-
దారుణం: ఒక్క పదం తప్పు రాశాడని చితకబాదిన టీచర్...విద్యార్థి మృతి
లక్నో: పరీక్షలో ఒకే ఒక్కపదం తప్పురాసినందుకు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్లోని జౌరియా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథన ప్రకారం నిఖిత్ దోహ్రే అనే దళిత బాలుడు స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. సెప్టంబర్ 7న సోషల్ ఎగ్జామ్లో ఒక పదం తప్పురాశాడని ఉపాధ్యాయుడు అశ్విన్ సింగ్ కర్రలు, రాడ్ తోటి అత్యంత హేయంగా కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి స్పృహ తప్పిపోయాడు. తల్లిదండ్రులు ఇటావా జిల్లాలోని ఆస్పత్రికి తరలిస్తుండగా ...ఆ విద్యార్థి మృతి చెందాడు. అదీగాక సదరు ఉపాధ్యాయుడు బాధితుడి తండ్రికి చికిత్స నిమిత్తం డబ్బులు కూడా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాదు ఆ బాలుడిని కులం పేరుతో దూషిస్తూ.. కొట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఆ బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి నిగమ్ తెలిపారు. నిందితుడు ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: భర్తను చితకబాది..భార్యపై ఆరుగురు గ్యాంగ్ రేప్) -
విద్యార్థులు బలిపశువులు కారాదు!
సాంకేతిక సమస్య కారణంగా గడువుతేదీ లోపు ఫీజు చెల్లించలేకపోయిన ఒక దళిత విద్యార్థికి తప్పకుండా సీటు కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవలే కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఫీజు చెల్లింపు విషయంలో బ్యాంకు నుంచి జరిగిన సాంకేతిక లోపం కారణంగా ఆ విద్యార్థిని బలిపశువును చేయవద్దంటూ సుప్రీంకోర్టు అసాధారణ వ్యాఖ్య చేయడం గమనార్హం. విద్యార్థి భవిష్యత్తు విషయంలో శిలాసదృశంగా ఉండొద్దని, కాస్త మానవీయ దృష్టితో వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం హితవు చెప్పింది. ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం నుంచి కోర్సు ముగింపు వరకు తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొం టున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ఈ తీర్పు ఒక ఆశా కిరణమై నిలిచింది. ఉన్నత విద్యను ఆశించి, అష్టకష్టాలు పడి సీటు సాధించి, ఉద్యోగ జీవితంలో కూడా వివక్ష పాలవుతున్న వెనుకబడిన వర్గాల పిల్లలకు... ప్రిన్స్, అతడి తండ్రి సాగించిన పోరాటం నిజంగానే స్ఫూర్తిదాయకం అవుతుంది. పద్దెనిమిదేళ్ల దళిత కుర్రాడు ప్రిన్స్ జైబీర్ సింగ్కి 48 గంటలలోపు బాంబే ఐఐటీలో ప్రవేశం కల్పించాలని, సుప్రీంకోర్టు ఇటీవలే అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిష్ఠా త్మక ఐఐటీలో చేరడానికి ఫీజు చెల్లింపు విషయంలో బ్యాంకు నుంచి జరిగిన సాంకేతిక లోపం కారణంగా ఈ విద్యార్థి గడువుతేదీ లోగా ఫీజు చెల్లించలేకపోయాడు. దీంతో అతడికి ప్రవేశార్హత లేదని అధికారులు ప్రకటించారు. తన ప్రమేయం లేకుండా జరిగిన ఒక సాంకేతిక తప్పిదానికి ఆ కుర్రాడి భవిష్యత్తు పట్ల అమానవీయ దృష్టితో వ్యవహరించడం తగదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ సమస్య మానవీయ కోణానికి సంబంధించింది కాబట్టి నియమనిబంధనలను శిలాసదృశంగా పాటించకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైనందున ఆ విద్యార్థికి ప్రవేశం కల్పించడం చెడు పరిణామాలకు దారి తీస్తుందని బాంబే ఐఐటీ అధికారులు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తాను చేయని తప్పుకు ఆ విద్యార్థిని బలిపశువును చేయవద్దని, ఒక యువకుడి భావి జీవితానికి సంబంధించిన ఈ విషయంలో వీలైనంత సహాయం చేసి అతడికి మేలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో భారత పీడిత ప్రజానీకంలో మన న్యాయవ్యవస్థ కాస్త ఆశలు నిలిపినట్లయింది. ఐఐటీ బాంబేలో తన స్థానంకోసం ప్రిన్స్ అనే పేరున్న ఈ దళిత కుర్రాడు చేసిన పోరాటం కానీ, ఈ క్రమంలో తాను సాధించిన విజయం కానీ సాధారణమైంది కాదు. ఇది ఇజ్రాయెల్ జానపద గాథల్లో గోలియెత్ని ఓడించిన గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన డేవిడ్ను తలపించింది. ఒక దళిత కుర్రాడు అందులోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రిన్స్ అనే పేరు పెట్టుకోవడం అసాధారణమే అని చెప్పాలి. ప్రిన్స్ అంటే ఇంగ్లిష్లో ‘ఎదుగుతున్న పాలకుడు’ అని అర్థం. అన్యాయానికి మూలం ఇదా? బాంబే ఐఐటీకి చెందిన జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీలోని అధికారులు ప్రిన్స్ అనే పేరు కల ఈ కుర్రాడి దళిత మూలాలను అనుమానించి ఉండవచ్చు. కానీ నిర్దేశించిన సమయంలోనే ఈ కుర్రాడి సోదరి ఐఐటీ పోర్టల్లో అవసరమైన అన్ని పత్రాలనూ అప్లోడ్ చేసిన తర్వాత పీజు కట్టడానికి ప్రయత్నించింది. కానీ వెబ్సైట్ పనిచేయ లేదు. దాంతో ప్రిన్స్ స్వయంగా మరోసారి ప్రయత్నించగా మళ్లీ అతడి ప్రయత్నం తిరస్కరణకు గురైంది. మన సంస్థాగత పునాదిలో ఆన్లైన్ అడ్మిషన్లను కూడా పక్షపాత దృష్టితో వేధించడానికి ఉపయోగిస్తారన్నది తెలిసిందే. భారతదేశంలో చివరకు ఇంటర్నెట్ కూడా దళిత వ్యతిరేక పాశుపతాస్త్రంగా మారిపోవడం విచారకరం. ఆ కుర్రాడు, ఉమ్మడి సీట్ కేటాయింపు విభాగం పనిచేస్తున్న పశ్చిమబెంగాల్ లోని ఐఐటీ ఖర్గపూర్కి సాధారణ కానిస్టేబుల్ అయిన తండ్రితో కలిసి వెళ్ళాడు. ఫీజు కడతానని చెప్పినా అతడిని చేర్చుకోవడానికి అధికారులు తిరస్కరించారు. గడువుతేదీ ముగిసిందని కారణం చెప్పారు. దీంతో అతడు బాంబే హైకోర్టు తలుపులు తట్టాడు. అక్కడా అతడి పిటిషన్ని కొట్టేశారు. చివరకు అతడు సుప్రీకోర్టుకు వెళ్లాడు. ఆ కుర్రాడిని ఐఐటీలో చేర్చుకోవలసిందిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వై.డి. చంద్రచూడ్, ఏఎస్ బోపన్న సంచలనాత్మక ఆదేశాలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన దళిత కానిస్టేబుల్ కుమారుడు అనేక స్థాయిల్లో పోరాటం సల్పి చిట్టచివరకు ఐఐటీ బాంబేలో చేరగలగడం ఆధునిక ఏకలవ్య గాథను తలపిస్తుంది. సమర్థుడైన విలుకాడు అయినందుకు తన బొటనవేలును కోల్పోవలసి వచ్చిన ఏకలవ్యుడు శస్త్రచికిత్స సహా యంతో తిరిగి తన బొటనవేలును పొందగలిగాడు. ఇప్పుడు ఈ దళిత కుర్రాడు ప్రిన్స్, ఐఐటీ సీటు కోసం పడిన తపనకు సుప్రీంకోర్టులో మాత్రమే న్యాయం జరిగింది. ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందడానికి తీవ్రంగా ఘర్షిస్తూ, అంతిమంగా సీట్లు చేజిక్కించుకుంటున్న, రిజర్వేషన్ హక్కు కలిగిన యువత పడుతున్న తపనలో, ఘర్షణలో ఇది ఒంటరి ఘటన కాదు. సరిగ్గా కొన్ని నెలల క్రితం ఐఐటీ మద్రాస్లో జనరల్ కేట గిరీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరిన ఓబీసీలకు చెందిన యువకుడు విపిన్ పి. వీటిల్.. మద్రాస్ ఐఐటీ నుంచి వివిధరకాల వివక్షల పాలబడి తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ప్యాకల్టీ అతడి కులనేపథ్యాన్ని కనిపెట్టి, అవమానించడం, వేధించడం మొదలెట్టింది. ఈ సందర్భంగా వివిధ స్థాయిల్లోని అధికారులకు విపిన్ రాసిన ఉత్తరాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలు ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కులతత్వం ఎంతగా పేరుకుపోయిందో స్పష్టం చేశాయి. ప్రస్తుత సందర్భానికి వస్తే మన దళిత ప్రిన్స్ ప్రవేశం కోసం చేసిన పోరాటంతోనే రిజర్వుడ్ అభ్యర్థుల పోరాటం ముగిసిపోలేదు. ఉన్నత విద్యాసంస్థల్లో చేరడం ఒకెత్తు కాగా, వీటిలో చదువు కొనసాగించడం మరొక ఎత్తు. వీరు క్యాంపస్లలోనే ఉంటున్నందువల్ల వివక్ష ఈ సంస్థల్లో ఒక నిరంతర సమస్యగా ఉంటుంది. ఇలా చెబితే అతిశయోక్తి కావచ్చు. ఆరెస్సెస్ శక్తులు మైనారిటీలను భారతీయేతరులుగా వ్యవహరిస్తున్నట్లుగా... దళితులు, ఓబీసీలు, గిరిజనుల పిల్లలను ఘనత వహించిన మన ఐఐటీలు భారతీయేతరులుగా చూస్తున్నాయి. ఈ విద్యా సంస్థలనుంచి రిజర్వేషన్లను తొలగించాలని వీరు అనేకసార్లు విద్యామంత్రికి పలు ఉత్తరాలు రాశారు. కానీ వారనుకున్నది జరిగితే, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం కంటే మించిన పెద్ద పోరాటాన్ని దేశం ఎదుర్కోవలిసి వస్తుందని వీరు గ్రహించడం లేదు. ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం విషయంలో నిరాకరణకు గురైన విద్యార్థులకు ప్రిన్స్ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం కానుంది. ఉన్నత విద్యాసంస్థల్లో చేరిన నా వంటి తొలితరం రిజర్వేషన్ విద్యార్థులకు, ఆపై ప్యాకల్టీగా మారినవారికి... గడువు తేదీలు, చివరి క్షణంలో మార్కుల కోతలు, రిజర్వేషన్ సంఖ్యలు వంటివాటిని ఎలా తారుమారు చేయగలరో స్పష్టంగా తెలుసు. ఒక విద్యార్థిగా చేరి, కోర్సు పూర్తి చేసుకునే తరుణంలో, విద్యార్థులకు ఏ గ్రేడ్ని ఇవ్వాలి అనే అంశాన్ని కూడా వీరు తారుమారు చేయగలరు. చదువు పూర్తయ్యాక ఉద్యోగ జీవితం కూడా వెనుకబడిన వర్గాల యువతకు రోజువారీ పోరాటంగా మారిపోతుంది. ఒక వైపు పోటీపడలేకపోవడం, మరోవైపు మోతాదుకు మించి పోటీపడటం అనేవి రిజర్వేషన్ విద్యార్థులను వెంటాడతాయి. మద్రాస్ ఐఐటీకి చెందిన విపిన్ తాను రెండో కారణం వల్ల వివక్షకు గురయ్యానని చెప్పారు. తన విభాగంలోని దళిత్/ఓబీసీ ఫ్యాకల్టీ సభ్యుడి కంటే ఎక్కువ సమర్థతను ప్రదర్శించడమే తన పట్ల వివక్షకు కారణమైందట. ఈ ఉన్నత విద్యాసంస్థల్లో ఏకలవ్యుల బొటనవేళ్లను నరికేసే ద్రోణాచార్యులూ ఉన్నారు. అలాగే వీటిలో చేరిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యువత జీవిత ప్రక్రియనే నరికేసే ద్రోణాచార్యులు కూడా ఉన్నారు. గ్రామీణ భారత్ నుంచి తొలి తరం విద్యా నేపథ్యం కలిగిన వారిలో చాలామంది విద్యార్థులు ఇలాంటి వివక్షకు గురైనప్పుడు విద్యాసంస్థలనే వదిలేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్ చదువు ముగించి తన కానిస్టేబుల్ తండ్రి కంటే ఉన్నతదశకు ఎదిగితే గొప్ప ఆదర్శంగా మారతాడు. విద్యాసంస్థలను టీచర్ల ద్వారా మాత్రమే సంస్కరించవచ్చు. అయితే ఇలాంటి విద్యాసంస్థల్లోని టీచర్లు ద్రోణాచార్యులను తమ ఆదర్శ గురువులుగా చేసుకున్నంతకాలం, వీరు జాతి మొత్తానికి పెను నష్టం కలిగించగలరు. ఈ విద్యా సంస్థలు గురునానక్ని తమకు ఆదర్శంగా తీసుకుంటే, సాంకేతిక అభివృద్ధిలో చైనానే సవాలు చేసే రీతిలో ఇవి దేశాన్ని మార్చివేయగలవు. ఈ సందర్భంగా ప్రిన్స్, ఆయన తండ్రి మనందరి అభినందనలకు అర్హులు. కంచె ఐలయ్య షెపర్డ్, ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఖాళీ సీట్లు.. దళితుల అగచాట్లు
అనంతపురం ఎడ్యుకేషన్ : అది పెన్నార్ భవనంలోని సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుల కార్యాలయం. కలెక్టర్ కార్యాలయానికి అడుగుల దూరంలోనే ఉంటుంది. అయినా ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగుల్లో చాలామంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. సమయపాలన ఉండదు. ఎవరు ఎప్పుడు వస్తారో..ఎప్పుడు వెళ్తారో తెలీని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఎస్సీలు నిత్యం వివిధ పనుల మీద ఈ కార్యాలయానికి వస్తుంటారు. సంక్షేమ పథకాలు, కులాంతర వివాహాలు, స్కాలర్షిప్పు, ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలు, హాస్టళ్లలో పని చేస్తున్న ఉద్యోగులు ఇలా రోజూ వందలాది మంది వస్తుంటారు. ఇక్కడ ఉప సంచాలకలతో పాటు జిల్లా అధికారి, ఇద్దరు సూపరింటెండెంట్లు, ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ ఒకరు, జూనియర్ అసిస్టెంట్లు ముగ్గురు, రికార్డు అసిస్టెంట్లు, టైపిస్టులు ముగ్గురు, డేటా ప్రాసెసింగ్ ఆపరేటర్ ఒకరు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకరు, అండెండర్లు నలుగురు, వాచ్మన్ ఒకరు, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఒకరు పని చేస్తున్నారు. వీరిలో కొందరు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉన్నతాధికారి అండ చూసుకుని అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాల్సి ఉన్నా...కొందరు ఉద్యోగులు రోజూ 12 గంటలకు తర్వాత వచ్చిన సందర్భాలూ చాలా ఉన్నాయంటూ ఓ ఉద్యోగి వాపోయాడు. వచ్చిన తర్వాత కూడా వారి సీట్లలో కూర్చుని పనులు చేసేది తక్కువని, తరచూ బయటకు వెళ్తూ గడిపేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని తోటి ఉద్యోగులు వాపోతున్నారు. కొందరు తరచూ బయటకు వెళ్లడం, ఆలస్యంగా రావడం వల్ల చాలా ఫైళ్లు రోజుల తరబడి పెండింగ్ పడుతున్నాయంటూ పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగులంతా సమయపాలన పాటించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై వివరణ కోరేందుకు డీడీ రోశన్న, జిల్లా అధికారి లక్ష్మానాయక్ను ఫోన్లో సంప్రదించగా ఇద్దరూ అందుబాటులోకి రాలేదు. -
రోహిత్ మరణానికి ఎవరూ కారణం కాదు
- వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య: అశోక్ - రూపన్వాలా కమిషన్ - సూసైడ్నోట్లోనూ అలాగే ఉంది సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు వర్సిటీ అధికారులు, రాజకీయ నేతల ఒత్తిడి కారణం కాదని అశోక్ రూపన్వాలా కమిషన్ పేర్కొంది. వర్సిటీ వీసీ అప్పారావు సహా ఎవ్వరిపైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. రోహిత్ దళితుడు కాదని, వడ్డెర (బీసీ) కులానికి చెందినవాడని నివేదికలో పేర్కొంది. 2016 జనవరిలో హెచ్సీయూలో రోహిత్ ఆత్మహత్య చేసుకోవడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అలహాబాద్ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఏకే రూపన్వాలా కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ గతేడాది డిసెంబర్లోనే నివేదిక సమర్పించినా.. మంగళవారం కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ తన వెబ్సైట్లో ఈ 51 పేజీల రిపోర్టును ఉంచింది. రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ, వర్సిటీ వీసీ అప్పారావుల ఒత్తిడే కారణమన్న ఆరోపణలను రూపన్వాలా కమిషన్ తోసిపుచ్చింది. వ్యక్తిగత కారణాలతోనే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదికలో స్పష్టంచేసింది. ‘‘యూనివర్సిటీ అధికారులు, రాజకీయ నేతల ఒత్తిడితో ఈ ఆత్మహత్యకు సంబంధం లేదు. వ్యక్తిగత నిర్ణయంతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారు. రోహిత్ సూసైడ్ నోట్ ప్రకారం.. ఆయన వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టమైంది. తన చుట్టూ జరుగుతున్న వ్యవహారాలతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడైంది’’అని నివేదికలో పేర్కొన్నారు. దళిత విద్యార్థులు యూనివర్సిటీలో చేరే సమయంలోనే ఈ వివక్షను భరించలేక ఉరేసుకునేందుకు ఒక తాడుని, ఇంత విషం ఇవ్వండి అంటూ 2015 డిసెంబర్ 18న వీసీ అప్పారావుకు రోహిత్ రాశారు. అయితే ఈ లేఖ తన మరణానికి నెల ముందు రాసింది కనుక రోహిత్ ఆత్మహత్యకు అది కారణం కాదని కమిషన్ అభిప్రాయపడింది. అలాగే వర్సిటీలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించినట్లుగా తన దృష్టికి రాలేదని వివరించింది. కమిషన్ పని ఏంటి..? రోహిత్ మరణానికి కారణం ఏంటన్న విషయాన్ని కాకుండా అతడు దళితుడు కాదన్న విషయాన్ని రుజువు చేసే పనిని కమిషన్ నెత్తిన వేసుకుందంటూ అంబేడ్కర్ స్డూడెంట్స్ అసోసియేషన్, సామాజిక న్యాయపోరాట ఐక్య కమిటీ మండిపడింది. వర్సిటీలో రోహిత్ సహా హాస్టల్ నుంచి వెలివేతకు గురైన సామాజిక న్యాయపోరాట కమిటీ నాయకుడు దొంత ప్రశాంత్ కమిషన్ రిపోర్టును దుయ్యబట్టారు. రోహిత్ మరణానికి కారకులైన వీసీ, కేంద్ర మంత్రి స్మృతీఇరానీ, కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచందర్రావులను తప్పించేందుకే న్యాయసమ్మతం కాని ఈ రిపోర్టు ఇచ్చారని అన్నారు. రోహిత్ కులాన్ని ధ్రువీకరించే అధికారం కమిషన్కు లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే దళితేతరుడైన, బీజేపీ అనుకూలురైన అశోక్ రూపన్వాలా ఇచ్చిన నివేదికను అంగీకరించేదిలేదు. బీజేపీ సర్కారు తనకు అనుకూలమైన వారితో రిపోర్టు ఇప్పించింది. దీన్ని మేం అంగీకరించం. నేషనల్ ఎస్సీ కమిషన్ ఏనాడో రోహిత్ దళితుడని తేల్చి చెప్పింది. – మున్నా, అంబేడ్కర్ çస్టూడెంట్స్ అసోసియేషన్ కన్వీనర్ నాడే వెల్లడించిన ‘సాక్షి’ రిపోర్టు ఆద్యంతం కులం ప్రస్తావనే అంటూ గతంలోనే ‘సాక్షి’ బయటపెట్టింది. ఇప్పుడు కమిషన్ అదే రిపోర్టు వెల్లడించింది. గతంలో సెంథిల్ కుమార్ ఆత్మహత్య సందర్భంగా నియమించిన పావురాల కమిషన్కానీ, కృష్ణ కమిషన్గానీ యూనివర్సిటీలో పరిస్థితుల మెరుగు కోసం సూచించిన ఎలాంటి చర్యలూ ఇప్పటికీ వర్సిటీ యాజమాన్యం తీసుకోకపోవడం గమనార్హం. -
హెచ్సీయూలో ఉద్రిక్తత
వెలివాడ ఉద్యమకారుల టెంట్లు తీసేయడంపై ఆందోళన సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్లీ అగ్గి రాజుకుంది. వర్సిటీలో వెలివాడ వద్ద ఏర్పాటు చేసుకున్న ఉద్యమకారుల టెంట్లు రాత్రికి రాత్రి మాయమవడంపై నిరసన పెల్లుబికింది. టెంట్లకున్న అంబేడ్కర్ నినాదాల పోస్టర్లు, రోహిత్ ఫొటోలనూ తొలగించడంపై విద్యార్థులు భగ్గుమన్నారు. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి వర్సిటీ గేటు వద్ద బైఠాయించారు. దళిత విద్యార్థులను అణచివేసేందుకు వీసీ అప్పారావు పన్నుతున్న కుయుక్తులే ఇవని ఆరోపించారు. సెక్యూరిటీ సిబ్బంది టెంట్లు తొలగిస్తుండగా కొందరు విద్యార్థులు చూశారని విద్యార్థి జేఏసీ తెలిపింది. సెక్యూరిటీని నిలదీసినప్పటికీ తమకేం తెలియదంటూ తప్పించుకుంటున్నారని ఆరోపించింది. తమకెలాంటి నోటీసూ ఇవ్వకుండానే టెంట్లు, బ్యానర్లు తొలగించిన వీసీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంది. ఏదిఏమైనా తమ ఉద్యమం ఆగదని, వీసీపై చర్యలు తీసుకునేవరకూ పోరాడతామని ప్రకటించింది. ఈ మేరకు విద్యార్థులంతా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. కండిషన్ బెయిల్ నుంచి విముక్తి హెచ్సీయూ విద్యార్థులు, అధ్యాపకులు సహా మొత్తం 27 మందికి మార్చి 22న నమోదైన కేసులో కండిషన్ బెయిల్ నుంచి విముక్తి లభించింది. మార్చి 22న విద్యార్థులు, అధ్యాపకులు రత్నం, తథాగత్లతో సహా 27 మంది హెచ్సీయూ విద్యార్థులకు ఇచ్చిన కండిషన్ బెయిల్ శుక్రవారంతో ముగిసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement