-
మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో హెచ్ఆర్డీఏ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఎన్నికల్లో హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) ఘన విజయం సాధించింది. హెచ్ఆర్డీఏ ప్రెసిడెంట్ డాక్టర్ మహేశ్కుమార్ నేతృత్వంలోని డాక్టర్ల టీమ్ ఎన్నికలు జరిగిన అన్ని స్థానాలనూ కైవసం చేసుకుంది. హేమాహేమీలుగా పిలిచే ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు ఓడిపోయారు. కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉన్న ప్రతి డాక్టర్ 13 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ 13 ఓట్లను కలిపి ఒక్క ఓటుగా పరిగణిస్తారు. అలా ఈ ఎన్నికల్లో మొత్తం 17,090 ఓట్లు పోల్ కాగా, రకరకాల కారణాలతో 3,311 ఓట్లను రిటర్ణింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. మిగిలిన 13,779 ఓట్లను లెక్కించారు. అత్యధికంగా డాక్టర్ ప్రతిభాలక్ష్మి 7,007 ఓట్లను సాధించగా, డాక్టర్ మహేశ్కుమార్ 6,735 ఓట్లు సాధించారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా ఎన్నికలు... రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. మెడికల్ కౌన్సిల్ 25 మంది డాక్టర్లతో ఏర్పాటవుతుంది. అందులో 13 మంది ఇప్పుడు డాక్టర్లు ఓటు ద్వారా ఎన్నికయ్యారు. మిగిలిన 12 మందిని ప్రభుత్వం నామినేట్ చేయాల్సి ఉంది. అనంతరం చైర్మన్ను ఎన్నుకుంటారు. చైర్మన్ కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ పదవినీ హెచ్ఆర్డీఏ కైవసం చేసుకునే అవకాశం ఉంది. వాస్తవంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే మెడికల్ కౌన్సిల్ ఎన్నికలకు తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల వల్ల మెడికల్ కౌన్సిల్ ఎన్నికలపై ఎవరూ పెద్దగా ఫోకస్ చేయలేదు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు రిజి్రస్టేషన్ చేసుకుంటారు. ఈ ఎన్నికల్లో వారే ఓట్లేశారు. విజేతలు సాధించిన ఓట్లు ఇలా డాక్టర్ ప్రతిభా లక్ష్మి 7,007 ఓట్లు, డాక్టర్ కె.మహేష్కుమార్ 6,735, డాక్టర్ బండారి రాజ్కుమార్ 6,593, డాక్టర్ జి.శ్రీనివాస్ 6,454, డాక్టర్ కిరణ్కుమార్ 6,434, డాక్టర్ ఎస్.ఆనంద్ 6,192, యెగ్గన శ్రీనివాస్ 6,086, డాక్టర్ రవికుమార్ 6,085, డాక్టర్ నరేష్కుమార్ 6,091, డాక్టర్ శ్రీకాంత్ 5,974, డాక్టర్ సన్నీ దావిస్ 5,912, డాక్టర్ విష్ణు 5,844, డాక్టర్ సయ్యద్ ఖాజా ఇమ్రాన్ అలీ 5695 ఓట్లు సాధించారు. -
మార్చి మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ 2021–22 సమావేశాలు మార్చి మూడో వారంలో జరిగే అవకాశాలున్నాయి. మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానంతోపాటు వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 20 జిల్లాలు, 77 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, పోల్ మేనేజ్మెంట్ ఏర్పాట్లలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు బిజీగా ఉన్నారు. మార్చి 14న పోలింగ్ జరగనుండగా 17న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు స్థానాల్లో సైతం తమ పార్టీ అభ్యర్థులను కచ్చితంగా గెలిపించుకోవడానికి పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పోలింగ్ జరిగే వరకు మండలి ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మండలి ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతే రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మార్చి 14 తర్వాత ఎప్పుడైనా బడ్జెట్ సమావేశాలు నిర్వహించవచ్చని తెలుస్తోంది. సమావేశాలు 15 రోజులే... వచ్చే ఆర్థిక సంవత్సరాని (2021–22)కి సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లును మార్చి 31లోగా ఉభయ సభలు తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉండడంతో ఈసారి బడ్జెట్ సమావేశాలు 12–15 రోజులకు మించి జరిగే అవకాశాలు లేవు. కరోనా కేసులు మళ్లీ పుంజుకుంటుండటం కూడా మరో కారణం కానుంది. పోలీసు సిబ్బంది లభ్యత, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, సెలవులు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ను మార్చి తొలి వారంలో ఖరారు చేసే అవకాశం ఉంది. శాసనసభ సమావేశాల తొలిరోజు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి ఒకట్రెండు రోజులు చర్చ నిర్వహించనున్నారు. మరుసటి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం, తదుపరి రోజు సెలవు ఇవ్వడం, తర్వాత రోజుల్లో బడ్జెట్పై చర్చ, అనంతరం పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తదితర ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంది. కేవలం 12–15 రోజుల్లో ఈ కార్యక్రమాలను ముగించేలా ప్రభుత్వం శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశం ఉంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఈసారి కూడా శాఖలవారీగా పద్దులపై విస్తృతస్థాయి చర్చ లేకుండానే ప్రభుత్వం బడ్జెట్ను ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. సానుకూల దృక్పథంతో బడ్జెట్... కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే క్రమంగా గాడినపడుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సిన ఆదాయం మినహా జీఎస్టీ, వ్యాట్, ఎక్సైజ్ తదితరాల రూపంలో ఆదాయం పుంజుకొని ఇప్పటికే సాధారణ స్థితికి చేరు కుంది. సానుకూల దృక్పథంతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2021–22 రూపకల్పనకు ప్రస్తుత పరిస్థితులు దోహదపడనున్నాయి. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆర్థిక శాఖ అధికారులతో ప్రాథమిక స్థాయిలో చర్చించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తున్నా ఇంకా కీలక దశకు చేరుకోలేదు. ఎప్పటిలాగే బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా వారంపాటు సమీక్షలు నిర్వహించాకే శాఖల వారీగా బడ్జెట్ అవసరాలు, కేటాయింపులు కొలిక్కి వస్తాయని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ప్రాధామ్యాలను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు జరపాల్సిన కేటాయింపులపై సీఎం స్వయంగా నిర్ణయం తీసుకోనున్నారని అధికారులు తెలిపారు. మార్చి తొలివారంలో బడ్జెట్ రూపకల్పనపై సీఎం సమీక్షలు నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
భద్రతా మండలిలో ఎన్నికల సందడి
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో ఐదు తాత్కాలిక సభ్యదేశాల నియామక ప్రక్రియ మొదలైంది. 75వ ఐక్యరాజ్యసమితి సమావేశాల అధ్యక్షుడిని ఎంపిక చేయడంతోపాటు సామాజిక, ఆర్థిక మండలి సభ్యుల నియామకానికి కూడా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికలను ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బుధవారం నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికల్లో తమకు స్పష్టమైన విజయం లభించడం ఖాయమని భారత్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో విజయం సాధిస్తే రెండేళ్లపాటు (2021–22) ఐరాస భద్రతా మండలిలో భారత్కు తాత్కాలిక సభ్యదేశ హోదా లభిస్తుంది. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్ గ్రూప్ నుంచి కేవలం భారత్ ఒక్కటే పోటీ చేస్తోంది కాబట్టి గెలుపు తథ్యమే. భారత్ 1950–51, 1967–68, 1972–73, 1077–78, 1984–85, 1991–92, 2011–22లో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశ హోదా దక్కించుకుంది. -
30న నిర్మాతల మండలి ఎన్నికలు
ప్రతి రెండేళ్లకోసారి నిర్మాతలమండలి ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఈసారి జరగాల్సిన ఎన్నికలు చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు నిర్మాతల మండలి ఎన్నికలు జూన్ 30న జరగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్ కలిసి ‘మన కౌన్సిల్– మన ప్యానెల్’ అనే నినాదంతో ముందుకు వచ్చారు. సి.కళ్యాణ్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతల మండలి నిర్మాతల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేయబడింది. నిర్మాతలందరం ఒక గ్రూప్గా ఏర్పడి నిర్మాతల మండలి బలంగా ఉండాలని పి.రామ్మోహన్రావు, డి.సురేశ్బాబు, అల్లు అరవింద్, చదలవాడ శ్రీనివాసరావు లాంటి పెద్దలందరూ ముందుకొచ్చారు’’ అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నిజానికి ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా అర్హులకు తగ్గ పదవులిచ్చి నిర్మాతల మండలి స్ట్రాంగ్గా ఉండాలన్నదే మా కోరిక. కానీ సమయాభావం వల్ల సభ్యులందరూ అందుబాటులో లేని కారణంగా ఎన్నికలు జరపక తప్పటం లేదు’’ అన్నారు. టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో చాలా సమస్యలున్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా మిగిలిన సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి అర్హులైన, ఆసక్తి ఉన్న సభ్యులకి పదవులిస్తాం’’ అన్నారు. ఈ ఎన్నికల్లో ‘మన ప్యానెల్’,‘గిల్డ్ప్యానెల్’ పోటీ పడనున్నాయి. ఈ కార్యక్రమంలో వైవీయస్ చౌదరి, నిర్మాతలు మోహన్ వడ్లపట్ల, రామసత్యనారాయణ, అశోక్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు. -
మండలి ఎన్నికలకు కొత్త జాబితా
సాక్షి, హైదరాబాద్ : శాసనమండలి ఎన్నికలకు కొత్త ఓటర్ల జాబితా రూపొందించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు జాబితాపై సెప్టెంబర్ 2016లోనే రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు చేసింది. దీంతో పాత ఓటర్ల జాబితా పూర్తిగా రద్దయింది. మరో 6 నెలల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటాలో ఎన్నిౖMðన ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తవుతుండటం, ఆలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సిన నేపథ్యంలో వచ్చే నెలలో ఓటర్ల న మోదుకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలోనే ప్రక్రియ పూర్తి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిౖMðన శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ పదవీకాలం వచ్చే ఏడాది పూర్తవనుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్రెడ్డి.. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ పూల రవీందర్ కూడా రిటైర్అవుతున్నారు. ఈ స్థానాలకు జనవరి లేదా ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కొత్తగా నమోదు చేసుకుంటేనే.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం కొత్తగా నమోదు చేసుకున్న వారికే ఓటు హక్కు ఉంటుంది. ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మూడేళ్లు దాటిన వారు ఓటు నమోదు చేసుకోవాలి. కొత్తగా ఓటర్ల నమోదు చేసుకోవా లని వచ్చే నెలలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసెంబరులో ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయని అధికార పార్టీ అంచనా వేస్తోంది. స్వామిగౌడ్ అనాసక్తి! వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వామిగౌడ్ పోటీచేయడానికి అనాసక్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో గ్రూప్–1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన తాను ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలుస్తానని ఆయన విశ్వాసంతో ఉన్నారు. టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు చంద్రశేఖర్గౌడ్ సన్నిహితులు చెబుతున్నారు. కరీంనగర్ మేయర్ రవీందర్సింగ్, కార్పొరేషన్ చైర్మన్ చిరుమిళ్ల రాకేశ్కుమార్ పేర్లు కూడా టీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ పేరూ టీఆర్ఎస్ పరిశీలించే అవకాశం లేకపోలేదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement