-
పుట్టినరోజే మృత్యువాత
హైదరాబాద్: ఇంటర్న్షిప్ కోసం హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థి ఉక్రెయిన్ వెళ్లాడు.. అది పూర్తి చేసుకుని తిరిగి రావడానికి టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు.. మరికొద్ది గంటల్లో విమానం ఎక్కి ఇంటికి రానున్న తరుణంలో విధి వక్రీకరించింది. పుట్టినరోజునాడే ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ నాంపల్లిలోని భాగ్యనగర్కాలనీకి చెందిన రాజేందర్సింగ్ భాటియా, జస్ప్రీత్ కౌర్ల కుమారుడు జస్ప్రీత్సింగ్ భాటియా (21) ముంబైలోని అమిటీ కళాశాలలో బీబీఏ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల 40 రోజుల ఇంటర్న్షిప్ కోసం ఉక్రెయిన్ వెళ్లాడు. శనివారం అది పూర్తి కావడంతో హైదరాబాద్ వచ్చేందుకు టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. కొద్ది గంటల్లో నగరానికి బయలుదేరాల్సి ఉండగా.. పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి ఉక్రెయిన్లోని ఫియో ఫానియా పార్క్ నది వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందాడు. ఈ విషయాన్ని అతడి స్నేహితులు జస్ప్రీత్ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు విషాదంలో మునిగిపోయారు. కాగా, జస్ప్రీత్ మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్యలు చేపట్టారని తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ ఖమ్రుద్దీన్, వైస్ చైర్మన్ శంకర్లూక్ తెలిపారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధికారులతో ఆయన మాట్లాడారని వెల్లడించారు. జస్ప్రీత్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచి్చనట్టు చెప్పారు. -
ప్రైవేటు వాహనం బోల్తా - విద్యార్థిని మృతి
ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ శివారులో టాటా మ్యాజిక్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆర్. శిరీష(12) అనే 7వ తరగతి విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది. వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదసమయంలో వాహనంలో ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. మూల రాంపూర్ గ్రామం నుంచి ఇబ్రహీంపట్నం వస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement