-
ఈ బ్యాంకు కస్టమర్లకు సర్ప్రైజ్: పండగ బొనాంజా
DCB Rates Hike డీసీబీ బ్యాంకు తన ఖాతాదారులకు సర్ప్రైజ్ ఇచ్చింది. తన సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచి వారికి పండగ బొనాంజా అందించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, సవరించిన వడ్డీరేట్లు ఈ రోజు (సెప్టెంబరు 27) నుంచే అమలులోకి వచ్చాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువున్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. అలాగే సేవింగ్స్ ఖాతాలో ఉన్న నిల్వ ఆధారంగా డీసీబీ కస్టమర్లకు గరిష్టంగా 8.00 శాతం వడ్డీ లభించనుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ట వడ్డీరేటు 7.90 శాతంగా ఉంచింది. సేవింగ్స్ ఖాతాల నిల్వపై వడ్డీ రేట్లు ఒక లక్ష వరకు ఉన్న పొదుపు ఖాతా నిల్వలపై బ్యాంక్ 1.75శాతం, 5 లక్షల లోపు నిల్వలపై 3.00 శాతం వడ్డీ అందిస్తుంది. 5 - 10 లక్షల లోపు , 10 లక్షల నుండి 2 కోట్ల లోపు ఖాతాలకు వరుసగా 5.25శాతం, 8.00శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే . రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్య పొదుపు ఖాతా నిల్వలపై బ్యాంక్ 5.50శాతం రూ. 10 కోట్ల లోపు నిల్వ ఉన్న ఖాతాలకు 7.00శాతం వడ్డీ రేటును అందిస్తోంది. (UP Scorpio Accident Death: ఆనంద్ మహీంద్రపై చీటింగ్ కేసు, కంపెనీ క్లారిటీ ఇది) బ్యాంక్ FDలపై చెల్లించే రేట్లు 7- 45 రోజుల డిపాజిట్లపై 3.75శాతం , ఏడాదిలోపు డిపాజట్లపై 7.15శాతం వడ్డీరేటు వర్తిస్తుంది. 12 నెలల 1 రోజు నుండి 12 నెలల 10 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే FDలపై, బ్యాంక్ 7.75శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. 38 నెలల నుండి 61 నెలల లోపు మెచ్యూరిటీ ఉన్న వాటికి 7.40శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు అన్ని పదవీకాలానికి ప్రామాణిక రేటు కంటే 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటు అందిస్తోంది. (డెల్టా కార్ప్ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్ చేస్తారా? అసలెవరీ మోడీ?) -
డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్
ముంబై: డీసీబీ బ్యాంక్.. డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్ను విడుదల చేసింది. అంతర్జాతీయ పర్యటనలు, వ్యాపార పర్యటనలు, వేకేషన్ల కోసం దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. భారత్లో ఉన్నప్పుడు ఇది డెబిట్ కార్డ్గా పనిచేస్తుందని తెలిపింది. ఈ కార్డ్ ఉంటే విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయాల్సిన అవరం లేకుండా సులభంగా ఎక్కడైనా ప్రయాణించొచ్చని, బీమా కవరేజీ, అదే సమయంలో డీసీబీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని బ్యాలన్స్పై ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్ చేసే మూడు రకాల ప్రయోజనాలతో డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్ వస్తుందని బ్యాంక్ తెలిపింది. ఇందులో ఫారీన్ కరెన్సీ మార్కప్ చార్జీలు అతి తక్కువగా 2 శాతమేనని పేర్కొంది. వీసా కార్డ్ను ఆమోదించే అన్ని అంతర్జాతీయ వేదికల వద్ద ఈ కార్డ్ను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. -
డీసీబీ బ్యాంకులోనూ ఇకపై ప్రభుత్వ లావాదేవీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ లావాదేవీల నిర్వహణకు (వ్యాపారం) ఆర్బీఐ నుంచి ఆమోదం లభించినట్టు డీసీబీ బ్యాంకు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి చెల్లింపులు, బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణకు వీలుగా డీసీబీ బ్యాంకును ఏజెన్సీ బ్యాంకుగా నియమించినట్టు తెలిపింది. ప్రైవేటురంగ బ్యాంకులనూ ప్రభుత్వ లావాదేవీల నిర్వహణకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఏడాది మే నెలలో నిర్ణయాన్ని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అందులో భాగంగానే డీసీబీ బ్యాంకుకు ఈ ఆమోదం లభించింది. -
డీసీబీ బ్యాంక్ లాభం 7 శాతం అప్
ముంబై: ప్రైవేట్ రంగంలోని డీసీబీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.70 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.65 కోట్ల నికర లాభం వచ్చిందని, 7 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్ తెలియజేసింది. నికర వడ్డీ ఆదాయం పెరగడం, కేటాయింపులు తక్కువగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం వృద్ది చెందిందని వివరించింది. గత క్యూ1లో రూ.233 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ1లో 17 శాతం వృద్ధితో రూ.273 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 4.23% నుంచి 3.90 శాతానికి తగ్గింది. రుణాలు 31 శాతం అప్.. బ్యాంక్ ఇచ్చిన రుణాలు 31 శాతం వృద్ధితో రూ.21,243 కోట్లకు పెరిగాయని, డిపాజిట్లు కూడా 31 శాతం పెరిగి రూ.25,032 కోట్లకు చేరాయని డీసీబీ బ్యాంక్ తెలిపింది. కేటాయింపులు 6 శాతం తగ్గి (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 14 శాతం) రూ.33 కోట్లకు పరిమితమయ్యాయి. అంతకు ముందటి క్వార్టర్లో (గత ఆర్థిక సంవత్సరం క్యూ4) 1.79 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 1.86 శాతానికి పెరిగాయి. -
డీసీబీ బ్యాంక్ నుంచి విదేశాలకు రెమిటెన్స్ సర్వీసులు
ముంబై: ప్రైవేట్ రంగానికి చెందిన డీసీబీ బ్యాంక్ తాజాగా ’డీసీబీ రెమిట్’ పేరిట రెమిటెన్స్ సర్వీసులు ప్రారంభించింది. దీనితో దేశీయంగా బ్యాంక్ ఖాతా ఉన్నవారు విదేశాలకు ఆన్లైన్లో నగదు పంపొచ్చు. అమెరికా సహా కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, యూఏఈ, జర్మనీల కోసం ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చని డీసీబీ బ్యాంక్ తెలిపింది. నిర్ధారిత విదేశీ మారక రేటు ప్రకారం ముందుగా.. ఖాతాదారు ఏ బ్యాంకు ఖాతా నుంచైనా డీసీబీ బ్యాంక్ ఖాతాలోకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తదుపరి పని దినం లోగా సదరు నగదును విదేశాల్లోని లబ్ధిదారు ఖాతాకు డీసీబీ బ్యాంక్ బదలాయిస్తుంది. విదేశీ కళాశాలల్లోని పిల్లల చదువుల కోసం, వైద్యం ఖర్చులు మొదలైన వాటి కోసం ఈ సత్వర రెమిటెన్స్ సేవలు ఉపయోగపడతాయని డీసీబీ బ్యాంక్ రిటైల్ విభాగం హెడ్ ప్రవీణ్ కుట్టి తెలిపారు. ఎవెన్యూస్ పేమెంట్స్ సంస్థతో కలిసి డీసీబీ బ్యాంక్ ఈ కొత్త సర్వీసు ప్రారంభించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement