతో పాలన మరింత చేరువైంది. ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోయినా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలో మాత్రం బీజం పడింది. కుమురం భీం జిల్లా ఆవిర్భావించడంతో ప్ర ధానంగా దూర భా రం సమస్య తీరినట్లయింది. మారుమూల ప్రాంతమైన బెజ్జూరు నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఒక రోజు ముందు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లా ఏర్పాటుతో ఈ తిప్పలు తప్పాయి. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చిట్టచివరి ప్రాంతాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ తక్కువగా ఉండేది. ప్రస్తుతం రెండు నియోజవర్గాలతో కలెక్టర్, ఎస్పీ నేరుగా మారుమూల ప్రాంతాలకు వెళ్లడంతో పాటు పర్యవేక్షణ పెరిగింది. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం.. కొత్త జిల్లాల ఏర్పాటుతో స్థానికులకే ఉద్యోగాల్లో 90 శాతం అవకాశం దక్కింది. గత మూడేళ్లుగా జిల్లాలో జరిగిన కానిస్టేబుల్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, ఇతర వివిధ శాఖల్లో తాత్కాలిక పోస్టుల్లోనూ జిల్లాలో స్థానిక నిరుద్యోగ యువతకే అవకాశం కలిగింది. ఇక జిల్లా ఏర్పాటుతో భవిష్యత్లోనూ స్థానిక నిరుద్యోగులకు ఈ రిజర్వేషన్ పద్ధతి కొనసాగనుంది. అభివృద్ధికి అడుగులు.. కొత్త జిల్లా ఏర్పాటుతో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది. జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత కొత్తగా లింగాపూర్, చింతలమానెపల్లి, పెంచికల్పేట మూడు మండలాలు ఏర్పడ్డాయి. చిన్న మండలాలతో పాలన మరింత సులభమవుతోంది. అలాగే కొత్తగా తహసీల్, ఎంపీడీవో, పోలీసు స్టేషన్, తదితర మండల కార్యాలయాలన్నీ రావడంతో పాలనలో ఫోకస్ పెరిగింది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ సమీకృత భవనాల నిర్మాణాలు, పోలీసు కార్యాలయాల నిర్మాణాలు మొదలయ్యాయి. జిల్లా కేంద్రం కావడంతో ప్రతి శాఖకు సంబందించిన కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. వైద్య సేవల్లో సామాజిక ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయడం, మహిళల భద్రత కోస సఖీ కేంద్రం తదితర శాఖల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. పరిపాలనపై మరింత పట్టు పెరిగింది. సొంత జిల్లాల్లోనే బదిలీలకు ఆస్కారమేర్పడింది. కేంద్రం కొత్త జిల్లాల ప్రతిపాదికనే ఇటీవల నిధులు మంజూరుకు సుముఖం తెలపడంతో ఇక నుంచి మరింత ప్రగతి ఆశించవచ్చు. అరకొర వసతులు.. గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు, కార్యాలయాలకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రాంతం కావడంతో అధికారులకు సరైన మౌలిక వసతులు లేక ఇక్కట్లకు గురికావాల్సి వస్తోంది. జిల్లా ఏర్పడిన నుంచి అరకొర సిబ్బందితోనే పాలన సాగుతోంది. ఇప్పటికీ అన్ని శాఖల్లోనూ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్నతాధికారులకు జిల్లా కేంద్రంలో ఆవాస యోగ్యం లేకపోవడంతో కాగజ్నగర్, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. మిగతా ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ హెచ్ఆర్ఏ తక్కువగా ఉండడంతో కొందరు ఉద్యోగులు ఇక్కడి నుంచి బదిలీ చేయించుకుని వెళ్తున్నారు. ప్రధానంగా గడిచిన మూడేళ్లలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి రాలేదు. డీఎంహెచ్వో కార్యాలయంతో పాటు చాలా వరకూ కార్యాలయాలు ఇరుకు గదుల్లో, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో రోడ్డు డివైడర్లు నిర్మించారు. ఏజెన్సీలో నేటికీ అనేక గ్రామాలకు సరైన రోడ్డు వసతి లేదు. పలు సమస్యలు ఉన్నప్పటికీ జిల్లా ఏర్పాటుతో ఎంతో మేలు జరిగినట్లయిందని ప్రజలు తెలుపుతున్నారు. విద్యా వ్యవస్థ మెరుగుపడాలి కొత్త జిల్లా ఏర్పాటుతో జిల్లాకు కొన్ని గురుకులాలు మంజూరయ్యాయి. ఇది స్వాగతించాల్సిన విషయమే అయినా జిల్లాలో ప్రభుత్వ విద్యావ్యవస్థ మరింత మెరుగుపడాల్సి ఉంది. జిల్లా కేంద్రంలో ప్ర భుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలు ఏర్పా టు చేయాలి. గిరిజన విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. – దుర్గం రవీందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు నూతన జిల్లాగా ఏర్పడినా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు దూరభారంతో ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం దూరభారం తగ్గినా చాలా వరకూ పనులు జరగడం లేదు. కాగజ్నగర్ను డివిజన్గా ఏర్పాటు చేసినా గతంలో ఉన్న పరిస్థితి మాత్రమే కనిపిస్తోంది. అనేక సమస్యలు పరిష్కారానికి నోచడం లేదు. – సిందం శ్రీనివాస్, కాగజ్నగర్ పరిపాలన సౌలభ్యం పెరిగింది కుమురం భీం జిల్లా ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం పెరిగింది. ప్రభుత్వ శాఖలు, అధికారులు అందుబాటులోకి వచ్చారు. గతంలో ఆదిలాబాద్కు వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్ల వెళ్లాల్సి వచ్చేది. దీంతో చాలా వ్యయప్రయాసలకు గురికావాల్సి వచ్చేంది. కాని కుమురం భీం జిల్లా ఏర్పాటుతో చాలా వరకూ పరిస్థితి మారింది. శాఖల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ సైతం పెరిగింది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. – బొమ్మినేని శ్రీధర్, రెబ్బెన అభివృద్ధికి బాటలు పడ్డాయి.. నూతనంగా జిల్లా, మండలాల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు పడ్డాయి. గతంలో జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో ఇబ్బందులకు గురయ్యాం. నూతన మండలాల ఏర్పాటుతో రవాణా ఇబ్బందులు తీరాయి. పరిపాలన సౌలభ్యంగా మారింది. ప్రభుత్వపరమైన పథకాలు, కార్యక్రమాల సమాచారం తెలుసుకుకోవడం నూతన మండలాలతో అందుబాటులోకి వచ్చింది. – సయ్యద్ అజీమ్, చింతలమానెపల్లి సేవలు అందుబాటులోకి చింతలమానెపల్లి మండలంగా ఏర్పడక ముందు గూడెం, డబ్బా, ఖర్జెల్లి, దిందా, అడెపల్లి, కేతిని, రుద్రాపూర్ గ్రామాలకు వెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేంది. చింతలమానెపల్లి కొత్త మండలంగా ఏర్పాటు కావడంతో చాలా వరకూ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు దగ్గరనే ఉన్నాయి. నూతన పంచాయతీలతో సౌలభ్యంగా ఉంది. మండల కేంద్రంలో అన్ని కార్యాలయాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజలకు మెరుగైన సేవలందించాలి. – కుమ్మరి హరీశ్, చింతలమానెపల్లి -
కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించి నేటికి మూడేళ్లు
జిల్లాల పునర్విభజనతో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రజలకు పాలన చేరువైంది. సంక్షేమ పథకాల అమలుపై పర్యవేక్షణ పెరిగింది. అభివృద్ధి సైతం జోరందుకుంది. మారుమూల ప్రాంతాల కూ జిల్లా స్థాయి అధికారులు వెళ్లి వస్తున్నారు. సమీకృత కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాల నిర్మాణ పనులు జిల్లాలో దాదాపుగా పూర్తికావచ్చాయి. కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించి మూడేళ్లవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి, కామారెడ్డి: పాలనను ప్రజలకు చేరువ చేసే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలను పున ర్విభజించింది. ఆ తరువాత కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా ఏర్పాటైంది. 2016 అక్టోబర్ 11న కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించింది. గతంలో జిల్లా విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో జిల్లా యంత్రాంగం అన్ని ప్రాంతాలను తిరగడం ఇబ్బందికరంగా ఉండేది. ఒక్కో ప్రాంతానికి ఏడాదికోమారు కూడా వెళ్లే పరిస్థితులు ఉండేవి కాదు. జిల్లాల పునర్విభజనతో ప్రజలకు పాలన చేరువైంది. కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు తరచూ అన్ని మండలాలను చుట్టి వస్తున్నారు. అభివృద్ధి పనుల పరిశీలన, సంక్షేమ పథకాల పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతోంది. ప్రతి వారం పథకాల అమలుపై సమీక్షిస్తున్నారు. కలెక్టర్ సత్యనారాయణ సెలవు రోజుల్లో సైతం జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును పరిశీలించి వస్తున్నారు. దీంతో పథకాల అమలులో పారదర్శకత పెరిగింది. వారంవారం ప్రజావాణి... కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో పాటు జిల్లా అధికారులంతా ప్రజావాణికి హాజరై ప్రజల విన్నపాలను వింటున్నారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. మూడేళ్ల కాలంలో దాదాపు 8 వేలకు పైగా అర్జీలు వచ్చాయి. అందులో చాలా వాటికి పరిష్కారం చూపారు. జిల్లా కేంద్రానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరాన ఉన్న జుక్కల్ నియోజక వర్గ ప్రజలు జిల్లా కేంద్రానికి రావడం ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ప్రతి నెల మొదటి శనివారం బిచ్కుంద మండల కేంద్రం లో కలెక్టర్ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. కలెక్టర్ సత్యనారాయణతోపాటు జిల్లా అధికారులంతా ప్రజావాణికి హాజరై ప్రజల సమస్యలను విని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ శ్వేత కూడా బిచ్కుందలో నెలకోరోజు సమయం కేటాయిస్తూ అక్కడి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో కలెక్టర్ ప్రతి రోజూ ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతున్నారు. పథకాల అమలులో ప్రత్యేక ముద్ర కామారెడ్డి జిల్లా వివిధ పథకాల అమలులో ముందంజలో ఉంటోంది. ఉపాధిహామీ, హరితహారం, గొర్రెల పంపిణీ, భూముల రికార్డుల ప్రక్షాళన, భూగర్భజలాల వృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల అమలులో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. కలెక్టర్, జేసీ క్యాంపు కార్యాలయాలు పూర్తి సమీకృత కార్యాలయాల ప్రాంగణంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ల కోసం చేపట్టిన భవనాలు నిర్మాణం పూర్తయ్యింది. మూడు నెలల క్రితమే వాటిని ప్రారంభించారు. అధికారులు ఆయా క్యాంపు కార్యాలయాల్లోనే నివాసం ఉంటున్నారు. కలెక్టర్, జేసీతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ తమ కార్యకలాపాలను అక్కడి నుంచే సాగిస్తున్నారు. కొత్త డివిజన్, మండలాల్లో ఇబ్బంది జిల్లాతో పాటే ఏర్పాటైన కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, కొత్త మండలాల్లో కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఇబ్బందులు నెలకొన్నాయి. ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లో రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయగా.. ఆర్డీవోలు, డీఎస్పీ కార్యాలయాలకు సరైన వసతులతో కూడిన భవనాలు లభించలేదు. ఇప్పటికీ భవనాలకు నిధులు మంజూరు కాలేదు. దీంతో ఆయా కార్యాలయాలకు సొంత భవనాలు ఎప్పుడు నిర్మిస్తారోనని ఎదురుచూడాల్సి వస్తోంది. సిద్ధమవుతున్న సమీకృత భవనాలు 2016 అక్టోబర్ 11న విజయ దశమి రోజున కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని పట్టణానికి సమీపంలో నూతనంగా నిర్మించిన మైనారిటీ గురుకుల పాఠశాలలో, జిల్లా పోలీసు కార్యాలయాన్ని అడ్లూర్ రోడ్డులోని గిరిజన విద్యార్థి వసతి గృహ భవనంలో ఏర్పాటు చేశారు. ఏ జిల్లాలో లేని విధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, పోలీసు కార్యాలయాలకు అన్ని వసతులతో కూడిన భవనాలు దొరకడంతో పాలనకు ఏ ఇబ్బందీ లేకుండాపోయింది. మూడేళ్లుగా ఆ భవనాల్లో కార్యాలయాలు కొనసాగుతున్నాయి. కాగా జిల్లా ఏర్పాటైన ఏడాదికి 2017 అక్టోబర్ 11న జిల్లా కలెక్టరేట్తో పాటు జిల్లా పోలీసు కార్యాలయాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణానికి ఆనుకుని ఉన్న అడ్లూర్ శివారులోని 427 సర్వేనంబరులో 90 ఎకరాల్లో అటు కలెక్టరేట్ సముదాయం, ఇటు పోలీసు కార్యాలయాల భవనాల నిర్మాణాలు చేపట్టారు. కలెక్టరేట్ సముదాయానికి రూ. 44 కోట్లు మంజూరు కాగా, రోడ్లు భవనాల శాఖ పనులను అప్పగించారు. జిల్లా పోలీసు కార్యాలయ భవన నిర్మాణానికి రూ.60 కోట్లు మంజూరు కాగా పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ పనులను పర్యవేక్షిస్తోంది. సమీకృత భవనాల నిర్మాణ పనులు జిల్లాలో వేగంగా సాగాయి. ప్రస్తుతం జిల్లా పోలీసు భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాలకన్నా ముందుగా కామారెడ్డిలోని పోలీసు కార్యాలయ భవనం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ముందుగా పూర్తయితే సీఎంతో ప్రారంభించా లని అప్పట్లో భావించారు. అయితే ముందస్తు ఎన్నికలు రావడంతో వాయిదాపడింది. ప్రస్తుతం పోలీసు కార్యాలయ భవనం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది. కాగా కలెక్టరేట్ భవన నిర్మాణ పనులూ వేగంగా కొనసాగుతున్నాయి. భవనాల నిర్మా ణం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. అయితే కార్యాలయ ప్రాంగణానికి రోడ్ల నిర్మాణం, ఫర్నిచర్ కొనుగోలు కోసం నిధుల సమస్య ఏర్పడింది. నిధులు మంజూరైతే నెల రోజుల్లో భవనాలను ప్రారంభించుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యాం జిల్లాల పునర్విభజన తరువాత అన్ని ప్రాంతాలపై పర్యవేక్షణ సులువైంది. పలు కార్యక్రమాలు, సంస్కరణలతో పోలీసులు ప్రజలకు దగ్గరయ్యారు. మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి ప్రజలతో మమేకమవుతున్నాం. ప్రజలు కూడా పోలీసులతో అన్నీ చెప్పుకుంటున్నారు. ప్రజల సహకారంతో సీసీ కెమెరాలను విస్తృతంగా ఏర్పాటు చేశాం. వాటి ద్వారా నేరాల సంఖ్య తగ్గింది. నేరస్తులను పట్టుకోవడం కూడా సులువైంది. అన్ని శాఖల అధికారుల కోఆర్డినేషన్తో ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. – శ్వేత, ఎస్పీ -
కొత్త ఆశలు..!
రాజకీయ నిరుద్యోగులు, రిజర్వేషన్లు అనుకూలించక పాలిటిక్స్నుంచి దూరమైన వారు, ఆర్థికంగా ఉన్నవారి కన్ను ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కానున్న నగర, గ్రామ పంచాయతీలపై పడింది. ఒక్కసారైనా ప్రజాప్రతినిధి కావాలన్న ఆశతో పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో విందులు, వినోదా లకు తెరలేపడమే కాకుండా రాజకీయబేరసారాలకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు రిజర్వేషన్లు దడ పుట్టిస్తున్నప్పటికీ.. అనుకూలంగా రాకపోతే తాము చెబితే వినే వ్యక్తులను బరిలో నిలిపేందుకు ఎత్తులు వేస్తున్నారు. మొత్తంగా స్థానిక పదువులపై ఆశలు పెట్టుకున్న వారందరూ ఎన్నికల కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు. సాక్షి, యాదాద్రి : నూతన చట్టం ద్వారా కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఏర్పడనున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ హడావుడి మొదలైంది. నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కీలకం కానున్నాయి. ఎంతో కాలంగా స్థానిక పదవులపై ఆశలు పెట్టుకున్న వారందరూ రిజర్వేషన్ల ఖరారు ఎలా ఉంటుందోనన్న ఆత్రుతతో ఉన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి అన్ని ఎన్నికల్లో 50శాతం మహిళలకు రిజర్వ్ చేస్తారు. మున్సిపల్, నగర, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అన్నింటిల్లో 50 శాతం ఆయా కేటగిరీల వారీగా కేటాయిస్తారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల యధావిధిగా కొనసాగుతాయా లేక కొత్త రిజర్వేషన్లు రూపొందిస్తారా.. అనే విషయం అంతు చిక్కడం లేదు. నూతన చట్టం అమలులోకి రాగానే నిర్ణీత సమయంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం కసరత్తు ఎప్పుడో ప్రారంభించింది. శాసనసభలో బిల్లు ఆమోదం పొందగానే∙గిరిజన తండాలు, మధిర గ్రామాలు కొత్త గ్రామ పంచాయతీలుగా పురుడుపోసుకోబోతున్నాయి. 2018, ఆగస్టు 1 వ తేది నాటికి గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుంది. పునర్విభజన నేపథ్యంలో.. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం రూపు రేఖలు మారాయి. రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. అయినప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీల పరంగానే జరుగుతాయి. 2013లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రం ఏర్పాటు అనంతరం నూతన జిల్లాల్లో భాగంగా ఉమ్మడి నల్లగొండ నుంచి విడివడిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా 16 మండలాలతో ఏర్పాటైంది. ఇందులో మోటాకొండూరు, అడ్డగూడురు రెండు కొత్త మండలాలు ఏర్పాటు అయ్యాయి. ఆశావాహుల్లో రిజర్వేషన్ గుబులు ఎలాగైనా సరే.. ఒక్కసారైనా ప్రజాప్రతినిధిని కావలన్న ఆశతో ఉన్నవారికి రిజర్వేషన్ దడ పట్టుకుంది. గ్రామ పంచాయతీల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విభాగాల్లో మహిళ, జనరల్ రిజర్వేషన్లు ఉంటాయి. వీటితో పాటు మహిళలకు సర్పంచ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఉండనే ఉన్నాయి. అంటే మొత్తం గ్రామ పంచాయతీల్లో అన్ని రిజర్వేషన్లు కలుపుకుని 50 శాతం మహిళలు సర్పంచ్లు అవుతారు. రిజర్వేషన్లు అనుకూలించగా రాజకీయాల నుంచి దూరమైన వారు ఉన్నారు. ఈనేపధ్యంలో ఈసారి మన గ్రామ పంచాయతీ రిజర్వేషన్ ఏమై ఉంటుందన్న చర్చ రచ్చబండల వద్ద జోరుగా సాగుతోంది. ఈ రిజర్వేషన్ అయితే ఇతను పోటీ చేస్తాడు. ఆరిజర్వేషన్ అయితే అతను పోటీ చేస్తాడు అన్నకోణంలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఆశావాహులు విందు వినోదాలకు తెరలేపారు. ఎలా ఎదుర్కొవాలి.. తమకు అనుకూలమైన రిజర్వేషన్ వచ్చే విధంగా చూడాలని ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ గత రిజర్వేషన్లు ఈసారి యధావిధిగా కొనసాగుతాయన్న ప్రచారం జోరందుకుంది. పాత రిజర్వేషన్లు ఉంటే ఎలా ముందుకుపోవాలని, లేదంటే కొత్త రిజర్వేషన్లు వస్తే ఎలా ఎదుర్కొవాలని అందుకు అనుగుణంగా అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయా పార్టీల ముఖ్యనేతలు అభ్యర్థుల ఎంపికను గుట్టుచప్పుడు కాకుండా ఖరారు చేస్తున్నారు. ఏది ఏమైనా శాసనసభలో ప్రవేశపెట్టే స్థానిక సంస్థల బిల్లు రానున్న ఎన్నికల్లో ఎందరికో రాజకీయ జీవితాన్ని ప్రసాదించబోతోంది. పావులు కదుపుతున్న రాజకీయ పార్టీలు.. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగా వేయడానికి ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. మున్సిపాలిటీ, నగరపంచాయతీ, గ్రామపంచాయతీల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ, టీడీపీ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ వంటి పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో కొద్ది తేడాలో ఓటమి పాలైన పలువురు ఈసారి ఎన్నికల్లో ఎన్నికల్లో ఎలాగైనా పదవిని అధిష్టించాలని పట్టుదలగా ఉన్నారు. ఈమేరకు గ్రామాల్లో రాజకీయ రాయబారాలు మొదలుపెట్టారు. చిన్న చిన్న వివాదాలు పరిష్కరించుకుంటున్నారు. అనుకూల వర్గంతోపాటు, ప్రతికూల వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. చిన్న చిన్న శుభకార్యాలను కూడా పెద్ద ఎత్తున చేస్తూ బంధువులు, శ్రేయోభిలాషులు, వివిధ వర్గాలను ఆహ్వానించి పోటీ చేయాలన్న తమ ఆకాంక్షను వెల్లడిస్తున్నారు. -
‘సహకారం’ పొడిగింపు
సాక్షి, ఆదిలాబాద్అర్బన్ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)కు నిర్వహించే ఈ దఫా ఎన్నికలకు బ్రేక్ పడింది. పీఏసీఎస్ పాలక వర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం (డీసీఎంఎస్)ల పదవీ కాలాన్ని కూడా మరో ఆరు నెలలు పాటు పొడిగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్లో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వ కార్యదర్శి సి. పార్థసారథి జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకాల పరపతి సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు 2013లో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 2018 జనవరి 30తో పాలక వర్గాల పదవీ కాలం పూర్తయింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై రెండు నెలలుగా సందిగ్దం నెలకొంది. అయితే తాజాగా పీఏసీఎస్, డీసీసీబీ, డీసీఎంఎస్ల పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు చేస్తూ సర్కారు ఆదేశాలివ్వడంతో సందిగ్దానికి తెరపడింది. ఉన్నవే కొనసాగింపు.. జిల్లాల పునర్విభజనతో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఉన్నాయి. ఇవి ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ఆయా జిల్లాల పరిధిలో ఉన్నాయి. కానీ వీటన్నింటికీ ఒకే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ఒకే మార్కెటింగ్ సంఘం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉంది. ఆయా జిల్లాల పరిధిలో ఉన్న పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించినట్లైతే వాటి పరిధిలోని డీసీసీబీలకు, డీసీఎంఎస్లకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. నాలుగు జిల్లాలకు ఒకే డీసీసీబీ, డీసీఎంఎస్ ఉంది. నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు డీసీసీబీ, డీసీఎంఎస్లను ఏర్పాటు చేస్తే తప్పా.. ఎన్నికలు నిర్వహించడమనేది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు తప్పా.. వేరే మార్గం లేకపోవడంతో ప్రభుత్వం ఈ రకంగా ముందడుగేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాల పదవీ కాలాన్నే మరో ఆరు నెలల పాటు పొడిగించింది. వీటితో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్ పాలక వర్గాల పదవీ కాలం కూడా పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో ప్రస్తుతం ఉన్న పాలక వర్గాలే మరో ఆరు నెలల పాటు కొనసాగనున్నాయి. అప్పుడు మేనేజ్మెంట్.. ఇప్పుడు పర్సన్ ఇన్చార్జి.. ఎన్నికల సమయంలో రైతులతో ఎన్నుకోబడిన పాలకవర్గాలను మేనేజ్మెంట్ కమిటీగా పిలుస్తారు. పదవీ కాలం ముగిసిపోయి ప్రభుత్వం పొడిగింపు చేస్తే ఆ కమిటీ అధ్యక్షుడిని పర్సన్ ఇన్చార్జీగా పిలవడం జరుగుతుందని సహకార శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అంటే పదవీలో ఉన్నప్పుడు మేనేజ్మెంట్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న వారే ఇప్పుడు పీఏసీఎస్కు పర్సన్ ఇన్చార్జి అన్నమాట. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 52 పాత మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మూడు సహకార శాఖ డివిజన్లు ఉన్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ డివిజన్లలో మొత్తం 77 ప్రాథమిక వ్యవసాయ సహకాల పరపతి సంఘాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో గెలుపొందిన డైరెక్టర్లు, సహకార శాఖ కార్యదర్శులు ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న డైరెక్టర్ల పదవీ కాలం జనవరి 30తో పూర్తయింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం తప్పని చర్యగా ఇలా చేపట్టినట్లు తెలుస్తోంది. వివరాలు కోరిన ప్రభుత్వం.. పీఏసీఎస్ పాలక వర్గాల పనితీరుపై జిల్లా సహకార శాఖను ప్రభుత్వం వివరణ కోరింది. పీఏసీఎస్లకు ఉన్న పాలక వర్గాల వివరాలు, అందులోని సభ్యులు, సొసైటీ నుంచి పొందిన రుణాలు, తిరిగి రుణాలు చెల్లిస్తున్న సభ్యు ల వివరాలను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ఫారం–1, ఫా రం–2ను పూర్తి చేసి రెండు రోజుల్లో సమర్పించాలని సహకార శాఖ అధికారులను ఆదేశించింది. పాలకవర్గాల పనితీరును దృష్టిలో ఉంచుకొని ఎవరికి పర్సన్ ఇన్చార్జీలుగా నియమించాలనే దానిపై ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టత ఇవ్వనుంది. అయితే ఉమ్మడి జిల్లాలోని కొన్ని సంఘాల్లోని సభ్యులు సొసైటీ నుంచి పంట రుణాలు తీసుకొని ఇప్పటి వరకు కట్టలేదు. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రతి ఏడాది సొసైటీ నుంచి రుణాలు తీసుకుంటున్న, తిరిగి చెల్లిస్తున్న సభ్యుల వివరాలు తెలియజేయాలని జిల్లా అధికారులను ఆదేశించడంతో అధికారులు ఆ వివరాల సేకరణలో తలామునకలవుతున్నారు. పర్సన్ ఇన్చార్జీలను నియమిస్తాం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలక వర్గాల పదవీకాలం పూర్తి కావడంతో వాటికి పర్సన్ ఇన్చార్జీలను నియమించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు నియమించే పర్సన్ ఇన్చార్జీలు ఫిబ్రవరి నుంచి 3 నుంచి కొనసాగుతారు. ఈ రెండు రోజుల వ్యవధిలో ప్రభుత్వం ఆదేశించిన కొన్ని వివరాలను సమర్పించాల్సి ఉంది. ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమయ్యాం. ఆదేశాల ప్రకారం పర్సన్ ఇన్చార్జీలను నియమిస్తాం. – మోహన్, జిల్లా సహకార శాఖ అధికారి, ఆదిలాబాద్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement