-
ద్రౌపది వస్త్రా పహరణంతో సమానం
-
ద్రౌపది వస్త్రా పహరణంతో సమానం
ట్రిపుల్ తలాక్ పట్ల మౌనంపై యూపీ సీఎం అభివర్ణన లక్నో: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న ట్రిపుల్ తలాక్ విషయంలో మౌనం వహించిన నేతలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్పై మౌనాన్ని మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంతో పోల్చారు. ట్రిపుల్ తలాక్కు మద్దతిచ్చే వారితో పాటు మౌనంగా ఉన్న వారు కూడా నేరస్తులే అని వ్యాఖ్యానించారు. ‘ఈ మధ్యకాలంలో, ట్రిపుల్ తలాక్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కొంతమంది మౌనం వహిస్తున్నారు. దీన్ని చూస్తే మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ ఘటన గుర్తుకువస్తోంది. ఈ పరిస్థితికి కారణమెవరని ద్రౌపది అక్కడున్న వారిని ప్రశ్నిస్తుంది. ఎవ్వరూ ఒక్కమాట కూడా మెదపరు. ఒక్క విదురుడు మాత్రమే స్పందిస్తూ.. నేరానికి పాల్ప డినవారితో పాటు ఆ నేరానికి మద్దతిచ్చినవారు..మౌనంగా ఉన్నవారు అందరూ బాధ్యులే అని సమాధానమిస్తాడు’ అని ట్రిపుల్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన వివరించారు. సోమవారం మాజీ ప్రధాని చంద్ర శేఖర్ 91వ జయంతి వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్కు అంతం పలకాలని, దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలుచేయాలని పేర్కొన్నారు. అవివేకమైన వ్యాఖ్యలు: ఏఐఎంపీఎల్బీ యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు అవివేకమని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) విమర్శించింది. ఏఐపీఎల్బీ జనరల్ సెక్రటరీ మౌలానా వలీ రెహ్మానీ మాట్లాడుతూ..‘ఆ అవివేక వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. తలాక్ విషయాన్ని ఆయన (యోగి) ద్రౌపది వస్త్రాపహరణతో ముడిపెడుతున్నారు. విచక్షణ ఉన్న వారు ఎవరూ ఇలా చేయరు. విషయాలను ఆయన వేరే కోణంలో చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ నిరోధానికి కఠిన చట్టం తీసుకురావాలనీ, సతీసహగమనాన్ని రూపుమాపినట్లుగానే దీన్ని అరికట్టాలని ఆలిండియా షియా పర్సనల్ లా బోర్డ్ కోరింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement