ప్రైవేటు వాహనం బోల్తా - విద్యార్థిని మృతి


ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ శివారులో టాటా మ్యాజిక్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆర్. శిరీష(12) అనే 7వ తరగతి విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది. వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదసమయంలో వాహనంలో ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. మూల రాంపూర్ గ్రామం నుంచి ఇబ్రహీంపట్నం వస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలిసింది.


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top