-
ఢిల్లీలో కరోనా విజృంభణ
దేశమంతటా కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, రాజధాని ఢిల్లీలో మాత్రం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. కరోనా బెంబేలెత్తిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 100 మంది దాకా మృత్యువాత పడుతున్నారు. ఢిల్లీలో ఇప్పటిదాకా 8,041 మందిని కరోనా వైరస్ బలి తీసుకుంది. న్యూఢిల్లీ: భారత్లో సెప్టెంబర్లో కరోనా వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరింది. అప్పటి నుంచి తీవ్రత తగ్గుతోంది. ఢిల్లీలో జూన్, సెప్టెంబర్లో గరిష్ట స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నవంబర్ 11న ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 8,593 కొత్త కేసులు నమోదయ్యాయి. నవంబర్ 18న ఒక్కరోజులోనే 131 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 19న 7,546 కొత్త కేసులు బయటపడ్డాయి, 98 మంది మరణించారు. గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా కరోనా కారణంగా సంభవించిన మొత్తం మరణాల్లో 21 శాతం మరణాలు ఢిల్లీలోనే చోటుచేసుకోవడం గమనార్హం. రాజధానిలో థర్డ్ వేవ్ ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాస్కు ధరించని వారికి జరిమానాను రూ.500 నుంచి ఏకంగా రూ.2,000కు పెంచేశారు. వివాహానికి 200 మంది అతిథులు హాజరుకావొచ్చంటూ గతంలో ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్నారు. జన సంచారం అధికంగా ఉండే మార్కెట్లను మూసివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కేంద్ర హోం శాఖ సైతం రంగంలోకి దిగింది. నవంబర్ ఆఖరి వరకు ప్రతిరోజూ 60,000 ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆసుపత్రుల్లో పడకల సంఖ్య, వసతులు భారీగా పెంచాలని కోరింది. పేదలే సమిధలు రాజధానిలో ప్రధానంగా కనిపించేది అధిక జనాభా. కరోనా విస్తరణకు ఇదొక ముఖ్య కారణమన్నది నిపుణుల మాట. కరోనా వి జృంభిస్తున్నా పేదలు ఇళ్లలోనే ఉండిపోయే పరిస్థితి లేదు. జీవనం కోసం బయటకు అడుగు పెట్టాల్సి వస్తోంది. ఢిల్లీలో ఇటీవల పేదలే ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పనుల కోసం ఇళ్ల నుంచి బయటకు వస్తున్న పేదలకు కరోనా సోకుతోందని ప్రఖ్యాత ఎపిడెమాలజిస్టు డాక్టర్ జయప్రకాశ్ ములియిల్ చెప్పారు. పేద వర్గాలు నివసించే ప్రాంతాల్లో జన సాంద్రత అధికంగా ఉండడం కరోనా వ్యాప్తికి అనుకూల పరిణామమే. ఢిల్లీలోనే ఎందుకు? దేశంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగలు అధికంగా జరుగుతాయి. పండుగ సీజన్లో కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని నిపుణులు ముందునుంచే హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా పండుగల సమయంలో కరోనా వ్యాప్తి పెద్దగా లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఢిల్లీలోనే మహమ్మారి ఎందుకు పడగ విప్పుతోందన్న ప్రశ్నలకు నిపుణులు రకరకాల సమాధానాలు చెబుతున్నారు. నగరం ఒక గ్యాస్ చాంబర్ ఢిల్లీలో చలికాలం ప్రారంభం కాగానే కాలుష్యం స్థాయి పెరిగిపోయింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేస్తున్నారు. ఆ పొగంతా ఢిల్లీని కమ్మేస్తోంది. గాలి వేగం తగ్గిపోయింది. ఢిల్లీ నగరం ఒక గ్యాస్ చాంబర్లా మారిందని చెప్పొచ్చు. నగరంలో కరోనా కేసుల పెరుగుదలకు వాయు కాలుష్యం కూడా ఒక ముఖ్యమైన కారణం. దీనికి తోడు కరోనా నియంత్రణకు ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా నియంత్రణకు ఇప్పుడున్న అతిపెద్ద ఔషధం అప్రమత్తతే. వాతావరణం.. కాలుష్యం ఢిల్లీలో చలికాలం అక్టోబర్ చివరి వారంలోనే ప్రవేశించింది. ఈ వాతావరణంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇళ్లల్లో ఉండే కరోనా బాధితుల నుంచి వైరస్ ఇతరులకు సులభంగా వ్యాపిస్తోందని నిపుణులు అంటున్నారు. అలాగే కాలుష్యం కారణంగా గొంతు, ముక్కు, ఊపిరితిత్తులకు ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. ఫలితంగా కరోనాతోపాటు ఇతర వైరస్లు సులభంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. -
కేజ్రీవాల్కు పెద్ద ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఊరట కలిగింది. పరువు నష్టం దావా కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి ఆయనకు మినహాయింపు లభించింది. ఆయన తరుపున న్యాయవాది హాజరయ్యేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. 2013లో ఓ పత్రికా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ నాటి టెలికం మంత్రి కపిల్ సిబల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై సిబల్ కుమారుడు అమిత్ సిబల్ నేర పూరిత పరువు నష్టం దావా కేసు వేశారు. దీనికి సంబంధించి ఆయన కోర్టుకు హాజరుకావాల్సి ఉందని కింది స్థాయి కోర్టు ఆదేశించగా తాను ముఖ్యమంత్రిగా పలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, కోర్టుకు హాజరుకావడం సాధ్యం కాదని, తన తరుపున వేరేవారి హాజరుకు అనుమతిస్తూ తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు కేజ్రీవాల్ అభ్యర్థనను ఆమోదించింది. అయితే, కేజ్రీవాల్ హాజరుకాకుంటే కేసు ముందుకు వెళ్లని పరిస్థితి ఉంటే మాత్రం హాజరుకావాలంటూ ఆదేశించే హక్కు మాత్రం కింది కోర్టుకు ఉందని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. -
అందరూ యుద్ధం ప్రకటించండి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో నానాటికి పెరుగుతున్న చికెన్ గున్యా, డెంగ్యూ కేసుల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దోమలపై పార్టీలకు అతీతంగా యుద్దం చేయాలని అన్నారు. ఒక యుద్ధానికి వెళ్లే సమయంలో ఎలాంటి సన్నాహాలు చేస్తామో అలాగే ప్రతి ఒక్కరు ఢిల్లీలో చికెన్ గున్యా, డెంగ్యూ దోమలను అరికట్టేందుకు నడుంకట్టాలని చెప్పారు. ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సమమంలో భారతీయులంతా ఏకమయ్యే తీరుగా ఢిల్లీలో ప్రమాదకరపరిస్థితులపట్ల ఏకమవ్వాలని తెలిపారు. గొంతు ఆపరేషన్ తర్వాత ఢిల్లీలో దోమల బెడద గురించి మాట్లాడిన ఆయన ప్రతి ఒక్క కుటుంబం కూడా చికెన్ గున్యా బారినపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దోమలకు కాంగ్రెస్ వాళ్లు, బీజేపీ వాళ్లు అనేది ఉండదని, అందరినీ అవి వెంబడిస్తాయని, కావున వాటిపై కలిసికట్టుగా యుద్ధం మాదిరి చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికే తాను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్కు దోమల నివారణకు కావాల్సిన ఫాగింగ్ మెషిన్లను కొనుగోలు చేయాలని ఆదేశించినట్లు అవి రెండు మూడు రోజుల్లో సమకూరుతాయని అన్నారు. 'ప్రభుత్వ సంస్థలు పనిచేయడం లేదని ఆరోపణలు చేస్తూ చేతులు ముడుచుకొని కూర్చోవడం సరికాదు. ప్రతి ఒక్క ఢిల్లీ పౌరుడు పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా. అందరం కలిసిపనిచేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది' అని కేజ్రీవాల్ అన్నారు. -
ఆ ఎమ్మెల్యేలు బడికే వెళ్లలేదట!
న్యూఢిల్లీ: రాజకీయ నాయకుల మాటల వెనుక అసలు నిజాలు వేరే ఉంటాయంటారు. అసలు కార్యం పూర్తయితే తప్ప ఆ విషయం బయటకు రాదు.. రానివ్వరు అని చెబుతుంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ఇది కాస్త రుజువైంది. తమ పార్టీ నేతలంతా బాగా చదువర్లు, ఉన్నత చదువులు చదివిన వాళ్లు.. ఎంబీఏ, ఇంజినీరింగ్ అని పేర్కొంటూ వివిధ రంగాల్లో కూడా ఆరితేరిన వారని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన మాటలన్ని కల్లలే అని తెలిసిపోయింది. ఎందుకంటే.. ఆయన ఎమ్మెల్యేల్లో మొత్తం 23 మంది కేవలం స్కూల్ స్థాయి చదువులే చదివారంట. అది కాకుండా ఏనాడు వీరు కనీసం ఆ క్లాసులకు కూడా పూర్తిగా వెళ్లలేదని తెలిసింది. ఎన్నికల కమిషన్కు నామినేషన్ సమయాల్లో సమర్పించిన అఫిడ్ విట్ లో ఈ విషయాలు పేర్కొన్నారు. దీని ప్రకారం 20మంది ఎమ్మెల్యేలు ప్రాథమిక, మాధ్యమిక విద్యను మాత్రమే పూర్తి చేశారు. ఇక ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతోపాటు మరో ఇద్దరు డిప్లోమా వరకు చదివారంట. 26మంది ఆప్ ఎమ్మెల్యేలో నరేశ్ బాల్యన్, హజారీ లాల్ చౌహాన్, రాజు దింగాన్, అవతార్ సింగ్ అనే నలుగురు నేతలు కేవలం 8వ తరగతి పూర్తి చేయగా మరికొందరు ఐదు, ఇంకొందరు పదో తరగతి పూర్తి చేశారని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వీళ్లలో ఏ ఒక్కరు కూడా రెగ్యులర్గా స్కూల్కు వెళ్లేవారు కాదంట. ఈ వివరాలు బయటకు రావడంతో విలువలు, నీతి అంటూ పార్టీ పెట్టి అందరు అవాక్కయ్యేలా ప్రసంగాలు ఇచ్చిన కేజ్రీవాల్ కూడా అబద్ధాలు చెబుతారా అని సామాన్యులు ఇప్పుడు విస్తుపోతున్నారు. -
'హనుమంతప్పకోసం ఎంతో ప్రార్థిస్తున్నాను'
న్యూఢిల్లీ: సియాచిన్ ప్రమాదంలో చిక్కుకొని ఆరు రోజులపాటు మంచుదిబ్బలకింద ఉండిపోయి చివరకు మృత్యుంజయుడిగా బయటపడి ప్రస్తుతం ప్రాణంకోసం పోరాడుతున్న లాన్స్ నాయక్ హనుమంతప్ప వీలయినంత త్వరగా కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆ వీర సైనికుడు త్వరత్వరగా కోలుకోవాలని తాను దేవుడిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాని ఆయన చెప్పారు. 'హనుమంతప్ప కొప్పాడ్ సురక్షితంగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను ఆయనను చూసేందుకు వెళ్లాలని అనుకున్నాను. కానీ, ఇప్పుడు అతడు ఉన్న పరిస్థితుల్లో కలవడం అంతమంచిదికాదని అధికారులు సూచించారు' అని కేజ్రీవాల్ చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement