-
ప్రేమపెళ్లి చేసుకున్నారని.. అత్యంత అమానుషం!
భోపాల్ : తమకు ఇష్టంలేని వివాహం చేసుకున్నారని ఓ జంటని వారి కుటుంబసభ్యులు అత్యంత అమానుషంగా అవమానపరిచారు. కుటుంబ సభ్యులకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నందుకు వారిచేత మూత్రం తాగించిన ఘటన ఇటీవల మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. భోపాల్కు చెందిన ఓ గిరిజన జంట ఇంట్లో వారికి తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన బాలిక కుటుంబసభ్యులు యువకుడి కుటుంబంపై దాడి చేసి, కుల పంచాయతీ పెట్టించి రూ. 70 వేల నష్టపరిహారంగా కట్టించుకున్నారు. వీరి వివాహాన్ని రద్దు చేస్తున్నామని కుల పెద్దలు నిర్ణయించారు. ఇది జరిగిన మరునాడే ఆ జంట గ్రామాన్ని వదిలి రహస్యంగా గుజరాత్ వెళ్లారు. అక్కడ కొద్ది రోజులు గడిపిన తరువాత ఉద్యోగం దొరకకపోవడంతో సొంత గ్రామం తిరిగి వచ్చారు. అప్పటికే వారిపై తీవ్ర కోపంతో ఉన్న బాలిక తండ్రి వారు తిరిగి రావడంతో ఆగ్రహించారు. యువకుడి ఇంటికి వచ్చిన యువతి కుటుంబ సభ్యులు ఆ జంటను స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు. అంతేకాకుండా యువతి జట్టును కత్తిరించి చిత్రహింసలకు గురిచేశారు. అంతటితో ఆగకుండా ఇద్దరిచే మూత్రం తాగించి అమాషంగా ప్రవర్తించారు. కుటుంబ సభ్యులకు ఇష్టంలేని వివాహం చేసుకున్నందుకు తన తండ్రి ప్రతీకారం తీర్చుకుంటున్నాడని యువతి జూలై 24న స్థానిక పోలీస్ స్టేషల్లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుపై స్పందించిన అలీరాజ్పూర్ డీఎస్పీ విపుల్ శ్రీవాస్తవ ఇద్దరు నింధితులను అరెస్ట్ చేశామని, ఘటనపై విచారణ వేగవంత చేస్తామని తెలిపారు. -
దంపతుల అనుమానాస్పద మృతి
విజయనగరం : విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య, భర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం గుర్ల మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దమరసింగ గ్రామానికి చెందిన రామారావు, గౌరీలకు పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి సిద్దూ(7), సౌమ్య(5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే రామారావు, గౌరీల మృతదేహాలు వారి ఇంటి సమీపంలో ఉన్న బావిలో మంగళవారం ఉదయం కనిపించాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (గుర్ల)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement